VijayaKumar

Aug 22 2024, 17:18

రెక్కలు తెగిన బాల్యానికి బాధ్యులు ఎవరు...బంగారు భవితనందించేది ఎవరు...

పాపం, పుణ్యం,ప్రపంచ మార్గం కష్టం, సౌఖ్యం,శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పువ్వుల్లారా... అయిదారేడుల పాపల్లారా.... మెరుపు మెరిస్తే వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా.... మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్యవిధాతలు... ఉడతల్లారా! బుడతల్లారా! ఇది నా గీతం వింటారా.... అంటూ కల్మషం లేని బాల్యానికి అక్షరాల ఆకారం ఇచ్చాడు మహాకవి శ్రీశ్రీ కానీ నేడు ఆ బాల్యానికి భరోసా ఇచ్చే వారు కరువౌతున్నారని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా నేటికీ 965 రోజుల క్రితం కుటుంబ పెద్దదిక్కుగా ఉన్న తండ్రిని కోల్పోయి బతుకు తెరువు కోసం జిల్లా కేంద్రానికి వచ్చారు ఈ కుటుంబం. వీరి బాధను అర్థం చేసుకొని సామాజిక కార్యకర్త ఒకరు 1098 కు పోన్ చేసి వీరికి రక్షణ తో పాటు పిల్లలకు చదువు, తల్లికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరారు. అధికారులు మాత్రం వీరిని తీసుకెళ్ళి వివరాలు రాసుకుని వదిలి వేసారు. తినడానికి తిండి లేక, ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వీరు మద్యానికి, డిపో కల్లుకు బానిసలయ్యారు.అంతేకాదు అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. పిల్లల సంక్షేమం కోసం, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా, ఆపథకాలు వీరికి అందకపోవడం లో ఆంతర్యం ఏమిటి? దేశంలోని 6-14 సంవత్సరాల వయస్సు పిల్లల కొరకు తెచ్చిన "నిర్భంద విద్యా హక్కు చట్టం- 2009" కి వీరు అర్హూలు కారా ? అని సామాజిక కార్యకర్తలు అడుగుతున్నారు. పసి పిల్లల సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు, బాలసదనం, మరియు చైల్డ్ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నా, వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. అనాధలైన, తప్పిపోయిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించాలని, లేదా బాలసదనం లో ఉంచి చదివించాలని సుప్రీం కోర్టు 2016 లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ స్మైల్" పేరుతో జులై ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ ముస్కాన్" పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహించి పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కమిటీ కి అప్పగిస్తున్నారు. కానీ జిల్లా కేంద్రం నగరం నడిబొడ్డున ఉన్న భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ , దుర్బర జీవితం గడుపుతున్న,వీరిని మాత్రం గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాల్యం ఎంతో విలువైనది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొనే భాద్యతలు తల్లిదండ్రుల పైనా, మరియు ప్రభుత్వల పైనా ఉంది. ఇప్పటికైనా భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి, తగిన వసతి కల్పించి, పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలని, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆమె కు మెరుగైన చికిత్స చేయించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. *పిల్లలను రక్షించండి, లేకుంటే సంఘం విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది* *కొడారి వెంకటేష్*. సామాజిక కార్యకర్త. గత రెండు సంవత్సరాలుగా భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ గడుపుతున్న కుటుంబం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ , దామెర ప్రాంతానికి చెందిన వారు. తల్లి హసీనా (30). పిల్లలు, రషీద్ (11) హైమ్మద్ (9) లు ఇప్పటికే మద్యానికి బానిసలయ్యారని, వీరిని ఇలాగే వదిలి పెడితే భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు.

VijayaKumar

Aug 21 2024, 20:17

నాగారం లో కట్ట లక్ష్మమ్మకి నివాళులర్పించిన మాలమహానాడు నేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో కట్ట అశోక్ మాతృమూర్తి కట్ట లక్ష్మమ్మ అనారోగ్యం తో మృతి చెందారు. బుధవారం నాగారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పెరుమాళ్ళ యాదగిరి, వలిగొండ మండలం మాల మహానాడు అధ్యక్షులు నీలం నరేందర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వల్లమల్ల రఘుపతి, సంగిశెట్టి నరసయ్య, బుంగ రాములు, సంభోగు బాలస్వామి, వల్లమాల రత్నయ్య, సలబద్రి మహేందర్, గడ్డం ప్రకాష్, సంగిశెట్టి చంద్రయ్య ,సంగిశెట్టి విజయ్ కుమార్, సంభోగు విజయ్ కుమార్, బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 21 2024, 18:38

దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ డిమాండ్

దివిస్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. హనుమంతు జెండగే కు వినతిపత్రం సమర్పించి దివిస్ కంపెనీ వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. వ్యర్థ రసాయనాలతో వస్తున్న బోర్ నీళ్లను వాటర్ బాటిల్స్ తో కలెక్టర్ కు చూపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావాలని కలెక్టర్ ను కోరగా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ప్రతి ఏటా లక్షల రూపాయలు విలువ చేసే పంటల ను, పశుసంపదను నష్టపోతున్నారని అన్నారు. దివిస్ కంపెనీ ఆవరణలోనే బోర్ వెల్స్ ద్వారా సుమారు150 బోర్లను వందలాది ఫీట్ల లోతు వేయించి వాటిల్లో కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను పంపడంతో కంపెనీ చుట్టూతా ఉన్న భూముల్లోని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై పంట నష్టం, ప్రాణ నష్టానికి కారణం అవుతున్నారని అన్నారు. వేసిన పంటలు వ్యర్ధ రసాయనాల వల్ల మాడి మసైపోతున్నాయని అన్నారు. పశువులు ఈ నీళ్లను తాగడం వల్ల చనిపోతున్నాయని అన్నారు. పశువులకు నీళ్లు తాపడానికి రైతులు ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి తాపుతున్నారన్నారు. ఈ కంపెనీ వెదజల్లే విషవాయువులను, వ్యర్థ రసాయనాలను ఆపడానికి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు, పశు పోషణ కరువై రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బాధిత రైతులకు ఒక ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన సిపిఎం ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బాధిత రైతులు సామ జనార్దన్ రెడ్డి, గుండెబోయిన బాలకృష్ణ, అనంతుల రాములు, శ్రీరాముల బక్కయ్య, జిల్లల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 21 2024, 18:35

వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణా రావు

యాదాద్రి భువనగిరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామక్రిష్ణ రావు జిల్లాలోని వలిగొండ మండల పరిధిలోని వేముల కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఉప కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల లోని అన్ని రికార్డులను పరిశీలించారు. ఔట్ పేషంట్స్ సర్వీస్ లను పరీక్షించారు. జ్వర కేసుల నమోదును పరిశీలించారు. అనంతరం వేముల కొండ ఆరోగ్య ఉప కేంద్రం లో పిల్లలకు టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అర్హులైన పిల్లలందరికీ టీకాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రసిధ్, సూపర్వైజర్ లు ప్రవీణ్, అనురాధ, మరియమ్మ ANM వినోద, సుస్మిత, కృష్ణ వేణి, సౌజన్య, రామలీల, కవిత, సూర్యకాంతం, పావని, నీరజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 20 2024, 21:07

మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో అన్నదానం: తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన నారపాక నరేందర్

హైదరాబాద్ నాదరుగుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో మంగళవారం రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నారపాక నరేందర్ వర్షిత ల కుమారుడు హ్రియాన్స్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నారపాక నరేందర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరిపి , వారికి ఒక్కపూట భోజనంతో పాటు 5000 రూపాయలు భోజనానికి తనవంతు సహకారం అందిస్తున్న అని అన్నారు .పుట్టినరోజు వేడుకలను గొప్పగా జరుపుకోవడం వల్ల ధనం వృధా కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఆ డబ్బుతో చాలామంది నిరుపేదలు, అనాధలకు ఒక్కపూట ఆకలి తీర్చినా సార్థకం ఉంటుందన్నారు.మా కుమారుడి పుట్టినరోజు వేడుకలు అనాధాశ్రమంలో జరపడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.అనంతరం హ్రియాన్స్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

VijayaKumar

Aug 20 2024, 20:01

విషపూరిత జ్వరాలని నిర్మూలిద్దాం; ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

విషపూరిత జ్వరాల్ని నిర్మూలిద్దాం-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దోమలను నివారిద్దాం ఆరోగ్యాన్ని పెంచుకుందామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు* మంగళవారం రోజు ఓ ప్రకటనలో తెలిపారు. .ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉంచడం తోనే దోమలు పుట్టుక జరుగుతుందని,ఇవి మనుషులకు కుట్టడాం వల్లే రోగాలు పుడుతాయన్నారు.కావున నీటి నిల్వ లేకుండా చేసి.దోమలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు.కాచి వడపోసిన నీరు, వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు.బయటి ఆహారం విషమని ఇంటిలో ఆహారం అమృతమన్నారు.గర్భిణులు, పిల్లలు,వృద్ధులు, తీవ్రమైన వ్యాధులు వున్న వారు అత్యంత జాగ్రత్తగా వుండాలన్నారు.జ్వర లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం కాకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.ప్రభుత్వ.ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.అందుకే విషపూరిత జ్వరాల్ని నిర్మూలిద్దామని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.

VijayaKumar

Aug 20 2024, 16:32

సెప్టెంబర్ 1న భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టఫర్

తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని సెప్టెంబర్ 1న భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ అన్నారు మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ చైతన్య యాత్రకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందని ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రతి ఉద్యమకారుడు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సమావేశానికి అధ్యక్షత వహించిన కదిలేని స్వామి నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య మహిళా కమిటీ అధ్యక్షురాలు గంధ మల్ల. మల్లమ్మ జిల్లా ఉపాధ్యక్షులు మంటి రమేష్. సీనియర్ నాయకులు శీలం స్వామి. జిల్లా నాయకులు మల్లం వెంకటేశం. చౌటుప్పల్ మండల అధ్యక్షులు గట్టు సుధాకర్ రామన్నపేట మండల అధ్యక్షులు నోముల శంకర్ బీబీనగర్ మండల అధ్యక్షులు ధారావత్ చంద్రభాను. బొడ్డుపల్లి లింగయ్య ఇమామ్. చౌటుప్పల్ శ్రీనివాస్. గంగ దారి సత్తయ్య. శిల్పంగి గణేష్. మంటి లింగయ్య. పబ్బు లక్ష్మయ్య. బాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 19 2024, 17:53

సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో రాఖీ పండుగ సంబరాలు జరిపిన యువకులు

యాదాద్రి భువనగిరి జిల్లా: అనాధ వృద్ధశ్రమం లో యువకులు ఘనంగా రాఖీ పండుగ సంబరాలు నిర్వహించారు. భువనగిరి మున్సిపాలిటీ లోని రాయగిరి శివారులో వున్న సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో  రాఖి పౌర్ణమి సందర్బంగా రాయగిరి  గ్రామానికి చెందిన యువకులు అనాధ వృద్ధాశ్రమంలో   వృద్ధులకి కుటుంబాలు దూరమైన వారికి మేము వున్నాం అని పండుగ వాతావరణంలో రాఖీలు కట్టించుకున్నారు. స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో  యువజన నాయకులు భాను బొజ్జ ,బొజ్జ శివ, ఏర్పల మహేష్, నిల కార్తీక్, మేకల Mtar ఆనంద్, కొత్త ప్రశాంత్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ...వున్నా దంట్లో ఎదుటి వ్యక్తులకి సంతోషాన్ని నింపడమే అసలైన జీవితం ఆనందం అని అన్నారు.

VijayaKumar

Aug 18 2024, 19:20

కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు అమలుపరచాలి: ఏశాల అశోక్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఐ జాతీయ సమితి పిలుపును అనుసరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేశాము సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ కోల్కతాలో వైద్యురాలు మౌ మిత పై అత్యాచారం చేసి హింసించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్స్ కు తగినంత రక్షణ కల్పించాలని అన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పోలీస్ భద్రతలు ఉంచాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్ సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ మండల కార్యదర్శి మరిపెళ్లి రాములు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య మండల కౌన్సిల్ సభ్యులు కోట శంకర్ బొమ్మాయిపల్లి 11వ వార్డు కార్యదర్శి చింతల పెంటయ్య నాయకులు రాసాల బాలస్వామి బద్దం వెంకటరెడ్డి కడారి మల్లేష్ అబ్బులు, చిక్క నరసయ్య రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 18 2024, 15:26

సబ్బండ వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: దయ్యాల నరసింహ గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు

సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతిని పురస్కరించుకొని భువనగిరి మండలం హనుమపురం గ్రామంలో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ 1650 సంవత్సరంలో ధర్మయ్యా సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని ఆనాటి అరాచకాలకు కులవృత్తులకు వేసిన పన్నులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు అని అన్నారు గోల్కొండ కోటను రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినారు షాపూర్ను తన రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని కొలనుపాక తాటికొండ, ఎలగందుల ,చేర్యాల, హుస్నాబాద్, భువనగిరి, జనగామ తో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడు అని అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న అనికొనియాడారు ఆనాడు జరిగిన హింసను భరించలేక దళాని ఏర్పరచుకొని బహుజనుల కోసం పోరాడి నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షులు రంగస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆముదాల రమేష్, మాజీ వార్డు సభ్యులు మోట ఎల్లయ్య, రాగల రాజేశ్వర్ ,మాజీ సొసైటీ అధ్యక్షులు రంగా కొండల్ ,పాలకూరి బిక్షపతి, హనుమగంటి సత్యనారాయణ, రంగ నారాయణ, ఎర్రబోయిన కిష్టయ్య, హనుమగంటి బిక్షపతి, దుర్గం కృష్ణ, ముద్దం కొమరయ్య ,తుమ్మేటి మల్లేష్, హనుమగంటి శ్రీశైలం, జాన భూపాలు ,హనుమగంటి సత్తయ్య ,హనుమగంటి సుక్కయ్య, నరసయ్య.