ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ రితేష్ చౌహాన్ గారికి ఘనంగా స్వాగతించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు..
అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహానికి మంగళవారం రాత్రి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ (జాయింట్ సెక్రటరీ & సిఈఓ, పి.ఎం.ఎఫ్.బి.వై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, న్యూఢిల్లీ) శ్రీ రితేష్ చౌహాన్ ఐ.ఏ.ఎస్ గారు చేరుకున్నారు. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ రితేష్ చౌహాన్ గారికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల..
అనంతపురం జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటాం.. పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం, జూన్ 18 : దేశంలోని వారణాసి నుంచి మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.* అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, రెడ్డిపల్లి సర్పంచ్ ఎస్. నరసమ్మ, ఎంపీపీ డి.సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ బి.సహదేవరెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.* - *జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేయడం జరిగిందని, జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. పీఎం కిసాన్ కింద 17 విడతలో భాగంగా రాష్ట్రంలో 40.91 లక్షల మంది రైతులకు 824.6 కోట్ల రూపాయల డబ్బును రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతోందని, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5.28 లక్షల మంది రైతులకు 106 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరనుందన్నారు. అందులో అనంతపురం జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2.52 లక్షల మంది రైతులకు రూ.50.44 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ లబ్ధి మన జిల్లా రైతులకు కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లో పంటతో పాటు ఆవు, మేక, కోళ్లు లాంటివి పెట్టుకోవాలని, పొలంలో రెండు మూడు రకాల ఎరువులు వేయడం, ఫారంపాండ్, ట్రెంచ్, బండ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంట పెట్టడంతోపాటు పొలం చుట్టూ చెట్లను పెంచాలని, దాని ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలని, సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించిన అంబికా లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా అంటే కరువు సీమ అని, ఇలాంటి ప్రాంతాల్లో అప్పు చేసి రైతులు పంటలు పెట్టినా నష్టపోతుంటారని, రైతులు పెట్టబడి నష్టపోకుండా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి, భూమిలో ఎటువంటి పంట పండిస్తే ఉపయోగకరంగా ఉంటుంది, ఉద్యాన శాఖ కింద ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి సలహాలు అందించాలని అందజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రైతులకు 20 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పారని, దానిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందని, ప్రధానమంత్రి అందించిన సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లను, కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చూస్తామన్నారు. రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డుని రైతు పి.రాముకి జిల్లా కలెక్టర్, ఎంపీ అందజేశారు. అనంతరం ఐసిహెచ్ - 66 హైబ్రిడ్ విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ భార్గవి, రెడ్డిపల్లి కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఎస్.ఎన్.మల్లేశ్వరి, ఎస్ఎంఎస్ హోమ్ సైన్స్ శాస్త్రవేత్త సుధారాణి, క్రాఫ్ ప్రొటెక్షన్ శాస్త్రవేత్త శశికళ, వెటర్నరీ సైన్స్ శాస్త్రవేత్త మాధవి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ శాస్త్రవేత్త చందన, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
శింగనమల మండల కేంద్రంలోని ఆత్మరామ దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని ఆత్మరామ దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్,

కలెక్టర్ ను ఘనంగా స్వాగతం పలికిన దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక పూజ చేసిన అర్చకులు..
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించిన శింగనమల నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యుల ఆత్మీయ కలయిక..
తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యుల ఆత్మీయ కలయిక..

అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల నుంచి *తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీం షేక్* గారి ఆధ్వర్యంలో *జి యం ఆర్ కన్వెన్షన్ హాల్* అనంతపూర్ నందు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నయీం గారు మాట్లాడుతూ 2024 ఎన్నికల గెలుపుకు సంబంధించి చర్చించడం జరిగింది ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సాధించిన ఫలితాలు గురించి అలాగే రాబోవు రోజులలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ పాత్ర ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ *అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు* పొట్ల రవి అన్న విశ్వనాథ్ అన్న బండారు రాఘవేంద్ర శింగనమల నియోజక వర్గ ఇన్చార్జి హేమంత్ యాదవ్ అనంతపూర్ అధ్యక్షులు జగన్ ఉరవకొండ ఇన్చార్జి సి ఎ వెంకటేష్ గుంతకల్ ఇన్చార్జి శివ తాడిపత్రి ఇన్చార్జి సోము, సి ఎ మురళీ, విష్ణు రాకేష్ వినోద్ కుషాల్ వెంకటేష్ తేజ అశోక్ మరియు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఆరు నెలల నుండి బోరు చెడిపోయి నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నందున బక్రీద్ సందర్భంగా మా సొంతం డబ్బులతో చేయించాము
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జన చైతన్య కాలనీ నందు వైయస్సార్ ప్రభుత్వం లో ఆరు నెలల నుండి బోరు చెడిపోయి నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నందువల్ల  మా సొంతం ఖర్చులతో జన చైతన్య మహిళా నాయకురాలు బుక్కరాయసముద్రం మహిళా నాయకురాలు అంచల రంగమ్మ నార్పల వలి రఫీ ఖాదర్ వలి సంచుల భాష దాదు విటల్ ఆ బోరు చేయించాము బక్రీద్ సందర్భంగా మా సొంతం డబ్బులతో చేయించాము
1989-90 పదవతరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
1989-90 పదవతరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ZPH స్కూల్ లో 35 సంవత్సరాల తరువాత 1989-90 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది .ఈ కార్యక్రమంలో గురువులు రామప్ప, రమణ, ఆంజనేయులు, విమలమ్మ, మినా కుమారి మరియు పూర్వవిద్యార్థులు కాటప్పగారి రామలింగారెడ్డి,ప్రసాద్, మురళి, హనుమంతురెడ్డి, ప్రకాష్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, నాగమునయ్య,శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రంగయ్య, నాగరాజు, సుధాకర్ రెడ్డి,విజయ కుమారి, వరలక్ష్మి, సావిత్రి మరియు దాదాపు 120 మంది విద్యార్ధివిద్యార్థునులు హాజరుయినారు.
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి..
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన *శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు* శింగనమల నియోజకవర్గము : బుక్కరాయసముద్రం పంచాయతీలోని ఎల్.బి. కాలనీ నివాసి శ్రీమతి కౌసర్ గారి ఆడబిడ్డ వివాహానికి ₹5000/- రూపాయలు మరియు జన చైతన్య నగర్ నివాసి శ్రీమతి సలీమా ల ఆడబిడ్డ వివాహానీకి ₹5000/- రూపాయలు ఆర్థిక సాయంను అందించిన *శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు*. ముస్లిం మైనార్టీల ఆడబిడ్డల పెండ్లిండ్ల కు సహాయం చేయడము చాలా సంతోషాన్నిస్తుందని తెలిపారు. *ఆడ బిడ్డల వివాహాలకు సహాయం చేసిన ముంటిమడుగు కేశవరెడ్డి గారికి మైనార్టీ మహిళలు ధన్యవాదాలు తెలిపారు*. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు జుగును, టిడిపి నాయకులు పూల శంషాద్, దూదేకుల రసూల్ బీ, చాపల మహబూబ్ బీ, తదితరులు పాల్గొన్నారు.
వ్యయ పరిశీలకులకు అభ్యర్థులు తుది అకౌంట్స్ సమర్పించాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
వ్యయ పరిశీలకులకు అభ్యర్థులు తుది అకౌంట్స్ సమర్పించాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శనివారం సాయంత్రం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సమావేశం నిర్వహించారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో చివరి అడుగు ఉందని, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థుల యొక్క వ్యయ ఖర్చుకు సంబంధించి తుది అకౌంట్స్ వ్యయ పరిశీలకులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 25వ తేదీ వ్యయ పరిశీలకులు వస్తారని, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముగ్గురు పరిశీలకులు రావడం జరుగుతుందని, వారం రోజులు ఇక్కడ ఉంటారని, వారు అభ్యర్థుల అకౌంట్స్ పరిశీలిస్తారన్నారు. అందరు అభ్యర్థులు అకౌంట్స్ పరిశీలన పూర్తి చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిసిఓ అరుణకుమారి, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..
ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం.. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం.. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు సంతకాలు చేసిన సందర్భంగా శింగనమల నియోజకవర్గ పరిధిలోని శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతూ, అభినందన సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మెగా డియస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4,000 పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ అమలుకు సంతకాలు చేసిన చంద్రబాబు గారికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా చీకట్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడే చంద్రబాబు గారి రూపంలో వెలుగు వచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు గారు ఐదు హామీల మీద సంతకాలు చేశారు. జగన్ నిరంకుశత్వానికి నిదర్శనం.. అన్న క్యాంటీన్ల మూసివేత, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య గా పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు గారు ఆ చట్టాన్ని రద్దు చేశారని బండారు శ్రావణి శ్రీ గారు పేర్కొన్నారు. పింఛన్ల పెంపు తో అవ్వా తాతలు, నిరాశ్రయులు, దివ్యంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు బండారు శ్రావణి శ్రీ గారు తెలిపారు.