తప్పు చేస్తే దొరకక తప్పదు

3 hours ago

తిరుపతి 'లడ్డూ ప్రసాదం' కేసులో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై హైదరాబాద్‌లో ఫిర్యాదు, తీవ్ర ఆరోపణలు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసిద్ధ 'లడ్డూ ప్రసాదం'లో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే అంశం ఈరోజుల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. ఎన్డీయే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసాదంలో కల్తీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులపై హైదరాబాద్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆలయాన్ని అపవిత్రం చేయడంతో పాటు హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా "దుద్దేశపూరిత చర్య" అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టెస్టింగ్ ల్యాబ్ రిపోర్టును పేర్కొంటూ న్యాయవాది కె. కరుణ సాగర్ సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యొక్క. ఈ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయానని కరుణ సాగర్ అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని పోలీసులను అభ్యర్థించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసి కోట్లాది మంది హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ఓ పోలీసు అధికారిని ప్రశ్నించగా.. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కావడంతో న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పారు. న్యాయపరమైన అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నాణ్యత పరీక్షల కోసం పంపిన నమూనాల్లో నాణ్యత లేని నెయ్యి, కొవ్వు కల్తీ ఉన్నట్లు గుర్తించినట్లు శుక్రవారం వెల్లడించింది. లడ్డూలలో జంతువుల కొవ్వు కల్తీ అని రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

6 hours ago

పావులు కదిపిన మోదీ: చైనాకు చెక్?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు సాగే పర్యటన ఇది. తొలి రోజున తీరిక లేని కార్యక్రమాల్లో గడిపారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఏర్పాటైన క్వాడ్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొన్నారు. కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ముగిసింది.

దీని తరువాత ఆయన న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. లాంగ్ ఐలాండ్‌లో గల నుస్సౌ వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ప్రవాస భారతీయులతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమెరికాలో నివసిస్తోన్న వందలాది మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్యత్వం ఉంది. జో బైడెన్‌, మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమ్మిట్ కొనసాగింది. పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి.

సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు, ఘర్షణలతో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్వాడ్ సదస్సు ఏర్పాటు కావడం అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవడం, వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కారించుకోవడానికి చర్చలే శరణ్యమని చెప్పారు.

స్వేచ్ఛా వాణిజ్యం, సమ్మిళిత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ రీజియన్‌ను నెలకొల్పుకోవాలనేదే క్వాడ్ భాగస్వామ్య దేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మిగిలిన దేశాలకు క్వాడ్ ఓ దిక్సూచిగా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం జో బైడెన్, మోదీ, ఆంటోనీ అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ.. జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.దక్షిణాసియా రీజియన్‌లో తరచూ సరిహద్దు జలాల్లోకి ప్రవేశిస్తూ ఉద్రిక్తతలకు కారణమౌతోన్న చైనాను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తెర మీదికి తీసుకుని రావాలని నిర్ణయించారు. క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్‌కు రూపకల్పన చేయాలని ప్రతిపాదించారు. యూఎస్ కోస్ట్ గార్డ్, భారత్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్‌కు ఇందులో భాగస్వామ్యాన్ని కల్పిస్తారు.

తీర ప్రాంతాల సరిహద్దు జలాల భద్రత కోసం ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు కావడం అనేది ఇదే తొలిసారి.ఇంటర్‌ ఆపరేబిలిటీని మెరుగుపరచడం, సముద్ర జలాల భద్రతను మరింత పటిష్ట పర్చడం, ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో మున్ముందు మరిన్ని జాయింట్ ఆపరేషన్/మిషన్‌లను చేపట్టాలని నిర్ణయించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

6 hours ago

ఏడుకొండలవాడా..! క్షమించు 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష

 

అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. 

లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 

22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. 

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. 

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 13:02

పెళ్లికి ఒప్పుకోని పెద్దలు, ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

కామరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు, బంధులవులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబార్‌పేటకు చెందిన వీణ, కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోని హాయిగా జీవించాలని ఎన్నో కలలకన్నారు.

పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీణ తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ప్రాణం తీసుకోగా.. సాయి కుమార్ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రామాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

బాలికలతో కేర్‌టేకర్‌ అనుచిత ప్రవర్తన

ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బాలికల అనాథాశ్రమంలో ఉన్న విద్యార్థినులతో గత కొంతకాలంగా కేర్‌టేకర్‌ అనుచితంగా ప్రవర్తిస్తోంది. అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట బాలికల దుస్తులిప్పించి నగ్నంగా నిలబెడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల చొరవతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాల్లోకి వెళితే.. అనాథల పిల్లల కోసం ఓ మహిళ కిస్మత్‌పూర్‌లో 15 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న బాలికలు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ఓ మహిళను పిల్లల బాగోగులు చూసేందుకు కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె బాలికలను చిత్రహింసలకు గురి చేస్తోంది. తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులు పూర్తిగా విప్పించి.. ఆశ్రమంలోనే పని చేస్తున్న ఇద్దరు పురుషుల ఎదుట నిగ్నంగా నిలబెడుతోందని బాలికలు వాపోయారు. సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 12:55

నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం

2013లో ఆప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి అధిష్టించనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేశారు.

మరికొన్ని గంటల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతిషితోపాటు ఆమె కేబినెట్‌‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదా సీదాగా జరగనుందని సమాచారం.

అయితే మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. కేజ్రీవాల్ కేబినెట్‌లోని దాదాపు 14 కీలక శాఖలు అతిషినే పర్యవేక్షించే వారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను ఆమె వద్దే ఉంచుకుంటారా? లేకుంటే.. వాటిని వీరికి కేటాయిస్తారా? అని చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.

2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి ఈ రోజు అధిష్టించనున్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేసిన విషయం విధితమే.

మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహాడ్ జైలు నుంచి విడుదలైన ఆయన... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే శాసన సభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అనంతరం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనాకు అందజేశారు. అలాగే శాసనసభ పక్షం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఎల్జీకి కేజ్రీవాల్ వివరించారు. దీంతో ఢిల్లీ సీఎంగా ఈ రోజు అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్న అతి పిన్న వయస్కురాలు అతిషినే కావడం గమనార్హం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 12:43

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెక్‌ అంద‌జేత‌

ఇటీవ‌ల భారీ వ‌ర‌ద‌లు ఏపీ, తెలంగాణ‌ను ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రం అస్త‌వ్య‌స్త‌మైంది. దాంతో చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ క్ర‌మంలో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయంగా విరాళాలు అంద‌జేశారు. 

తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ షో క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది కూడా విరాళం ఇచ్చారు. రూ. 3ల‌క్ష‌ల విరాళం తాలూకు చెక్‌ను ఆయ‌న స్వ‌యంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అంద‌జేశారు. ఇక తాను ఇచ్చిన ఈ మూడు ల‌క్ష‌ల్లో వ‌ర‌ద పీడిత గ్రామ‌మైన ఏకే మ‌ల్ల‌వ‌రం (పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం) కు రూ. 1ల‌క్ష ఇవ్వాల‌ని, మిగ‌తా రెండు ల‌క్ష‌లు త‌న సొంత గ్రామం ప‌ల్లాప‌ల్లి గ్రామ పంచాయ‌తీకి ఇవ్వాల‌ని ఆది కోరారు. 

ఈ సంద‌ర్భంగా ఆది మాట్లాడుతూ.. వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వం కోల్పోయిన బాధితుల‌కు రూ. 6కోట్ల విరాళం ఇచ్చి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అందిరిలో స్ఫూర్తిని నింపార‌ని అన్నారు. ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయ‌తీల‌కు విరాలం ఇవ్వొచ్చ‌ని తెలిసి త‌న వంతుగా రూ. 3ల‌క్ష‌లు ఇచ్చాన‌ని ఆది తెలిపారు. 

కాగా, వ‌ర‌ద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ప‌వ‌న్‌ రూ.6 కోట్లు విరాళం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌ల‌కు చెరో రూ.కోటి చొప్పున అంద‌జేశారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ప్ర‌క‌టించారు. వీటిలో ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున ఇవ్వ‌నున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 12:37

విజయసాయి కుమార్తెకి చెందిన స్టార్ హోట‌ల్ నిర్మాణాలు కూల్చివేత..

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి త‌న‌ న‌క్ష‌త్ర హోట‌ల్ కోసం ఆక్రమిత స్థలంలో కాంపౌండ్ వాల్ ను నిర్మించారు.

దీంతో ఇక్క‌డ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.

సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలున్నాయి. సుమారు 4ఎకరాల స్థలంలో ఈ అక్రమ కట్టడాలున్నట్లు ఆరోపణలున్నాయి.

దీనిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిల్‌ వేశారు. ఈక్రమంలో కోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపు చేపట్టారు. పర్యావరణ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. మరోసారి తాజాగా శనివారం కూల్చివేతలు చేపట్టారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 09:59

నేడు, రేపు వర్షాలు..

ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వాయవ్య, పరిసర మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం మరో ఆవర్తనం పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.

దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండ్రోజులు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం జగిత్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, కామారెడ్డి, నారాయణపేట్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, ములుగు, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2024, 09:14

సీఐడీ విచారణపై భయమెందుకో!

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తుందేమోనన్న భయం మాజీ సీఎం జగన్‌ను వణికిస్తోందా

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తుందేమోనన్న భయం మాజీ సీఎం జగన్‌ను వణికిస్తోందా? సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని తెలియడంతోనే .. వైసీపీ ముఖ్యనేతల్లో భయం ఆవహించిందా..? తాజా పరిణామాలు అదే సూచిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తప్పేమైనా జరిగితే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి, టీడీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి సవాల్‌ విసరాలి. కానీ అందుకు విరుద్ధంగా శుక్రవారంనాడు జగన్‌, సుబ్బారెడ్డి వ్యవహరించారు. వారి మాటల్లో తొట్రుపాటు అడుగడుగునా కనిపించింది. మాజీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై విచారణ జరగాలన్నారు. గంటా పదినిమిషాల పాటు మాట్లాడితే.. కేవలం ఒకేసారి విచారణ కోరారు. మిగిలిన సమయమంతా .. చంద్రబాబును బీజేపీ, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిట్టాలని కోరుకున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్‌ విసరడం తర్వాత.. మాటమాత్రంగానైనా అనలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తనపై విజిలెన్స్‌ విచారణ జరపకుండా స్టే విధించాలని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత గానీ.. అది నియమించే కమిటీతో గానీ న్యాయ విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి కోరారు. ఒకవైపు విజిలెన్స్‌ విచారణపై స్టే కోరుతూ.. మరోవైపు న్యాయవిచారణ అడగడంపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు 2014-19 నడుమ సీఎంగా ఉన్నప్పుడు జరిగినవాటిపై తన ఐదేళ్ల పాలనలో జగన్మోహన్‌రెడ్డి ఏనాడూ న్యాయ విచారణకు ఆదేశించలేదు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో గవర్నర్‌ ఆమోదం కూడా తీసుకోకుండా సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. జగన్‌ జమానాలో ఎవరైనా విమర్శిస్తూ సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినా.. వాటిని లైక్‌ చేసినా.. భూఆక్రమణలున్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించడం.. అర్థరాత్రి సమయంలో గోడలు దూకి మరీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగాయి. ఏనాడూ న్యాయ విచాణకు జగన్‌ ఆదేశించలేదు. ప్రతి చిన్న విషయానికీ సీఐడీని వాడేసుకున్న జగన్‌ అండ్‌ కో.. ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తిరుమల లడ్డూ విషయంలో సీఐడీ విచారణను ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జగన్‌ మాటలకూ.. సుబ్బారెడ్డి చేతలకూ పొంతన లేకపోవడంపై తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో చంద్రబాబును, టీడీపీ నేతలను పలు కేసుల్లో సీఐడీ జైలు పాలు చేసినప్పుడల్లా.. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు ప్రత్యక్షమయ్యేవారు. బెయిల్‌ కోరకుండా జైళ్లలోనే మగ్గి.. నిజాయితీ నిరూపించుకోవాలని సలహా ఇచ్చేవారు. కానీ ఇప్పుడాయన కనిపించడమే గగనమైపోయింది. కీలక అంశాలపై మీడియాతో మాట్లాడానికే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రావడంలేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2024, 19:34

జగన్ కు బిగ్ షాక్.. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు.

తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో కాకుండా.. ప్రపంచదేశాలలో కూడా చాలా వివాదస్పదంగా మారింది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.

అదే విధంగా గత సర్కారు పవిత్రమైన తిరుమలను పూర్తిగా అపవిత్రం చేసే విధంగా పనులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. భక్తులు తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు.

తిరుమల లడ్డుకు కొన్నిఏళ్ల చరిత్ర కూడా ఉంది. అలాంటిది తిరుమల లడ్డులో.. పంది కొవ్వు, చేపనూనె.. వంటి ఇతర పదార్ధాలను ఉపయోగించినట్లు కూడా సంచలన విషయం దేశమంతా దుమారంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డుగురించి వ్యాఖ్యలు చేయడమే కాకుండ.. ల్యాబ్ రిపోర్ట్ ను సైతం బహిరంగపరిచారు.

దీంతో ఇప్పుడిదీ చాలా వివదాస్పదంగా మారింది. శ్రీవారికి మనదేశంలోనేకాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డులో ఉపయోగించే పదార్థాలలో.. పంది కొవ్వు, చేప నూనె ఉపయోగించారని వార్తలు తెలిసి..చాలా మంది భక్తులు తీవ్ర మనోవేదనకు లోనౌతున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ లు సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా.. దీనిపై వైఎస్సార్సీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. చంద్రబాబు.. లడ్డు వ్యాఖ్యలపై వైసీపీ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం.. వచ్చే బుధవారం పిటిషన్ ను విచారిస్తామని చెప్పింది. మరోవైపు లడ్డు వివాదంపై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు.

హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను భంగం కలిగేలా జగన్ ప్రవర్తించారన్నారు. రాజకీయ నేతలు, హిందు సంఘాలు, పలువురు మేధావులు, శ్రీవారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలో.. న్యాయవాది జిందాల్..

కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది.

ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా.. గత జగన్ మోహన్ రెడ్డి నీచానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.

వెంటనే దీనిపై టీటీడీ కూడా స్పందించాలని, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. అదే విధంగా.. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.