NLG: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన నాంపల్లి మండల మాజీ ఎంపీపీ దండిగ నాగమణి భర్త దండిగ వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Ads
NLG: ఆర్టీసీ బస్సు ఎక్కిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ నియోజకవర్గ కేంద్రంలోని పలు వీధుల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు. అప్పుడే చౌటుప్పల్ నుండి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలను పలకరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు.

NLG: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి: డిఇఓ బిక్షపతి
నల్లగొండ: డీఎస్సీ 2024 లో ర్యాంకులు సాధించి 1: 3 నిష్పత్తి లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం ముగిసిందని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎల్పీ, పిఈటి విభాగాల్లో 1525 మంది ఎంపిక కాగా, 1403 మంది హాజరయ్యారు. 122 మంది హాజరు కాలేదని డిఈవో బిక్షపతి తెలిపారు. ఈనెల 9న హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు అందిస్తారని పేర్కొన్నారు.
కాకా విగ్రహానికి పూలమాల వేసిన మునుగోడు ఎమ్మెల్యే
మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శనివారం స్వర్గీయ  కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతి సందర్బంగా, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద  కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాక.. నిరుపేదలకు, కార్మికులకు, కర్షకుల కోసం చేసిన సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి, తదితరులు ఉన్నారు.
NLG: మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాకా జయంతి
మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి (కాకా) 95 వ జయంతి ని శనివారం నల్గొండ  మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకా కార్మికుల కోసం చేసిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వెంకటసాయి సాధించిన 3 గోల్స్ తో నల్గొండ జిల్లా ఫుట్బాల్ జట్టు ముందంజ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు ఈరోజు జరిగిన పోటీల్లో ఖమ్మం జిల్లా ఫుట్బాల్ జట్టుతో డ్రా చేసుకోగా రెండో మ్యాచ్ లో నిజామాబాద్ జిల్లాపై 3-0 స్కోర్ తో విజయం సాధించిందని ఈ 3 గోల్స్ కూడా చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకటసాయి సాధించడం ఎంతో అభినందనీయమని క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు వెంకటసాయి కి అభినందనలు తెలిపారు.
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం సభ్యులకు సన్మానం

నల్లగొండ: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో, నేడు నూతనంగా ఏర్పడిన నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం మెంబర్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జిజియల్ లెక్చరర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు హేమ్ల నాయక్ మాట్లాడుతూ. విద్యార్థుల భవిష్యత్తు కొరకు తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల సంక్షేమంబికొరకు నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాపించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల బహుజన జాతి బిడ్డలందరికీ గొప్ప అవకాశం అని ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లు గా, ఇంజనీర్లు గా ఉన్నత ఉద్యోగాలలో పోలీస్ విభాగాలలో పనిచేస్తున్నారంటే, అది మంత్రి కోమటిరెడ్డి సహకారం అని తెలిపారు.ఆయన సహాయం వల్లనే లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య చదువుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ కాలేజీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని వారు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన క్వాలిఫైడ్ లెక్చరర్స్ బోధనలు విని మంచి స్థాయికి రావడం జరుగుతుందని అన్నారు.ఈ కళాశాల చైర్మన్ పెద్దలు గోన రెడ్డి పేద విద్యార్థుల అభ్యున్నతి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు, వారికి కూడా మా బహుజన విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా సంఘం బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ హేమ్లా నాయక్, సెక్రెటరీ శిల్ప, వైస్ ప్రెసిడెంట్ జ్యోత్స్న, ట్రెజరర్ ధనమ్మ, చీఫ్ అడ్వైజర్ శిబ, జాయింట్ సెక్రెటరీ రామకృష్ణ, లేడీస్ సెక్రటరీ గా నస్రత్ బేగం, ఈసీ మెంబర్స్ కోటేశ్వరరావు, లింగారెడ్డి, వేణుగోపాల్ లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ తాడిశెట్టి నరసింహ, లెక్చరర్స్ శివకోటి విక్రమ్ బాబు, మల్లెపాక వెంకన్న, జిల్లా నరసింహ, జయమ్మ, లింగం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరున్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, నియోజకవర్గ అధ్యక్షులు శివతేజ, ప్రవీణ్, సురేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్

చెన్నై అపోలో ఆస్ప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విష్ చేసిన‌ ప్ర‌ముఖుల‌కు, అభిమానులకు సామాజిక మాధ్యమం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్ లో చేరిన రజినీకాంత్ కు డాక్టర్లు స్టెంట్స్ వేసారు. మూడు రోజులు విశ్రాంతి తర్వాత ఈ రోజు ఆయన్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.

NLG: డీజే ల వినియోగం పై నిషేధం: ఎస్పీ
నల్లగొండ: ఈ నెల 14 వరకు  జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డీ.జే లు, అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్య కఠిన చర్యలు చేపడుతామని అన్నారు.
NLG: మర్రిగూడ మండలం నుండి ఎన్నిక అయిన మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లకు సన్మానం
నల్లగొండ జిల్లా:
మాల్ మార్కెట్ యార్డ్ నందు నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి గురువారం మర్రిగూడ మండలం నుండి ఎన్నిక అయినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లను వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, జమ్ముల వెంకటేష్ గౌడ్, గంట మల్లేష్,  మేకల జగన్ రెడ్డి లను శాలువాతో సన్మానించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఇటీవల నియమించిన విషయం విధితమే.

ఈనెల 7 న పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యే అవకాశం ఉంది.