గ్లోబల్ క్యాన్సర్ రన్-2024 ను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి.. డిజె టిల్లు పాటకు డాన్స్
HYD: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024 ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను ఉత్సాహపరచడానికి వారితో కలిసి డాన్స్ చేశారు.
NLG: బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామానికి రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే
మునుగోడు: నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించాలని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయానికి గ్రామాల నుండి సానుకూల స్పందన వస్తోంది. గ్రామాలలో గ్రామస్తుల ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేసుకుని, బెల్ట్ షాపులు నిర్వహించకుండా గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధిని నిధులు మంజూరు చేస్తున్నారు.

మునుగోడు మండలంలోని రావి గూడెంలో బెల్ట్ షాపులు నిర్మూలించినందుకు కమిటీ సభ్యులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. వెంటనే రావి గూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ads బెల్ట్ షాపులను నిర్మూలించిన కమిటీ మెంబర్స్ అయిన మహిళల అభిప్రాయాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మీరు తీసుకున్న  బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారని తాగుడు జోలికే వెళ్లట్లేదని ఎమ్మెల్యేకు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితులలో బెల్ట్ షాపులు మూసివేయాల్సిందేనని, ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరికట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే తీసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: మున్సిపాలిటీగా మారనున్న మునుగోడు!.. ప్రపోజల్స్ ను ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్ట బోతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈరోజు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలి

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలని.. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు.

నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు పట్టణన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారు.

మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రపోజల్స్ ను తొందరలోనే తెప్పించుకొని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. 

మునుగోడు నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనే తన విజన్ ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో శాసనసభ్యుల చిత్తశుద్ధికి మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

NLG: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన నాంపల్లి మండల మాజీ ఎంపీపీ దండిగ నాగమణి భర్త దండిగ వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Ads
NLG: ఆర్టీసీ బస్సు ఎక్కిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ నియోజకవర్గ కేంద్రంలోని పలు వీధుల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు. అప్పుడే చౌటుప్పల్ నుండి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలను పలకరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు.

NLG: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి: డిఇఓ బిక్షపతి
నల్లగొండ: డీఎస్సీ 2024 లో ర్యాంకులు సాధించి 1: 3 నిష్పత్తి లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం ముగిసిందని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ, పిఈటి విభాగాల్లో 1525 మంది ఎంపిక కాగా, 1403 మంది హాజరయ్యారు. 122 మంది హాజరు కాలేదని డిఈవో బిక్షపతి తెలిపారు. ఈనెల 9న హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు అందిస్తారని పేర్కొన్నారు.
కాకా విగ్రహానికి పూలమాల వేసిన మునుగోడు ఎమ్మెల్యే
మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శనివారం స్వర్గీయ  కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతి సందర్బంగా, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద  కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాక.. నిరుపేదలకు, కార్మికులకు, కర్షకుల కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి, తదితరులు ఉన్నారు.
NLG: మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాకా జయంతి
మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతి ని శనివారం నల్గొండ  మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకా కార్మికుల కోసం చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వెంకటసాయి సాధించిన 3 గోల్స్ తో నల్గొండ జిల్లా ఫుట్బాల్ జట్టు ముందంజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు ఈరోజు జరిగిన పోటీల్లో ఖమ్మం జిల్లా ఫుట్బాల్ జట్టుతో డ్రా చేసుకోగా రెండో మ్యాచ్ లో నిజామాబాద్ జిల్లాపై 3-0 స్కోర్ తో విజయం సాధించిందని ఈ 3 గోల్స్ కూడా చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకటసాయి సాధించడం ఎంతో అభినందనీయమని క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు వెంకటసాయి కి అభినందనలు తెలిపారు.
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం సభ్యులకు సన్మానం

నల్లగొండ: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో, నేడు నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిజియల్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్ల నాయక్ మాట్లాడుతూ. విద్యార్థుల భవిష్యత్తు కొరకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల సంక్షేమంబికొరకు నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల బహుజన జాతి బిడ్డలందరికీ గొప్ప అవకాశం అని ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు గా, ఇంజనీర్లు గా ఉన్నత ఉద్యోగాలలో పోలీస్ విభాగాలలో పనిచేస్తున్నారంటే, అది మంత్రి కోమటిరెడ్డి సహకారం అని తెలిపారు.ఆయన సహాయం వల్లనే లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య చదువుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ కాలేజీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని వారు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన క్వాలిఫైడ్ లెక్చరర్స్ బోధనలు విని మంచి స్థాయికి రావడం జరుగుతుందని అన్నారు.ఈ కళాశాల చైర్మన్ పెద్దలు గోన రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు, వారికి కూడా మా బహుజన విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా సంఘం బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ హేమ్లా నాయక్, సెక్రెటరీ శిల్ప, వైస్ ప్రెసిడెంట్ జ్యోత్స్న, ట్రెజరర్ ధనమ్మ, చీఫ్ అడ్వైజర్ శిబ, జాయింట్ సెక్రెటరీ రామకృష్ణ, లేడీస్ సెక్రటరీ గా నస్రత్ బేగం, ఈసీ మెంబర్స్ కోటేశ్వరరావు, లింగారెడ్డి, వేణుగోపాల్ లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ తాడిశెట్టి నరసింహ, లెక్చరర్స్ శివకోటి విక్రమ్ బాబు, మల్లెపాక వెంకన్న, జిల్లా నరసింహ, జయమ్మ, లింగం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరున్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, నియోజకవర్గ అధ్యక్షులు శివతేజ, ప్రవీణ్, సురేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.