హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి:TSJA రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ద్వారా ఇవ్వనున్న ఇంటి స్థలాల మాదిరిగానే అదేవిధంగా ఖమ్మంలో త్వరలో ఇవ్వబోతున్న విధంగానే రాష్ట్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో కొనసాగుతున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయంలో వీలైనంత తొందరగా స్పందించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వనున్న ఇంటి స్థలాల విషయంలో అర్హత లేని వారికి ఏనాడు వార్తలు రాయకుండా అక్రిడేషన్లు పొందుకున్న వారికి జర్నలిస్టులుగా గుర్తించి ఇంటి స్థలాలు ఇస్తే అలాంటి వారి లిస్ట్ బయటపెట్టి ప్రత్యేక ఉద్యమం చేపడుతామని తెలిపారు. అక్రిడేషన్ లతో సంబంధం లేకుండా వర్కింగ్ లో ఉండి ఇంటి స్థలాలు రాకుండా అణిచివేతకు గురైన ప్రతి ఒక్కరికి టీఎస్ జేఏ అండగా ఉంటుందని తెలిపారు.ఖమ్మం జిల్లాలో హైదరాబాదులో స్పందించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనువెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు,సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షుడు రవిచంద్ర నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్నగర్ వాసి మాజ్హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్బాగ్కు చెందిన సమీయుద్దీన్పై కేసు నమోదు చేసింది.
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
Feb 07 2023, 21:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.6k