నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 20:19

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన Hawk Eye యాప్‌ హ్యాక్‌...

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన Hawk Eye యాప్‌ హ్యాక్‌. దాదాపు 2 లక్షల మంది మహిళల పేర్లు, కంప్లైంట్స్‌, ఫోన్‌ నెంబర్స్‌. లొకేషన్స్‌, SOS జర్నీ వివరాలు లీక్‌ అయినట్లు సమాచారం.

నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 20:00

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

సీసీబీ పోలీసుల మూడో నోటీసుకు హాజరైన హేమ

పోలీసు విచారణకు బుర్ఖాలో వెళ్లిన హేమ

విచారణ అనంతరం హేమను అరెస్ట్ చేసిన పోలీసులు.

ప్రభుత్వాస్పత్రిలో నటి హేమకు వైద్య పరీక్షలు

రేపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు

రేవ్‌ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర

ఐదుగురితో కలిసి రేవ్ పార్టీ నిర్వహించిన హేమ

నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 15:58

ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు సలాం కొట్టి, స్టాండింగ్ ఆవేషన్ ఇచ్చిన భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఓటర్లకు స్టాండింగ్‌ అవేషన్‌ ఇచ్చిన సీఈసీ.. ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు వేశారు.. 31 కోట్ల మంది మహిళలు ఓటేశారు.. మన దేశంలో ఓటేసినవారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు.. రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం-రాజీవ్‌ కుమార్‌

నిజందాగదుక్షణంఆగదు

Jun 03 2024, 15:43

లిక్కర్‌ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు...

ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

ఈడీ, సీబీఐ కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో..

కవితను కోర్టులో హాజరుపరిచిన అధికారులు

జై తెలంగాణ, జై భారత్‌ అంటూ కోర్టులోకి వెళ్లిన కవిత

కోర్టులో కవితను కలిసేందుకు..

ఇద్దరు కుమారులకు అనుమతి ఇచ్చిన జడ్జి కావేరి బవేజా

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీ

తిహార్‌ జైలుకు కవిత తరలింపు

లిక్కర్‌ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఈనెల 7 వరకు పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

ఈనెల 7న కవితపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్న సీబీఐ

నిజందాగదుక్షణంఆగదు

Jun 02 2024, 13:20

సిక్కింలో ఎస్‌కేఎం పార్టీకి మరోసారి అధికారం..

సిక్కింలో ఎస్‌కేఎం పార్టీకి మరోసారి అధికారం. 32 స్థానాలకు మ్యాజిక్‌ ఫిగర్‌ 17 సీట్లు.. అధికారం నిలుపుకున్న ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌, మెజార్టీ మార్క్‌ దాటి 18 స్థానాలు గెలిచిన ఎస్‌కేఎం.. మరో 13 స్థానాల్లో ఎస్‌కేఎం పార్టీ ఆధిక్యం.

నిజందాగదుక్షణంఆగదు

Jun 02 2024, 13:07

ఇల్లు లేని నిరుపేదలకు, స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం గుడ్ న్యూస్..

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తామన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో సొంత ఇళ్లు లేని వారు ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సభాముఖంగా తెలిపారు.


ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున.. ప్రతి ఏడాది 4.50 ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని అన్నారు. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిందని అన్నారు. ఈ ఒక్క ఏడాదే 22,500 కోట్ల రూపాయలు వెచ్చించిందని అన్నారు. ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు తొలిదశలో రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు పై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలకు రుణం ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 02 2024, 10:48

ప్రాణం తీసిన 'ఒక్క రూపాయి' పంచాయతీ...

ఒక్క..రూపాయి పంచాయతీ ప్రాణంతీసింది..!! 

వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..

ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్దకు బిర్యాని కోసం వచ్చాడు. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు కూడా బిర్యాని కోసం అక్కడకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ 59 రూపాయల బిర్యానికి, 60 రూపాయలు ఫోన్ పే కొట్టాడు. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్ ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేశాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది. క్షణికావేశంలో ఇద్దరు పిడుగులు గుద్దుకున్నారు.. తోపులాటలో అరవింద్ ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ బలంగా నెట్టేయడంతో కిందపడి పక్కనే ఉన్న రాయికి అతని తల తాకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని గమనించి ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చిన్న మెదడు చిట్లి ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయినట్లు* వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

 ఒక్క రూపాయి ఇంతటి వివాదానికి కారణమైంది.క్షణికావేశం నిండు ప్రాణాలు బలి తీసుకుంది. అహంకారంతో ఆటోడ్రైవర్ ప్రాణాలు మింగేసిన యువకుడు అరవింద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 02 2024, 10:40

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ఘనవిజయం..

మహబూబ్‌నగర్‌ : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ కుమార్‌ రెడ్డి గెలుపు. కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి.

నిజందాగదుక్షణంఆగదు

Jun 02 2024, 09:39

నేటి నుంచి బాసర IIIT లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ..

నేటి నుంచి బాసర IIIT లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ

ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ అధికారులు ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే

నేటి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. నేటి నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. www.rgukt.ac.in వెబ్ సైట్, ఇమెయిల్ ద్వారా సందర్శించాలని సూచించారు. ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు

తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలి, ఏ కోర్సులు చదవాలి అనే విషయాలపై తల్లిదండ్రులు విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువుపైనే ప్రత్యేక చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఏకైక విద్యాలయ ప్రాంగణం కలిగిన బాసర ట్రిపుల్స్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే చదివించాలని కోరుకుంటారు. కాగా.. బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020-21లో 32,000 మంది, 2021- 22లో 20,178 మంది, 2022-23లో 31,432 మంది, 2023-24లో 32,635 మంది విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 02 2024, 08:07

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం..

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం.

నేటితో ముగియనున్న అరునాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు. అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ముందుగానే ఓట్ల లెక్కింపు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 స్థానాలు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 10 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న బీజేపీ.