జగన్ కాన్వాయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం..
జగన్ కాన్వాయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది..
కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్ళుతుండగా రామరాజు పల్లి వద్ద కాన్వాయ్ లో వాహనాలు ఢీ కొన్నాయి.వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా నేడు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు ఆయన వెళ్తున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.
Jun 23 2024, 06:16