Mane Praveen

Jul 01 2024, 11:57

నేటి నుండి కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : దేశంలో జులై 1 నుండి మూడు కొత్త న్యాయ చట్టాలు అమలులోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్,(ఐపీసీ) స్థానంలో
భారతీయ న్యాయసంహిత బీఎన్‌ఎస్, క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్ (సీఆర్‌పిసి) స్థానంలో
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బీఎన్‌ఎస్‌ఎస్,
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం బీఎస్‌ఏ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీస్‌లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. *కొత్త చట్టాల ప్రకారం*
1. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూని కేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకొనే వెసులుబా టు పోలీస్‌లకు లభి స్తుంది.
2. జీరో ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి. 3. అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది.
4. అరెస్ట్‌ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌ తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్ట్‌కు సంబంధించిన ముఖ్య మైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.

5. హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. ఏడేళ్లకు పైగా శిక్షపడే అవకాశం ఉన్న నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీని వల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వస నీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
6. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స , వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.

Mane Praveen

Jun 30 2024, 19:48

TG: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ
ఈరోజు ఖమ్మం పట్టణంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో నల్గొండ మండలం రసూల్ పూర్ గ్రామానికి చెందిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. గతం లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో పనిచేసి, తర్వాత బిఆర్ఎస్ లో పార్టీ లో చేరి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి చేరుకున్నారు. సొంత గూటికి చేరిన సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు  జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ , రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి జాకో ప్రతాప్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొర్లపాటి చిరంజీవి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కామళ్ళ సంపత్, కాంగ్రెస్ నాయకులు తీగల నవీన్, సోయల్, మాల మహానాడు చింతకాని మండల గౌరవ అధ్యక్షలు పట్టేటి గోపయ్య సీనియర్ మాలమాల నాయకులు మాలమహానాడు చింతకాని మండల అధ్యక్షులు గామాల రవికుమార్,వనం చిన్నప్ప, మాల మహానాడు సీనియర్ నాయకులు గొర్రె ముచ్చు రత్నాకర్ మండల ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 29 2024, 20:17

NLG: ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు
మేడిపల్లి లింగయ్య 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించి, ఈరోజు ఉద్యోగ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు వారికి ఘన సన్మానాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో కోలాట నృత్యాలతో సన్మాన గ్రహీత దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రీయ నృత్యాలతో కార్యక్రమాన్ని ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు.

Mane Praveen

Jun 28 2024, 18:48

శివన్నగూడ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇవాళ మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. శివన్నగూడ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాలలో ఇల్లు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి త్వరితగతిన ఇండ్ల స్థలాలను కేటాయించనున్నట్లు, ఇంకా ఎవరికైనా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోతే అందజేయనున్నట్లు తెలిపారు. మర్రిగూడ మండలంలో లేదా చింతపల్లి సమీపంలో ఇండ్ల స్థలాలను కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మండల సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

Mane Praveen

Jun 26 2024, 21:40

వైద్య రత్న జాతీయ అవార్డు అందుకున్న డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి
NLG: పీఏ పల్లి మండలంలోని గ్రామాలలో నిరుపేదలకు సూర్య హాస్పిటల్ సిబ్బంది ద్వారా ఉచిత మందులు, రక్త పరీక్షలు ఈసీజీ ద్వారా ప్రజలకు ఉచితంగవైద్య సేవలందించి పేద ప్రజల ఆప్తుడైన డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి కి హైదరాబాద్  సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య భవన్లో బహుజన సాహిత్య అకాడమీ 4వ బహుజన రైటర్స్ వెస్టర్ను ఇండియా కాన్ఫరెన్స్ అవార్డుల ప్రధానోత్సవ సదస్సు లో సంస్థ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా వైద్య రత్న జాతీయ అవార్డులను నిన్న అందజేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారులు కవి గాయకులు దరువు ఎల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ.. బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ఒక స్టేట్లో ఇండియా కాన్ఫరెన్స్ అవార్డుల ప్రధానోత్సవ సదస్సులు నిర్వహించి ప్రజాసేవ చేసినటువంటి డెలిగేట్స్ ను మా సంస్థ  గౌరవించి వారిని వారు చేసిన సేవను బట్టి అవార్డులను అందజేస్తామన్నారు. బహు జన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం సంఘ సేవకులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు మరియు స్వచ్ఛందంగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 33 జిల్లాల నుండి 200 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరై అవార్డులు తీసుకున్నట్లు తెలియజేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ పాల్వాయి వెంక రెడ్డి మాట్లాడుతూ..  జాతీయ స్థాయిలో నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమని అలాగే ఇంకా గ్రామాలలో ఉచిత వైద్యం అందించడానికి నాకు ఇంకా బాధ్యత పెరిగిందని పేదలకు ఎల్లవేళలా వైద్య సేవలందిస్తానని వారు తెలియజేశారు. నాకు వైద్య రత్న జాతీయ అవార్డుకు సెలక్షన్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కమిటీ మెంబర్ సామాజిక వేత్త, దళిత రత్న బుర్రి వెంకన్న కు కృతజ్ఞతలు అని తెలిపారు.

Mane Praveen

Jun 26 2024, 20:50

ఎస్పీ ని కలిసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు

నల్గొండ జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శరత్ చంద్ర పవార్ ను, మంగళవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గిరిజన సాంప్రదాయ కండువాను జిల్లా ఎస్పీకి బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేలావత్ నగేష్ నాయక్, లోకా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 26 2024, 12:40

NLG: సామాజిక కార్యకర్త కి డాక్టరేట్ ప్రదానం
నార్కట్ పల్లి మండలం, ఔరవాని గ్రామానికి చెందిన ముప్పిడి రవి గత కొంత కాలంగా, పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ సృస్తికర్త అయినటువంటి డాక్టర్ కృష్ణంరాజు తో పనిచేస్తూ రాష్ట్రంలో పలు జిల్లాలలో రక్తం అవసరం ఉన్నవారికి కొన్ని వందల మందికి రక్తధాతలని పంపించి అవసరం తీర్చి,  సోషల్ వర్కర్ గా గుర్తింపు పొంది అనేక రకాల సేవ కార్యక్రమాలలో పాల్గొని ముందుండి నడిపిస్తూ సేవ చేస్తున్నారు. వారు చేసే సేవలకు ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్  ( IPAC ) వారు విడుదల చేసిన డాక్టరేట్ డిగ్రీ కి నామినేషన్ లో ఎంపికైయ్యారు. ఈ అవార్డు ను ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ చే సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఢిల్లీ లో గౌరవ డాక్టరెట్ ని అందుకున్నారు.

Mane Praveen

Jun 25 2024, 14:44

అనుమతుల్లేని పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి
బీసీ విద్యార్థి సంఘం మరియు బిసి రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో ఎస్పిఆర్ హైస్కూల్ పేరు మీద పాఠశాలను చలాయిస్తున్నారని, దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవనీ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని, విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారిని కోరుతున్నట్లు తెలిపారు. ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ చోరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Mane Praveen

Jun 25 2024, 14:34

బొట్టుగూడ హైస్కూల్లో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ
హైస్కూల్లో యూత్ ఫర్ సేవ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఇవాళ విద్యార్థినీ విద్యార్థులకు మానవ శరీర నిర్మాణం మరియు అంతర్గత అవయాల పనితీరు మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకొనుట కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడిపల్లి లింగయ్య గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మరియు యూత్ ఫర్ సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 24 2024, 22:10

అంగన్వాడీల వేతనాలు పెంచాలి: ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్
NLG: అంగన్వాడీల వేతనాలు రూ.18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని  ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే  గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే రూ. 18 వేల వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు.

అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న  సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని  డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.

అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10 ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా   పనిచేస్తున్నా నేటికీ గౌరవ వేతనం మాత్రమే పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి, సాయి సుజిత, బి.రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,CH. తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో  ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.