నిజందాగదుక్షణంఆగదు

May 30 2024, 08:17

శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్..

శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్..

5వ ప్రయత్నంలో విజయవంతంగా షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అగ్నిబాణ్..

దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ఇంజిన్ ఆధారిత రాకెట్.. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ కు చెందిన సంస్థ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం..

భవిష్యత్లో చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి.. ఈ తరహా ప్రయోగంతో పరీక్షించిన ఇస్రో

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:54

పాన్‌, ఆధార్‌ అనుసంధానం వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో మే 31 లాస్ట్‌డేట్‌..

పాన్‌, ఆధార్‌ అనుసంధానం.. ట్యాక్స్‌పేయర్లకు మే 31 లాస్ట్‌డేట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం (PAN-Aadhaar Link) చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయనివారి పాన్‌ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. దీన్ని 2024 మే 31లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.

లేనిపక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్‌/టీసీఎస్‌ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తుచేసింది. దీనికి పాన్‌ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత/చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు పాన్‌ యాక్టివేట్‌ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది.

అనుసంధానం అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ ఎప్పటి నుంచో చెబుతోంది. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసిందీ లేనిదీ గుర్తు లేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ‘

లింక్‌ ఆధార్‌ స్టేటస్‌

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

’పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే లింక్‌ అయినట్లు సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్‌ చెల్లించి ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి చేయాలి.

ఫైన్‌ చెల్లించి అనుసంధానం ఇలా..

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాలి. అందులో ‘

ఈ-పే ట్యాక్స్‌

https://eportal.incometax.gov.in/iec/foservices/#/e-pay-tax-prelogin/user-details

’పై క్లిక్‌ చేయాలి.

అక్కడ పాన్‌ నంబర్‌ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.

తర్వాతి పేజీలో మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి.

వెరిఫికేషన్‌ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి.

తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్‌ ఇయర్‌ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్‌ రిసిప్ట్స్‌ (Other receipts (500) ఎంచుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్‌ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.

పేమెంట్‌ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని లింక్‌ ఆధార్‌ను క్లిక్‌ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:43

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్‌ చట్టాలు..

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్‌ చట్టాలు

  న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం

  నల్సార్‌ వీసీ శ్రీకృష్ణదేవరావు వెల్లడి

  రాజద్రోహం.. ఇకపై దేశద్రోహం

  చిన్న నేరాలకు శిక్షగా సమాజసేవ

హైదరాబాద్‌: న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు జూలై 1 నుంచి దేశంలో 3 కొత్త క్రిమినల్‌ చట్టాలు అమల్లోకి రానున్నాయని నల్సార్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు వెల్లడించారు. ఆయా చట్టాలపై సోమవారం సమాచార కార్యాలయంలో పీఐబీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శృతి పాటిల్‌ అధ్యక్షతన నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బ్రిటిషర్ల హయాంలో చేసిన భారత శిక్షా సృ్మతి-1860 (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌-1973 (సీఆర్పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలను అమలు చేయనున్నట్టు తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త క్రిమినల్‌ చట్టాలను రూపొందించారని, ఇవి శిక్ష కంటే న్యాయంపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని, అసమంజసమైన వాయిదాలను అరికట్టడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు కాలపరిమితిని నిర్ణయిస్తాయని వివరించారు.

మాజీ ఐజీ దామోదర్‌ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు కొత్త క్రిమినల్‌ చట్టాలు దోహదపడతాయని, వీటిపై అందరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. కొత్త క్రిమినల్‌ చట్టాల్లో చేసిన మార్పుల గురించి సీడీటీఐ డైరెక్టర్‌ ఎన్‌ రాజశేఖర్‌ వివరించారు. మహిళలు, పిల్లల హకుల పరిరక్షణ కోసం న్యాయ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్టు తెలిపారు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారని, చిన్న నేరాలకు పాల్పడినవారికి సమాజ సేవను శిక్షగా విధించనున్నారని, ఆర్థిక, సైబర్‌ నేరాలను వ్యవస్థీకృత నేరాలుగా వర్గీకరించారని వెల్లడించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:34

TS:రాష్ట్ర చిహ్నంలో మార్పులపై చర్చ చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌

రాష్ట్ర చిహ్నంలో మార్పులపై చర్చ

చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చిస్తున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులపై ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం చిత్రకారులతో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుత అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి క్యాబినెట్‌ సమావేశంలో అభ్యంతరం వ్యక్తమైంది. ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిహ్నాన్ని రూపొందించాలని అప్పుడే నిర్ణయించారు.

అందులో భాగంగానే చిత్రకారుల బృందంతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌కు 12 నమూనాలను చూపించారు. వీటిపైచర్చించిన సీఎం తుది నమూనాపై పలు సూచనలు చేశారు. 

నిజందాగదుక్షణంఆగదు

May 28 2024, 15:19

‘ఆదర్శ’పాఠశాలలో ఇంటర్‌ దరఖాస్తుల గడువు పెంపు..

‘ఆదర్శ’ ఇంటర్‌ దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివరాలకు మోడల్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 16:06

రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి...

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ. రెమాల్‌ తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు.

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, భద్రాద్రి జిల్లాలకు వర్ష సూచన.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 15:53

నల్గొండ: ఉదయ సముద్రం చెరువులో చాపల వేటకు వెళ్లి తీవ్రమైన గాలి ప్రభావం వల్ల మృతి చెందిన సైదులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి...

కొడదల సైదులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

   పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ డిమాండ్. 

 పానగల్లు ఉదయ సముద్రం చెరువులో చేపలు పట్టుటకు వెళ్లిన నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన సైదులు తీవ్రమైన గాలితో చెరువులో మునిగి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన సైదులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రెసియ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉదయం నుండి పానగల్లు చెరువులో గల్లంతైన సైదులు మృతదేహం ఫైర్ సేఫ్టీ మరియు రెస్కి టీం తీవ్రంగా గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి మనోధైర్యం కలిగించడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం నల్లగొండ ప్రభుత్వ దావకాన వద్ద కొడదల సైదులకు అఖిలపక్ష నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. తరచుగా పానగల చెరువులో ప్రమాదాలు గురై ఇప్పటివరకు చందనపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందారని తెలియజేశారు. తీవ్రమైన గాలి వాన బీభత్సాన్ని సృష్టించిందని అందులో సైదులు మరణం ఒకటని తెలిపారు. చందనపల్లి గ్రామంలో ఇండ్లు కూలిపోయాయని కరెంటు స్తంభాలు విరిగిపోయాయని చెట్లు అల్లతోటలు విరిగిపోయాయి అని అపార నష్టం జరిగిందని తెలిపారు ప్రభుత్వం వ్యవసాయ అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా సైదులు కుటుంబాన్ని ఆదుకోవాలని 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. 

 

    ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ప్రభావతి కాంగ్రెస్ నాయకులు పెద్ది గోవర్ధన్ టిఆర్ఎస్ నాయకులు పెద్ది వెంకటయ్య మరియు రూపని లింగయ్య, ఉప్పుల జానీ, ఆలకుంట్ల వెంకన్న, కొడదల మనీ, రూపని ఎల్లయ్య, ఓర్సు నాగయ్య, భూపతి యాదయ్య తదితరులు శ్రద్ధాంజలి ఘటించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 12:13

బెంగుళూరు రేవు పార్టీ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హాజరుకాలేనని హేమ లేఖ..

బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిన నటి హేమ.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ రాసిన హేమ..

సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరిన హేమ..

మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సీసీబీ.. ఇవాళ హాజరుకావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసులకు హేమ రిప్లై..

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 11:59

తెలంగాణ ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్లో మళ్లీ పెరుగుతున్న కడుపు కోతలు..

మళ్లీ తిరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్లో కడుపు కోతలు..

రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు 

ప్రైవేటు ఆస్పత్రుల్లో 75 శాతం ప్రసవాలు అవే 

సర్కారు దవాఖానల్లో 46.4 శాతం 

అగ్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా

నిరుటితో పోలిస్తే పెరిగిన ఆపరేషన్లు 

వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం. మార్చి నెలలో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలపై సర్కారుకు వైద్యశాఖ ఇటీవలే ఓ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఆ నెలలో జరిగిన మొత్తం ప్రసవాల్లో 57ు సీ సెక్షన్స్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ వంద కాన్పుల్లో సిజేరియన్లు 21 ఉండగా, భారత్‌లో అది 23.29గా ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్‌ డెలివరీలు సగటున 28.5 శాతానికి పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 

కానీ మనదగ్గర ఇప్పుడే దానికి రెట్టింపు స్థాయిలో కడుపుకోతలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్‌ ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాగా, గతేడాది వరకు సర్కారీ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 66.8 శాతం ఉండగా... ఇప్పుడవి 54 శాతానికి తగ్గాయి. దాదాపు 12 శాతం మేరకు నార్మల్‌ డెలివరీలు తగ్గి సిజేరియన్లు పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రైవేటులో సాధారణ ప్రసవాలు గతేడాది వరకు 33-34 శాతం మధ్య ఉండగా... ప్రస్తుతం అవి 25 శాతానికి పడిపోయి, ఏకంగా 75 శాతం డెలివరీలు సిజేరియన్లే అవుతున్నాయి. 

ప్రతీ గంటకు 29 సిజేరియన్‌ ఆపరేషన్లు 

రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలపి మొత్తం 39,188 ప్రసవాలు జరిగాయి. ఇందులో 22,046 డెలివరీలు సిజేరియన్లు. ఈ లెక్కన ప్రతీ గంటకు 29, రోజుకు సగటున 711 కడుపుకోతలు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు కేవలం 43.75 శాతంగా నమోదయ్యాయి. అత్యధిక సిజేరియన్లు జరిగిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచింది. అక్కడ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ వంద డెలివరీల్లో 93.5 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 73.2 శాతం సీ-సెక్షన్స్‌ జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యల్పంగా సీ సెక్షన్స్‌ మేడ్చల్‌ జిల్లాల్లో జరుగుతున్నాయి. అక్కడ 51 శాతమే నమోదయ్యాయి. 

మహబూబాబాద్‌ జిల్లాలో ప్రైవేటులో 91.6 శాతం, సర్కారీలో 62 శాతం సిజేరియన్స్‌ జరుగుతున్నాయి. 90 శాతం సీ సెక్షన్స్‌తో నిర్మల్‌ జిల్లా మూడోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాల్లో సగటున అన్ని జిల్లాల్లో సీ సెక్షన్స్‌ 75 శాతం జరుగుతున్నాయి. 80 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాలా జాబితాలో పెద్దపల్లి (89), వరంగల్‌, జనగాం (87), వికారాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల (86), ఆదిలాబాద్‌, కామారెడ్డి (85), సిద్దిపేట (84), మెదక్‌, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్‌, హన్మకొండ (83), ఖమ్మం (80)ఉన్నాయి. సుమారుగా సగం జిల్లాల్లో 80 శాతానికిపైగా కడుపుకోతలు జరుగుతుండం ఆందోళనకర అంశమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాల జాబితాలో నాగర్‌కర్నూల్‌ (50), కరీంనగర్‌ (69), సిద్దిపేట, వరంగల్‌ (57), మంచిర్యాల (60), జగిత్యాల, హన్మకొండ (67), జయశంకర్‌ భూపాలపల్లి (59), కామారెడ్డి, నల్గొండ (51), పెద్దపల్లి (67), ఖమ్మం (53) యాదాద్రి భువనగిరి (55), నిర్మల్‌ (65), నిజామాబాద్‌ (54), మహబూబాబాద్‌, జనగాం (62) జిల్లాలున్నాయి. 

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 15 శాతమే.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల మేరకు సీసెక్షన్‌ ప్రసవాలు ప్రతీ వందకు 10-15 మాత్రమే ఉండాలి. 1990లో ప్రపంచవ్యాప్తంగా సగటు సీ సెక్షన్‌ రేటు 7 శాతం ఉండగా, 2030 నాటికి అది 28.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆఫ్రికాలో 9.2 శాతం, ఆసియాలో 23.1 శాతం, యూర్‌పలో 25.7 శాతం, అమెరికాలో 39.3 శాతం కడుపుకోతలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 11:35

తెలంగాణలో ఉసురు తీసిన గాలివాన

ఉసురు తీసిన గాలివాన

విరిగిపడిన చెట్లు.. కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు

రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృత్యువాత

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురి దుర్మరణం

హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌

ఉసురు తీసిన గాలివాన

హైదరాబాద్‌ వనస్థలిపురం గణేశ్‌ ఆలయం ప్రాంతంలోని కెనరా బ్యాంకు రోడ్డులో కారు, ఆటోపై కూలిన వృక్షం

అకాలవర్షాలు, ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ... మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడటంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, ఓ డ్రైవరు చనిపోయారు. రాజధాని హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరు వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గాలుల ధాటికి రోడ్లపై, ఇళ్ల ఆవరణల్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గాలిదుమారం రేగింది. నల్గొండ జిల్లా పెద్ద అడిశెర్లపాడు మండలం ఘన్‌పూర్, హాలియా మండలం ఇబ్రహీంపేట, గుర్రంపోడు మండల కేంద్రాల్లో వాన కురిసింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరులో కూలిపోయిన రేకులషెడ్డు శిథిలాల్లో నలుగురి మృతదేహాలు

హైదరాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన పలు హోర్డింగ్‌లు, సెల్‌టవర్లు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవ్వడంతో ప్రజలు వణికిపోయారు. హయత్‌నగర్‌ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీనగర్‌ వరకూ, మల్కాజిగిరి, మేడ్చల్‌ నుంచి శామీర్‌పేట్‌ మీదుగా కీసర, ఘట్‌కేసర్‌ వరకూ వాహనాల రాకపోకలు స్తంభించాయి. సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు, ఐటీ కారిడార్‌లో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ ఇంటిపై పడిపోయిన హోర్డింగ్‌

పలు జిల్లాల్లో ఎండల తీవ్రత 

మరోవైపు రాష్ట్రంలో ఎండలు ఆదివారం 46.5 డిగ్రీల మార్కును తాకాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 46.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇదే మండలం బుద్దేష్పల్లిలో 46.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ 45.8, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌ 45.6, ధర్మపురి మండలం నేరెళ్ల 45.6, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి 45.2, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ 45.2, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రం 45.1, మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం 45, నిర్మల్‌ జిల్లా కేంద్రం 45, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్‌లో 45 డిగ్రీల ఎండ కాసింది. మరికొన్ని జిల్లాల్లో 44.8 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 

హయత్‌నగర్‌ ఇన్ఫర్మేషన్‌ కాలనీలో ద్విచక్రవాహనంపై కూలిన భారీ వృక్షం

వనస్థలిపురం సాగర్‌ కాంప్లెక్స్‌పై విరిగి పడిన సెల్‌ఫోన్‌ టవర్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏడుగురి మృత్యువాత

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు శివారులోని ఇంద్రకల్‌ రోడ్డు సమీపంలో రైతు మల్లేశ్‌(38) తన పొలంలో రేకుల షెడ్డు నిర్మించుకుంటున్నారు. ఆయనతోపాటు భార్య పార్వతమ్మ, కుమారుడు రాజు, కుమార్తె అనూష(12), పని చేయడానికి వచ్చిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన ఇద్దరు మేస్త్రీలు, ఇద్దరు అడ్డాకూలీలు చెన్నమ్మ(38), రాముడు(36) అక్కడే ఉన్నారు. ఉన్నట్లుండి ఈదురుగాలులతో వర్షం కురవడంతో మల్లేశ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, మేస్త్రీలు చిన్ననాగులు, కుర్మయ్య, చెన్నమ్మ, రాముడు, పక్క పొలం రైతు నాగరాజు షెడ్డులో తలదాచుకున్నారు. నిర్మాణంలో ఉన్న షెడ్డు ఒక్కసారిగా కూలిపోవడంతో మల్లేశ్, అనూష, చెన్నమ్మ, రాముడు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రగాయాలైన పార్వతమ్మ, రాజు, చిన్ననాగులు, నాగరాజులును ఆసుపత్రికి తరలించారు. నాగర్‌కర్నూల్‌ మంతటి గేట్‌ సమీపంలో రేకుల షెడ్డుపై ఉన్న రాయి పడి వేణుగోపాల్‌(38) మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా బాషీర్‌బాద్‌ మండలం నీళ్లపల్లి చెందిన వేణుగోపాల్‌ కారు కిరాయికి తిప్పుతూ జీవనం సాగించేవారు. శ్రీశైలం కిరాయికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈదురుగాలులకు మంతటి గేటు సమీపంలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డుపై ఉన్న రాయి వేగంగా దూసుకొచ్చి కారు అద్దాన్ని పగులగొట్టుకొని లోపలున్న వేణుగోపాల్‌పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందారు. అలాగే తెలకపల్లికి చెందిన లక్ష్మణ్‌(12), తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన కుమ్మరి వెంకటయ్య(54) వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు బలయ్యారు.

హైదరాబాద్‌లో నలుగురి మృతి

కీసర, మియాపూర్: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ధనుంజయ్‌లు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తిమ్మాయిపల్లి సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బలమైన ఈదురుగాలులకు భారీ చెట్టు విరిగి వారిపై పడింది. దీంతో వెనుక కూర్చున్న నాగిరెడ్డి రామిరెడ్డి(56) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలైన ధనుంజయ్‌(44)ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. హఫీజ్‌పేట్‌లోని సాయినగర్‌లో ఓ ఇంటి మూడో అంతస్తులో రేకులషెడ్డు వేసి, పైన ఇటుకలు పెట్టారు. గాలివానకు రేకులు ఎగిరిపోగా.. ఇటుకలు పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారి సమద్‌(3)తోపాటు రోడ్డుపై వెళ్తున్న రషీద్‌(45)పై పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే చనిపోగా.. రషీద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరి దుర్మరణం

ములుగు: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌(30).. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(50)(గౌరీ శంకర్‌కు వదిన) తమ కుటుంబసభ్యులతో కలిసి శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో బంధువులు విభూతి శ్రీనివాస్‌ ఇంటికి వచ్చారు. ఆదివారం శ్రీనివాస్‌ పొలానికి అందరూ కలిసి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో గాలివాన రావడంతో సమీపంలోని ఇరుకుల రాములు కోళ్లఫారం గోడ వద్దకు వెళ్లారు. గాలి ధాటికి అది ఒక్కసారిగా కూలిపోవడంతో గౌరీశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గంగామాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, గంగ సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గౌరీశంకర్‌ బ్యాంకు ఉద్యోగి కాగా అతని తండ్రి నాలుగేళ్ల క్రితం, సోదరుడు మూడేళ్ల క్రితం మృతిచెందారు.

నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి మరింత విస్తరించాయి. మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. దీన్ని బట్టి ఈ నెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో వర్షాలతో వాతావరణం చల్లబడటం, యాసంగి సాగు దాదాపు పూర్తవడంతో విద్యుత్‌ డిమాండు గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ గరిష్ఠ డిమాండు 8797 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది ఇదేరోజు 9262 మెగావాట్లు ఉంది. రాత్రి సమయంలో డిమాండు 7 వేల మెగావాట్లకు చేరుతోంది. నెల క్రితం వరకూ రోజూవారీ గరిష్ఠ డిమాండు 15 వేల మెగావాట్లకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.