NLG: మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలు విస్తరిస్తాం: వై.ఆర్.పి. ఫౌండేషన్
నల్లగొండ:
వై.ఆర్.పి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైష్ణోవి కన్స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎలిశాల రవి ప్రసాద్  వ్యక్తిగత పని నిమిత్తం నల్లగొండకు విచ్చేసిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
బొమ్మపాల గిరిబాబు కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక ఆధ్యాత్మిక విద్యాపరంగా, క్రీడల పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని, భవిష్యత్తులో కూడా మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలను విస్తరిస్తామని, రాష్ట్ర జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తామని మరియు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు మంచి అవకాశాలను కూడా కల్పిస్తామని రవి ప్రసాద్ తెలిపారు.
NLG: సెమీఫైనల్స్ కు చేరిన అండర్ 17 బాలుర ఉమ్మడి నల్గొండ జిల్లా బాలుర ఫుట్బాల్ టీం
భద్రాద్రి కొత్తగూడెం లో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీం సెమీఫైనల్ కు చేరిందని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ ఆదివారం తెలిపారు. ఈరోజు రెండు మ్యాచ్ లు జరగగా మొదటి మ్యాచ్ లో మహబూబ్ నగర్ జట్టుపై ఖాజా అన్వర్ (చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్) సాధించిన ఒక గోల్ తో 1-1 స్కోర్ తో డ్రా చేసుకోగా, 2వ మాచ్ లో ఆదిలాబాద్ పై రాచూరి వెంకటసాయి ( చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్)సాధించిన 3 గోల్స్ తో గ్రూప్ విన్నర్స్ గా సెమీఫైనల్ కు చేరుకున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నల్లగొండ జిల్లా క్రీడాకారులు జిల్లా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. లీగ్ దశలో నల్గొండ టీం నాలుగు మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లు డ్రా చేసుకొని.. 2 మ్యాచ్ లు విజయం సాధించి.. గ్రూప్ విజేత గా 6 పాయింట్లు సాధించి సెమీ ఫైనల్ కు చేరుకున్నదని పేర్కొన్నారు.

రాచూరి వెంకటసాయి - 6 గోల్స్ సాధించగా ఖజా అన్వర్ -1 గోల్ సాధించారని తెలిపారు.
NLG: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ,ఎస్సీ,ఎస్టీ లకు తీరని అన్యాయం: కట్టెకోలు దీపేందర్
  నల్లగొండ:
ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్ అమలు వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.

సమాజంలో 6 శాతం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం బీసీలను నట్టేట ముంచే చర్య అని అన్నారు.
గ్లోబల్ క్యాన్సర్ రన్-2024 ను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి.. డిజె టిల్లు పాటకు డాన్స్
HYD: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024 ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను ఉత్సాహపరచడానికి వారితో కలిసి డాన్స్ చేశారు.
NLG: బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామానికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే
మునుగోడు: నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించాలని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయానికి గ్రామాల నుండి సానుకూల స్పందన వస్తోంది. గ్రామాలలో గ్రామస్తుల ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేసుకుని, బెల్ట్ షాపులు నిర్వహించకుండా గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధిని నిధులు మంజూరు చేస్తున్నారు.

మునుగోడు మండలంలోని రావి గూడెంలో బెల్ట్ షాపులు నిర్మూలించినందుకు కమిటీ సభ్యులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. వెంటనే రావి గూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ads బెల్ట్ షాపులను నిర్మూలించిన కమిటీ మెంబర్స్ అయిన మహిళల అభిప్రాయాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మీరు తీసుకున్న  బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారని తాగుడు జోలికే వెళ్లట్లేదని ఎమ్మెల్యేకు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితులలో బెల్ట్ షాపులు మూసివేయాల్సిందేనని, ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరికట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే తీసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: మున్సిపాలిటీగా మారనున్న మునుగోడు!.. ప్రపోజల్స్ ను ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్ట బోతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈరోజు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలి

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలని.. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు.

నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు పట్టణన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారు.

మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రపోజల్స్ ను తొందరలోనే తెప్పించుకొని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. 

మునుగోడు నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనే తన విజన్ ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో శాసనసభ్యుల చిత్తశుద్ధికి మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

NLG: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన నాంపల్లి మండల మాజీ ఎంపీపీ దండిగ నాగమణి భర్త దండిగ వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Ads
NLG: ఆర్టీసీ బస్సు ఎక్కిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ నియోజకవర్గ కేంద్రంలోని పలు వీధుల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు. అప్పుడే చౌటుప్పల్ నుండి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలను పలకరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు.

NLG: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి: డిఇఓ బిక్షపతి
నల్లగొండ: డీఎస్సీ 2024 లో ర్యాంకులు సాధించి 1: 3 నిష్పత్తి లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం ముగిసిందని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ, పిఈటి విభాగాల్లో 1525 మంది ఎంపిక కాగా, 1403 మంది హాజరయ్యారు. 122 మంది హాజరు కాలేదని డిఈవో బిక్షపతి తెలిపారు. ఈనెల 9న హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు అందిస్తారని పేర్కొన్నారు.
కాకా విగ్రహానికి పూలమాల వేసిన మునుగోడు ఎమ్మెల్యే
మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శనివారం స్వర్గీయ  కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతి సందర్బంగా, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద  కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాక.. నిరుపేదలకు, కార్మికులకు, కర్షకుల కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి, తదితరులు ఉన్నారు.