నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 10:05

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగోడు!

ప్రపంచం వ్యాప్తంగా తెలుగులో ఉన్నారు. అన్ని దేశాల్లో తెలుగువారు కనిపిస్తున్నే ఉంటారు. అంతేకాక విదేశాల్లో తమదైన ప్రతిభతో తెలుగు ఖ్యాతిని పెంచుతుంటారు. ఇప్పటికే అనేక మంది తెలుగు వారు వివిధ సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే పలు దేశ రాజకీయాల్లోనూ తెలుగు వారు..తమ ప్రత్యేకను చాటుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు వ్యక్తి విదేశాల్లో సత్తాచాటారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిలిచారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు నిలిచారు. బ్రిటన్ లోని ప్రధాన పార్టీల్లో ఒకటైనా లేబర్‌ పార్టీ నుంచి నాగరాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ తమ పార్లమెంటరీ అభ్యర్థిగా నాగరాజు పేరు ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ బౌండరీ కమిషన్‌ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.

Sandip University

ఎలక్టో రల్‌ కాల్కులస్‌ ప్రకారం.. ఆ నియోజకవర్గంలో లేబర్‌ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి బ్రిటన్ వెళ్లిన నాగరాజు.. అక్కడ అంచలంచలుగా ఎదిగారు. ఇప్పుడు యూకే బరిలో నాగరాజు దిగారు. శనిగరం గ్రామానికి చెందిన హనుమంతరావు, నిర్మలాదేవి దంపతులకు ఉదరు నాగరాజు జన్మించారు. నాగరాజుకు చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉన్నారు. అలానే చదువుల్లో కూడా ఎప్పుడు ముందు ఉన్నారు. అలా కష్టపడే తత్వం ఉన్న నాగరాజు ఉదరు అంచెలంచలుగా ఎదిగారు.

బ్రిటన్‌లోనియూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. ఐ పాలసీ ల్యాబ్స్‌ అనే థింక్‌ట్యాంక్‌ను నాగరాజు స్థాపించారు. అంతర్జాతీయ వక్తగా, రైటర్ గా మంచి పేరు పొందారు. అక్కడ పొలిటికల్ అంశాలపై దశాబ్దకాలంగా ప్రచారం చేయడంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉదరు నాగ రాజు కూడా బ్రిటన్‌ పార్ల మెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 09:33

TS: రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచన. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న సీఎం

నిజందాగదుక్షణంఆగదు

May 17 2024, 09:26

AP:ప్రశాంత్‌ కిషోర్‌కు సీఎం జగన్‌ కౌంటర్‌,..

ప్రశాంత్‌ కిషోర్‌కు సీఎం జగన్‌ కౌంటర్‌, ప్రశాంత్‌ కిషోర్‌ చేసిందేమీ లేదు.. చేసేదంతా టీమే. ప్రశాంత్‌ కిషోర్‌ మనకు వ్యతిరేకంగా మారారు, ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదు.. ఈసారి వచ్చే ఫలితాలతో దేశం షాక్‌ కాబోతుంది, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించాం, ఐప్యాక్‌ సేవలను పరిపాలనలోనూ ఉపయోగించాం.. ఫలితాలతో దేశంలోని ప్రతీ నేత ఏపీ వైపే చూస్తారు.. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం-జగన్‌.

నిజందాగదుక్షణంఆగదు

May 16 2024, 17:12

మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

CM Revanth Reddy Warning: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మెట్రో అమ్ముకుంటే అమ్ముకో.. L&T కంపెనీపై రేవంత్ రెడ్డి కామెంట్స్

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలిచిన అంశం ఏదైనా ఉందంటే అది మెట్రో రైలుదే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ స్కీమ్ లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని వల్ల మెట్రో భారీగా నష్టపోతుందని ఇటీవల లార్సెన్ అండ్ టర్బో కంపెనీ ప్రకటించింది. మెట్రో రైళ్లను నడపడం తమ వల్ల కాదని పేర్కొంది. అయితే ఎల్ అండ్ టీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మే15) తన నివాసంలో మీడియాతో ఎల్ అండ్ టీ చేసిన వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ప్రారంభించాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్ జండర్స్ కి ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తామని హామీ ఇచ్చాం. కేవలం మెట్రో రైలు నష్టంతో ఈ పథకం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఎల్ అండ్ టీ నష్టాల గురించి గానీ లాభాల గురించి గానీ ఎలాంటి బాధ లేదని.. వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి వెళ్లినా తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. వాళ్ళని వెళ్తే వెళ్లనివ్వండి.. ప్రభుత్వం దానికి ప్రత్యమ్నాయ ఏర్పాటు చేసుకుంటుంది. ఒక కాంట్రాక్టర్ వెళ్లిపోతే ఇంకో కాంట్రాక్టర్ వస్తాడని అన్నారు. ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే..ఉచిత బస్సు ప్రయాణాలు మెట్రోపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. హైదరాబాద్ లో 2026 తర్వాత మెట్రో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం వల్ల మెట్రో రైల్ రైడర్ షిప్ పై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్, హూల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ అధికారి ఆర్ శంకర్ రామన్ అన్నారు. నష్టాలు భరిస్తూ ప్రాజెక్ట్ ని కొనసాగించడం కష్టం.. అందుకే మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయా సంస్థల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.. కార్పోరేట్ల ఇష్టాయిష్టాలపై మనం ఏం చెప్పలేం అన్నారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏం జరిగినా మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తాం.. మేం ప్రతి నెల టీఎస్ఆర్టీసీకి నిధులు రియంబర్స్ చేస్తున్నాం. ఉచిత బస్సు పథకం కారణంగా టీఎస్ఆర్టీసీ ని ఆర్థిక సంక్షోభంలో పడకుండా కాపాడుకునే బాధ్యత మాది అని అన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 15 2024, 09:41

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ లివర్లు సేఫ్....

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక మీ లివర్లు సేఫ్.. 

పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

మద్యం తాగడం హానికరమని ఆ మందు సీసాల మీదనే ఉంటుంది. అయినా గానీ మందుబాబులు పట్టించుకోరు. తెగ తాగుతా ఉంటారు. లివర్లు కొట్టేస్తాయన్న భయం కూడా ఉండదు. అయితే ఎంత తాగినా గానీ లివర్ కేమీ కాకుండా శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. మందుబాబులకు తమ లివర్ల గురించి బెంగ లేకపోయినా.. కుటుంబ సభ్యులకు ఉంటుంది కాబట్టి వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. మందు తాగినా కూడా లివర్ కి ఏమీ జరక్కుండా ఉండేలా ఒక జెల్ ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దీని మీద పరిశోధన మొదలుపెట్టారు. ఈ జెల్ ని ఎలుకల మీద ప్రయోగించారు.

కొన్ని ఎలుకలకు యాంటీ ఇన్ టాక్సికెంట్ జెల్ ని.. కొన్నిటికి నానో జెల్ ని ఇచ్చారు. కొన్ని ఎలుకలకు మాత్రం జెల్ ఇవ్వలేదు. అనంతరం అన్ని ఎలుకలకు ఒక డోస్ ఆల్కహాల్ పోశారు. జెల్ ఇవ్వని ఎలుకల రక్తంతో పోలిస్తే.. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలోనే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే జెల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ని తగ్గిస్తుందని వారి ప్రయోగంలో తేలింది. అంతేకాదు.. జెల్ తీసుకున్న ఎలుకల లివర్ మీద పెద్ద ప్రభావం కూడా పడలేదని గుర్తించారు. త్వరలోనే ఈ జెల్ ని మనుషుల మీద కూడా ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం కూడా ఫలిస్తే.. త్వరలోనే మందుబాబుల కోసం మార్కెట్లోకి ఈ జెల్ ని వదులుతామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

మందు తాగితే ఏమవుతుంది?:

మందు తాగిన తర్వాత అది కడుపు లోపల పేగుల్లో పై పొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలిసి ఆ తర్వాత లివర్ లో కలుస్తుంది. లివర్ లో హార్మోన్స్ జరిపే రసాయన చర్యల వల్ల మందు తొలుత హాని చేసే ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. ఆ వెంటనే ఎసిటిక్ యాసిడ్ గా మారుతుంది. దీని వల్ల శరీరానికి పెద్దగా హానికరం కాదు కానీ.. రసాయన చర్య అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ చర్య వల్ల శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ చాలా తక్కువ సమయంలోనే హాని చేయని ఎసిటిక్ యాసిడ్ గా మారుతుంది. అయినప్పటికీ ఈ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్ కు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఈ తక్కువ సమయంలో కనుక ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ కడుపులో పడితే ఈ రియాక్షన్ నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో కిక్ ఎక్కుతుంది. అదే టైంలో లివర్ తో పాటు శరీరంలో ఉన్న మిగతా అవయవాలు కూడా ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి.   

ఈ జెల్ ఎలా పని చేస్తుంది?:

అయితే ఆల్కహాల్ తీసుకునే ముందు నానో ప్రోటీన్స్ తో తయారైన ఈ నానో జెల్ ని తీసుకుంటే.. శరీరంలోని పేగుల లోపల ఒక పొరలా ఏర్పడుతుంది. ఈ జెల్ జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అదే సమయంలో ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఇది ఆల్కహాల్ ను రక్తం నుంచి లివర్ లో చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ గా ఏర్పడకముందే.. పేగుల్లో ఉండగానే దాన్ని మడత పెట్టేస్తుంది. అంటే ఆల్కహాల్ ని హాని చేయని ఎసిటిక్ యాసిడ్ గా మార్చేస్తుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఆల్కహాల్ రక్తంలో కలిసినా లివర్ పై పెద్దగా ప్రభావం చూపించదు. దీని వల్ల మందుబాబులకు కిక్ ఎక్కదు. లివర్ తో పాటు శరీరంలో మిగతా అవయవాలు కూడా సురక్షితంగా ఉంటాయి.  

ఈ జెల్ ని స్విట్జర్లాండ్ లోని జురిచ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇందులో గోల్డ్ నానో పార్టికల్స్, గ్లూకోజ్, వే ప్రోటీన్ నుంచి వచ్చే నానో ఫైబర్స్ ఉంటాయి. ఇవి ఐరన్ అణువులతో కప్పబడి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్ తో జరిగే రసాయన చర్యకు ఈ ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పని చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఉత్పత్తి చేస్తాయి. నిజానికి మందు తాగకపోవడమే మంచిది. కానీ మేము తాగకుండా ఉండలేము అనేవారికి మాత్రం ఈ జెల్ దివ్యౌషధంలా పని చేస్తుంది. మరి మందుబాబుల కోసం శాస్త్రవేత్తలు జెల్ ని కనిపెట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

నిజందాగదుక్షణంఆగదు

May 15 2024, 09:26

AP:చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

చిలకలూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. ఢీకొట్టాక చెలరేగిన మంటలు.. ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం.. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్, నలుగురు బస్సు ప్రయాణికులు సజీవదహనం.. 32 మందికి తీవ్ర గాయాలు..

బస్సు బయల్దేరినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఆందోళన.. బస్సును ఓవర్ స్పీడ్ తో నడిపారని పోలీసులకు సమాచారం.. స్పీడ్ గా వెళ్లవద్దని డ్రైవర్ ని కోరిన ప్రయాణికులు.. ప్రమాదంలో డ్రైవర్, పరారైన బస్సు క్లీనర్.. బస్సు క్లీనర్ ఆచూకీపై పోలీసుల ఆరా.. లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్సు చీరాలకు చెందినదిగా గుర్తింపు..

నిజందాగదుక్షణంఆగదు

May 15 2024, 09:12

ఏపీలో రికార్డు స్థాయి తుది పోలింగ్ శాతం... ఎంతంటే...

ఏపీలో తుది పోలింగ్‌ శాతం ప్రకటించిన ఈసీ

ఏపీలో రికార్డుస్థాయిలో 80.66 శాతం పోలింగ్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1.2 శాతం మేర నమోదు

మొత్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదు

నిజందాగదుక్షణంఆగదు

May 14 2024, 21:39

TS:రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: దేశంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు.. కాంగ్రెస్‌, బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళితే ఆ పార్టీ ఉండదు.. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం.. రుణమాఫీ, విద్యాశాఖపై ఫోకస్ పెడతాం.. అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం.. త్వరలో బ్యాంకర్లతో సమావేశం.. రుణమాఫీపై చర్యలు చేపడతాం.. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. -మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి.

నిజందాగదుక్షణంఆగదు

May 14 2024, 19:00

ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి.

నిజందాగదుక్షణంఆగదు

May 14 2024, 17:49

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు వాతావరణ శాఖ మరో మూడు రోజులు పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు.

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వాతవరణంలో భిన్నమైన మార్ఫులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓ వైపు భగ భగ మంటూ ఎండలు దంచికొడుతున్నాయి. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా వేళ.. గత వారం రోజుల నుంచి వాతవరణం చల్లబడింది. కాగా, పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పగటి పూట ఎండలు దంచికొడుతుంటే.. మరో వైపు సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు అనగా ఈనెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు.

అయితే ఆ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుందని.. మరి కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందన్నారు. అలాగే ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. కాగా, నేడు మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

ఇక బుధవారం మే 15వ తేదీన పై జిల్లాతోపాటు సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌ నగరంలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మాగ్జిమం 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు. మరి, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.