సర్పంచులు, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..
సర్పంచులు, కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత..

బుక్కరాయసముద్రం మండలం నందు మూడు రోజుల శిక్షణా కార్యక్రమములో భాగంగా మొదటి రోజు “రిఫ్రెషర్ శిక్షణా కార్యక్రమం” పారిశుద్ధ్యము, ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక అంశాల పై మండల స్థాయి శిక్షణా కార్యక్రమము ఉదయం 10.00 గంటల నుంచి నిర్వహించడం జరిగినది. శిక్షణా కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులకు నిర్వహించడం జరిగినది. మరియు “డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్” సంబంధించి ప్రతిజ్ఞ చేయడమైనది. ఈ కార్యక్రమంలో శ్రీమతి దాసరి సునీత గారు, మండల పరిషత్ అధ్యక్షులు మరియు శ్రీమతి కె. తేజోష్ణ గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, శ్రీమతి కె.దామోదరమ్మ, విస్తరణా అధికారి (పి.ఆర్. & ఆర్.డి), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, గ్రామీణ నీటి సరఫరా విభాగము, బుక్కరాయసముద్రం వారు హాజరు కావడం జరిగినది.
పేదింటి ఆడపడుచు వివాహ కార్యమానికి ₹5000/- రూ.లు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
పేదింటి ఆడపడుచు వివాహ కార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు* ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని బండారు గంగమ్మ కుమార్తె వివాహకార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు.ఈ కార్యక్రమలో సిద్దారంపురం ZPH హైస్కూల్ చైర్మన్ లింగమయ్య, ఏలిమెంటరీ స్కూల్ కమిటీ చైర్మన్ అంజి, నాగేంద్ర, రవి, కాటమయ్య,శేఖరయ్య, చెన్నమయ్య, నరసింహులు, కొండన్న తదితరులు పాల్గొన్నారు.
Breaking.. టీవీ5 కెమెరామెన్ శేఖర్ మృతిపై ఎమ్మెల్యే దగ్గుపాటి దిగ్భ్రాంతి..
Breaking.. టీవీ5 కెమెరామెన్ శేఖర్ మృతిపై ఎమ్మెల్యే దగ్గుపాటి దిగ్భ్రాంతి..

టీవీ ఫైవ్ కెమెరామెన్ శేఖర్ మృతి పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రిలో వైద్యుల్ని అప్రమత్తం చేశారు. త్వరితగతిన చికిత్సలు అందించాలని సూచించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతినిత్యం మీడియా కవరేజ్ లో కనిపించే శేఖర్ మృతి చెందారు అంటే నమ్మలేకపోతున్నానని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. శేఖర్ మృతి పై సంతాపం వ్యక్తం చేశారు.
పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..
పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..

ఆదివారం నాడు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బయో ఫోర్టిఫైడ్ మరియు క్లయిమేట్ రిసైలైన్ట్ రకాలను దాదాపుగా 109 పంట రకాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో జాతికి అంకితం చేశారు. మోడీ గారి సందేశాన్ని కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా రైతులకు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మల్లీశ్వరి సాదినేని గారు రైతులకు చూపించారు. 109 రకాల వివరాలను అదేవిధంగా వాటి పంట స్థితిగతులను రైతులకు తెలియజేశారు. అదేవిధంగా ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం నుండి రెండు రకాలను జాతీయస్థాయిలో మోడీ గారు రిలీజ్ చేశారు. పప్పు శనగలో NBEG 1267, పెసర లో LGG -610 రకాలను విడుదల చేశారు. ఈ రకం మన అనంతపురం జిల్లాకు చాలా అనుగుణంగా ఉంటుందని తెలియజేశారు. మొత్తం 109 రకాల ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల రకాలను భారత జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి గ్రామ రైతులు, వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు శాస్త్రవేత్తలు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ కిషోర్ మరియు డాక్టర్ మాధవి సిబ్బంది ముత్యాలరావు, ప్రభు మిత్ర, సాయికుమార్ పాల్గొన్నారు.
అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేసిన.. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి..
ఆస్పత్రిలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో డిస్పోస్ తెలియలి, డాక్టర్ ఈ బి దేవి డి యం అండ్ హెచ్ ఓ ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి అనంతపురం పట్టణంలోని ప్రైవేట్ యశోద ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది ఆసుపత్రిలో వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను సక్రమమైన పద్ధతిలో డిస్పోజ్ చేయడం లేదని ఫిర్యాదులు అందడంతో డి ఎం అండ్ హెచ్ వో గారు తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రిలో వెలువడేటువంటి వ్యక్తపదార్థాలను బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో అనుసంధానమై శాస్త్రీయ పద్ధతిలో వ్యక్తపదార్థాలను డిస్పోజ్ చేయాలని ఆదేశించారు .ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను రకాలుగా విభజించుకొని పసుపు రంగు,ఎరుపు రంగు ,నీలం రంగు మరియు పంచర్ ప్రూఫ్ కవర్లలో వేయాలని వేసేముందు ఏ రంగు చెత్తకుండీలో ఏ చెత్త వేయాలో విభజించుకుని అందులో వేసి బయో మెడికల్ డిస్పోజల్ ప్రాంతానికి ఒప్పంద ప్రకారం పంపివేయాలని ఆదేశించారు బయో మెడికల్ వేస్ట్ ప్రమాదకరమైనవని పారవేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని తెలియజేశారు ఆసుపత్రుల యాజమాన్యం ఆసుపత్రులలో వెలువడే వ్యర్థ పదార్థాలను శాస్త్రీయ పద్దతిలో డిస్పోస్ చేయక పొతే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు
నిరుపేదల వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి...

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం గార్లదిన్నె గ్రామంలో నివాసంఉంటున్న మంగళ గణేష్ కూతురు వివాహంకు ₹10000 ఆర్థిక సహాయం చేసిన నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాండు మాజీ వైస్ ఎంపీపీ శేఖర్ నాయుడు గ్రామ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు రామంజి కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మహిళా నాయకురాలు నేహా అయేషా..
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మహిళా నాయకురాలు నేహా అయేషా

అనంతపురం అర్బన్ నియోజవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేడు జన్మదినం తన క్యాంపు కార్యాలయం ఘనంగా జరిగింది.37వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నేహా అయేషా పూల బొక్కేను అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు.
మరణించిన నడిపి కొండన్న పార్థివదేహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేసిన.. కాట్టప్ప గారి రామలింగారెడ్డి..
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలో అనారోగ్యంతో మరణించిన బండారు నడిపి కొండన్న, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కరణలా ఖర్చులకి ₹10,000/- రూ.లు ఆర్థికసాయం చేసిన పేదలపెన్నిధి, మంచిమనస్సున్న మహానేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. అనంతరం బండారు నడిపి కొండన్న గారి పార్థివదేహంకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త సాకే నాగేంద్ర, సిద్దారంపురం ZPH స్కూల్ కమిటీ చైర్మన్ బోయ లింగమయ్య, సిద్దారంపురం ఏలిమెంటరీ స్కూల్ కమిటీ చైర్మన్ బోయ అంజి, కాటమయ్య, చెన్నమయ్య, నాగేంద్ర, వెంకటేష్, రవి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆరో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరిన రవి కుమార్ నాయక్
ప్రపంచ అదివాసి దినోత్సవం సందర్బంగా అనంతపురం జిల్లా గిరిజన భవన్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మారుమూల గిరిజన గారిని కలిసిన రవి కుమార్ నాయక్ పుష్పగుచం అందించి గిరిజనుల వివిధ సమస్యలను తీర్చాలని అలాగే అనంతపురం జిల్లాలో మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనులకు ఒక్కొక్క ఊరిలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి తారురోడ్లు వేయించి సమాన్యాయాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరి అందేలా చూడాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది..
ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ - పంట ద్వారా నమోదు.. ఉద్యానాధికారి శైలజ..
ఈ పంట నమోదు: ఈరోజు బుక్కరాయసముద్రం మండలం , పసలూరు కొత్తపల్లి, రేకులకుంట గ్రామంలో ఖరీఫ్ 2024 సంవత్సరం ఈ పంట నమోదు లో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల వివరాలను ఈ పంట ద్వారా నమోదు చేయడమైనది. మండల వ్యాప్తంగా ఈ పంట ద్వారా నమోదు చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్పుట్స్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, అకాల వర్షాలు మరియు ఈదురు గాలుల వలన పంట నష్ట పరిహారాలు ,పంట మీద బ్యాంకు రుణాలు అందుతాయని తెలపడం అయినది .పంట నమోదుకు రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం ,ఆధార్ కార్డు, రైతు ఫోన్ నెంబర్తో ఆయా గ్రామాల రైతు సేవ కేంద్రాల్లో వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేసుకోవాలని తెలపడం అయినది .దీర్ఘకాలిక ఉద్యాన పంటలను గత ఏడాది పంట నమోదైన పంటలను ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేయాలని రైతు సేవా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడమైనది. ఎంఐడిహెచ్ 2024 ఆర్థిక సంవత్సరం లో భాగంగా కొత్తగా నాటిన చి నీ ,మామిడి, జామ, బంతిపూల తోటలను సందర్శించడమైనది.ఈ కార్యక్రమంలో ఉద్యానాధికారి శైలజ, ఉద్యాన మరియు వ్యవసాయ సిబ్బంది అనూష నదియా, జోష్ణ ,ముని కుమార్ పాల్గోడమైనది.