నిజందాగదుక్షణంఆగదు

Jun 05 2024, 16:32

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఎన్ హెచ్-69 రహదారిపై ఇకపై ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు...

ఎన్‌హెచ్‌ 65పై 17 బ్లాక్‌స్పాట్లు

ప్రమాదాల నివారణకు చర్యలు

అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లకు తక్షణ ఏర్పాట్లు

త్వరలోనే పనులు ప్రారంభం*

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (బ్లాక్‌స్పాట్‌) జరుగుతున్నట్టు గుర్తించారు. ఆయాచోట్ల ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టబోతున్నారు. ఈ హైవేపై సహజంగానే ట్రాఫిక్‌ రద్దీ అధికం. ఈ రహదారిపై గ్రామాలు, మూలమలుపులు, క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 17 ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్లు తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర పోలీసుశాఖ నమోదుచేసిన వివరాలను జాతీయ రహదారులశాఖ పరిధిలోని ట్రాన్స్‌పోర్ట్‌ రిసెర్చ్‌ వింగ్‌ (టీఆర్‌డబ్ల్యూ) పరిశీలించి బ్లాక్‌స్పాట్‌లను ఖరారు చేస్తుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం, 500 మీటర్లలో వరుసగా మూడేండ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు, తీవ్ర గాయాలు సంభవించడం, లేక ఒకేసారి జరిగిన ప్రమాదంలో 10 మరణాలు సంభవించడం.. ఈ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ఇటువంటి బ్లాక్‌స్పాట్లు హైదరాబాద్‌-విజయవాడ హైవేపై 17 ఉన్నాయి. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలతో కూడిన నివేదికను జాతీయ రహదారులశాఖ రూపొందించింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

17 బ్లాక్‌స్పాట్లలో అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఇలా..

ఇరువైపులా లైటింగ్‌తో కూడిన సర్వీసు రోడ్ల నిర్మాణం- కటకమ్మగూడెం, మేళ్లచెరువు, శ్రీరంగాపురం, ఇనుపాముల.

   

రోడ్‌ సైనేజెస్‌తోపాటు స్ట్రీట్‌ లైటింగ్‌తో కూడిన జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్‌- నవాబ్‌పేట్‌ జంక్షన్‌, ఆకుపాముల, కట్టంగూర్‌, దురాజ్‌పల్లి జంక్షన్‌.

   

అండర్‌పాస్‌(వీయూపీ)లు- రామాపురం క్రాస్‌రోడ్స్‌, కోమరబండ క్రాస్‌రోడ్‌, ముకుందాపురం, పెద్దకాపర్తి, చిట్యాల, చౌటుప్పల్‌, టేకుమట్ల, ఎస్వీకాలేజ్‌, జనగామ జంక్షన్‌.

నిజందాగదుక్షణంఆగదు

Jun 05 2024, 16:19

ఢిల్లీ: మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి తొలి సమావేశం..

ఢిల్లీ: మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి తొలి సమావేశం..

మోడీ నివాసంలో NDA సమావేశం. NDA సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నితీశ్‌కుమార్‌. ప్రధాని నివాసంలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌, గడ్కరీ. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం. ఎన్డీఏ కూటమికి ఎన్నిక్లలో 292 సీట్లు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 04 2024, 18:11

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి మధ్య హోరాహోరీ..ఎన్డీఏ కూటమిని ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి మధ్య హోరాహోరీ. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి. యూపీ, మహారాష్ట్ర బెంగాల్‌లో తారుమారైన బీజేపీ అంచనాలు. యూపీలో అనూహ్యంగా సమాజ్‌వాదీ పార్టీకి భారీగా సీట్లు. యూపీలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ. ఎన్డీఏ కూటమిని ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 04 2024, 14:45

భారీ మెజారిటీతో విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

పిఠాపురంలో 69169 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

నిజందాగదుక్షణంఆగదు

Jun 04 2024, 14:39

ఓటమి వైపు స్పీడ్ గా పరిగెడుతున్న ఏపీ మంత్రులు...

ఏపీ: ఓటమి దిశగా 20 మంది మంత్రులు..

వెనకబడ్డ మంత్రులు ధర్మాన, సిదిరి అప్పలరాజు, రాజన్నదొర, బొత్స, అమర్నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణు, కొట్టు సత్యనారాయణ, కారుమూరి, తానేటి వనిత, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజినీ, ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, రోజా, అంజాద్‌ బాషా, బుగ్గన, ఉషశ్రీ చరణ్‌

నిజందాగదుక్షణంఆగదు

Jun 04 2024, 14:28

ప్రస్తుత ఎలక్షన్ ఫలితాల ప్రకారం జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించనున్న నారా చంద్రబాబు నాయుడు...

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించబోతున్నారు. 

గతంలో అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలను నిర్వర్తించారు.

 ఆ సమయంలో తమకు ఇది కావాలి.. అది కావాలి.. ఏదీ డిమాండ్ చేయలేదు. కేవలం కేంద్రంలో ప్రభుత్వం సజావుగా సాగేలా చూశారు. తాజాగా మరోసారి అదే పాత్రను పోషించబోతున్నారు.

బీజేపీకి ఎదురుగాలులు

తాజాగా విడుదలవుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. 

ఈసారి 400 కు పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నామని, ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారంటూ బీజేపీ ఊదరగొట్టింది. 

తీరా ఫలితాలు వస్తున్న తీరును గమనిస్తుంటే ఎన్డీయే కు వస్తున్న ఫలితాలు అంతంతమాత్రంగానే కనపడుతున్నాయి. 

ఇండియా కూటమి అనుకున్నదానికన్నా అద్భుతమైన పనితీరును కనపరుస్తోంది. మంచి ఫలితాలను రాబడుతోంది.

మిత్రపక్షాలపై ఆధారపడాలి

 భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేైసినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనపడటంలేదు.

 మిత్రులపై తప్పనిసరిగా ఆధారాపడాల్సిన పరిస్థితి కనపడుతోంది. 

దాదాపుగా మిత్రపక్షాలమీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవుతోంది.

 ఎన్డీయే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర అవుతోంది. 

రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుండటంతోపాటు భారీ స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోబోతోంది.

 దాదాపు పోటీచేసిన అన్ని ఎంపీ స్థానాల్లోను గెలవబోతోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పనుండటం ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి చంద్రబాబు సూచించిన వారికే కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి...

నిజందాగదుక్షణంఆగదు

Jun 04 2024, 10:15

ఆంధ్రప్రదేశ్లో సత్తా చూపిస్తున్న జనసేన పార్టీ...

ఈసారి జరిగిన ఎలక్షన్ ఫలితాలలో పోయినసారి కంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో తమ సత్తా చూపిస్తున్న జన సేనానీలు..

ఏపీ అసెంబ్లీ ఫలితాలు: పోటీ చేసిన 21 సీట్లలో జనసేన ఆధిక్యం

నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 20:19

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన Hawk Eye యాప్‌ హ్యాక్‌...

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన Hawk Eye యాప్‌ హ్యాక్‌. దాదాపు 2 లక్షల మంది మహిళల పేర్లు, కంప్లైంట్స్‌, ఫోన్‌ నెంబర్స్‌. లొకేషన్స్‌, SOS జర్నీ వివరాలు లీక్‌ అయినట్లు సమాచారం.

నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 20:00

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

సీసీబీ పోలీసుల మూడో నోటీసుకు హాజరైన హేమ

పోలీసు విచారణకు బుర్ఖాలో వెళ్లిన హేమ

విచారణ అనంతరం హేమను అరెస్ట్ చేసిన పోలీసులు.

ప్రభుత్వాస్పత్రిలో నటి హేమకు వైద్య పరీక్షలు

రేపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు

రేవ్‌ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర

ఐదుగురితో కలిసి రేవ్ పార్టీ నిర్వహించిన హేమ

నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 15:58

ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు సలాం కొట్టి, స్టాండింగ్ ఆవేషన్ ఇచ్చిన భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఓటర్లకు స్టాండింగ్‌ అవేషన్‌ ఇచ్చిన సీఈసీ.. ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు వేశారు.. 31 కోట్ల మంది మహిళలు ఓటేశారు.. మన దేశంలో ఓటేసినవారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు.. రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం-రాజీవ్‌ కుమార్‌