హై స్కూల్స్, హాస్టల్స్ పై ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
విద్యార్థులకు రుచి, శుచికరమైన భోజనం అందించాలి నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ శింగనమల నియోజకవర్గం: బుక్కరాయసముద్రం మండల కేంద్రం లోని జడ్పీ ఉన్నత పాఠశాలను నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈరోజు విద్యార్థుల మధ్యాహ్న భోజన సమయానికి ఎవ్వరికీ తెలియకుండా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హై స్కూల్ కు వచ్చారు. వచ్చి రాగానే భోజనాల వద్దకు నేరుగా వచ్చి, భోజన పాత్రలలో అన్నం, కూరలు పరిశీలించారు. భోజన వంటల పై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఆదేశించారు. లేదంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత భోజనాలు చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి, పలు విషయాలు మాట్లాడారు. భోజనాలు గురించే గాకుండా, విద్యా బోధన విషయాలు, సమస్యలు పై అడిగారు. ఆ తర్వాత ఆర్.డబ్ల్యు.యస్. అధికారులు ను పిలిపించి, విద్యార్థులు త్రాగుతున్న నీటి గురించి పరీక్షలు జరిపించారు. అధికారులు త్రాగునీటి వాడకం పై ఎలాంటి ఇబ్బంది లేదని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ గారికి తెలిపారు. ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోడల వరకు నిర్మించి, నిలిపివేసిన భోజన శాల ను పరిశీలించారు. భోజన శాల ను విద్యార్థులకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హై స్కూలు యందు అబ్బాయిలకు,ఉపాద్యాయులుకు టాయిలెట్స్ లేకపోవడంతో వెంటనే సంబంధించిన అధికారులు కు రిపోర్ట్ చేయాలని హెడ్ మాస్టర్ కు సూచించారు. అలాగే టీచర్ల కొరత గురించి ఉపాద్యాయులు ను అడిగారు. త్వరలోనే హిందీ టీచర్ రిటైర్డ్ అవుతారని, హిందీ టీచర్ ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కి వినతి చేశారు. జిల్లా విద్యా శాఖాధికారి కి లేఖ వ్రాయాలని, అలాగే టీచర్ల, ఇతర సమస్యల గురించి ఒక రిపోర్ట్ కాపీ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ఉపాద్యాయులు కు సూచించారు.
పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు...

పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు.

శింగనమల నియోజకవర్గం,బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు పరిశీలించారు. వసతి గృహ గదులలో పైకప్పు సిమెంట్ స్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఉండడం చూసి సంబంధించిన వసతి గృహ వార్డెన్ ఫై అసహనం వ్యక్తం చేశారు.స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిన సంగతి గురించి సంబంధించిన అధికారులకు తెలిపినారా లేరా అని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు అధికారిని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద మరమ్మత్తుల కోసం పంపించామని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారి దృష్టికి కాగితాలు చూపుతూ వసతి గృహ అధికారి రామ్ నాయక్ తెలిపారు.గడిచిన నాడు నేడు కింద వైసీపీ ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా నిర్లక్ష్యం చేయడం విద్యారంగానికి సంబంధించిన విద్యార్థుల వసతి గృహాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం చేసి వ్యవస్థలను ఎక్కడి గొంగళి అక్కడేఅన్న చందంగా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు.ఇంకొకసారి స్లాబ్ పై కప్పు సిమెంట్ పెచ్చులు ఊడి పోయాయని,మరమ్మతులు కోసం సంబంధించిన అధికారులు కు పంపండని సూచించారు. వంట గదిని పరిశీలించి,శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.ఆ తర్వాత అరుగు పై ఉంచిన స్టీల్ పాత్రను పరిశీలించారు. పాత్రలో నిల్వ ఉంచిన నీటిని విద్యార్థులు ఎల్లవేళలా త్రాగుటకు ఉపయోగిస్తారని సిబ్బంది ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారికి తెలిపారు.పాత్ర పై ఉంచిన మూత తీసి,పాత్రలోపలి భాగం చూశారు.నీటి అడుగున పాచిపట్టి,దోమలు పడి అపరిశుభ్రంగా ఉండటం చూసి,సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ ఇండ్లలో త్రాగడానికి ఇలాగే పాత్రలు ఉంటాయా అని మండిపడ్డారు.వెంటనే పాత్ర ను మార్చాలని ఆదేశించారు. వసతి గృహంలో ని గదులు పరిశీలించే క్రమంలో నలుగురు విద్యార్థులు పాఠశాల కు వెళ్లకుండా ఉండటం చూసిన ఎమ్మెల్యే గారు,విద్యార్థులుకు ఆరోగ్యం బాగా లేదని,అందుకు వెళ్ళ లేదని సిబ్బంది తెలిపారు. సిబ్బంది ని పక్కకు పంపి,ఎమ్మెల్యే గారు విద్యార్థుల ఆరోగ్యం గురించి వివరాలు అడిగి,వైద్య సేవలు అందాయా లేవా అని అడిగారు.విద్యార్థులు వైద్య సేవలు అందాయాని ఎమ్మెల్యే గారికి తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య విషయం లో జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి ఎమ్మెల్యే శ్రావణి గారు సూచించారు. అలాగే గదులలో విద్యుత్ ఫ్యాన్లు,బల్బులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపించి,గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలని అధికారికి ఎమ్మెల్యే తెలిపారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచు అందజేసిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు *బీసి సంక్షేమం,ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారిని మర్యాద పూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు* మరియు నాయకులు పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 380 వ రోజు అన్నా క్యాoటీన్ ద్వారా భోజనం ఏర్పాటుచేసిన *బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు
జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, జూన్ 27.. జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పెన్షన్ల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీలులేదన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం వెంటనే క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని, సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులైన మండల స్థాయిలోని ఆర్ఐలు, జూనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, బిల్ కలెక్టర్లు, తదితర సిబ్బందిని పెన్షన్ల పంపిణీకి నియమించాలన్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో, నగరంలో, మున్సిపాలిటీలలో పెన్షన్ల పంపిణీ పై సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీపై శిక్షణ ఇవ్వాలన్నారు. శనివారం రోజు పెన్షన్ల పంపిణీ అమౌంట్ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలని, నగదును బ్యాంకుల నుంచి తీసుకెళ్లేటప్పుడు బందోబస్తు ఉండాలని ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ విషయం పంచాయతీ సెక్రెటరీలకు తెలియజేయాలన్నారు. అన్నిచోట్ల బయోమెట్రిక్ డివైసెస్ అవసరమైనన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం లబ్ధిదారుల మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డీఓలు జి.వెంకటేష్, వి.శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు..
టీడీపీ కార్యకర్త భౌతికాయనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ..
టీడీపీ కార్యకర్త భౌతికాయనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామ నివాసి, టీడీపీ కార్యకర్త తలారి రాజన్న అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తలారి రాజన్న గారి పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. రాజన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, టీడీపీ తరపున ఎల్లవేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు.
హోంశాఖ మంత్రివర్యులు కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో భాగంగా అమరావతిలో హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు
జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం..

జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది..

కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి.

వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు ఆయన వెళ్తున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.

ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్..

ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* అనంతపురం, జూన్ 22 : *జాతీయ రహదారి 544-డికి సంబంధించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారి 544-డికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో భూ నష్టపరిహారం పంపిణీపై ఆర్బిట్రేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 544-డి జాతీయ రహదారికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో సర్వేనెంబర్ 112-2లో 0.60 ఎకరాల భూమికి అవార్డు అయ్యాక నష్టపరిహారం అందించలేదని, గ్రామానికి చెందిన పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. గ్రామానికి చెందిన భూమి, ఇళ్లు కోల్పోయిన పట్టాదారులతో మాట్లాడి వారికి ఏం కావాలో తెలుసుకొని ఎన్.హెచ్.ఏ.ఐ పిడి, ఆర్డీఓ, తహసీల్దార్ లతో చర్చించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్ట ప్రకారం వారికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఎన్.హెచ్.ఏ.ఐ పిడి తరుణ్ కుమార్, అనంతపురం ఆర్డిఓ జి.వెంకటేష్, బుక్కరాయసముద్రం తహసిల్దార్, సింగనమల సబ్ రిజిస్టర్, బోడిగానిదొడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

Breaking... తండ్రి చేతిలోనే దారుణ హత్య కు గురైన ఆరేళ్ల బాలిక..
అనంతపురం నార్పలలో దారుణం ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్ మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు బాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్ బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు
ప్రపంచ యోగా దినోత్సవములో మండల ఎంపీపీ దాసరి సునీత..
బుక్కరాయసముద్రం మండలంలోని సిద్దరాంపురం గ్రామపంచాయతీ నందు గత సంవత్సరంలో చేపట్టినటువంటి అమృత్ సరోవర్ పని దగ్గర ప్రపంచ యోగా దినోత్సవమును జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షులు దాసరి సునీత గారు హాజరు కావడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి గారు, ఈవో పి ఆర్ డి దామోదరమ్మ గారు, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నారాయణస్వామి గారు, ప్రజా ప్రతినిధి బుల్లే నారాయణస్వామి గారు, ఉపాధి సిబ్బంది ఏపిఓలు, టిఏలు, పంచాయతీ లెవెల్ ఆఫీసర్లు, ఉపాధి కూలీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నడం జరిగినది.