/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Bopparaju: ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే.. ప్రజలకేం చెబుతారు?: బొప్పరాజు Yadagiri Goud
Bopparaju: ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే.. ప్రజలకేం చెబుతారు?: బొప్పరాజు

విజయవాడ: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న ఆర్థికశాఖ.. తమకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ప్రశ్నించారు..

ఉద్యోగుల వేతనాలు సరైన సమయంలో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు.

''ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం 30 శాతం పెంచాలని పీఆర్సీ కమిషన్‌ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం కూడా పెంచలేదు. గత ప్రభుత్వ హయాంలో వారికి 50 శాతం మేర వేతనాలు పెంచారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకేం చెబుతారు? ఎంత మొత్తాన్ని జమ చేస్తున్నారు? ఎంత వెనక్కి తీసుకుంటున్నారు? అనేది అర్థం కావడం లేదు. వీఆర్‌ఏ లాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా డీఏ చెల్లించలేరా?''అని బొప్పరాజు నిలదీశారు..

Andhra Neews: భాజపాతో పొత్తులోనే ఉన్నామని పవన్ చెప్పారు: సోము వీర్రాజు..

చీరాల: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలం నుంచి చేస్తున్న ఆరోపణలపై గతంలో స్పందించలేదని.. ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు..

భాజపాలో కార్యకర్తగా చేరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారని.. తానేంటో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని సోము అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు. కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకే భాజపాను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక పార్టీలో వ్యక్తి పెత్తనం ఎక్కువైపోయిందని.. వర్గాలుగా చీలిపోయేలా వ్యవహరించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..

జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. ''విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వారాహికి పూజ సమయంలో భాజపా పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్ వైకాపా ప్రభుత్వానికి 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే, అన్ని పథకాలకు తామే నిధులు ఖర్చుపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం శోచనీయం'' అని సోము అన్నారు..

గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.

ఇళ్ల నిర్మాణం, టిట్కో ఇళ్లపై ఆయన సమీక్షించారు.

ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదిన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..

Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌..

జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి..

ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలే అని మండిపడ్డారు.

Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా

Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా అంటున్నారు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..

ఈ రోజు కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల నిరసన సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు..

నెల్లూరు రూరల్ లో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించిన ఆయన.. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపినా.. ఆర్థికశాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలైన నేను కూడా పూర్తి చేయలేకపోయానన్న ఆయన.. నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు.

Big Breking: పేలిన బెలూన్లు.. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గాయాలు..

అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..అంబర్ పేట్ నియోజకవర్గం లో శుక్రవారం సీఎం జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొందరు కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ..

గ్యాస్ బెలున్లు గాలిలో వదిలే సమయంలో కార్యకర్తలు టపాకాయలు కాల్చడంతో నిప్పు రవ్వలు చెలరేగి బెలున్ల పై పడి ఒక్క సారిగా బెలూన్లు పెలిపోయాయి. వీటి నుంచి వెలువడ్డ నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్‌లపై పడటంతో అవి పేలిపోయాయి. దీంతో మంటలు రావటంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే, కార్యకర్తలు అక్కడనుంచి పరుగులు తీసారు. పరిగెత్తే క్రమంలో ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు కిందకు పడిపోయారు. దీంతో స్వల్ప గాయాలయ్యాయి..

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

ఆర్మూర్‌ పట్టణం: నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా ఆర్మూర్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

బస్సు 38 మంది ప్రయాణికులతో రాయచూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్‌ బాబు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Joe Biden: చైనాకు సారీ చెప్పేదే లేదు.. త్వరలో జిన్‌పింగ్‌తో మాట్లాడతా..!

దిల్లీ: బెలూన్‌ కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని, అలాగే తాను త్వరలో చైనా(China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(Xi Jinping)తో మాట్లాడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) వెల్లడించారు. ఇటీవల అమెరికా (US) గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బైడెన్ నోటి నుంచి ఈ కీలక వ్యాఖ్యలు వచ్చాయి.

‘త్వరలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడతానని భావిస్తున్నాను. మేం సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదు. బెలూన్ కూల్చివేసిన విషయంలో క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, భద్రతకే మా మొదటి ప్రాధాన్యం’ అని స్పష్టం చేశారు. అమెరికా(US) గగనతలంపై ప్రయాణించిన ఓ చైనా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేయగా.. అది వాతావరణ పరిశోధన కోసమే ప్రయోగించామని చైనా చెప్పింది.

అది గూఢచర్య బెలూన్‌ అని విశ్వసించిన అమెరికా యుద్ధ విమానాన్ని పంపించి తమ దేశ తీరానికి సమీపంలోని అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూల్చివేసింది. అది కూలిన ప్రదేశంలో సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించినట్లు యూఎస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోపక్క.. ఫిబ్రవరి 4వ తేదీన తొలి బెలూన్‌ కూల్చిన తర్వాత అమెరికా(US) వైమానిక దళం మరో మూడు వస్తువులను గాల్లోనే కూల్చేసింది.

NGT ₹500కోట్ల జరిమానాపై స్టే.. ప్రాజెక్టుకు ఓకే

దిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీలను ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.

అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ప్రజలు ఇబ్బంది పడకూడదనే అవకాశమిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన ₹500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది.

Nirmala sitharaman: మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కు తెలియదా?: నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో తెలియదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

'అమృతకాల బడ్జెట్‌' అంశంపై దూరదర్శన్‌ న్యూస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. చేతులు జోడించి చెబుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ లకు చేరాలన్న లక్ష్యంపై జోక్‌లు వద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో చేసిన అప్పులపై కేంద్రమంత్రి మాట్లాడారు. కేసీఆర్‌ పాలనకు ముందు తెలంగాణ రాష్ట్రం అప్పులు ఎంత? ఇప్పుడు తెలంగాణ అప్పులు ఎంత? అని ప్రశ్నించారు..

2014లో తెలంగాణకి రూ.60వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రూ.3లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలు చేసే అప్పులను నియంత్రించే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చిందని, దానినే తాము అమలు చేస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల పేర్లు అడిగినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని ప్రశ్నించారు. నో డేటా అవైలబుల్‌ గవర్నమెంట్‌ ఎవరిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని భారాస నేతలు మాట్లాడాలన్నారు. కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీలు ఉన్నా అవే జిల్లాల పేర్లు మళ్లీ మెడికల్‌ కాలేజీల కోసం పంపించారని.. అందుకే తిరస్కరించి పంపించినా కొత్త జిల్లాల పేర్లు ఇప్పటికీ పంపించలేదని నిర్మలా సీతారామన్‌ తెలిపారు..