ఈనెల 6న మోత్కూరులో మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తేదీ 6-04-24 శనివారం ఉదయం 10 గంటలకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనం మోత్కూరు లో నిర్వహిస్తున్నామని ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య ఆన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఉగాదికి నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న మహనీయులకు ఉగాది పురస్కారాలను అందించాలని, ఈ క్రోధినామ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ఉగాది పురస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ భువనగిరి, గుర్రం కవిత లక్ష్మీ నరసింహారెడ్డి మోత్కూరు మున్సిపల్ చైర్మన్, మోత్కూరు నరహరి తెలుగు ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు, అభినయ శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ గేయ రచయిత అవార్డు గ్రహీత, ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి తదితరులు హాజరై ఉగాది పురస్కార గ్రహీతలకు పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
![]()



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి, నర్సయ్య గూడెం గ్రామాలలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వలిగొండ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఎమ్ జానీ , రవీందర్, పంచాయతీ సెక్రెటరీ నరేందర్ , ఏఈఓ సాయి, వెల్వర్తి మహిళా సంఘం సభ్యులు అధ్యక్షురాలు ఎడవెల్లి పోచమ్మ,సభ్యురాలు పల్లె వాణి, బూడిద శ్రీలత,కల్కూరి నరసింహ, నర్సాయిగూడెం మహిళా సంఘం సభ్యులు అధ్యక్షులు మాదాని రోజా, పసల రాణి, పసల శ్రీదేవి. సింగాని పర్వతమ్మ ,పసల బాల రవి పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వలిగొండ మండల అధ్యక్షులు బొల్ల సుదర్శన్ అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగలయ్యాగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన జిల్లా కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 6/4/ 2024 రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు అదే రోజు టిఫిన్ బైటెక్ లను బూతుల వారిగా నిర్వహించి విజయవంతం చేయాలని వారు కోరారు ,మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 45 రోజులపాటు ప్రతి బూతులలో ఇంటింటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరాలని వారు అన్నారు అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు స్వీకరించరో వారి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా నాయకులు సత్తయ్య గౌడ్ స్టేట్ కౌన్సిల్ మేంబర్ ఏలే చంద్రశేఖర్ ,ప్రధాన కార్యదర్శి లోడ లింగస్వామి,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానేష గౌడ్, దయ్యాల వెంకటేష్ ,గంగదారి దయాకర్, డోగుపర్తి సంతోష్, మంద నరసింహ ,అప్పిశెట్టి సంతోష్, కొంతం రామచంద్రం ,మందాడి రంజిత్ రెడ్డి , మందుల నాగరాజు ,సంతోష్,బర్ల మల్లేశం దంతురు అరుణ్ ఎల్లంకి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 6 న తుక్కుగూడ లో జరిగే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .ఘట్కేసర్ లోని ఔషాపూర్ పిపిఆర్ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సభ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం స్థాయి నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కి ప్రధమ జిల్లా కలెక్టర్ గా విశిష్ట సేవలను అందించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనిత రామచంద్రన్ ను సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ వేసవికాలం లో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకి మంచినీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి ప్రత్యేక అధికారులను నియమించారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అనిత రామచంద్రన్ ని నియమించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్వి గ్రహాలకి మాస్క్ వేయడం జరిగిందని ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకి తక్షణమే మాస్క్ తొలగించి అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని బుధవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇటికల దేవేందర్ మాదిగ ,కోళ్ల జహంగీర్, కుసంగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు
.
Apr 05 2024, 14:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
25.6k