VijayaKumar

Jul 19 2024, 20:14

ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి ,ప్రైవేట్ పాఠశాలల్లో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి: AISF

అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ప్రమాదానికి గురైన సెయింట్ ఆన్స్ పాఠశాలను సందర్శించి పాఠశాల కరస్పాండెంట్ తో మాట్లాడడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ మోత్కూరు మండల నాయకులు చందు వినయ్ అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది.

VijayaKumar

Jul 19 2024, 19:44

పహిల్వాన్ పురం అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట - అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని  పహిల్వాన్ పురం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు రమేష్ , అంగన్వాడి టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పిల్లలను అంగన్వాడి కేంద్రంలో చేర్పించి వారికి పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని ,తల్లిదండ్రులు తమ పిల్లలని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలి .వారి ఆరోగ్య విద్య, దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు .అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించకుండా ఆ వయసు ఉన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి .ఆటపాటలతో విద్యను అందిస్తున్నాము మరియు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బాలమని, రాణి ,ఆశా వర్కర్లు పద్మ ,చంద్రకళ మరియు తల్లులు రజిత, మమత ,సంతోష, అలివేలు, లావణ్య, హేమలత, మౌనిక, గౌతమి, గీత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 17:56

సుంకి శాల పాఠశాల నుండి బదిలీపై వెళ్తున్న టీచర్లకు ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల పాఠశాల నుండి బదిలీ పై వెళ్తున్న టీచర్లు ఆలకుంట్ల శ్రీనివాస్ , వరమ్మ ,వై వి ఎన్ . రెడ్డి,వి మాధవి లకు బదిలీ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి బుగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించినారు . ఈ కార్యక్రమంలో  వారి సేవలకు గుర్తుగా  టీచర్లకు మెమెంటోస్  అందజేసి వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేశారు. సుంకి శాల పాఠశాలకు బదిలీపై వచ్చిన టీచర్లు ఇద్దరు అయాజ్ అహ్మద్. పి శ్రీను  లకు హెచ్ ఎం.  జి. బుగ్గా రెడ్డి సాదరంగా  ఆహ్వానం పలికినారు. బదిలీపై వెళ్లిన టీచర్లు వారి అనుభవము విద్యార్థులతో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మొగిలి పాక నరసింహ, పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 17:20

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి

భువనగిరి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు 1923 లో "రూపాయి దాని సమస్య- పరిష్కార మార్గం" అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యంగ్ కమిషన్, సైమన్ కమిషన్,రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసారని, ఆనాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని , అలాంటి నాయకుని ఫోటోని కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా, పార్లమెంటులో మాట్లాడాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి, కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆద్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన, ఆర్బిఐ పైన ఉందని ఎం పి అన్నారు . ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడతానని, ఈనెల 29,30,31తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగే "మహాధర్నాకు" హాజరవుతానని ఎం పి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. భువగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన వారిలో కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, గౌరవాధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, జిల్లా ఎస్సీ /ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, తెలంగాణ దళిత సేన రాష్ట్ర అద్యక్షులు పల్లెర్ల వెంకటేష్, నాయకులు నల్ల కృష్ణ, కుడుదుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 19 2024, 16:22

ఔరవాణి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటి సారిగా మహిళలకూ ఉచిత ప్రయాణం, రెండోదిగా ఉచిత కరెంటు బిల్లు గృహ జ్యోతి నేడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో పాలాభిషేకం చేశారు. ముందు ముందు సామాన్య ప్రజల హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పేదోడి కి న్యాయం జరగాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారనే సాధ్యమన్నారు. తెలంగాణ మార్పు అంటే పేదోడి దగ్గరికి వచ్చిన ఫలితమే నేడు ఎంతో మంది రైతు కళ్ళల్లో ఆనందం వెలుగుతుందన్నారు.అదే విధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, రూపాని రాములు, నడిగోటి అంజయ్య, ఎల్లయ్య, మాధగోని శ్రీను, జక్కిలి గణేష్, శేఖర్, రఘు, నర్సింహా చారి, శివ, జలంధర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jul 19 2024, 07:30

వలిగొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయుచున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి మండల కేంద్రంలోని రైతు వేదిక వరకు ఎడ్లబండి పై ఊరేగింపుగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు రైతులు , రైతు వేదిక కు చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే . జండగే తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో, మండల అధికారులు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ , కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి , గరిసె రవి, పలుసం సతీష్ గౌడ్ ,బత్తిన లింగయ్య, కాసుల వెంకన్న, బత్తిని సహదేవ్, పాలకూర్ల వెంకటేశం, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 22:04

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త: వలిగొండ ఎస్సై డి మహేందర్

వలిగొండ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఎదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగో తో *వాట్స్ యాప్ లో APK files పంపిస్తున్నారు. దీన్ని మనము accept చేస్తే మన వాట్స్ యాప్ వాళ్ళ కంట్రోల్ కీ వెళ్లి పోతుంది, అంతే కాకుండా మన కాంటాక్ట్స్ లో వున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళ్తున్నది.* దీని ద్వారా *సైబర్ నేరస్థులు మన Google Pay / Phone Pay మరియు UPI ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.* ట్రేండింగ్ లో వున్న టాపిక్ ద్వారా APK Files పంపి డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి అందరికి మనవి చేసేది ఏమంటే ఏదయినా apk files వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదు. మీ వాట్స్ యాప్ పనిచేయకుంటే వెంటనే రిఇంస్టాల్ చేసి report ఆప్షన్ లో రిపోర్ట్ చెయ్యండి. ఎవరైనా ఏదయినా నేరానికి గురి అయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా #1930 కీ కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jul 18 2024, 20:10

ఈనెల 20న ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహా ధర్నా విజయవంతం చేయండి: దిండు భాస్కర్ BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోనీ BJYM కార్యలయంలో బీజేవైయం మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి ఆద్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  బీజేవైయం జిల్లా ప్రధానకార్యదర్శి దిండు భాస్కర్ గారు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...జూలై 20 న ఇందిరాపార్క్ దగ్గర జరిగే నిరుద్యోగ మహాధర్నాలో పాల్గోన వలసిందిగా బీజేవైయం నాయకులు, నిరుద్యోగులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రేగూరి అమరేందర్, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్, BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు దంతూరి అరుణ్, మండల ప్రధానకార్యదర్శి అమనగంటి శివ, బుంగ మట్ల పెద్ద మహేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 19:58

భువనగిరి పట్టణంలో శానిటేషన్ పనులను పరిశీలించిన 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణములో రాంనగర్ లో జెసిపి ద్వారా మోరీ జాము తిపిస్తున్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మోరీ లో నీళ్లు వెళ్లకుండా జాము  కావడంతో నీళ్లు  నీలిచి  దోమలు మరియు దూర్వసన   వచ్చి ఇండ్లముందర. జా మై ప్రజలకు జ్వరాలకు ఆరోగ్యములు  క్షీనించి తీవ్ర ఇబ్బందులకు  గురివుతున్నారు  అని అన్నారు. కావున ..ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మోరిలను వెంటనే శుభ్రం చేయాలని పారిశుద్ధ్య  కార్మికులకు తెలియజేశారు మరియు. మెయిన్ రోడ్డు. మీద స్కూలుకు. వెళ్లే. దారిలో. వర్షపు. నీరు నీలిచి స్కూల్ పిల్లలకి  ప్రజలకు  తీవ్ర ఇబంది కలుగుతుంది . కావున  గుంతలో మొరము పోసి ప్రజలకు  ఇబ్బంది  కాకుండా చేయించారు .ఈ కార్యక్రమంలో.కౌన్సిలర్ బొర్రా రాకేష్ , జవాన్ సునీల్, జవాన్ నర్సింగరావు, గిరి , పారిశుద్ధ్య  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 16:59

ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదు , దాతల సహకారం ను సద్వినియోగం చేసుకోవాలి : కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త

గ్రామీణ విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో బస్వాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కీ! శే! బెజ్జంకి వెంకట నర్సింహ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన వారసులు అందించే మెరిట్ స్కాలర్ షిప్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. గురువారం భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెరిట్ విద్యార్థులకు, గ్రామ మాజీ సర్పంచ్ బెజ్జంకి వెంకట నర్సింహ రెడ్డి వారసులు బెజ్జంకి నరోత్తంరెడ్డి, బెజ్జంకి మాణిక్ రెడ్డి, సామ సుష్మా, కోమటిరెడ్డి స్వప్న లు అందించిన యాబది వేల రూపాయల నగదును నల్గురు విద్యార్థులకు (ఒక్కొరికి పన్నెండు వేల ఐదు వందలు) అందజేశారు. ఈ సందర్బంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పుట్టిన ఊరును, చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్ షిప్ లు అందించి, విద్యార్థులను ప్రోత్సహించే దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతల సహకారంను సద్వినియోగం చేసుకుని, ప్రయోజకులు కావాలని ఆయన కోరారు. అనంతరం దాతలను పాఠశాల ఉపాధ్యాయుల ఆద్వర్యంలో సన్మానం చేశారు. పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ డి. కృష్ణవేణి అద్యక్షతన జరిగిన సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కొండ మడుగు బాలమణి, మెరిట్ స్కాలర్ షిప్ దాతలు సామ సుష్మా, కోమటిరెడ్డి స్వప్న, కుమారి రుచిక, గ్రామానికి చెందిన వికలాంగుల హక్కుల నాయకులు మచ్చ ఉపేందర్, మెరిట్ స్కాలర్ షిప్ లు పొందిన విద్యార్థులు చందన, వైశాలి, శ్రవంతి, అభిలాష్, బస్వాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.