VijayaKumar

Jun 24 2024, 17:06

హనుమపురం ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు మెమోరండం అందజేసిన సిపిఐ నేతలు

భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 28 లో పేదలకు పట్టాలు ఇవ్వాలని సోమవారం  ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని లబ్ధిదారులతో కలిసి మెమోరండం ఇవ్వడం జరిగింది హనుమాపురం గ్రామంలో గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని తేదీ 23/6/2024 ఆదివారం రోజున హనుమాపురం గ్రామంలో నిరసన ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మాట్లాడుతూ దాదాపు 5 మాసాల నుండి లబ్ధిదారులు ప్రయత్నం చేసినప్పటికీని ప్రభుత్వం స్పందించడం లేదు వెంటనే గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసిన వారిలో సిపిఐ నాయకులు ఎల్లంకి మహేష్ హన్మాపురం గ్రామ గుడిసెల సంఘం నాయకులు నాగపురి యాదగిరి రామగోని ప్రవీణ్ కుమార్ కోర సామేలు కిల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు ఏషాల అశోక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భువనగిరి, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 24 2024, 15:37

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులకు నిధులు కోరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

హైదరాబాదులో సోమవారం  ఉదయం 10:00గం.లకు రాష్ట్ర రెవెన్యు మరియు గ్రుహ నిర్మాణ శాఖా మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని భువనగిరి నియేజకవర్గంలోని సింగన్నగూడెం,హుస్సేనాబాద్,కొండమడుగు,బీబినగర్,రేవణవల్లి,జిబ్లాక్ పల్లి నందుగల అసంపూర్తిగా వున్న 641 డబుల్ బెడ్రూం ఇండ్లకు పెండిగ్ లో వున్న పనులను పూర్తి చేయుటకు 4.62కోట్ల నిదులను మంజూరు చేయాలని కోరిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి . అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

VijayaKumar

Jun 24 2024, 15:32

వంట కార్మికులకు గౌరవ వేతనం 10వేలు వెంటనే ఇవ్వాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్

భువనగిరి జిల్లా మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పెండింగ్ మెస్ బిల్లులు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో నెలకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేసి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి *జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండిబా గారికి మరియు జిల్లా ఉద్యాశాఖధికారి నారాయణ రెడ్డి గార్లకు వేరు వేరుగా వినతి పత్రం సమర్పించడం జరిగింది.* ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని దానిని వెంటనే అమలు చేయాలని, మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదని, కార్మికులను తొలగించరాదని, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, వయసు పై బడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, అదేవిధంగా స్లాబ్ రేటు పెంచుతూ నిత్యవసర వస్తువులన్నిటిని కూడా సరఫరా చేస్తూ పిల్లలకు పౌష్టికాహారం కింద కోడి గుడ్డను కూడా సరఫరా చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సంధ్య, నిర్మల, పద్మ, లక్ష్మీ, అనసూర్య, వాణి, అండాలు, కృష్ణవేణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 23 2024, 17:58

LOC చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  మండలంలోని నాగారం గ్రామానికి చెందిన ఆలకుంట్ల గణేష్ కూతురు వినీషా ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముందస్తుగా ప్రభుత్వం నుండి మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ ఓ సి చెక్కును భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయన నివాసంలో ఆదివారం బాధిత కుటుంబ సబ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తీగల కిష్టయ్య,బెలిదెనాగేశ్వర్, గొళ్ల యాదయ్య, జిట్ట సత్తయ్య, బర్ల నర్సింహా,బర్ల జగదీశ్వర్,జిట్ట స్వామి,ఏగ్గె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 23 2024, 17:53

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 % రిజర్వేషన్లు ఇవ్వాలి; పల్లగొర్ల మోది రాందేవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

వలిగొండ బీసీ ఆఫీసులో వివిధ బీసీ కుల,సంఘాలతో కలిసి సమావేశం నిర్వహించారు .బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 42% రిజర్వేషన్లు ఇవ్వక పోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుద్దన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్టంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూడటం అత్యంత దుర్మార్గం అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పినందుకే..కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీ సీట్లు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో బీసీలను మోసం చేసినందుకే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా మరోసారి బీసీలను మోసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారని, అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే కులగణన విధివిధానాల కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. ఏది ఏమైనా..కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేలా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా కుల సంఘాలన్నీ ఏకతాటి మీదిగా ఉండి పని చేయాలన్నారు *ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ ముదిరాజ్,మనీల్,గొలుసుల మధు,వెంకట్ గౌడ్,సురేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 23 2024, 12:37

వలిగొండ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బలిదాన్ దివస్

భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు “ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా” అంటూ సమైక్య భారతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన భరతమాత ముద్దుబిడ్డ,జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ_శ్యామ్_ప్రసాద్_ముఖర్జీ గారి బలిదాన్ దివస్, వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్,బీజేపీ మండల కార్యదర్శి మందుల నాగరాజు ,పిట్టల రాజు ,bjym అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్, BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, BJYM మండల ఉపాధ్యక్షులు అమనగంటి శివ,కీర్తి వెంకటేశం, రెగూ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 22 2024, 22:30

ముద్దాపురం గ్రామంలో వ్యక్తి అదృశ్యం... కేసు నమోదు...

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామానికి చెందిన సామ చంద్రా రెడ్డి వయసు 30 సంవత్సరాలు, ఈనెల 17 న సాయంత్రం ఐదు గంటలకి ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. సోదరుడు సామ నర్సిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jun 22 2024, 22:24

లోతుకుంట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత: వలిగొండ ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట గ్రామ శివారులో గల మూసి నది నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను శనివారం వలిగొండ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోతుకుంట గ్రామానికి చెందిన పాప శ్రీశైలం మూసీ నది నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని తెలిపారు. ట్రాక్టర్ ని పోలీస్ స్టేషన్ కి తరలించి సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వెలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jun 22 2024, 20:40

చౌటుప్పల్ లో ఓ కంపెనీ నుండి వెదజల్లుతున్న దుర్వాసన.... మూసివేసేందుకు చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, అధికారులు

చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని
అయ్యాన్ ఆగ్రో ఫార్మ్ కంపెనీ నుండి వెదజల్లుతున్న దుర్వసన నేపథ్యంలో
పలు మార్లు పిర్యాధులు రావడంతో ఫారిశ్రమను సందర్శించారు .
మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు  మరియు స్థానిక ఆర్ డి ఓ, మున్సిపాలిటీ కమిషనర్.
15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ కోడి వ్యర్థలా ద్వారా చేపల దానను తయారు చేసే పరిశ్రమ చాలా దుర్గందాన్ని వేదచ్చళ్ళుతు
మున్సిపాలిటీ పరిధిలోని జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్నీ గుర్తించారు.

ఈ సందర్బంగా సంబంధిత అధికారులు మరియు ఛైర్మెన్ గారు
కంపెనీ యాజమాన్యానికి వేరే చోట పరిశ్రమల ఏర్పాటు చేయనుకోవాలని సూచించారు.
అలాగే ఈ ఘటన పై మంగళవారం రోజు కాలుష్య నియంత్రణ అధికారులతో తనిఖీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

VijayaKumar

Jun 22 2024, 19:04

వలిగొండ మాంటిస్సోరి పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేసిన విద్యాధికారులు

వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక మాంటిస్సోరి ప్రైవేట్ పాఠశాల లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించగా పాఠశాలలో స్టేషనరీ పుస్తకాలు అమ్మకాలు జరుగుతుండడంతో వెంటనే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆ పుస్తకాలు తీసుకొని ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యా అనేది వ్యాపారంగా మలుచుకొని అంగట్లో సరుకుల్లా మాదిరిగా ఇష్టానుసారమైన ధరల ఫీజులతో పుస్తకాలు అమ్ముతున్నారన్నారు ఒకవైపు ప్రభుత్వం ఎక్కడ స్టేషనరీ పుస్తకాల అమ్మకాలు చేయొద్దని సర్కులర్ జారీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభుత్వ నియమాలు నిబంధనలు పాటించకుండా పుస్తకాలతో బ్యాగులతో పాటు వేలకు వేలు దోచుకుంటున్నారన్నారు పేద మధ్యతరగతి తల్లిదండ్రులను వారి పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేయాలంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒకటవ తరగతి విద్యార్థి పాఠ్యపుస్తకాలకు 3700 రూపాయలు తీసుకుంటున్నారన్నారు ఇలాంటి వేలకు వేలు ఫీజులు కట్టాలంటే పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మండల విద్యాధికారి గారు వచ్చి ఏదైతే ఈ స్టేషనరీ బుక్కులు ఉన్నాయో సీజ్ చేయాలని వారి డిమాండ్ చేశారు వెంటనే మండల విద్యాధికారి గారు స్పందించి వారి బృందంతో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్ కార్యదర్శి సాయి వినయ్ , చంద్రశేఖర్, పవన్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.