madagoni surendar

Jul 06 2024, 15:40

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్

ప్రజలు అప్రమత్తంగా  ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్

నల్గొండ జిల్లా:-

 నల్లగొండ జిల్లా ఎస్పి  శరత్ చంద్ర పవార్    ఆదేశానుసారం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో కొత్త చట్టాలపై అవగాహన కలిగించుటకు రోడ్డు ప్రమాదాలు నివారణ  గంజాయి మత్తు పదార్థాల నివారణ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత బాల కార్మికులు సోషల్ మీడియా స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలా నివారణ కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు దొంగతనాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ  ప్రత్యేక కార్యాచరణతో అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యంపుటకు పోలీస్ కళాబృందల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ,, ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నకిరేకల్ పిఎస్ పరిధిలోని చందంపల్లి గ్రామంలోసీఐ  రాజశేఖర్,ఎస్సై  గోపిక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాకారుల బృందం షేక్ హుస్సేన్, శేఖర్ పురుషోత్తం, సత్యం, మురళి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,  ఈ సందర్భంగా,సీఐ రాజశేఖర్,ఎస్ఐ గోపిక్రిష్ణ లు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చిన అనుమానిత వ్యక్తులు కనిపించిన 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసువారికి  సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు,  

madagoni surendar

Jul 06 2024, 14:29

నలగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో సాంకేతిక కారణాలతో సింహపురి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్ నిలిచి పోయింది
నలగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో సాంకేతిక కారణాలతో సింహపురి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టలపైనే నిలిచి పోయింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈ ట్రైన్ హిల్ బ్రేక్ లాక్ కావడన్ని గుర్తించిన రైల్వే అధికారులు

madagoni surendar

Jul 05 2024, 20:49

టి ఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడి గా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ క్రృతజ్ఞతలు. టిఎస్జేఏ హుజూర్నగర్ అధ్యక్షులు అల్వాల రవికుమార్

టి ఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడి గా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ క్రృతజ్ఞతలు

టిఎస్జేఏ హుజూర్నగర్ అధ్యక్షులు అల్వాల రవికుమార్*

నల్గొండ జిల్లా :-

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి కి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి నాగబాబు కి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం బాలు కి ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము కి,రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్ కి , రాష్ట్ర కమిటీ సభ్యులు దేవరం రామకృష్ణారెడ్డి కి, బరిగెల విజయ్ కుమార్ కి,త్రిపురం లక్ష్మారెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని

హుజూర్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు అల్వాల రవికుమార్ అన్నారు.

madagoni surendar

Jul 05 2024, 14:30

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌.

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్:జులై 05

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు.

కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను ఈరోజు సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.తాను కుమారి ఆంటీతో ఉన్నాన‌ని, ఆమె గురించి ఎంతో విన్న‌ట్లుగా ఆ వీడియోలో సోనూసూద్ చెప్పుకొచ్చారు.

ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు. కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతు న్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నా డు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని అడుగ‌గా.. రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ చెప్పింది.

తాను వెజిటేరియ‌న్ అని ప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, నాన్ వెజ్ అయితే రూ.120 అని తెలిపింది.తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు

సోనూసూద్‌. అదే స‌మ‌ యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడు గ‌గా.. మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని చెప్పింది. ఈ రోజు నాకు లాట‌రీ త‌గి లింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ అన్నాడు.

మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది...

madagoni surendar

Jul 03 2024, 18:42

కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ నియోజకవర్గం:-కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన., అనంతరం.. కట్టంగూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ, ఎంపీటీసీ ల 5 సంవత్సరాల (2019-2024)పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.ఈ కార్యక్రమంలో కట్టంగూర్ జెల్లా ఎంపీపీ ముత్తిలింగయ్య.కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీ టు మాద యాదగిరి,అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Jul 03 2024, 14:18

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‎లో చేరేందుకు నిర్ణయించుకు న్నారు. నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది.

కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ లో చేరారు..

madagoni surendar

Jul 03 2024, 12:28

ఖమ్మం జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరో వాహనం.

ఖమ్మం జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరోవాహనం.

నల్గొండ జిల్లా :-

సూర్యాపేట జిల్లా : టేకుమట్ల ఖమ్మం జాతీయ రహదారి, చివ్వెంల మండల పరిధిలోని ఎల్ ఎన్ రావు తండా సమీపంలో బొలెరో వాహనం హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తూన్న క్రమంలో టైర్ పంచర్ అవ్వడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ఈ వాహనంలో నారాయణ కళాశాల సంబంధించిన ప్రింటింగ్ బుక్స్ లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అవ్వగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.

madagoni surendar

Jul 02 2024, 18:08

నకిరేకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులు మరియు రేకుల షెడ్డు ను ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులు మరియు రేకుల షెడ్డు ను ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన నిర్మించిన అదనపు గదులు మరియు రేకుల షెడ్డు ను ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో రివ్యూ ను చేపట్టడం జరిగింది త్వరలో పదవి విరమణ చేయబోతున్న ఎంపీపీని,యంపిటిసి సభ్యులను ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :-గడిసిన కాలంలో ప్రజలకు సేవ చేసిన నకిరేకల్ ఎంపీపీ కి అభినందనలు ప్రజాపతినిదులకు పదవి కాలం ముగిసింది తిరిగి మళ్లీ ప్రజాలకు సేవ చేస్తే ప్రజాప్రతినిదులు కావచ్చు గడిసిన 4 సంవత్సరాలో ఏలాంటి అభివృద్ధి చెందలేదు ఈ 05 సంవత్సరాలో మెరుగ్తెన అభివృద్ధి చేసుకుందాం ప్రజాప్రతినిదులు కాల పరిమితి ఉంటుంది, అధికారులకు జీవితం మైతం ఉంటుంది అధికారులందరికి నా సహయసహకరం ఉంటుంది

యం.పి.పి నిత్యం పేద ప్రజలకు సేవ చేస్తుంటారు వారికి అభినందనలు..ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య,నకిరేకల్ మండల ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్,నకిరేకల్ పి.ఏ.సి.ఎస్.చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,మండల ప్రజాప్రతినిదులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు..

madagoni surendar

Jun 29 2024, 13:39

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.జిల్లా యువజన నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్

నల్లగొండ జిల్లా :-

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారి జన్మదినం సందర్భంగా నకిరేకల్ లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకకు హజరై కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన.కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్, కట్టంగూర్ మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య యాదవ్, కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు మేడి విజయకుమార్,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Jun 24 2024, 19:53

"ప్రజావాణి" తో ప్రజల సమస్యలు పరిష్కారం.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

"ప్రజావాణి" తో ప్రజల సమస్యలు పరిష్కారం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

సోమవారం నాడు నకిరేకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో నిర్వహించే వారు.పేద వారికి, వృద్ధులు, వికలాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటురని దూర బారం ఐతుందని గమనించి మన జిల్లా కలెక్టర్ ఇకపై ప్రతీ సోమవారం మండల స్థాయి కార్యలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించలను కోవటం మంచి నిర్ణయం.

ఇకపై సమస్యలు పరిష్కారానికి సులువుగా ఉంటుంది

అధికారులందరికి నా విజ్ఞప్తి మీకు ఏ సమస్యలున్నా నేను పరిష్కారం చేస్తా నా దృష్టికి తీసుకురండి. మీ వంతుగా కూడా వచ్చిన దరఖాస్తులన్నీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయండి పారదర్శకంవమైన పాలన ఇద్దాంనకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న అధికారులందరూ బాగా పనిచేస్తున్నారు అందరికీ నా అభినందనలు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల యం.పి.పి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్,పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు.