madagoni surendar

Jul 22 2024, 17:50

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం   

     

 పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా

మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి

 కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

..

నల్గొండ జిల్లా :-

నకిరేకల్.కల్యాణ లక్ష్మీ పధకం పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా నిలుస్తుంది అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు,సోమవారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా గుడి ఆలయంలో కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు, అనంతరం మండలంలోని మంజూరైన 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేశారు 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.

నేడు 67 కల్యాణ లక్ష్మీ చెక్కులను అందుకుటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు 

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది నార్కెట్‌పల్లి లో బస్సు డిపోను పునరావృత్తం చేస్తాం 

మన నియెజకవర్గం ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం ముఖ్యమంత్రి చేతులు మీదుగా 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం, డ్రీగి కళాశాల ను నిర్మాణం చేసుకుందాం నకిరేకల్ పట్టణంలోని పేద విద్యార్థులకు, ఫీజుల భారం లేకుండా నర్సరీ నుండి డ్రీగి వరకు నాణ్యతమైన విద్యను అందిస్తాం మీ సమస్యల పరిష్కారానికి ఏల్లపుడు తోడుగా ఉంటా.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Jul 20 2024, 17:53

నివాళుర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-నకిరేకల్ నియోజకవర్గం.

నివాళుర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నకిరేకల్ నియోజకవర్గం:-నిన్న ప్రమాదవశాత్తు మరణించిన నార్కెట్‌పల్లి మండలం పల్లెపహడ్ గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మంట్టిపల్లి నర్సింహ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సహాయం కింద 50. వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేసి భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలియజేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

madagoni surendar

Jul 20 2024, 17:36

న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

హైదరాబాద్ :-

న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని లైంగికంగా వేదించిన సనత్ నగర్ సీఐ

ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్

సైబరాబాద్ సీపీని ఆశ్రయించిన బాధితురాలు. సీఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు.

అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సీఐ మేసేజిలు

madagoni surendar

Jul 20 2024, 08:37

హైదరాబాద్:-విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు.

తెలంగాణ. హైదరాబాద్ :-

విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేసిన ఓ యువకుడు.

హైదరాబాద్ - సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు

బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో.. విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు

దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీదర్ రావు(19) విద్యుత్ సిబ్బంది పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు.

madagoni surendar

Jul 19 2024, 22:46

పోలీసులపై పోలీసుల లాఠీఛార్జ్!*
ఝార్ఖండ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO)పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీఓలు సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎస్పీఓలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.

madagoni surendar

Jul 19 2024, 21:33

ఆంధ్రప్రదేశ్.పల్నాడు జిల్లా :- ప్రభుత్వ అధికారి కారు బోల్తా.. తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్. పల్నాడు జిల్లా :-

ప్రభుత్వ అధికారి కారు బోల్తా తీవ్రగాయాలు

పల్నాడు: నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రంగారావు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

madagoni surendar

Jul 19 2024, 19:03

రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నకిరేకల్ ల్లో జోరు వర్షంలో అంబరాన్ని అంటిన రైతన్న సంబరాలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ జిల్లా :-

రైతును రారాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నకిరేకల్ ల్లో జోరు వర్షంలో అంబరాన్ని అంటిన రైతన్న సంబరాలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ నియోజకవర్గం:-కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ నిధులు విడుదల సంధర్బంలో చేస్తున్న సంబరాల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ నుండి మెయిన్ సెంటర్ వరకు రైతన్నలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ లు, డోల్లు, డీజె చప్పుడుల నడుమా జోరు వర్షంలో రైతులు, నృత్యాలు వేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాని చేయటం జరిగింది.

అనంతరం మెయిన్ సెంటర్ నందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ ధన్యవాదాలు మన నాయకుడు మన ముఖ్యమంత్రి రుణమాఫీ ఓకే సారి చేసి రైతులకు ఒడ్డున చేర్చటమే కాకుండా మాయ మాటలు చెప్పే ప్రతిపక్షాలను లేవలేకుండా కొట్టాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు, రుణమాఫీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది దేశంలో ఏ ప్రభుత్వం చేయనిది నాడైనా నేడైనా మన ప్రభుత్వమే చేసింది ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఓ మాజీమంత్రి రాజకీయల నుండి తప్పకుంటా అన్నాడు మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో

గత ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు ఏడు వేలకోట్ల వడ్డీ కడుతున్నం ఈ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంతో పాటు ప్రజాస్వామ్య పాలన కూడా వచ్చింది ముఖ్యమంత్రి తో మాట్లాడి 10ఎకరాల్లో ఇంట్రిగెటెడ్ స్కూల్ నిర్మాణం చేసుకుందాం100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభం చేసుకుందాం డ్రిగి కళాశాల ను తెచ్చుకుందాం ఎన్నికల ముందు బిఆర్ఎస్ వారు అయిటిపాముల లిఫ్ట్ కు కొబ్బరికాయలు కొట్టారు తప్ప ఏమి లేదు, దాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేసుకుందాంబ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు నీళ్లు.మీద చల్లుకొని ఊరేగింపు చేశాడు తప్ప అక్కడ పనులేమి జరగలేదు.బ్యాంకు సమస్యలు ఏమైనా ఉంటే నేను మాట్లాడుతా నా దృష్టికి తీసుకురండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే గెలుపు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, భారీ ఎత్తున హాజరుఅయ్యారు.

madagoni surendar

Jul 19 2024, 18:13

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన

తెలంగాణ.

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.

3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన

4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం

విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు.అంగన్ వాడీలకు సింగిల్ టీచర్

చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్ వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.రెసిడెన్షియల్స్ కు రవాణా సదుపాయం 3వ తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు.విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయడానికంటే ముందే విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు.

సీఎస్ఆర్ ఫండ్స్ తోనూ..

పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సీఎస్ఆర్) ఫండ్స్ పైనా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

madagoni surendar

Jul 18 2024, 20:28

చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామం లో రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ జిల్లా:-నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనం లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడియె కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

.

నల్గొండ జిల్లా :-

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనం లో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడియె కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ ను నడిపి గ్రామంలోని రైతులు డప్పుచప్పుల్లతో ఆనందం వ్యక్తం చేస్తు ర్యాలీ ని నిర్వహించిన్న.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినం ఈరోజు అమలు చేస్తున్నం ఎవరు ఎన్ని ఛాలెంజ్ లు చేసినా మన ముఖ్యమంత్రి ఏక కాలంలో రుణాలు మాఫీ చేస్తూ రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారుముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి నకిరేకల్ నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ రాష్టంలో రైతు రాజ్యం వచ్చింది.రేపు అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు, పాలభిశేకలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కి ధన్యవాదాలు తెలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Jul 13 2024, 20:55

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రానున్న మూడు రోజులు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జూలై 16న (మంగళవారం) గుజరాత్‌లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే వచ్చే మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్, కేరళ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.