Venkatesh1

Jun 28 2024, 10:19

బీసీ సంక్షేమ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచు అందజేసిన సింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు..
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు *బీసి సంక్షేమం,ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారిని మర్యాద పూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు గారు* మరియు నాయకులు పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీర్చడం పూర్వజన్మ సుకృతం పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 380 వ రోజు అన్నా క్యాoటీన్ ద్వారా భోజనం ఏర్పాటుచేసిన *బీసి సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖా మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు

Venkatesh1

Jun 28 2024, 07:10

జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి.. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, జూన్ 27.. జూలై 1వ తేదీన 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పెన్షన్ల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ చిన్న పొరపాటు జరగడానికి వీలులేదన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం వెంటనే క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని, సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులైన మండల స్థాయిలోని ఆర్ఐలు, జూనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, బిల్ కలెక్టర్లు, తదితర సిబ్బందిని పెన్షన్ల పంపిణీకి నియమించాలన్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో, నగరంలో, మున్సిపాలిటీలలో పెన్షన్ల పంపిణీ పై సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీపై శిక్షణ ఇవ్వాలన్నారు. శనివారం రోజు పెన్షన్ల పంపిణీ అమౌంట్ బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలని, నగదును బ్యాంకుల నుంచి తీసుకెళ్లేటప్పుడు బందోబస్తు ఉండాలని ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ విషయం పంచాయతీ సెక్రెటరీలకు తెలియజేయాలన్నారు. అన్నిచోట్ల బయోమెట్రిక్ డివైసెస్ అవసరమైనన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం లబ్ధిదారుల మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్డీఓలు జి.వెంకటేష్, వి.శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Venkatesh1

Jun 28 2024, 06:54

టీడీపీ కార్యకర్త భౌతికాయనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ..
టీడీపీ కార్యకర్త భౌతికాయనికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామ నివాసి, టీడీపీ కార్యకర్త తలారి రాజన్న అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు తలారి రాజన్న గారి పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. రాజన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, టీడీపీ తరపున ఎల్లవేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు.

Venkatesh1

Jun 23 2024, 06:16

హోంశాఖ మంత్రివర్యులు కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో భాగంగా అమరావతిలో హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు

Venkatesh1

Jun 22 2024, 19:26

జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం..

జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది..

కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి.

వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు ఆయన వెళ్తున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.

Venkatesh1

Jun 22 2024, 19:12

ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్..

ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* అనంతపురం, జూన్ 22 : *జాతీయ రహదారి 544-డికి సంబంధించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారి 544-డికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో భూ నష్టపరిహారం పంపిణీపై ఆర్బిట్రేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 544-డి జాతీయ రహదారికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో సర్వేనెంబర్ 112-2లో 0.60 ఎకరాల భూమికి అవార్డు అయ్యాక నష్టపరిహారం అందించలేదని, గ్రామానికి చెందిన పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. గ్రామానికి చెందిన భూమి, ఇళ్లు కోల్పోయిన పట్టాదారులతో మాట్లాడి వారికి ఏం కావాలో తెలుసుకొని ఎన్.హెచ్.ఏ.ఐ పిడి, ఆర్డీఓ, తహసీల్దార్ లతో చర్చించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్ట ప్రకారం వారికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఎన్.హెచ్.ఏ.ఐ పిడి తరుణ్ కుమార్, అనంతపురం ఆర్డిఓ జి.వెంకటేష్, బుక్కరాయసముద్రం తహసిల్దార్, సింగనమల సబ్ రిజిస్టర్, బోడిగానిదొడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

Venkatesh1

Jun 22 2024, 10:49

Breaking... తండ్రి చేతిలోనే దారుణ హత్య కు గురైన ఆరేళ్ల బాలిక..
అనంతపురం నార్పలలో దారుణం ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్ మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు బాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్ బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు

Venkatesh1

Jun 22 2024, 07:09

ప్రపంచ యోగా దినోత్సవములో మండల ఎంపీపీ దాసరి సునీత..
బుక్కరాయసముద్రం మండలంలోని సిద్దరాంపురం గ్రామపంచాయతీ నందు గత సంవత్సరంలో చేపట్టినటువంటి అమృత్ సరోవర్ పని దగ్గర ప్రపంచ యోగా దినోత్సవమును జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షులు దాసరి సునీత గారు హాజరు కావడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి గారు, ఈవో పి ఆర్ డి దామోదరమ్మ గారు, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నారాయణస్వామి గారు, ప్రజా ప్రతినిధి బుల్లే నారాయణస్వామి గారు, ఉపాధి సిబ్బంది ఏపిఓలు, టిఏలు, పంచాయతీ లెవెల్ ఆఫీసర్లు, ఉపాధి కూలీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నడం జరిగినది.

Venkatesh1

Jun 22 2024, 07:02

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే దస్తగిరి మరియు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కాటప్పగారి రామలింగారెడ్డి..
అమరావతి అసెంబ్లీ సెక్రటరియేట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ప్రస్తుతం శింగనమల నియోజకవర్గంలోనీ పరిస్థితులపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారితో చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు*

Venkatesh1

Jun 22 2024, 06:55

దశాబ్దాలు తర్వాత.. తాత కల నేటికి సఫలీకృతం.. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన శింగనమల నియోజకవర్గం శాసన సభ్యురాలు బండారు శ్రావణీ శ్రీ.. ఈ అవకాశాన్ని కల్పించిన శింగనమల నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి