నిజందాగదుక్షణంఆగదు

Jul 26 2024, 20:37

చట్టాలపై పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి:సురుపంగ శివలింగం

 "చట్టాలపై పౌర సమాజం అవగాహన కలిగి ఉండాలి"

-- సురుపంగ శివలింగం

 

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మరియు ఎస్సీ, ఎస్టీ ల ప్రత్యేక ప్రగతి నిధి చట్టం పట్ల పౌర సమాజం పూర్తి అవగాహన కలిగిఉండాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివలింగం అన్నారు.

ఈరోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సిటిజన్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత గిరిజనుల రక్షణ చట్టాలు మరియు సంక్షేమ, అభివృద్ధి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరగవలసిన అవసరం ఉన్నదన్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలను సంఘటిత పరిచి చైతన్యం చేయవలసిన భాద్యత పౌర సమాజంపై ఉన్నదన్నారు.

ఇందుకోసం కృషి చేస్తున్న దళిత సంఘాలకు అభినందనలు తెలిపారు.

జిల్లాలో సిటీజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆవిర్భావం జరగడం నూతన కమిటీ ఎన్నుకోవడం మంచి పరిణామమని ఈకమిటీలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేయాలని అంతేకాకుండా కమిటీల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

 దళిత గిరిజన విశ్రాంత ఉద్యోగులు, అద్వకేట్ లు, జర్నలిస్టులు, దళిత గిరిజన నాయకులు పాల్గొన్నారు.

అనంతరం నూతన అడ్ హాక్ కమిటీని ఎన్నుకున్నారు.

గౌరవ సలహదారులుగా మేడి లక్ష్మయ్య, కట్టెల శివకుమార్, కె. మధు, డి. నాగయ్య, కె. విజయలక్ష్మి, మోహన్,  కె. యాదయ్య, మౌనిక,  తదితరులను ఎన్నుకున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 26 2024, 20:27

నకిరేకల్: అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం

నకిరేకల్: అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి... బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని ఆపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం అన్నారు. నకిరేకల్ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీను అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటూ అధికార పార్టీ వైఫల్యాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుడుకుంట్ల సాయన్న వనం వేణు, పందాల సైదులు, కారింగు నాగరాజు, చంద్రగిరి శ్రీను, తండు నాగరాజు, యన్నం వెంకటేశం, కానుకుర్తి నరేష్ పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 23 2024, 19:31

స్థిరాస్తి అమ్మకందారులకు నిర్మలమ్మ బిగ్‌ షాక్‌...

స్థిరాస్తి అమ్మకందారులకు నిర్మలమ్మ బిగ్‌ షాక్‌

ఇకపై నో ఇండెక్సేషన్‌ తీసుకొస్తున్న కేంద్రం

15 ఏళ్లు దాటిన ప్రాపర్టీలు అమ్మితే..

ఇకపై 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనంటున్న కేంద్రం

ఇండెక్సేషన్‌ మినహాయింపు తీసేసిన కేంద్రం

ఇల్లు అమ్మితే లాభాల్లో 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే

లాంగ్‌టర్మ్‌ కేపిటల్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను

కేంద్రంనిర్ణయంతో నష్టాల్లో రియాల్టీ కంపెనీల షేర్లు

నిజందాగదుక్షణంఆగదు

Jul 23 2024, 19:20

భద్రాచలం: చర్ల:పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల రేంజర్ ఉపేందర్కు వినతిపత్రం..

పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల రేంజర్ ఉపేందర్కు వినతిపత్రం

పోడు సాగు భూములకు పట్టాలి ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల ఫారెస్ట్ రేంజర్ ఉపేందర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలి ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కలిసి భూములు దున్నుకొని ఇవ్వకుండా పంటలు వేసుకునియ్యకుండా వేసిన పంటలను నాశనం చేస్తూ కాలం పబ్బం గడిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పీసా 1/70 యాక్టివ్ అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏజెన్సీలో ఆదివాసీలకు హక్కులుఅని చెప్పి ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలి ఇవ్వకుండా ఆపుతున్నారని వారన్నారు బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి అటవీ హక్కుల నిబంధనలు ఉల్లంఘిస్తూ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ అధికారులు వాళ్లకెట్ల పర్మిషన్లు ఇస్తున్నారో పరిశ్రమలకు బిల్డింగ్ లకి నిర్మాణాలకు ఎలా పరిమిషన్లు ఇస్తున్నారో చర్ల మండల ప్రజలకు చెప్పాలని వారన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడు, గూడు గుడ్డ లేకుండా అర్ధాకలితో అలమటిస్తున్న ఆదివాసులకు ఎకరం భూమి కొట్టుకొని సాగు చేసుకుంటే వీళ్లకు చట్టాలు నిబంధనలు గుర్తుకు రావడం లేదా అని ఆయన అన్నారు తక్షణమే ఏజెన్సీ ఆదివాసులకు వారి హక్కుల ప్రకారం సాగు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వారు కోరారు?

ఈ కార్యక్రమంలో p o w మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క మంగక్క రాజు తులసి రాసి రమేష్ బయమ్మ రాజమ్మ భవాని సెంకర్ పొడుభూముల సాగుదారులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 23 2024, 18:57

మఠంపల్లి ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం దర్శించి ఆలయ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్

నల్లగొండ,:నేడు జిల్లా లోని మట్టంపల్లి ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి, మరియు రాష్ట్రీయ శ్రీరాంసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి గారు ప్రవచనాలు ఇస్తూ దేవాలయం యొక్క విశిష్టతని భక్తులకు తెలియపరిచినారు అనంతరం,ఆలయ పురోహితులు యొక్క ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాగరాజు, చక్రధర్, అఖిల్, మరియు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 22 2024, 07:42

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో డ్రగ్స్‌ కలకలం..

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో డ్రగ్స్‌ కలకలం

జోరా పబ్‌లో నార్కోటిక్‌ పోలీసుల దాడులు

వైట్ అండ్‌ వైట్‌ ఈవెంట్‌లో పోలీసుల సోదాలు

ఈవెంట్‌లో పాల్గొన్న వారికి డ్రగ్స్‌ టెస్ట్‌

నలుగురికి పాజిటివ్‌..అదుపులోకి తీసుకున్న పోలీసులు

దుర్గం చెరువులోని ఒలీవ్ బ్రిస్టో పబ్‌లోనూ సోదాలు

నిజందాగదుక్షణంఆగదు

Jul 22 2024, 07:32

నిఫా వైరస్‌పై అప్రమత్తమైన కేంద్రం...

నిఫా వైరస్‌పై అప్రమత్తమైన కేంద్రం

కేరళ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందం

కేరళలో మల్లప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి.

కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అందరి శాంపిల్స్‌ సేకరణ

కొజికోడ్‌కు BSL-3 మొబైల్ ల్యాబ్ పంపిన కేంద్రం

నిఫా మరణాలతో క్వారంటైన్ చర్యలకు కేంద్రం ఆదేశం

నిజందాగదుక్షణంఆగదు

Jul 22 2024, 07:23

విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి...

విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి.

విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి చెప్పారు . విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మనదేశంలో ప్రైమరీ స్కూల్స్ పై ఇప్పటికీ ప్రభుత్వాలకు , ప్రజలకు ఒక స్పష్టత లేదన్నారు.

 జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర మహిళా సభ డిగ్రీ ఉమెన్స్ కళాశాల ఆధ్వర్యంలో.... విద్యా, వైద్య రంగాలు - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.... విద్యార్థుల్లో చిన్నప్పటినుంచి శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని, ఇందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. విద్యారంగానికి ప్రభుత్వాలు తమ బడ్జెట్లో కేటాయించాల్సిన స్థాయిలో నిధులను కేటాయించడం లేదని అన్నారు. విద్యకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ప్రాథమిక విద్యనుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించేలా పాఠ్యపుస్తకాలను రూపొందించాలని కోరారు. యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు సైతం అశాస్త్రీయ పద్ధతులను పాటించడం ఏంటని ప్రశ్నించారు. యువత ఎక్కువగా సాంకేతిక విద్య పట్ల ఆసక్తి చూపుతోందని.. ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. సామాజిక అంశాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఆర్ట్స్ ,సైన్స్ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని... కావున విద్యార్థులు సాంకేతిక విద్య కే ప్రాధాన్యత కాకుండా సామాజిక అంశాలకు కూడా ఎంచుకోవాలని కోరారు.

 జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.... సమాజంలో పేదలకు సరైన న్యాయం అందడం లేదన్నారు. చట్టం ఒకటే అయినా అది అందరికీ సమానంగా అందడం లేదన్నారు. పేదలకు ఒకలా, ధనవంతులకు మరోలా న్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రముఖ కార్డియాలజిస్ట్ విరించి విరివింటి మాట్లాడుతూ.... ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కానీ ప్రభుత్వాలు ఈ బాధ్యతనుండి క్రమంగా తప్పుకుంటున్నాయని చెప్పారు. చిన్న చిన్న రోగాలకు కూడా పేదలు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని చెప్పారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం ఫలితంగా.... పేదలు చిన్న చిన్న వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సర్కార్ ఆస్పత్రులను బలోపేతం చేయాలని.. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వర్ రావు, టి. శ్రీనాథ్, రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య, వెంకటరమణారెడ్డి, జితేందర్, చెలిమెల రాజేశ్వర్, ప్రొఫెసర్ బి.యన్.రెడ్డి, డాక్టర్ రమాదేవి, ఎస్పీ లింగస్వామి , రవీంద్రబాబు ,భీమేశ్వర్, ఆంధ్ర మహిళా సభ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి. రజిని ,ప్రిన్సిపల్ డాక్టర్ K. ఝాన్సీ రాణి, అధ్యాపకులు డాక్టర్ K. కరుణాదేవి డాక్టర్ వై. వసుంధర సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 20:26

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

రవాణ, హౌసింగ్‌, జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్

జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌

గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌

గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి

రెవెన్యూశాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌

మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా రాధిక గుప్తా

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 20:16

నల్లగొండ: రేపు ఆదివారం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే ఆరోగ్య అవగాహన సదస్సును విజయవంతం చేయండి...

ఆరోగ్య అవగాహన సదస్సును విజయవంతం చేయండి..

మన ఆరోగ్యం మన చేతుల్లో వంటిల్లే వైద్యశాల,

.అన్ని వ్యాధులకు పరిష్కారం ప్రకృతితోనే సాధ్యం

ఏచూరి శైలజ, ఐ బీ సీ ఛానల్ యం డీ, 

లోకనబోయిన రమణ ముదిరాజ్, మత్స్య కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,

నల్లగొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఐ భి సి ఛానల్ అధినేత ఏచూరి శైలజ భాస్కర్, మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ , బొమ్మపాల గిరిబాబు,పాముల అశోక్ లు మాట్లాడుతూ ఈ నెల తేదీ 21 ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నల్లగొండ లోని చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే ఆరోగ్య అవగాహన సదస్సుకు అత్యధిక సంఖ్యలో విచ్చేసి నిత్యజీవితంలో మనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు ఎలా అధిగమించవచ్చో తెలుసుకోవచ్చని మన వంటింట్లోనే ఉన్న నిత్యం మనం వాడే దినుసులు కరివేపాకు మునగాకు తదితర చాలా రకాలతో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? పెస్టిసైడ్స్ వాడకుండా మన పెరట్లో కురాగాయల సాగుతో ఏ విధంగా ఆరోగ్యంగా జీవించొచ్చు, ఇలా ప్రస్తుత కాలంలో ప్రతి ఆహార పదార్ధము కల్తే జరుగుతుందని వీటన్నిటికీ పరిష్కారాలు మనకు ఆ రోజు ఆరోగ్య సదస్సులో దొరుకుతాయి కావునా ప్రతి ఒక్కరూ తప్పక రావాలని విజ్ఞప్తి చేశారు

ఇట్టి కార్యక్రమంలో కందిమల్ల నాగమణి,ముక్కామల నరసింహ,ఎం డీ అజీజ్ షరీఫ్, రవీందర్ రెడ్డి, రమేష్, మహేశ్ తదితరులు పాల్గోన్నారు.