నిజందాగదుక్షణంఆగదు

May 22 2024, 22:40

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు 

తెలంగాణ వచ్చిన పదేండ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ.  

దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వ హించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.  

రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

వేలాదిమంది ఉద్యమించి నా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు ఉంది. 

కాబట్టి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం...

నిజందాగదుక్షణంఆగదు

May 19 2024, 20:29

కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. అధ్యక్షుడు కోసం గాలింపు.....

కూలిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం హెలికాప్టర్‌. వాతావరణం అనుకూలించక కుప్పకూలిన హెలికాప్టర్‌. ఇబ్రహీం ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. జోల్ఫా సిటీ సమీపంలో ప్రమాదం. అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్తుండగా ఘటన.

నిజందాగదుక్షణంఆగదు

May 19 2024, 20:12

ఇకపై కల్యాణ లక్ష్మి పథకంలో లక్ష, తులం బంగారానికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్...

రేవంత్ సర్కార్ శుభవార్త లక్ష తులం బంగారానికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. కానీ.. ఇంకా ఎలక్షన్ కోడ్‌ మాత్రం అమల్లోని ఉంటుంది. వచ్చే నెల నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్న సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.అయితే.. ఎన్నికల ముగిసిన వెంటనే రేవంత్‌ ప్రభుత్వం పథకాల అమలుపై ఫోకస్‌ పెడుతోంది.

ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే వివిధ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికారుల ద్వారా ప్రణాళికలను సిద్ధం చేసింది. నిధులను కూడా సమకూరుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల్లో భాగమైన ముఖ్యమైన పథకం కల్యాణ లక్ష్మి. దీన్ని తాము చెప్పినట్లుగానే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు.

అంతేకాదు.. దీన్ని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.725 కోట్లకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ ముందు చెప్పినట్లుగా లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం అందించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు.

కల్యాణ లక్ష్మి పథకం అమలు కోసం రాష్ట్రంలో చాలా మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కొందరు అయితే.. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ పథకంపై అధికార పార్టీపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దాంతో.. సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుని కచ్చితంగా తాము చెప్పినట్లుగానే రూ.లక్షతో పాటుగా తులం బంగారం అందించేలా ప్రణాళికలను సిద్దం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజందాగదుక్షణంఆగదు

May 19 2024, 19:23

TS: రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశానికి సిఈసి గ్రీన్ సిగ్నల్...

TS: రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశానికి సిఈసి గ్రీన్ సిగ్నల్...

రేపు మ.3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

సీఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో రేపు సమావేశం

కేబినెట్‌ సమావేశానికి షరతులు విధించిన సీఈసీ

అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ

ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదు-CEC

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు..

ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీని వాయిదా వేయాలి-సీఈసీ

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 11:08

ఏపీకి ఇంటెలిజెన్స్‌ అలర్ట్..

ఏపీకి ఇంటెలిజెన్స్‌ అలర్ట్.. జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరిక.. జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలన్న ఇంటెలిజెన్స్‌

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 10:57

ఈనెల 20న ప్రారంభం కానున్న తెలంగాణ TET పరీక్షలు.. హాల్ టికెట్ ఈ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి...

 ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెట్-2024 పరీక్షలకు హాల్ విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీన ముగుస్తాయి. టెట్‌కు సుమారు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 10:05

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!

ప్రపంచం వ్యాప్తంగా తెలుగులో ఉన్నారు. అన్ని దేశాల్లో తెలుగువారు కనిపిస్తున్నే ఉంటారు. అంతేకాక విదేశాల్లో తమదైన ప్రతిభతో తెలుగు ఖ్యాతిని పెంచుతుంటారు. ఇప్పటికే అనేక మంది తెలుగు వారు వివిధ సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే పలు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారు..తమ ప్రత్యేకను చాటుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి విదేశాల్లో సత్తాచాటారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిలిచారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు నిలిచారు. బ్రిటన్ లోని ప్రధాన పార్టీల్లో ఒకటైనా లేబర్‌ పార్టీ నుంచి నాగరాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ తమ పార్లమెంటరీ అభ్యర్థిగా నాగరాజు పేరు ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ బౌండరీ కమిషన్‌ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.

Sandip University

ఎలక్టో రల్‌ కాల్కులస్‌ ప్రకారం.. ఆ నియోజకవర్గంలో లేబర్‌ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి బ్రిటన్ వెళ్లిన నాగరాజు.. అక్కడ అంచలంచలుగా ఎదిగారు. ఇప్పుడు యూకే బరిలో నాగరాజు దిగారు. శనిగరం గ్రామానికి చెందిన హనుమంతరావు, నిర్మలాదేవి దంపతులకు ఉదరు నాగరాజు జన్మించారు. నాగరాజుకు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉన్నారు. అలానే చదువుల్లో కూడా ఎప్పుడు ముందు ఉన్నారు. అలా కష్టపడే తత్వం ఉన్న నాగరాజు ఉదరు అంచెలంచలుగా ఎదిగారు.

బ్రిటన్‌లోనియూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. ఐ పాలసీ ల్యాబ్స్‌ అనే థింక్‌ట్యాంక్‌ను నాగరాజు స్థాపించారు. అంతర్జాతీయ వక్తగా, రైటర్ గా మంచి పేరు పొందారు. అక్కడ పొలిటికల్ అంశాలపై దశాబ్దకాలంగా ప్రచారం చేయడంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉదరు నాగ రాజు కూడా బ్రిటన్‌ పార్ల మెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 09:33

TS: రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచన. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న సీఎం

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 09:26

AP:ప్రశాంత్‌ కిషోర్‌కు సీఎం జగన్‌ కౌంటర్‌,..

ప్రశాంత్‌ కిషోర్‌కు సీఎం జగన్‌ కౌంటర్‌, ప్రశాంత్‌ కిషోర్‌ చేసిందేమీ లేదు.. చేసేదంతా టీమే. ప్రశాంత్‌ కిషోర్‌ మనకు వ్యతిరేకంగా మారారు, ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదు.. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్‌ కాబోతుంది, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించాం, ఐప్యాక్‌ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించాం.. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు.. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం-జగన్‌.

నిజందాగదుక్షణంఆగదు

May 16 2024, 17:12

మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

CM Revanth Reddy Warning: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలిచిన అంశం ఏదైనా ఉందంటే అది మెట్రో రైలుదే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ స్కీమ్ లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని వల్ల మెట్రో భారీగా నష్టపోతుందని ఇటీవల లార్సెన్ అండ్ టర్బో కంపెనీ ప్రకటించింది. మెట్రో రైళ్లను నడపడం తమ వల్ల కాదని పేర్కొంది. అయితే ఎల్ అండ్ టీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మే15) తన నివాసంలో మీడియాతో ఎల్ అండ్ టీ చేసిన వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ప్రారంభించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్ జండర్స్ కి ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తామని హామీ ఇచ్చాం. కేవలం మెట్రో రైలు నష్టంతో ఈ పథకం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఎల్ అండ్ టీ నష్టాల గురించి గానీ లాభాల గురించి గానీ ఎలాంటి బాధ లేదని.. వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి వెళ్లినా తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. వాళ్ళని వెళ్తే వెళ్లనివ్వండి.. ప్రభుత్వం దానికి ప్రత్యమ్నాయ ఏర్పాటు చేసుకుంటుంది. ఒక కాంట్రాక్టర్ వెళ్లిపోతే ఇంకో కాంట్రాక్టర్ వస్తాడని అన్నారు. ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే..ఉచిత బస్సు ప్రయాణాలు మెట్రోపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. హైదరాబాద్ లో 2026 తర్వాత మెట్రో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం వల్ల మెట్రో రైల్ రైడర్ షిప్ పై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్, హూల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ అధికారి ఆర్ శంకర్ రామన్ అన్నారు. నష్టాలు భరిస్తూ ప్రాజెక్ట్ ని కొనసాగించడం కష్టం.. అందుకే మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయా సంస్థల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.. కార్పోరేట్ల ఇష్టాయిష్టాలపై మనం ఏం చెప్పలేం అన్నారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏం జరిగినా మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తాం.. మేం ప్రతి నెల టీఎస్ఆర్టీసీకి నిధులు రియంబర్స్ చేస్తున్నాం. ఉచిత బస్సు పథకం కారణంగా టీఎస్ఆర్టీసీ ని ఆర్థిక సంక్షోభంలో పడకుండా కాపాడుకునే బాధ్యత మాది అని అన్నారు.