నిజందాగదుక్షణంఆగదు

Jun 01 2024, 16:59

ఎలక్షన్ కోడ్ ముగిశాక తెలంగాణలో కొలువుల పండగ..

కోడ్‌ ముగిశాక కొలువుల పండగ

టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13 వేల పోస్టులు

నెలాఖరులోగా గురుకుల సొసైటీల్లో పోస్టింగులు!

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్‌ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తికాగా, టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడికానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్‌ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధ్రువీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్‌ ర్యాంకు జాబితా (జీఆర్‌ఎల్‌) వెల్లడైన నోటిఫికేషన్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి రెండు, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కమిషన్‌ పనిచేస్తోంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా గ్రూప్‌-4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్‌ఎల్‌ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈనెలలో ప్రారంభించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

నియామక ప్రక్రియ తుది దశలో...

ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధించి మెరిట్‌ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టుల తుది కీతో పాటు జీఆర్‌ఎల్‌ను కమిషన్‌ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల జీఆర్‌ఎల్‌ విడుదలైంది. పురపాలక శాఖలో ఎకౌంటెంట్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఇప్పటికే కమిషన్‌ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్య క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది. సాంకేతికవిద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు కమిషన్‌ జీఆర్‌ఎల్‌ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్‌ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్‌ విద్య విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు తుది కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్‌లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్‌ భావిస్తోంది. 

నేటి నుంచి గ్రూప్‌-1 హాల్‌టికెట్లు

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల కోసం జూన్‌ 9న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హాల్‌టికెట్లు శనివారం అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమిషన్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషన్‌ వెబ్‌సైట్లో ప్రత్యేక లింకు పెట్టనుంది. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఆ వివరాలన్నీ కమిషన్‌.. వెబ్‌సైట్లో పొందుపరిచింది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 01 2024, 16:43

Ts: రాజకీయ విమర్శలకు తావు లేకుండా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ గీతం ఉండాలని ప్రజలు కోరుకున్నారు.. రాజకీయ విమర్శలకు తావులేకుండా దశాబ్ది వేడుకలు జరుపుకోవాలి.. తెలంగాణ అమరులను ప్రధాని మోడీ అవమానించారు.. తల్లి చనిపోయింది.. బిడ్డను తెచ్చుకున్నారన్నారు.. సుష్మా స్వరాజ్‌ సేవలు మేం మర్చిపోం-మంత్రి పొన్నం ప్రభాకర్‌

నిజందాగదుక్షణంఆగదు

Jun 01 2024, 16:30

వరంగల్‌: కేయూలో విద్యార్థుల రాజముద్ర మార్పుపై ఆందోళన..

వరంగల్‌: కేయూలో విద్యార్థుల ఆందోళన

తెలంగాణ రాజముద్రలో..

కాకతీయ కళాతోరణాన్ని తొలగించవద్దని నిరసన

సీఎం రేవంత్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

అడ్డుకున్న పోలీసులతో విద్యార్థుల వాగ్వాదం

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 15:55

వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు..

వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు,

కాకినాడ ఈహెచ్‌ఎస్ ఆస్పత్రిలో ఉద్యోగాలకు రూ.10 లక్షల చొప్పున వంగా గీత లంచం తీసుకుంటున్నారు..

ఉద్యోగాల విషయంలో రూ.కోట్ల రూపాయల స్కామ్‌ జరిగింది.. మా ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి విచారణ చేయిస్తాం: మాజీ ఎమ్మెల్యే వర్మ.

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 13:47

ఇక నుంచి నేరుగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు శ్రీవారి ఉచిత దర్శనం..

*ఇక నుంచి నేరుగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు శ్రీవారి ఉచిత దర్శనం

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు TTD చర్యలు చేపట్టింది.

 సోమవారం నుంచి శనివారం వరకు 

ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

 అయితే, వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, 

వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 13:34

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడి ఆత్మహత్య..

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడి ఆత్మహత్య 

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కొడుకు హర్షవర్ధన్ (9)

హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే వేసవి సెలవులకు బాలుడు ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో తన తండ్రి కాంతారావు ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు బాలుడు మృతి చెందాడు.

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 13:28

భద్రాచలం: మారుతి కాలేజీలో నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మరణంపై కలెక్టర్, ఎస్పీ న్యాయ విచారణ జరిపించాలి:PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్

భద్రాచలం మారుతి కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయినా పగిడిపల్లి కారుణ్య మరణం పై కలెక్టర్,SP, న్యాయ విచారణ జరిపించాలి PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ మస్తాన్ అధికారులను డిమాండ్ చేశారు

 కొనిజర్ల మండలం ఓ గ్రామం నుండి వచ్చి డాక్టర్ కాంతారావు నడుపుతున్న మారుతి పారామెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య ఎలా చనిపోయిందో కలెక్టర్ ఎస్పీ న్యాయ విచారణ జరిపించాలనీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ మస్తాన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతి కాలేజీ సిసి కెమెరా ఫుటేజ్ డిలీట్ చేయటం రాష్ట్రవ్యాప్తంగా అనుమానాస్పదంగా మారిందని ఆయన అన్నారు 12, వ తారీకు గురువారం రాత్రి 8,గంటలకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయినట్టు నిర్ణయించారు శుక్రవారం మధ్యాహ్నం 3, గంటలకు 25 లక్షలకు కాలేజీ యాజమాన్యం డాక్టర్ కాంతారావు సెటిల్మెంట్ చేశారు దీనిపై హైకోర్టు విచారణ జరిపించాలని మహిళా సంఘాలు గిరిజన సంఘాలు న్యాయ విచారణ జరిగే వరకు ఉద్యమాలు చేపట్టాలని కామ్రేడ్ మస్తాన్ పిలుపునిచ్చారు మారుతి కాలేజీకి మారుతి కాలేజీ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ ఎస్పీ విచారణ జరిపించి తగు న్యాయం జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే మా డిమాండు కారుణ్య క్రింద పడిన స్థలంని మిత్ర బృందాన్ని స్థలాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి సరైన ఎంక్వయిరీ చేయాలని కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తప్పు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం ముందు అందరూ సమానమే వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని నియమా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భద్రాచలం మారుతి పారామెడికల్ కాలేజీపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిలర్ కు కంప్లీట్ చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు చిన్నతనంలోనే కొట్టుకొని విడాకులు తీసుకొని ఉన్నారు కారుణ్య బాధ్యత మొత్తం వాళ్ళ మేనమామే తీసుకున్నారు ఆ అమ్మాయిని మేనమామ కష్టపడి చదివించాడని అన్నారు కారుణ్య చనిపోయిన ప్లేస్ కు వెళ్లి విచారణ జరపకుండా ఇది కేవలం ఆత్మహత్య అని హట్టు కథలు అల్లి 25 లక్షలకు వాళ్ళ తల్లిదండ్రులకు సెటిల్మెంట్ చేసి కాలేజ్ యాజమాన్యం చేతులు దులుపుకోవాలని చెప్పి చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థి  మహిళా సంఘాలుసంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 13:16

ఉన్న సొసైటీకి ఎన్నికలు పెట్టండి మొర్రో.. అంటే కొత్త సొసైటీని ఏర్పాటు చేస్తాం అంటున్న మత్స్యశాఖ అధికారికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ...

ఉన్న సొసైటీకి ఎన్నికలు పెట్టండి మొర్రో.. అంటే కొత్త సొసైటీని ఏర్పాటు చేస్తాం అంటున్న మత్స్యశాఖ అధికారి

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీ ఆర్ ఎమ్మెస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారిని కలిసి అభ్యంతరం తెలియచేస్తు లేఖను అందచేసారు, ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..

నల్లగొండ జిల్లాలో పురాతనమైనటువంటి రాష్త్రంలోని అతి పెద్దదైన నల్లగొండ జిల్లా మత్స్య సొసైటీకి గత కొన్ని ఏండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యంతో అశ్రద్ధ చేసి అదే విదంగా గ్రామ మత్స్య సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్ పెట్టి ఇవ్వాలా ఆదరాబాదరాగా నూతన జిల్లా సొసైటీని ఏర్పాటు చేస్తామంటూ చీఫ్ ప్రమోటర్ నూ జనరల్ బాడిని ప్రకటిస్తామని ఈనెల 7వ తారీఖున సమావేశం ఉంటుందని చెప్పడాన్ని వారి అవగాహనారాహిత్యాన్ని తెలియచేస్తుందంటూ నూతనంగా ఏర్పాటు అయిన కొత్త జిల్లాల్లో మాత్రమె నూతన జిల్లా సొసైటీని ఏర్పాటు చేసి అట్టి సొసైటీకి మాత్రమె చీప్ ప్రమోటర్ ని జనరల్ బాడిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందనీ..

ఆ మేరకు జిల్లా నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆ ప్రాతిపాదికనే నూతన జిల్లా మత్స్య సొసైటీలు ఏర్పటైనాయని గతంలో ఉన్న నల్లగొండ జిల్లా మత్స్య సొసైటీకి రాజ్యాంగ బద్దంగా రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పెట్టాలంటూ నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం తరపున మత్స్యశాఖ ఏర్పాటు చేసిన 249 మత్స్య సొసైటీలలో ఎన్నికలు జరగకుండా ఉన్న అతి పెద్ద ప్రాజెక్ట్ లైన మూసి రిజర్వాయర్, ఏ కే బీ ఆర్ ప్రాజెక్ట్ లతో పాటు పెండింగ్ లో ఉన్న వందకు పైగా మత్స్య సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి అట్టి పాలకమండల్లు ఏర్పాటై ఆ సొసైటీలు కూడా తమ న్యాయమైన ఓటు హక్కును వినియోగించుకునెలా చేసిన తరువాతే జిల్లా మత్స్య సొసైటీ ఎలక్షన్స్ కి జిల్లా మత్స్యశాఖ వెళ్ళాలని డిమాండు చేశారు,

ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు జిట్టబోయిన రమేష్, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుడిసె కృష్ణ, రాఖి తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 13:03

ఢిల్లీలో నీటి కోరతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ ప్రభుత్వం..

ఢిల్లీలో నీటి కోరతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ ప్రభుత్వం..

ఢిల్లీలో తాగునీటి సమస్యపై ఆప్ సర్కార్ న్యాయపోరాటం.. హక్కువగా రావాల్సిన నీళ్లను ఇవ్వడం లేదంటూ సుప్రీం మెట్లెక్కిన ఆప్..

హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటిని విడుదల చేయడం లేదంటున్న ఆప్.. ఢిల్లీలో బిందెడు నీళ్ల కోసం కొట్టుకు చస్తున్న జనం..

చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై పానీపట్టు యుద్ధం.. ఒక్క వాటర్ ట్యాంకర్ వస్తే నిమిషాల్లో ఖాళీ.. స్లమ్ ఏరియాలో పరిస్థితి మరీ దయనీయం.. నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు ఫైన్ వేస్తామని ఆప్ హెచ్చరిక..

నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 12:56

ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ లో ఉద్రిక్తత..

ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ లో ఉద్రిక్తత..

అటవీశాఖ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు.. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం..

పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య గొడవ.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై రైతుల నిరసన..