Aug 18 2024, 20:05
సాగర్ రింగ్ రోడ్ లో బస్సులను పరిశీలించిన నల్లగొండ ఆర్ఎం
నల్లగొండ జిల్లా టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల ప్రాంగణం వద్ద బస్సులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాఖీ పండగ వేల రద్దీతో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని, దేవరకొండ మరియు నాగార్జునసాగర్ లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ డిపో మేనేజర్ రమేష్ బాబు, ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బి వెంకట నరసయ్య, మరియు ఇతర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Aug 19 2024, 20:20