madagoni surendar

Jul 23 2024, 21:48

ఢిల్లీ :-2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్. బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

ఢిల్లీ :-

2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్:

-:రాహుల్ గాంధీ

బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత

మిత్రులను ఆనందింపజేసేందుకు సామాన్యులకు ఏమీ ప్రకటించలేదని ఆరోపణ

కాంగ్రెస్ మేనిఫెస్టో‌ను కాపీ-పేస్ట్ చేశారని మండిపాటు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్‌ను ‘కుర్చీని కాపాడుకునే బడ్జెట్’గా అభివర్ణించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ‘కాపీ అండ్ పేస్ట్’ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను విమర్శిస్తూ, దీనిని కుర్సీ బచావో బడ్జెట్ అని అభివర్ణించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 బడ్జెట్‌ను తన 7వ వరుస ప్రజెంటేషన్‌గా ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మొదటి బడ్జెట్. 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో మరియు మునుపటి బడ్జెట్‌ల యొక్క "కాపీ అండ్ పేస్ట్" పని బడ్జెట్ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ పేర్కొన్నారు.

బడ్జెట్‌లో మిత్రపక్షాలను సంతృప్తిపరిచారని, ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు చేశామని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బడ్జెట్ ద్వారా మిత్రులను ఆనందింపజేశారని, ఏఏలకు (అంబానీ, అంబానీ అనే అర్థంతో) ప్రయోజనం చేకూర్చేందుకు సామాన్యులకు ఎలాంటి ఉపశమనం కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, మునుపటి బడ్జెట్లలను ‘కాపీ అండ్ పేస్ట్’ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

నిరుద్యోగం ఉందని అంగీకరించారు: కాంగ్రెస్

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్ వేదికగా బడ్జెట్ 2024-25పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం బడ్జెట్ ఆకట్టుకోవడంపై మాత్రమే దృష్టిసారించిందని, చర్యలపై ఫోకస్ చేయలేదని పేర్కొంది. కాపీ-పేస్ట్ ప్రభుత్వం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిరుద్యోగం జాతీయ సంక్షోభం అనే విషయాన్ని ఈ బడ్జెట్ ద్వారా కేంద్రం నిశ్శబ్దంగా అంగీకరించినట్టు అయిందని వ్యాఖ్యానించింది. రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా ఉన్నాయని ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతోందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

madagoni surendar

Jul 23 2024, 13:10

ఆంధ్రప్రదేశ్ :- ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం::రెండో ప్రమాద హెచ్చరిక జారీ.

ఆంధ్రప్రదేశ్ :-

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం::రెండో ప్రమాద హెచ్చరిక జారీ.

జలదిగ్భందంలో పలు గ్రామాలు

అమరావతి :, జులై 23

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగు తుంది. సోమవారం అర్ధ రాత్రి 2గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 

కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులు తున్నారు. సుమారు 13లక్షల14వేలు క్యూసెక్కు ల నీటిని దిగు ప్రాంతానికి వదులుతున్నారు. 

ఈరోజు ఉదయం ఏడు గంటల వరకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటగం టకు వరద ప్రభావం పెరగ డంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

చింతూరు జాతీయ రహదారి (NH)30పై వరద నీరు చేరింది. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వి.ఆర్.పురం మండలం చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం గ్రామాల వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. నాలుగు మండలాల్లో సుమారుగా 250 గ్రామాలకు రాకపోక లకు పూర్తిగా నిలిచిపో యాయి. 

లోతట్టు గ్రామాల ప్రజలను అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిం చడానికి 18 లాంచీలను అధికారులు ఏర్పాటు చేశారు.

madagoni surendar

Jul 23 2024, 12:47

ఆంధ్రప్రదేశ్ :-నెల్లూరు జిల్లా :-పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఆంధ్రప్రదేశ్ :-

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

AP: నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్తో తెల్లవారుజామున 5 గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డ్లోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు.

madagoni surendar

Jul 22 2024, 17:50

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం   

     

 పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

 కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

..

నల్గొండ జిల్లా :-

నకిరేకల్.కల్యాణ లక్ష్మీ పధకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిలుస్తుంది అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు,సోమవారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి ఆలయంలో కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు, అనంతరం మండలంలోని మంజూరైన 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.

నేడు 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను అందుకుటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు 

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది నార్కెట్‌పల్లి లో బస్సు డిపోను పునరావృత్తం చేస్తాం 

మన నియెజకవర్గం ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ముఖ్యమంత్రి చేతులు మీదుగా 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం, డ్రీగి కళాశాల ను నిర్మాణం చేసుకుందాం నకిరేకల్ పట్టణంలోని పేద విద్యార్థులకు, ఫీజుల భారం లేకుండా నర్సరీ నుండి డ్రీగి వరకు నాణ్యతమైన విద్యను అందిస్తాం మీ సమస్యల పరిష్కారానికి ఏల్లపుడు తోడుగా ఉంటా.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Jul 20 2024, 17:53

నివాళుర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-నకిరేకల్ నియోజకవర్గం.

నివాళుర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నకిరేకల్ నియోజకవర్గం:-నిన్న ప్రమాదవశాత్తు మరణించిన నార్కెట్‌పల్లి మండలం పల్లెపహడ్ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మంట్టిపల్లి నర్సింహ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సహాయం కింద 50. వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేసి భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

madagoni surendar

Jul 20 2024, 17:36

న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

హైదరాబాద్ :-

న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్

సైబరాబాద్ సీపీని ఆశ్రయించిన బాధితురాలు. సీఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు.

అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సీఐ మేసేజిలు

madagoni surendar

Jul 20 2024, 08:37

హైదరాబాద్:-విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు.

తెలంగాణ. హైదరాబాద్ :-

విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు.

హైదరాబాద్ - సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు

బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో.. విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు

దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీదర్ రావు(19) విద్యుత్ సిబ్బంది పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు.

madagoni surendar

Jul 19 2024, 22:46

పోలీసులపై పోలీసుల లాఠీఛార్జ్!*
ఝార్ఖండ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO)పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీఓలు సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎస్పీఓలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.

madagoni surendar

Jul 19 2024, 21:33

ఆంధ్రప్రదేశ్.పల్నాడు జిల్లా :- ప్రభుత్వ అధికారి కారు బోల్తా.. తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్. పల్నాడు జిల్లా :-

ప్రభుత్వ అధికారి కారు బోల్తా తీవ్రగాయాలు

పల్నాడు: నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రంగారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

madagoni surendar

Jul 19 2024, 19:03

రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నకిరేకల్ ల్లో జోరు వర్షంలో అంబరాన్ని అంటిన రైతన్న సంబరాలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ జిల్లా :-

రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నకిరేకల్ ల్లో జోరు వర్షంలో అంబరాన్ని అంటిన రైతన్న సంబరాలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ నియోజకవర్గం:-కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ నిధులు విడుదల సంధర్బంలో చేస్తున్న సంబరాల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ నుండి మెయిన్ సెంటర్ వరకు రైతన్నలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ లు, డోల్లు, డీజె చప్పుడుల నడుమా జోరు వర్షంలో రైతులు, నృత్యాలు వేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాని చేయటం జరిగింది.

అనంతరం మెయిన్ సెంటర్ నందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ ధన్యవాదాలు మన నాయకుడు మన ముఖ్యమంత్రి రుణమాఫీ ఓకే సారి చేసి రైతులకు ఒడ్డున చేర్చటమే కాకుండా మాయ మాటలు చెప్పే ప్రతిపక్షాలను లేవలేకుండా కొట్టాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు, రుణమాఫీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది దేశంలో ఏ ప్రభుత్వం చేయనిది నాడైనా నేడైనా మన ప్రభుత్వమే చేసింది ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఓ మాజీమంత్రి రాజకీయల నుండి తప్పకుంటా అన్నాడు మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో

గత ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు ఏడు వేలకోట్ల వడ్డీ కడుతున్నం ఈ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు ప్రజాస్వామ్య పాలన కూడా వచ్చింది ముఖ్యమంత్రి తో మాట్లాడి 10ఎకరాల్లో ఇంట్రిగెటెడ్ స్కూల్ నిర్మాణం చేసుకుందాం100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం డ్రిగి కళాశాల ను తెచ్చుకుందాం ఎన్నికల ముందు బిఆర్ఎస్ వారు అయిటిపాముల లిఫ్ట్ కు కొబ్బరికాయలు కొట్టారు తప్ప ఏమి లేదు, దాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేసుకుందాంబ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు నీళ్లు.మీద చల్లుకొని ఊరేగింపు చేశాడు తప్ప అక్కడ పనులేమి జరగలేదు.బ్యాంకు సమస్యలు ఏమైనా ఉంటే నేను మాట్లాడుతా నా దృష్టికి తీసుకురండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే గెలుపు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, భారీ ఎత్తున హాజరుఅయ్యారు.