Mane Praveen

Sep 06 2024, 23:01

నారాయణపూర్ PRTU TS మండల శాఖ అధ్యక్షులుగా నంద్యాల చలపతి రెడ్డి
PRTU TS యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండల శాఖ, సర్వసభ్య సమావేశం శుక్రవారం నారాయణపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దోర్నాల రాము, అసోసియేట్ అధ్యక్షులుగా అంతటి శ్రీనివాసులు, మహిళా ఉపాధ్యక్షులు మమత, కార్యదర్శిగా కోల శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా శ్రావణి ఎన్నికయ్యారు.

Mane Praveen

Sep 06 2024, 21:53

వరద బాధితులకు అండగా.. తెలుగు చిత్ర పరిశ్రమ
TG: వరద బాధితులకు అండగా నిలుస్తామంటూ తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కు ఫిల్మ్ ఛాంబర్ తరపున రూ. 25 లక్షలు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ తరపున రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటించారు.

టాలివుడ్ లోని పలు విభాగాల ప్రతినిధులు, సభ్యులు సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చూపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Mane Praveen

Sep 06 2024, 21:36

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపన్న హస్తం.. అనారోగ్య బాధితురాలికి 2 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు
నల్గొండ జిల్లా,  నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కె. చంద్రకళ భర్త రాములు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి లో భాగంగా ముందస్తు చికిత్స కోసం 2,00,000 రూపాయలు ఎల్ ఓ సి  చెక్కును మంజూరు చేయించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ - ఎల్ఓసి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళ కుటుంబీకులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Mane Praveen

Sep 06 2024, 21:17

NLG: మర్రిగూడ బైపాస్ - పిట్టంపల్లి రోడ్డు రిపేర్ కు మోక్షమెప్పుడో...
నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని మర్రిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి రహదారి కనీస మరమ్మత్తులు లేక గుంతలమయమైంది. ప్రజా రవాణా కు అసౌకర్యంగా మారింది.

ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి రోడ్డు రిపేర్ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు రిపేర్ కు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Mane Praveen

Sep 06 2024, 21:11

NLG: వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నల్లగొండ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు.

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ మట్టి గణపతులను పూజించాలని విజ్ఞప్తి చేశారు.

Mane Praveen

Sep 06 2024, 15:19

NLG: సిఐటియు ఆధ్వర్యంలో  మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
ఆశా డే సందర్భంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని, శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో మర్రిగూడ మండల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ కు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆశాలు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ స్కీం లో పనిచేసే ఆశాలు దళిత, బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఆశలను కార్మికులుగా గుర్తించాలి, గ్రాడ్యుటీ మరియు పెన్షన్తో సహా అన్ని సామాజిక భద్రత ప్రయోజనాలకు నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ కాకుండా చెల్లించాలి.అన్ని రకాల పెండింగ్ బిల్లు లు తక్షణమే చెల్లించాలి. ఆశా లకు పనిభారం తగ్గించాలి. పారితోషకం లేని పనులు చేయించ కూడదని అన్నారు.

అదేవిధంగా అంగన్వాడీ లకు గ్రేడ్ వర్జింపజేసి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్కీం వర్కర్ లో భాగమైన ఆశలకు వర్తింపచేయాలని ఆరు నెలల వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు అమలు చేయాలని, 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, మెడికల్ సెలవుల కోసం కచ్చితంగా నిబంధనలు రూపొందించాలని, అదేవిధంగా విధుల కోసం ఆశలకు ప్రయాణ ఖర్చులను వాస్తవ రూపంలో చెల్లించాలి. లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకోవాలి. ఆశలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, మట్టం భాగ్యమ్మ ఏర్పుల పద్మ, ఊరిపక్క మేరీ, అందుగుల యాదమ్మ, రామావత్ జయమ్మ, లక్ష్మి, విజయమ్మ , సుజాత తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 06 2024, 14:34

TG: వరద బాధితులకు ఒక నెల జీతాన్ని ఇచ్చిన భువనగిరి ఎంపీ చాపల కిరణ్ కుమార్ రెడ్డి
HYD: వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,  భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తన ఒక నెల జీతం రూ.1.85 లక్ష లను ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.

ఈ మేరకు సంబంధిత  చెక్కును అందజేశారు. వరద సహాయ కార్యక్రమాల కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ఒక నెల జీతాన్ని అందించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.

Mane Praveen

Sep 06 2024, 07:52

ఉత్తమ గ్రంథ పాలకులుగా అవార్డును స్వీకరించిన డా.దుర్గాప్రసాద్
HYD: రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఉన్నత విద్యలో రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ పాలకులుగా అవార్డును డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ పొందారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, కే.కేశవరావు ప్రభుత్వ సలహదారు, తెలంగాణ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఏబీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీల చేతుల మీదుగా అవార్డును గ్రంథ పాలకులు దుర్గాప్రసాద్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు లభించడం ద్వారా తనకు ప్రోత్సాహకంగా ఉందని, ఇంకా మంచిగా గ్రంధాలయ సేవలు విద్యార్థులకు అందిస్తానని తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ కు రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథపాలకులు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జోష్ణ ప్రభ, అధ్యాపక, కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో బుర్ర వెంకటేశం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉన్నత విద్య, దేవసేన- కళాశాల విద్య, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి మరియు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ బాల భాస్కర్, కళాశాల విద్య అకాడమిక్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 22:24

నల్లగొండ లో కొవ్వొత్తుల ర్యాలీ
దేశంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులను నిరసిస్తూ, నల్లగొండ పట్టణ కేంద్రంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. కలకత్తా లో జూనియర్ డాక్టర్ పై , కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళల పై జరిగిన అత్యాచారం, హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

PDSU, PYL, IFTU, BCP, TJS, TSU పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 05 2024, 22:18

NLG: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: సీఐ రాజశేఖర్ రెడ్డి
నల్లగొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, డీఎస్పీ శివరాం రెడ్డి సూచనల మేరకు, నేడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో,  పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు.

1) ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు  ప్రతి విగ్రహాన్ని విధిగా ఆన్లైన్ చేసుకోవాలని, ప్రతి విగ్రహానికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని విగ్రహాన్ని ఆన్లైన్ చేసుకోవడం వల్ల పోలీస్ వారు ప్రతి రోజు రాత్రి పూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జియో టాగ్ చేసి, నిఘా పెడతామని  తెలిపారు. 
2)మండపాలను రోడ్ కి అడ్డంగా నిర్మించటం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మండపాలను నిర్మించుకోవాలి.
3)ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సంప్రదించి, వారి వద్ద నుండి పర్మిషన్ తీసుకుని, తగు జాగ్రత్తలు పాటిస్తూ, మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
3)నిమజ్జనం రోజు గణేష్ మండపాల నిర్వాహకులు రాత్రి వరకు ఉండకుండా తొందరగా తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేయాలి.
4)DJ లకు పర్మిషన్ లేదు. సౌండ్ బాక్స్ లకు కూడా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఒక వేళ DJ లు పెట్టినట్లయితే అట్టి DJ లను సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.
5)తప్పనిసరిగా మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, లడ్డు విషయంలో దీపం విషయంలో జాగ్రత్తలు వహించాలని కోరారు. 

అదే విధంగా ప్రతి గణేష్ మండపం వద్ద భక్తి భావం పెంపొందించేలా, సమాజ వికాసానికి సంబంధించిన వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అంతేతప్ప రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని అసభ్యకరంగా ఉండే పాటలు డాన్సులు చేయవద్దు అని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్.ఐ సందీప్ రెడ్డి, ఎస్.ఐ శంకర్, ఎస్.ఐ సైదులు, సురేష్, వార్డు కౌన్సిలర్లు సమద్, అభిమన్యు, శ్రీను, కంకణాల నాగిరెడ్డి, పూజిత శ్రీను, బాబా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సంపత్, హషం, నర్సిరెడ్డి, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.