తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2024, 11:56

నగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు..

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.

మహానగరం చుట్టూ డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని లేఖలో కోరారు.

ప్యారానగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలోని ఖానాపూర్‌, సంగారెడ్డి పటాన్‌చెరు(Khanapur, Sangareddy Patancheru) మండలంలోని లక్డారం, దుండిగల్‌, చౌటుప్పల్‌లోని మల్కాపూర్‌ ప్రాంతాల్లో భూములను డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు గుర్తించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన రాకుండా, పర్యావరణంపై ప్రభావం పడకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల పునర్వినియోగం, నిర్వహణ చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తడి చెత్త నుంచి బయో గ్యాస్‌, సేంద్రియ ఎరువులు, పొడి చెత్త నుంచి విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేయనున్నారు.

ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలాన్ని డంపింగ్‌ యార్డు కోసం గతంలో గుర్తించారు. రహదారి, ఇతరత్రా నిర్మాణ పనులూ ప్రారంభించారు. స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. రోజూ 270 టన్నుల తడి చెత్తతో బయోగ్యాస్‌ ఉత్పత్తికి ఏర్పాటుచేయనున్నారు. చెత్తనూ భూగర్భంలోని బంకర్‌లో వేసి తడి, పొడి చెత్తగా వేరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం నగరంలో రోజూ 7,500 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో లక్ష టన్నులకుపైగా టన్నుల వ్యర్థాల తడి, పొడి చెత్త కుప్పలు ఉన్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2024, 09:00

తిరుమలలో అనూహ్య పరిణామం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదికి వచ్చిన తరువాత తిరుమల లడ్డూ వివాదం కాస్త చల్లారినట్టే కనిపిస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ అంశంపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో భాగంగా- తిరుమలను సందర్శించాలని, శ్రీవారిని దర్శించుకోవాలనీ జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపాన్ని దాల్చలేకపోయింది.

చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యాడర్‌కు సూచించారు. అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు వెళ్లాలనీ, రాత్రి అక్కడే బస చేయాలనీ నిర్ణయించారు.

జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలొచ్చిన మరుక్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పార్టీ శాసన సభ్యుడు సుజనా చౌదరి, సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, జనసేన, టీడీపీకి చెందిన పలువురు నేతలు- తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు.

జగన్ రానున్నారనే విషయం తెలిశాక- అటు తిరుమలలో కూడా కొత్తగా డిక్లరేషన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. టీటీడీ అధికారులు తిరుమలలో పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. హైందవేతరుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అవి.

టీటీడీ ఆలయాలు కేవలం హిందువులకు మాత్రమే చెందినవని, హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయదలచుకుంటే శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, అదనపు కార్యనిర్వహణాధికారి క్యాంప్ ఆఫీస్, రిసెప్షన్ కార్యాలయాలు, అన్ని ఉప విచారణ కార్యలయాల వద్ద డిక్లరేషన ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయని పొందుపరిచారు.

ఆ ఫ్లెక్సీలు, బోర్డులను తిరుమలలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించిన తరువాత వాటిని అప్పటికప్పుడు తొలగించారు టీటీడీ సిబ్బంది. దీనితో- అవన్నీ కూడా జగన్‌ను ఉద్దేశించే పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తోన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2024, 08:56

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చాలా కాలంగా ఓ డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ అంశంపై మోదీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటి వేళ.. కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడంలో ఏకభిప్రాయం సాధించాలని ఆయన రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

పుణే ఇంటర్నేషనల్ సెంటర్‌ 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రాబోయే దశాబ్దంలో భారతదేశం యొక్క ఇంధన భద్రతను పెంపొందించడానికి వ్యూహం మరియు చర్యలు" అనే అంశంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలకోపన్యాసం చేశారు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని చాలా కాలంగా ఓ డిమాండ్ అయితే ఉందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 1.4 మిలియన్లకు చేరిందన్నారు. దీంతో ఇంధనం వాడకం సైతం మూడింతలు పెరిగిందని చెప్పారు.

రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే 25 శాతం ఇంధనాన్ని భారత్ వినియోగించనుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో కేంద్రం సైతం సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

అయితే ఇదే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించాలని గతంలో కేరళ హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. కానీ ఈ సమావేశంలో చర్చించేందుకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గుర్తు చేశారు. మరోవైపు వ్యాట్‌ను వదులుకోవడానికి బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలు సిద్దంగా లేవన్నారు.

అదీకాక రాష్ట్రాలకు మద్యం, ఇంధనం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపారు. అలాంటి వేళ.. ఇంధనాన్ని జీఎస్టీ పరధిలోకి తీసుకు వచ్చేందుకు పలు రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేయక పోవచ్చునని కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంధన దిగుమతి చేసుకోని.. పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాల్సిన ప్రాముఖ్యత ఉందని పూణే ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2024, 08:48

నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

దేశంలో రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కూడా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వానలు కురుస్తాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.

దేశంలో రుతుపవనాల పరిస్థితి చూస్తుంటే, ఇంకా తగ్గేలా కనిపించడం లేదు. ఉత్తర భారతదేశంలోని పర్వతాల నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ వర్షపాతం(rains) ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో హిమాచల్, జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం కూడా ప్రారంభమైంది. దీంతో పెరిగిన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. హిమాచల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది. ఈ క్రమంలో నేడు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.

సెప్టెంబరు 28న పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో కొన్ని చోట్ల, తూర్పు యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు చోట్ల గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని టెరాయ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మధ్య బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. భారీ వర్షాల కారణంగా యూపీలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

మహారాష్ట్రతో పాటు బీహార్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే నేడు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం వర్ష సూచనలు లేవు. సెప్టెంబరు 28న పంజాబ్-హర్యానా, చండీగఢ్‌లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. బీహార్‌లో బాగమతి ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, కోసి, గండక్‌లు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్‌లో వచ్చే 24 గంటల్లో పాట్నా సహా 13 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరద హెచ్చరిక ఉన్న జిల్లాల మెజిస్ట్రేట్‌లకు విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు పంపింది. అదే సమయంలో ఐదు జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

మరోవైపు జమ్మూ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది, వర్షం సంకేతాలు లేవు. ఉత్తరాఖండ్‌లో ఎల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే తూర్పు, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు త్వరలో విడిచిపెట్టబోతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వాతావరణం స్పష్టంగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రమైన బెంగాల్‌లోని డార్జిలింగ్ పరిస్థితి భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దీంతో కొండ ప్రాంతాలలో సామాన్య ప్రజల ఇబ్బందులు పెరగడమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల రాక ఆగిపోయింది. శనివారం కూడా ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం శనివారం కూడా పర్వతాలు, మైదానాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 28 2024, 08:36

హైడ్రా' భ‌యంతో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఏమ‌న్నారంటే..!

హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇల్లును రాసిచ్చారు. 

అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. 

స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్..

ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

హైడ్రా ఎవ‌రికీ నోటీసులు ఇవ్వ‌లేద‌న్న రంగ‌నాథ్‌.. శివ‌య్య దంప‌తులు త‌మ కూతుళ్ల‌కు రాసిచ్చిన ఇళ్లు కూక‌ట్‌ప‌ల్లి చెరువుకు స‌మీపంలోనే ఉన్న‌ప్ప‌టికీ ఎఫ్‌టీఎల్ ప‌రిధికి దూరంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇక కూల్చివేత‌ల‌కు సంబంధించి మూసీ ప‌రిధిలో చేప‌ట్టిన ఏ స‌ర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. 

మూసీ న‌దిలో శ‌నివారం భారీగా ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేయ‌బోతున్న‌ట్లు ఫేక్ న్యూస్ ప్ర‌చారం అవుతోంది. కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని రంగ‌నాథ్ మండిప‌డ్డారు. కూల్చివేత‌ల గురించి ప్ర‌జ‌లు అనవ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. కూల్చివేత‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఇబ్బందులు ప‌డ‌కుండా హైడ్రాకు ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2024, 15:13

పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తోంది.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాల్లో అధికారులు సోదాలు చేపట్టారు.

15 బృందాలు

జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్‌లో గల ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు, బంధువుల ఇళ్లలో రైడ్స్ కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇన్ ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో 15 బృందాలు తనిఖీలు చేపట్టింది.

ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంటిలో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది. నారాయణ పేట- కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు‌ను రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దీనికి సంబంధం లేదని తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు జరుగుతున్న రైడ్స్ దానికి కొనసాగింపు అని తెలుస్తోంది.

పొంగులేటి హర్ష పేరుతో భారీగా ఆస్తులు

పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి చిన్న వయస్సులోనే బిలియనీర్‌గా మారారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. హర్ష రెడ్డి పేరుతో రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇది చర్చానీయాంశం అవుతుంది. ఆ క్రమంలో వరసగా ఈడీ రైడ్స్ జరగడం చర్చకు దారితీస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2024, 11:56

మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్

మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి. ఒక్కో టీమ్ లో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు.

మూసీ (Musi) నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి. ఒక్కో టీమ్ లో తహసీల్దార్ తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ నిర్మాణాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు ఇళ్ళతో పాటు నష్టపరిహరం చెల్లించేందుకు ప్రభుత్వం (Telangana Govt) సిద్ధమైంది. అయితే పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు

మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించినట్లు దాన కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.

దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని దాన కిషోర్ తెలిపారు. రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించి పునరావసం కల్పించిన తర్వాతనే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. బఫర్ జోన్‌కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్టం ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇస్తామన్నారు. ఆ తరువాత మాత్రమే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని దాన కిషోర్ తెలిపారు. మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని, అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2024, 11:45

స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌(Somajiguda Press Club)లో ‘సమగ్ర కులగణన - సామాజిక న్యాయం’పై రాష్ట్ర స్థాయి అఖిల పక్ష సదస్సు జరిగింది. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఫౌండేషన్‌ సెక్రెటరీ జనరల్‌ రాపోల్‌ జ్ఞానేశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ బీఎ్‌స రాములు తదితరులు మాట్లాడారు.

బీసీలపై కనిపించని వివక్ష, దోపిడీ కొనసాగుతున్నదని ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి, సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అన్నారు. బీసీ రాజ్యాధికారం సాధించడానికి మహా ఉద్యమం రావాలన్నారు. మన కలలు సాకారం అయినప్పుడే కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నిజమైన నివాళి అని కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్థమే జరుగుతుందని హెచ్చరించారు. సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. సదస్సులో సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, లాల్‌ కృష్ణ, సురేష్‌, కిరణ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌,మునుగోడు మాజీ జెడ్పీటీసీ బొల్లి శివకుమార్‌, వేముల రామకృష్ణ, వివిధ బిసి కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2024, 09:53

వంగవీటి రాధాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగా స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాధాను వెంటనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయంలో తెలియడంతో అభిమానులు, కూటమి నేతలు పరామర్శించారు.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున స్వల్పంగా గుండెలో నొప్పి వచ్చింది.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడినట్లు తేల్చారు.. అసవరమైన వైద్యం అందించి వెంటనే డిశ్చార్జ్ చేశారు.

వంగవీటి రాధా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. స్వల్పంగా నొప్పి స్వల్పంగా రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. రాధా అనారోగ్యంపై మరోవైపు కూటమి నేతలు రాధా ఆరోగ్యంపై ఆరా తీశారు.. కొందరు ఫోన్‌లు చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

వంగవీటి రాధా స్వల్పంగా నొప్పి వచ్చిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గ్యాస్ సమస్య వల్ల ఇబ్బందిపడ్డారని.. గుండెనొప్పి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు.

వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు కచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ, ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే రెండు రోజుల క్రితమే నామినేటెడ్ పదవులు కొన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీలో చేరి.. అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వంగవీటి రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు.. అయితే అమరావతి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అలాగే ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను కలిశారు.. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేదరనే చెప్పాలి. అయితే 2024 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్‌సీపీకి మళ్లీ వెళతారని ప్రచారం జరిగింది.. అలాగే జనసేన పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఆ తర్వాత కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2024, 06:38

కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ జూన్‌ 7న సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

జూలై 22న ఆ చార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై ఇరుపక్షాల వాదనలు జరుగుతుండగా బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా చార్జిషీట్‌ పై విచారణ నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే.. చార్జిషీట్‌లో పేజీలు సరిగా లేవని, కొన్ని పేజీల్లో అక్షరాలు స్పష్టంగా లేవని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావు న్యాయమూర్తికి తెలిపారు.

మోహిత్‌ రావుతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చార్జిషీట్‌ ను సరైన పద్ధతిలో ఫైల్‌ చేసి కాపీని అందజేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 4కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు