Mane Praveen

May 18 2024, 22:05

అంబేద్కర్ కి పూజలు చేసిన మోదీ
ప్రధాని మోదీ..  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు. SB NEWS

Mane Praveen

May 18 2024, 21:57

సిఎం రేవంత్ రెడ్డి  సంచలన ప్రకటన
*తెలంగాణ ప్రభుత్వంలోని వికలాంగులందరికీ శుభవార్త*

*ఇక నుండి సదరం స్లాట్ బుకింగ్ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుంది.*
*ఎవరైనా ఎపుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చును.*
*స్లాట్ బుక్ చేసుకోగానే స్లాట్ ఉన్నచో స్లాట్ క్యాంపు తేది, వెన్యూ చూపెడుతుంది.* *స్లాట్ లేనిచో రిజర్వులో ఉంటుంది.*
*ఎపుడైతే స్లాట్ షెడ్యూల్ ఇస్తారో వారికి ఆటోమేటిక్ గా స్లాట్ అల్లాట్మెంట్ జరుగుతుంది.* *స్లాట్ బుక్ కాగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిపార్ట్‌మెంట్ ద్వారా SMS పంపడం జరుగుతుంది.*
*అందులో క్యాంపు మరియు స్లాట్ వివరాలు వారికి తెలియజేయబడుతుంది.*

Mane Praveen

May 18 2024, 21:51

NLG: మర్రిగూడ మండలంలో 1384 గ్రాడ్యుయేట్ ఓటర్లు
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఓటర్ లిస్ట్ లను అధికారులు అధికారిక వెబ్సైట్లో లో పొందుపరిచారు. ఈ ఎన్నిక కోసం నల్లగొండ జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐతే మర్రిగూడ మండలంలో 1384 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 917 మంది ఉండగా  మహిళలు 467 మంది ఉన్నారు. ఈ ఎన్నిక కోసం మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Mane Praveen

May 18 2024, 17:19

NLG: డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్  జరుగుతున్నవి. ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, కళాశాలలో మొత్తం 1560 సీట్లు అందుబాటులో ఉన్నాయని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో 240 సీట్లు, బీకాంలో 420 సీట్లు, బి బి ఏ లో 60 సీట్లు, బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 360 సీట్లు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో 420 సీట్లు , బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, దోస్త్ కన్వీనర్ వెంపటి శ్రీనివాసులు తెలిపారు. ఈ సంవత్సరం కొత్తగా బీకాం ఫైనాన్స్ కోర్స్ మరియు బి ఏ (ఈ హెచ్ పి) స్పెషల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయని , ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా ఈనెల 29వ తారీకు లోగా నమోదు చేసుకొని, ఈనెల 20వ తారీకు నుంచి 30వ తారీకు వరకు దోస్త్ ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 18 2024, 14:42

నిరాశ్రయ కుటుంబానికి ముత్తు చేయూత

RR: మాడ్గుల మండలం, అన్నెబోయినపల్లి గ్రామానికి చెందిన జిల్లా శారద అనే మహిళ భర్త ఇటీవల ఆక్సిడెంట్ కారణంగా మరణించాడు. భర్త మరణంతో శారద ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. బాధితురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ఇల్లు గడవటం కూడా కష్టంగా మారింది.

సహచరుల ద్వారా విషయం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు వారి కుటుంబానికి భరోసాను అందించారు. ఆర్థిక సహాయంగా శారదకు పదివేల రూపాయలను అందించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫౌండేషన్ ని సంప్రదించాలని ముత్తు కోరారు.

ఈ సందర్బంగా ముత్తు  మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ ఎంతో మంది పేద ప్రజలకు నీడనిస్తుందని, అన్నార్తులకు ఆకలి ముద్దగా కడుపు నింపుతుందని పేర్కొన్నారు. పేదల కోసం తమ ఫౌండేషన్ ఎప్పటికి అండగా నిలబడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, ట్రెజరరీ పగడాల కళ్యాణ్, జనరల్ సెక్రెటరీ మొగిలి కిషన్, ఎం. మల్లేపల్లి మాజీ సర్పంచ్ మార్ల వెంకటయ్య, నర్ర పరమేష్ తదితరులు ఉన్నారు.

Mane Praveen

May 17 2024, 15:27

మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.

మాడుగులపల్లి లో 2, వేములపల్లి 1, మిర్యాలగూడ 13, దామరచర్ల 2 అడవిదేవులపల్లి 1, నిడమనూరు 2 త్రిపురారం 2, తిరుమలగిరి సాగర్ 2, హాలియా 2,  పెద్దవూర లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Mane Praveen

May 17 2024, 15:27

మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.

మాడుగులపల్లి లో 2, వేములపల్లి 1, మిర్యాలగూడ 13, దామరచర్ల 2 అడవిదేవులపల్లి 1, నిడమనూరు 2 త్రిపురారం 2, తిరుమలగిరి సాగర్ 2, హాలియా 2,  పెద్దవూర లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Mane Praveen

May 17 2024, 14:35

శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ను ప్రారంభించిన జడ్పిటిసి
నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు పక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ఓపెన్నింగ్ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి  హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన వివిధ రకాలైన పంట గింజలు, మందులను రైతులు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, కోట రఘు నందన్, ఈద శేఖర్, దోటీ పరమేష్, కత్తుల రాజు, తదితరులు, ఉన్నారు.

Mane Praveen

May 17 2024, 14:23

తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

తెలంగాణలో 5 రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని IMD వెల్లడించింది.

ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Mane Praveen

May 17 2024, 11:59

TS స్థానంలో TG అమలు చేయాలని గెజిట్ నోటిఫికేషన్‌..
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా TS స్థానంలో TG అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌.. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌ ప్రకారం ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు TS స్థానంలో TG ఉండే విధంగా రిజిస్టేషన్లు చేయాలని గెజిట్