దశాబ్దాలు తర్వాత.. తాత కల నేటికి సఫలీకృతం.. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన శింగనమల నియోజకవర్గం శాసన సభ్యురాలు బండారు శ్రావణీ శ్రీ.. ఈ అవకాశాన్ని కల్పించిన శింగనమల నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
అమరావతి సచివాలయం లో అనంతపురం జిల్లా మంత్రులను కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి
అమరావతి సచివాలయం లో ఆర్థికశాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారిని మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
జాంబియా దేశానికి చెందిన డెలిగేట్స్ తో జిల్లా కలెక్టర్ సమావేశం..

అనంతపురం, జూన్ 20 : అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం రాత్రి జాంబియా దేశానికి చెందిన డెలిగేట్స్ తో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాంబియా దేశము నుంచి 16 మంది డెలిగేట్స్ ఈనెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాలలో ప్రకృతి వ్యవసాయంలో ఏ గ్రేడ్ మోడల్, ఏటీఎం మోడల్, DRPM మోడల్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చే నెలలో మన జిల్లా నుండి బాగా ప్రావీణ్యం పొందిన సుకన్యా, రవిచంద్ర, శివ శంకర్, సుధాకర్ లు జాంబియాలోని వ్యవసాయ విధానాలు వారికి నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జాంబియా టీం కు చెందిన సెబాస్టియన్, మాంజా, ముండియా, సెలిషియన్, సిటీ&ఎల్ఓ డిపిఎం లక్ష్మీ నాయక్, తదితరులు పాల్గొన్నారు..

ఆరేళ్ల బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన నార్పల పోలీసులు..
ఆరేళ్ల బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన నార్పల పోలీసులు.. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు నార్పల మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల బాలిక పావని మిస్సింగ్ పై కేసు ( క్రైం నంబర్ 108/2024) నమోదు చేశామని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు మధ్యహ్మాం అంగడికి వెళ్లొస్తానని చెప్పి బయటికెళ్లిన తన కూతురు పావని సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని ఆ అమ్మాయి తండ్రి గణేష్ ఫిర్యాదు చేశాడన్నారు. బాలిక మిస్సింగుపై దర్యాప్తు ప్రారంభించామని... జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆ అమ్మాయి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఎవరికైనా ఆ బాలిక ఆచూకీ తెలిసినా, కనిపించినా వెంటనే తన ఫోన్ నంబర్ 9490107853 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి..
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి..

గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుండి మడకశిర నియోజకవర్గ ప్రజలు మాజీ ప్రజా ప్రతినిధులకు ఎన్ని అర్జీలు ఇచ్చిన విద్యుత్ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన పట్టణంలోని రెండు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫర్లను మార్చలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కేవలం పది రోజులలోపే ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ప్రమాణస్వీకారం కాకముందే నిన్నటి రోజు మంగళవారం పట్టణంలో పలుచోట్ల సుడిగాలి పర్యటన చేసి ప్రధాన సమస్యలుగా ఉన్న ప్రధాన రహదారిపై రెండు విద్యుత్ ట్రాన్స్ఫర్లను వెంటనే తొలగించి రోడ్డు పక్కన పెట్టండి అని విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సూచించారు. ఈరోజు బుధవారం విద్యుత్ కాంట్రాక్టర్ లోకేష్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు పక్కన పెట్టే విధంగా పనులు జెసిపి ద్వారా చేపడుతున్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి లకు ప్రజలు కృతజ్ఞాతలు తెలిపారు
నేను బడికి పోతా కార్యక్రమంలో ఎమ్యెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు గౌరవనీయులు కుమారి బండారు శ్రావణి శ్రీ గారు బుక్కరాయసముద్రము మండలములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొర్రపాడు గ్రామంలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ చేసి మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కుమారి బండారు శ్రావణి శ్రీ గారు విద్యార్థులను ఉద్దేశించి విద్యను బాగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే బడి బయట ఉండే పిల్లలందరిని బడిలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఎన్యూమరేటర్స్ అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPP దాసరి సునీత, సర్పంచ్, తహసిల్దార్, ఎంపీడీవో, MEO లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యాఆరోగ్య శ్యాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కాటప్పగారి రామలింగారెడ్డి..
నూతనంగా బాధ్యతలు స్వికరించిన వైద్యాఆరోగ్య శ్యాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు
పెనకచెర్ల డ్యామ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
పెనకచెర్ల డ్యామ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..

శింగనమల నియోజకవర్గము: గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం ను శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్యాం కు సంబంధించిన 1,2, 13,14 రేడియల్ గేట్లు దెబ్బతిన్నాయి.గేట్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా లేదు.జనరేటరు ఏర్పాటు చేశారు,ఇది కూడా మరమ్మతులు కు గురైంది.అంతేకాకుండా నార్త్,సౌత్ కెనాల్ కాలువలకు సంబంధించిన గేట్లు ఎక్కడికక్కడ పని చేయకుండా చిలిమిపట్టి ఉన్నాయి.ఈ గేట్లు ద్వారా కాలువలకు నీటిని వదలడం జరుగుతుంది.గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అధికారులు మిడ్ పెన్నారు పెనకచెర్ల డ్యామ్ కు సంబంధించి రూ.5.3 కోట్లు అంచనా తో అధికారులు నివేదిక అందించిన కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు,ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.వచ్చే వర్షా కాలం లోపు తక్షణ మరమ్మతులు కు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు ఆదేశించారు.పూర్తిగా పునరుద్ధరణ పనులు కొరకు సంబంధించిన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి,పరిష్కరింప చేసేందుకు కృషి చేస్తానని శ్రావణి శ్రీ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవరెడ్డి గారు,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమణ రెడ్డి గారు, ఎ. డబ్ల్యు.ఇ. సురేంద్ర గారు,ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ రితేష్ చౌహాన్ గారికి ఘనంగా స్వాగతించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు..
అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహానికి మంగళవారం రాత్రి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ (జాయింట్ సెక్రటరీ & సిఈఓ, పి.ఎం.ఎఫ్.బి.వై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, న్యూఢిల్లీ) శ్రీ రితేష్ చౌహాన్ ఐ.ఏ.ఎస్ గారు చేరుకున్నారు. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ రితేష్ చౌహాన్ గారికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల..
అనంతపురం జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటాం.. పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం, జూన్ 18 : దేశంలోని వారణాసి నుంచి మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.* అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, రెడ్డిపల్లి సర్పంచ్ ఎస్. నరసమ్మ, ఎంపీపీ డి.సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ బి.సహదేవరెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.* - *జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేయడం జరిగిందని, జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. పీఎం కిసాన్ కింద 17 విడతలో భాగంగా రాష్ట్రంలో 40.91 లక్షల మంది రైతులకు 824.6 కోట్ల రూపాయల డబ్బును రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతోందని, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5.28 లక్షల మంది రైతులకు 106 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరనుందన్నారు. అందులో అనంతపురం జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2.52 లక్షల మంది రైతులకు రూ.50.44 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ లబ్ధి మన జిల్లా రైతులకు కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లో పంటతో పాటు ఆవు, మేక, కోళ్లు లాంటివి పెట్టుకోవాలని, పొలంలో రెండు మూడు రకాల ఎరువులు వేయడం, ఫారంపాండ్, ట్రెంచ్, బండ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంట పెట్టడంతోపాటు పొలం చుట్టూ చెట్లను పెంచాలని, దాని ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలని, సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించిన అంబికా లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా అంటే కరువు సీమ అని, ఇలాంటి ప్రాంతాల్లో అప్పు చేసి రైతులు పంటలు పెట్టినా నష్టపోతుంటారని, రైతులు పెట్టబడి నష్టపోకుండా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి, భూమిలో ఎటువంటి పంట పండిస్తే ఉపయోగకరంగా ఉంటుంది, ఉద్యాన శాఖ కింద ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి సలహాలు అందించాలని అందజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రైతులకు 20 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పారని, దానిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందని, ప్రధానమంత్రి అందించిన సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లను, కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చూస్తామన్నారు. రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డుని రైతు పి.రాముకి జిల్లా కలెక్టర్, ఎంపీ అందజేశారు. అనంతరం ఐసిహెచ్ - 66 హైబ్రిడ్ విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ భార్గవి, రెడ్డిపల్లి కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఎస్.ఎన్.మల్లేశ్వరి, ఎస్ఎంఎస్ హోమ్ సైన్స్ శాస్త్రవేత్త సుధారాణి, క్రాఫ్ ప్రొటెక్షన్ శాస్త్రవేత్త శశికళ, వెటర్నరీ సైన్స్ శాస్త్రవేత్త మాధవి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ శాస్త్రవేత్త చందన, రైతులు, తదితరులు పాల్గొన్నారు.