Mane Praveen

Aug 24 2024, 21:30

రాష్ట్ర ఉత్తమ డిప్యూటీ ఆర్ఎం అవార్డు అందుకున్న నల్లగొండ డిప్యూటీ ఆర్ఎం
నల్లగొండ డిప్యూటీ ఆర్ఎం శివశంకర్ రాష్ట్ర ఉత్తమ డిప్యూటీ ఆర్ఎం  అవార్డు అందుకున్నారు.ఇవాళ హైదరాబాదులోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన ఉత్తమ ఉద్యోగుల ప్రగతి చక్రం పురస్కార ప్రధానోత్సవంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి సజ్జనార్ అవార్డును అందజేశారు. నల్లగొండ రీజియన్ లో గ్యారేజ్ మెయింటేనెన్స్ విభాగాన్ని పటిష్ట పరిచి, అహర్నిశలు గ్యారేజీ ఇన్చార్జిలకు గైడ్ చేస్తూ గ్యారేజీ ప్యారా మీటర్లను పెంపొందించినందుకు వారు అవార్డు అందుకున్నారు.

Mane Praveen

Aug 24 2024, 19:42

అవార్డు సాధించిన మీడియా ఫోటోగ్రాఫర్లను అభినందించిన కలెక్టర్ మరియు డిపిఆర్ఓ

నల్గొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ ని, ఉమ్మడి నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ ను శనివారం, నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు అభినందించారు.

Mane Praveen

Aug 24 2024, 19:17

బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటన
విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకత, విషయపరిజ్ఞానం, ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల పట్ల అవగాహనను పెంపొందించే పనిలో భాగంగా, శనివారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీల మరియు విద్యార్థిని విద్యార్థుల బృందం పానగల్లు పర్యాటక కేంద్రాన్ని  సందర్శించారు.

ఈ మేరకు ఉపాధ్యాయినీలు  మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి సమీపంలో గల పానగల్ లో ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఛాయా సోమేశ్వరాలయం, ఉదయ సముద్రం రిజర్వాయర్, పురాతన కట్టడాలను విద్యార్థులకు చూపించి  వాటి విశిష్టతను విద్యార్థులకు తెలియజేసినట్లు తెలిపారు.

పాఠశాల టీచర్లు  జయ, ప్రసన్న, కుశలకుమారి, చంద్రకళ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 24 2024, 19:03

చికిత్స పొందుతున్న జిట్టా బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
TG: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని శనివారం  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల తోనూ కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినట్లు వారికి సూచించారు.

Mane Praveen

Aug 24 2024, 18:53

NLG: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు
నల్గొండ:  జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు మేరెడ్డి సురేందర్ రెడ్డి జయంతి ని బంధుమిత్రులు అభిమానులు మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవన్  లో సీనియర్ నాయకులు లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మేరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ చిత్రం జీవన్ రావు, చిత్రం శ్రీను, సింగం రామలింగయ్య, కారింగు నవీన్, సురేష్, వెంకట్ రెడ్డి, లింగయ్య, రాంబాబు, అశోక్, లైన్స్ క్లబ్ మెంబర్స్ సరళ, మామిడిపల్లి దీపిక, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 24 2024, 18:33

NLG: అవార్డులు పొందిన ఫోటోగ్రాఫర్లను అభినందించిన కలెక్టర్
నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయా చిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో మూడు అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్  లను శనివారం నాడు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు  అభినందించారు.

Mane Praveen

Aug 23 2024, 22:09

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం మండల కేంద్రంలోని గుమ్మకొండ కొండల్ రెడ్డి గార్డెన్ లో భీమనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగాల్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట పలువురు మండల నాయకులు ఉన్నారు.

Ads

ఎమ్మెల్యే రావడం పట్ల నూతన వధూవరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అదేవిధంగా నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. ఆయన అభిమానుల మధ్య సందడి చేశారు.

Mane Praveen

Aug 23 2024, 21:29

బొట్టుగూడ హైస్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుక

నల్గొండ: పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలను ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ వై.శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలలో భారతదేశం సాధిస్తున్న విజయాలను విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి విద్యార్థి పాఠశాల దశ నుండే అంతరిక్ష పరిశోధనలపై శ్రద్ధాసక్తుల్ని కనపర్చి, ఖగోళ శాస్త్రంలో జరుగుతున్న మార్పులను, భారతదేశం ప్రపంచ అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీపడుతూ సాధిస్తున్న అభివృద్ధిని తెలుసుకోవాలని అన్నారు.

భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు గా తయారు కావడానికి ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులు వారికున్న శాస్త్రీయ విజ్ఞానాన్ని తోటి విద్యార్థుల ముందర ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 22 2024, 22:10

NLG: విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
చండూరు: కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ దాతృత్వంతో  మండలంలోని బంగారుగడ్డ  ప్రాథమిక పాఠశాల లో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగ్ లు, మహనీయుల చిత్రపటాలు బహుకరించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాదగోని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కస్తూరి చరణ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 22 2024, 21:45

RR: నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు
రంగారెడ్డి జిల్లా:  అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గురువారం 'నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ప్రత్యేక కమిషనర్ సాతి ఉల్లాల్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మజీద్పూర్ గ్రామ పంచాయతీ పరిదిలో 500 మొక్కలు వివిధ శాఖల నుండి వచ్చిన అధికారులు మొక్కలు నాటడం జరిగింది. దీనిలో భాగంగా రంగా రెడ్డి జిల్లా డిఆర్డిఓ శ్రీలత రెడ్డి మొక్కలు నాటారు.

అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల ఎంపిడివో శ్రీవాణి, క్లస్టర్ ఏపిడి సక్రియా, మండల స్పెషల్ ఆఫీసర్,  గ్రామ కార్యదర్శి రాఘేంద్రరా, మండల ఏ పి ఓ సుధాకర్, శంకర్  మొక్కలు నాటడం పూర్తి చేశారు.