నిజందాగదుక్షణంఆగదు

May 31 2024, 12:56

ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ లో ఉద్రిక్తత..

ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ లో ఉద్రిక్తత..

అటవీశాఖ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు.. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం..

పోడు రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య గొడవ.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై రైతుల నిరసన..

నిజందాగదుక్షణంఆగదు

May 30 2024, 10:31

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం అంటే...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ,

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,811 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు.

నిజందాగదుక్షణంఆగదు

May 30 2024, 08:17

శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్..

శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్..

5వ ప్రయత్నంలో విజయవంతంగా షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాణ్..

దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్.. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ కు చెందిన సంస్థ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం..

భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి.. ఈ తరహా ప్రయోగంతో పరీక్షించిన ఇస్రో

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:54

పాన్‌, ఆధార్‌ అనుసంధానం వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో మే 31 లాస్ట్‌డేట్‌..

పాన్‌, ఆధార్‌ అనుసంధానం.. ట్యాక్స్‌పేయర్లకు మే 31 లాస్ట్‌డేట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం (PAN-Aadhaar Link) చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయనివారి పాన్‌ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. దీన్ని 2024 మే 31లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.

లేనిపక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్‌/టీసీఎస్‌ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తుచేసింది. దీనికి పాన్‌ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత/చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు పాన్‌ యాక్టివేట్‌ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది.

అనుసంధానం అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ ఎప్పటి నుంచో చెబుతోంది. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసిందీ లేనిదీ గుర్తు లేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ‘

లింక్‌ ఆధార్‌ స్టేటస్‌

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

’పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే లింక్‌ అయినట్లు సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్‌ చెల్లించి ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి చేయాలి.

ఫైన్‌ చెల్లించి అనుసంధానం ఇలా..

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాలి. అందులో ‘

ఈ-పే ట్యాక్స్‌

https://eportal.incometax.gov.in/iec/foservices/#/e-pay-tax-prelogin/user-details

’పై క్లిక్‌ చేయాలి.

అక్కడ పాన్‌ నంబర్‌ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

తర్వాతి పేజీలో మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి.

వెరిఫికేషన్‌ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి.

తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్‌ ఇయర్‌ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్‌ రిసిప్ట్స్‌ (Other receipts (500) ఎంచుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్‌ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.

పేమెంట్‌ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని లింక్‌ ఆధార్‌ను క్లిక్‌ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:43

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్‌ చట్టాలు..

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్‌ చట్టాలు

  న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

  నల్సార్‌ వీసీ శ్రీకృష్ణదేవరావు వెల్లడి

  రాజద్రోహం.. ఇకపై దేశద్రోహం

  చిన్న నేరాలకు శిక్షగా సమాజసేవ

హైదరాబాద్‌: న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు జూలై 1 నుంచి దేశంలో 3 కొత్త క్రిమినల్‌ చట్టాలు అమల్లోకి రానున్నాయని నల్సార్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు వెల్లడించారు. ఆయా చట్టాలపై సోమవారం సమాచార కార్యాలయంలో పీఐబీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శృతి పాటిల్‌ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బ్రిటిషర్ల హయాంలో చేసిన భారత శిక్షా సృ్మతి-1860 (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌-1973 (సీఆర్పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలను అమలు చేయనున్నట్టు తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త క్రిమినల్‌ చట్టాలను రూపొందించారని, ఇవి శిక్ష కంటే న్యాయంపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని, అసమంజసమైన వాయిదాలను అరికట్టడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు కాలపరిమితిని నిర్ణయిస్తాయని వివరించారు.

మాజీ ఐజీ దామోదర్‌ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు కొత్త క్రిమినల్‌ చట్టాలు దోహదపడతాయని, వీటిపై అందరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. కొత్త క్రిమినల్‌ చట్టాల్లో చేసిన మార్పుల గురించి సీడీటీఐ డైరెక్టర్‌ ఎన్‌ రాజశేఖర్‌ వివరించారు. మహిళలు, పిల్లల హకుల పరిరక్షణ కోసం న్యాయ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్టు తెలిపారు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారని, చిన్న నేరాలకు పాల్పడినవారికి సమాజ సేవను శిక్షగా విధించనున్నారని, ఆర్థిక, సైబర్‌ నేరాలను వ్యవస్థీకృత నేరాలుగా వర్గీకరించారని వెల్లడించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:34

TS:రాష్ట్ర చిహ్నంలో మార్పులపై చర్చ చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌

రాష్ట్ర చిహ్నంలో మార్పులపై చర్చ

చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులపై ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం చిత్రకారులతో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుత అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి క్యాబినెట్‌ సమావేశంలో అభ్యంతరం వ్యక్తమైంది. ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిహ్నాన్ని రూపొందించాలని అప్పుడే నిర్ణయించారు.

అందులో భాగంగానే చిత్రకారుల బృందంతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌కు 12 నమూనాలను చూపించారు. వీటిపైచర్చించిన సీఎం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. 

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:19

‘ఆదర్శ’పాఠశాలలో ఇంటర్‌ దరఖాస్తుల గడువు పెంపు..

‘ఆదర్శ’ ఇంటర్‌ దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివరాలకు మోడల్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 16:06

రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి...

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ. రెమాల్‌ తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు.

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, భద్రాద్రి జిల్లాలకు వర్ష సూచన.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 15:53

నల్గొండ: ఉదయ సముద్రం చెరువులో చాపల వేటకు వెళ్లి తీవ్రమైన గాలి ప్రభావం వల్ల మృతి చెందిన సైదులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి...

కొడదల సైదులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

   పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ డిమాండ్. 

 పానగల్లు ఉదయ సముద్రం చెరువులో చేపలు పట్టుటకు వెళ్లిన నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన సైదులు తీవ్రమైన గాలితో చెరువులో మునిగి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన సైదులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రెసియ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉదయం నుండి పానగల్లు చెరువులో గల్లంతైన సైదులు మృతదేహం ఫైర్ సేఫ్టీ మరియు రెస్కి టీం తీవ్రంగా గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం నల్లగొండ ప్రభుత్వ దావకాన వద్ద కొడదల సైదులకు అఖిలపక్ష నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. తరచుగా పానగల చెరువులో ప్రమాదాలు గురై ఇప్పటివరకు చందనపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారని తెలియజేశారు. తీవ్రమైన గాలి వాన బీభత్సాన్ని సృష్టించిందని అందులో సైదులు మరణం ఒకటని తెలిపారు. చందనపల్లి గ్రామంలో ఇండ్లు కూలిపోయాయని కరెంటు స్తంభాలు విరిగిపోయాయని చెట్లు అల్లతోటలు విరిగిపోయాయి అని అపార నష్టం జరిగిందని తెలిపారు ప్రభుత్వం వ్యవసాయ అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా సైదులు కుటుంబాన్ని ఆదుకోవాలని 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. 

 

    ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ప్రభావతి కాంగ్రెస్ నాయకులు పెద్ది గోవర్ధన్ టిఆర్ఎస్ నాయకులు పెద్ది వెంకటయ్య మరియు రూపని లింగయ్య, ఉప్పుల జానీ, ఆలకుంట్ల వెంకన్న, కొడదల మనీ, రూపని ఎల్లయ్య, ఓర్సు నాగయ్య, భూపతి యాదయ్య తదితరులు శ్రద్ధాంజలి ఘటించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 12:13

బెంగుళూరు రేవు పార్టీ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హాజరుకాలేనని హేమ లేఖ..

బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిన నటి హేమ.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ రాసిన హేమ..

సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరిన హేమ..

మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సీసీబీ.. ఇవాళ హాజరుకావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసులకు హేమ రిప్లై..