Mane Praveen

Jun 07 2024, 22:01

బి ఏ ఎస్ స్కీం కింద ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్స్ ఇప్పించాలి బి ఏ ఎస్ సీట్లు కేటాయించని స్కూల్ లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆఫీస్ ముందు KVPS ధర్నా
నల్లగొండ:
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద దళిత గిరిజన విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివిస్తున్నారు, కానీ బిఏఎస్ స్కీం కింద సీట్లు కేటాయించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ డిఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ దళిత గిరిజన విద్యార్థులకు సీట్లు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.  అధిక ఫీజులు ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ జీతాలు పొందుతూ మళ్లీ విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

అడ్మిషన్స్ నిరాకరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ హరిచందన  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలో నిమ్న జాతుల పిల్లలకు సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యం తన ఇష్టానుసారంగా నడుపుతున్నారని అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు.  సీట్ల కేటాయింపులు ఇవ్వని పాఠశాలల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కొండేటి శ్రీను జిల్లా ఆఫీసు బేరర్స్ బొట్టు శివకుమార్, కోడి రెక్క మల్లన్న, పెరిక విజయ్ కుమార్, బొల్లు రవీందర్, ఉంటే పాక కృష్ణ, కోడి రెక్క రాధిక, పెరికే విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, దంతాల నాగార్జున, పెరికే మల్లయ్య, దేవయ్య,అచ్చాలు, పెరికే మల్లయ్య, శివలింగం,తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 07 2024, 21:35

రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య
నల్గొండ పట్టణంలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో రైలుకు ఎదురు వెళ్లి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన జరిగింది.

మృతుడు నల్గొండ మండలం చందనపల్లికి చెందిన కోరదల శివమణి (20) గా గుర్తింపు చేశారు.ఆర్ధిక ఇబ్బందులతో అగ్రికల్చర్ బీఎస్సీ లో చేరేందుకు యువకుడి కుంగుబాటు గురైనట్లు సమాచారం.

అప్పు కోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్న సమయంలో  మనస్థాపానికి గురై తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.

Mane Praveen

Jun 07 2024, 13:53

బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు

నల్గొండ పట్టణంలోని గవర్నమెంట్ జేబీఎస్ హైస్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు ఎస్.నాగిరెడ్డి ఆధ్వర్యంలో బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించి, బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరియు గుండ్లపల్లి రోడ్ లోని ఇందిరమ్మ అపార్ట్మెంట్ లలో బడిబాట లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీచర్లు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 07 2024, 08:58

కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
వరంగల్- ఖమ్మం-నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయి రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టిన విషయం తెలిసిందే. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో భాగంగా ఈ రోజు ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా, 27 వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.

Mane Praveen

Jun 05 2024, 22:43

12,000 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న..
ఎమ్మెల్సీ బై పోల్ బ్రేకింగ్..
నల్లగొండ టౌన్: నల్లగొండ ఖమ్మం వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్ మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లలో 12000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు
మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Mane Praveen

Jun 05 2024, 22:15

NCC ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
NLG: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇవాళ నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఎన్సిసి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తో పాటుగా నల్లగొండ పట్టణంలోని పౌరులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్సిసి 31 బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ అనుజ్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క పౌరుడిపై ఉన్నదని,పర్యావరణ పరిరక్షణ అనేది శతాబ్దాలుగా ప్రపంచంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఉద్భవించిందని మరియు మానవులకు ఎల్లప్పుడూ ముఖ్యమైనదనీ,అడవుల పెంపకం మరియు చెట్ల పెంపకం గ్లోబల్ వార్మింగ్, నేల కోత మొదలైనవాటిని తగ్గించడం ద్వారా మన పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడతాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎన్సిసి క్యాడేట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని,ప్రకృతి, పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గౌరవించడానికి మరియు గుర్తించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మానవాళిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నదని, దీనికి తక్షణ కర్తవ్యం గా ప్రతి పౌరుడు చెట్లు నాటి ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి సుబేదార్ మేజర్ ఎల్ మాధవరావు, ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, అధికారులు చంకూర్ సింగ్, నాగఫణి, సంతోష్ మరియు ఎన్సీసీ క్యాడేట్ లు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 05 2024, 14:36

చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపిగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పుష్పగుచ్చం అందించి అభినందించారు.

Mane Praveen

Jun 05 2024, 14:01

మునుగోడు,నకిరేకల్ లలో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్ల సంఖ్య
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రకారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,08,667 బిజెపి పార్టీకి 54,961, బిఆర్ఎస్ పార్టీకి 35,660 ఓట్లు వచ్చాయి. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 96,914, బిజెపి పార్టీకి 59,231 బిఆర్ఎస్ పార్టీకి 21,377 ఓట్లు వచ్చాయి.

Mane Praveen

Jun 05 2024, 12:46

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్
 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం, ఎండలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడి పన చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 7982 మెజార్టీ ఓట్లు  ఇచ్చిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Mane Praveen

Jun 04 2024, 15:40

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి...

నల్గొండ పార్లమెంట్ -ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 552659 ఓట్లు ఆధిక్యత లో ఉంది.

కాంగ్రెస్ :7,72,264

బీ ఆర్ ఎస్: 2,16,681

బి జే పి: 2,19,605 ఓట్లు సాధించారు.