నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:31

వాళ్లుఅర్హులా?... అనర్హులా...? గురుకుల నియామకాలపై తర్జనభర్జన..

వాళ్లుఅర్హులా?... అనర్హులా...?

గురుకుల నియామకాలపై తర్జనభర్జన

విద్యార్హతల నిర్ధారణపై ట్రిబ్‌కు అస్పష్టత

కోర్టుకు బాటనీ జేఎల్‌ అభ్యర్థులు

అర్హతలపై విద్యామండలికి ట్రిబ్‌ లేఖ

3 నెలలుగా అభ్యర్థుల ఎదురుచూపులు

హైదరాబాద్‌, జూన్‌13: తెలంగాణ గురుకుల విద్య సంస్థ నియామక మండలి (ట్రిబ్‌) నోటిఫికేషనలో ఒకటి పేర్కొని, నియామక ప్రక్రియలో మరోవిధంగా నడుచుకొన్నదని అభ్యర్థులు మండిపడుతున్నారు. పలు పోస్టుల విద్యార్హతలకు సంబంధించి దేనిపైనా స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు బోర్డు మాత్రం అభ్యర్థులు లేవనెత్తిన ఆయా విద్యార్హతల అంశాలపై ఉన్నత విద్యామండలికి లేఖ రాసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మూడునెలలుగా సదరు అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.

నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జేఎల్‌ బాటనీ

ట్రిబ్‌ 160 బాటనీ జేఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ సమయంలో ఆ పోస్టులకు బాటనీతోపాటు బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, మెరైన్‌ బయోలజీ, బయో సైన్స్‌, మాడ్రన్‌ బయోలజీ, ప్లాంట్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులని ట్రిబ్‌ పేర్కొన్నది. ఈ మేరకు జేఎల్‌ పోస్టులకు సంబంధించి 1ః2 మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. ఎంఎస్సీతోపాటు డిగ్రీలో కూడా బాటనీ చదివి ఉండాలంటూ అనేక మంది అభ్యర్థులను కనీసం డెమోకు కూడా ట్రిబ్‌ అనుమతించలేదు. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా మైక్రోబయోలజీ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి చేసిన వారే జేఎల్‌ బాటనీకి అర్హులని కొంతమంది అభ్యర్థులను తిరస్కరించింది. అటు తరువాత తుది జాబితాను ప్రకటించింది. దీంతో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే వాదనలు విన్న అనంతరం నోటిఫికేషన్‌ ప్రకారం జేఎల్‌ బాటనీ పోస్టుకు యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రో బయోలజీ అభ్యర్థులు కూడా అర్హులని ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరికొందరు కోర్టును ఆశ్రయించగా, అందుకు అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది. ఇదే తరహాలో మరికొంత మంది సైతం వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటికే కోర్టు ను ఆశ్రయించారు. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఈ విద్యార్హతలకు సంబంధించి ట్రిబ్‌ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. విద్యార్హతలను తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యామండలికి లేఖరాశామని, వారి మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని ట్రిబ్‌ అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ అంశం ఎటూ తేలకపోవడంతో దాదాపు 3 నెలలుగా అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఆయా సొసైటీలు కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చే ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ అంశాన్ని తేల్చాలని ట్రిబ్‌ను డిమాండ్‌ చేస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 14 2024, 08:21

TG: ములుగు జిల్లా లో పేలిన మందుపాతర....

ములుగు జిల్లా ఏజెన్సీలో పేలిన మరో మందుపాతర

సుజాత అనే మహిళకు తీవ్రగాయాలు

జోల కట్టి సుజాతను ఆస్పత్రికి తరలించిన స్థానికులు

దైవ దర్శనానికి వెళ్తుండగా పేలిన మందుపాతర

పోలీసులే టార్గెట్‌గా మందుపాతర అమర్చిన మావోయిస్టులు

వెంకటాపురం మండలం చొక్కాల అడవుల్లో ఘటన

నిజందాగదుక్షణంఆగదు

Jun 13 2024, 07:38

ఏపీ: నేడు సచివాలయానికి వెళ్లి బాధ్యతలు చేపట్టనున్న సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: ఇవాళ సాయంత్రం సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. నేడు సచివాలయం మొదటి బ్లాక్‌ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ.. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్న చంద్రబాబు.. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్న చంద్రబాబు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 16:54

చర్ల: భద్రాచలం: నకిలీ విత్తనాలను అరికట్టాలి మరియు అమ్మిన వ్యాపారస్తులపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలనీ తాసిల్దార్కు వినతి పత్రం అందజేత..

నకిలీ విత్తనాలను అరికట్టాలి,అమ్మిన వ్యాపారస్తులపై పిడియాక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్లలో ప్రదర్శనర్యాలీ ధర్నా తహసిల్దార్ కు వినతి పత్రం

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నకిలీ విత్తనాలను అరికట్టాలని అమ్మిన వ్యాపార వర్గాలపై పిడియక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఈరోజు చర్ల మండల కేంద్రంలో ప్రదర్శన తహసిల్దార్ కార్యాలయం ధర్నా అనంతరం తాహాసిల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

ఈ కార్యక్రమం కు చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ 1 కోటి 60 లక్షల మంది రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసుకుంటుండగా అందులో 60 లక్షల మంది రైతులు పత్తి మిరప వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.వీరికి సరిపడా విత్తనాలు సరఫరా చేయలేక కొంతమంది వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులని మోసం చేస్తున్నారని అలాంటి వ్యాపార వర్గాలపై పిడి కేసులు నమోదు చేయాలని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాగానే పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని అన్ని దేశాలలో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్టుగా ఈ భారత దేశంలో కూడా ఇవ్వాలని వారు కోరారు.వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపార వర్గాలపై చర్యలు తీసుకోవాలని పంట బీమా,బి3 పత్తి విత్తనాల నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని,భూసార పరీక్షలు చేయాలని,సహకార సంఘాల ద్వారా ఎరువులు విత్తనాలు పురుగుమందులు సరఫరా చేయించాలని వారన్నారు.తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు రైతులు విత్తనాలు కొంటె రసీదులు ఇచ్చేటట్టుగా ఏ పంట పండుతుందో భూసార పరీక్షలు చేసేటట్టుగా వారిని చైతన్య పరచాలని వారు కోరారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ నాయకులు కల్లూరి నర్సింగరావు,ఆదిలక్ష్మి,ఇర్ప సమ్మక్క,బొర్రా సమ్మక్క,కోట నాగమణి,కనకమ్మ ,శ్రీదేవి,బాయమ్మ,కల్లూరి నాగమని ,సబక నాగలక్ష్మి,వెంకటరమణ,జ్యోతి,కల్లూరు జయ,రామలక్ష్మి,ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 08:03

Ts:రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: సీఎం

రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: సీఎం

రాష్ట్ర రియల్‌ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి పల్లె, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిత్రా రామచంద్రన్‌లు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ.. స్థిరాస్తి కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 07:55

Ts,:సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం...

సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈనెల 29లోపు దరఖాస్తులు పంపించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ సమాచార కమిషనర్ల నియామకానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్‌ శాంతికుమారి స్పష్టం చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 07:49

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం..

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు.. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు.. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ.. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ.

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 18:18

చర్ల: భద్రాచలం:CRPF ఎదురు సందులో కరెంట్ స్థంభానికి ఉన్న ట్రాన్స్ఫార్మర్ వెంటనే తొలగించాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ముసలి సతీష్

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లోని లింగాల కాలనీ గ్రామంలో CRPF, పోలీస్ క్యాంప్ ఎదురు సందులో ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న ట్రాన్స్ఫార్ను తొలగించాలి న్యూడెమోక్రసీ నేత కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీలోని లింగాల కాలనీ గ్రామంలో సిఆర్పిఎఫ్ పోలీస్ క్యాంప్ ఎదురుగా ఉన్న సందులో కరెంటు స్తంభానికి ఒక ట్రాన్స్పరు నిర్మించబడి ఉన్నది అది వెంటనే తొలగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ఉద్దేశించి చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ ఈ ట్రాన్స్ ఫార్మర్ స్తంభానికి కింది బాగానే ఉండడంతో చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు అనేకమంది ప్రమాదానికి గురి అయ్యే పరిస్థితి ఉంది ఇది రహదారి కావడంతో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్న క్రమంలో అలసిపోయి పట్టుకుంటే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉన్నది కావున విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కింది భాగాన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ని తొలగించి వేరే దగ్గర నిర్మించవలసిందిగా కోరుతున్నాం లేనియెడల అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని వారు కోరారు ఈ కార్యక్రమంలో POW జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క మండల నాయకురాలు బొర్ర సమ్మక్క రామలక్ష్మి నాగమణి ఇర్ప వెంకటేష్ కణితి రమణ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 09:11

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే....

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 09:05

నాగర్ కర్నూల్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాసం పెట్టనున్న కాంగ్రెస్...

నాగర్ కర్నూల్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాసం పెట్టనున్న కాంగ్రెస్...

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం.. మున్సిపల్ చైర్పర్సన్ కల్పనభాస్కర్ గౌడ్పై ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న కాంగ్రెస్.. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న 14 మంది కౌన్సిలర్లు..