సంక్షేమ పథకాలే గెలుపు అస్త్రాలు.. మీ సేవకుడిగా ఉంటా..ఆశీర్వదించండి.. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

సంక్షేమ పథకాలే గెలుపు అస్త్రాలు.. మీ సేవకుడిగా ఉంటా..ఆశీర్వదించండి.. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

◆ నియోజకవర్గ వ్యాప్తంగా సాగిన పర్యటన..గ్రామాల్లో నీరాజనం పలికిన ప్రజలు

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నమ్మకంతో అవకాశం కల్పించారని, రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని వీరాంజనేయులు అన్నారు.

పుట్లూరు మండలం ఏ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి, కడవకల్లు, సంజీవపురం, ఓబుళాపురం, దోసలేడు, చెర్లోపల్లి, నారాయణరెడ్డిపల్లి, చాలవేముల, మడ్డిపల్లి, కుమ్మనమల, కొండుగారికుంట, రంగమనాయునిపల్లి, రంగరాజుకుంట, మడుగుపల్లి, జంగంరెడ్డిపేట, ఎల్లుట్ల గ్రామాల్లో పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పర్యటించారు.

గ్రామాల్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరించారు. గ్రామాల్లో ప్రజలను ఆప్యాయంగా పకరిస్తూ, సంక్షేమ పథకాలు వివరించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న అవకాశం కల్పించారని, రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి, సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ప్రజలను కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. పేదలు, పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల యుద్ధంలో జగనన్న సంక్షేమ పథకాలే విజయానికి అస్త్రాలన్నారు. ప్రతి ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ అడ్డదారిలో అధికారంలోకి రావాలని కుటిల యత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు. రాజకీయాల్లో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబుకు జగనన్న భయం పట్టుకుంది కాబట్టే ఒంటరిగా పోటీ చేయడం చేతకాక కూటమి ఏర్పాటు చేసుకున్నారని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మంచి చేయాలని స్పృహ బాబు కు లేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అందించిన సంక్షేమ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చడంతోపాటు పేదలకు నేనున్నా..అన్న భరోసా కల్పించి వారి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, రంగాలకు పెద్దపీట వేశారన్నారు. జగనన్న చెప్పిందే చేస్తారని, చేయగలిగింది చెప్తారని స్పష్టం చేశారు. 

నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల పరిధిలోని ప్రతి గ్రామాల్లోని ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను, ప్రజలను పలకరించారు. ఆత్మీయ పలకరింపు పర్యటనను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పాలనకు ప్రజల పట్టం.. శింగనమలలో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

సంక్షేమ పాలనకు ప్రజల పట్టం.. శింగనమలలో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

పుట్లూరు మండలం తిమ్మాపురం, శనగలగూడూరు, గాండ్లపాడు, తక్కళ్ళపల్లి, పుట్లూరు, పి.చింతలపల్లి, గోపరాజుపల్లి, సి.వెంగన్నపల్లి, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, చింతకుంట కందికాపుల గ్రామాలలో నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ పర్యటించారు.

గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంతో ప్రజలు తమ అభిమానాన్ని ఊరూరా చాటుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అవ్వతాతలను, ప్రజలను ఆప్యాయంగా పలకరించి, రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇలాంటి గొప్ప పథకాలు అందుతాయని వివరించారు.

ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేసి మరోసారి వైస్సార్సీపీ జెండాను నియోజకవర్గంలో ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. జగనన్న పరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలని ఇంటింటికి వెళ్లి వారికి వివరించామన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుందన్నారు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడటంతో ప్రతిపక్ష పార్టీలు ఇళ్ల వద్దకు వచ్చి మోస మాటలు చెబుతారని, వారిని నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీలను ఓడించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు, పల్లె పల్లె అభివృద్ధితో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న జగనన్నని మళ్లీ గెలిపించుకుందామన్నారు.

శంకర్ నారాయణ మాట్లాడుతూ.. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యాన్ని అందించారని, 2024 లో వైఎస్ఆర్సిపి ఏ పార్టీలతో పొత్తు లేకుండా సింగల్ గా ఎన్నికలకు వెళ్లి 175 గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలి అంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

హాస్పిటల్ నందు చికత్స పొందుతున్న రాబిన్ శర్మ టీం లోని బాలు గారిని పరామర్శించిన శింగనమల నియోజకవర్గం

శింగనమల నియోజకవర్గంలోనీ ఆరోగ్యం సరిగా లేక ప్రవేట్ హాస్పిటల్ నందు చికత్స పొందుతున్న రాబిన్ శర్మ టీం లోని బాలు గారిని పరామర్శించిన శింగనమల నియోజకవర్గం (టీడీపీ-జనసేన -బీజేపీ) ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు*

రాజకీయ చరిత్రలో సంచలనాత్మకం సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఎం. వీరాంజనేయులు

సామాజిక సమీకరణలో భాగంగా.. శింగనమల మండలం సి. బండమీద పల్లి గ్రామానికి చెందిన యం. వీరాంజినేయులు(మాదిగ)ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్రకటించారు.

మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యం. వీరాంజనేయులను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పారు. వీరాంనేజియులుకు సహకరిస్తామని, అదేవిధంగా 2019 లో అత్యదిక మెజారిటీతో గెలిచిన విధంగా 2024 లో అదే మెజారిటీతో గెలిపించుకొని  జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తామని ఆమె అన్నారు.

జగనన్నకు రుణపడి ఉంటాము: యం. వీరాంజినేయులు

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా గొప్ప విషయమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వం విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానని వీరాంజనేయులు అన్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేస్తానన్నారు. 

నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

వైఎస్సార్సీపీకి గ్రామాల్లో అపూర్వ స్వాగతం..మంచి చేసిన జగనన్నను గెలిపించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

వైఎస్సార్సీపీకి గ్రామాల్లో అపూర్వ స్వాగతం..మంచి చేసిన జగనన్నను గెలిపించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లో ప్రజలు పార్టీకి అపూర్వ స్వాగతం పలుకుతున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు.

యల్లనూరు మండలం కూచివారిపల్లి, బొప్పేపల్లి, వాసాపురం, బుక్కాపురం, ఆరవేడు, కొడవండ్లపల్లి, చింతకాయమంద, గొడ్డుమర్రి, సింగవరం, ఎస్.కొత్తపల్లి, కల్లూరు, దుగ్గుపల్లి, వెంకటాంపల్లి, దంతలపల్లి, నిర్జంపల్లి గ్రామాల్లో  నాయకులతో కలసి పర్యటించారు.

వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మరోసారి జరగాలంటే వైఎస్ఆర్సిపి "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించామన్నారు. గత ప్రభుత్వాల హయంలో, ఇప్పుడు తమ కుటుంబాలకు జరిగిన మేలును ప్రజలు భేరీజు వేసుకోవాలన్నారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి టిడిపి రాగానే ఆ పార్టీ మేనిఫెస్టోను వెబ్ సైట్ లో నుంచి మాయం చేశారని, హామీలతో ప్రజలను వంచించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం మళ్లీ మాయమాటలతో వస్తున్నారని, ఈ పర్యాయం వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదలకు అండగా ఉన్న పథకాలతోనే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని నానాయాగీ చేసిన వాళ్లు ఇప్పుడు ప్రజలను కోటీశ్వరులను చేస్తామంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు.

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా గొప్ప విషయమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానన్నారు.

నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అభిమాన సంఘాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జగనన్న నెరవేర్చిన దశాబ్దాల కల.. ప్రజల చిరకాల స్వప్నం శింగనమల చెరువు లోకలైజేషన్.. ఈ చారిత్రక విజయానికి నిదర్శనం స్థూపం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్

జగనన్న నెరవేర్చిన దశాబ్దాల కల.. ప్రజల చిరకాల స్వప్నం శింగనమల చెరువు లోకలైజేషన్..  ఈ చారిత్రక విజయానికి నిదర్శనం స్థూపం  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

రాష్ట్రంలో అనేక ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు పరిపాలించినా శింగనమల చెరువు లోకలైజేషన్ చేసిన వారు లేరని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, నాలుగున్నర దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

శింగనమల రంగరాయల చెరువు లోకలైజేషన్ సాధించడంతో ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని మరువకొమ్మలో నియోజకవర్గ రైతులు ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఆమె ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...శింగనమల రంగరాయల చెరువు జిల్లాలోనే అతి పెద్దదన్నారు. ఈ చెరువులో నీరు ఉంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల అనేక గ్రామాల రైతన్నలు వ్యవసాయం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. గతంలో లోకలైజేషన్ అనే వాటిని రాజకీయ పార్టీలు 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశారన్నారు. ఒకానొక దశలో టిడిపి హయాంలో లోకలైజేషన్ జీవో తెచ్చామని ప్రచారం చేసుకున్నారన్నారు. ప్రజలు వారిమాటలు నమ్మలేదన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నాలుగేళ్ల పాటు శింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి. నార్పల బహిరంగ సభలో లోకలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన అకాల మరణంతో హామీ నెరవేరలేదన్నారు. కనీసం నీరు విడిపించే దిక్కు లేకుండా పోయిందన్నారు

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించే విధంగా జీవో తీసుకురావడం జరిగిందన్నారు. శింగనమల ప్రజల చిరకాల కోరిక లోకలైజేషన్ చేసి నెరవేర్చారన్నారు. 

ఈ చెరువుకు ప్రతి ఏటా ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో హంద్రీ-నీవా కాలువ ద్వారా పీఏబీఆర్, అటు నుంచి మిడ్ పెన్నార్ అక్కడి నుంచి దక్షిణ కాలువ ద్వారా శింగమల చెరువుకు నీళ్లు రానున్నాయి. చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీ. నీరు వదిలితే ఏటా పంటలు పండుతాయన్నారు. ఈ లోకలైజేషన్ చేయడం ద్వారా చెరువులో నీరు ఉంటే 300 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో ఆధారం లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, మత్స్యకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వివాహానికి 10000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..

శింగనమల మండలం ఆనందరావుపేట గ్రామంలో నివాసంఉంటున్న శ్రీమతి నారాయణమ్మ జయరాం కుమారుడు హనుమంతు   వివాహానికి ₹10000 ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాసరి గంగాధర్ మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ టియన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యనిర్వహకార్యదర్శి బండి పరుశురాం యస్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాకే అనీల్ శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున బెస్త సాధికార కమిటీ పార్లమెంట్ అధ్యక్షులు బెస్త‌‌‌ అమర్ నాథ్ తెలుగు యువత మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్ ప్రసాద్ నాయక్ శీనాయక్ నరసింహ నాయక్ దండు ప్రకాష్ సతీష్ రాయల్ జంఘంశేట్టినవీన్ రామదాసు సురేష్ మెండెం చిన్న ఎర్రిస్వామి తదితరులు  పాల్గొన్నారు.

జగనన్నను గెలిపిద్దాం.. సంక్షేమాన్ని కాపాడుదాం.. సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నను గెలిపించుకొని ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలను కాపాడుకుందామని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

యల్లనూరు మండలం వేములపల్లి, మేడికుర్తి, నిట్టూరు, పెద్ద మల్లేపల్లి, పీఎం.కొండాపురం, తిరుమలాపురం, అచ్యుతాపురం, చిలమకూరు, కోడుమూర్తి, యల్లనూరు, జంగంపల్లి, పాతపల్లి, వెన్నపూసపల్లి, గడ్డంవారిపల్లి, లింగారెడ్డిపల్లి, మల్లాగుండ్ల, గ్రామాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా ప్రకరిస్తూ వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు నాయుడు గతంలో అబద్ధపు హామీలతో మోసం చేసినట్టు ఇప్పుడు కూడా అదే విధంగా చేయటానికి వస్తున్నారని అలాంటి వారికి ఓటు వేస్తే ప్రస్తుతం జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని వారికి తెలియజేశారు. ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందాలి అంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పాలన జరుగుతుందన్నారు. ఈ పాలనను చూసి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదని గ్రహించి పొత్తులతో ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమం అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు నీరాజనం పలుకుతూ జగనన్నే మళ్లీ కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని గుర్తు చేశారు.

గ్రామాల్లో గతంలో పింఛన్లు తీసుకోవాలంటే పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడే వాళ్ళమని, తమ మనవడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తెల్లవారుజామునే వాలంటీర్లతో పింఛన్ అందజేస్తున్నారని మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నాడు - నేడు ద్వారా పాఠశాల రూపురేఖ మార్చి పేదవాడికి ఉన్నత విద్యను అందిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజలందరి ఆశీర్వాదంతో జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, అభిమాన సంఘాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విపక్షాలన్నీ ఏకమైనా జగనన్నను ఓడించలేవు.. ఓటమి భయంతో టీడీపీ పొత్తులు..శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజి నేయులు..

విపక్షాలన్నీ ఏకమైనా జగనన్నను ఓడించలేవు.. ఓటమి భయంతో టీడీపీ పొత్తులు..

◆ సంక్షేమ పథకాల లబ్ధితో ప్రజలు నిరాజనం

శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజి నేయులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందనే, ఓటమి భయంతో టిడిపి పొత్తులతో వస్తోందని ఎం వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండలం దుర్గం, సిద్దరాచెర్ల, బోయకొట్టాల, గొల్లపల్లి, బండ్లపల్లి, మాలవాండ్లపల్లి, బొమ్మకుంటపల్లి, పప్పూరు, మంగపట్నం, సోదనపల్లి, గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి, గంగనపల్లి, ముచుకుంటపల్లి, గూగూడు, నడింపల్లి గ్రామాలలో వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

ముందుగా స్థానికులు స్వాగతం పలిచారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలను అబద్ధపు హామీలతో టీడీపీ పొత్తులతో మోసం చేయటానికి వస్తోందని నమ్మొద్దని తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వపు సంక్షేమ పాలన మళ్ళీ కావాలి అంటే "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. 2014 లో అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదన్నారు. అదే కోవలో 2024 లో నెరవేర్చలేని హామీలతో ప్రజలని మోసం చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై మోసం చేయడానికి వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు చెప్పని హామీలను కూడా చేసి చూపించిన ఘనత దక్కుతుందన్నారు. గ్రామాల్లో వెళ్ళినప్పుడు జగనన్న పాలన ఏవిధంగా ఉందో ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే అర్థమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

గ్రామ సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం సాకారం

సచివాలయ వ్యవస్థతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని ఎం. వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండలం హెచ్. సోదనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల నూతన భవనాలను మరియు పి. బండమీదపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రజా ప్రతినిధులు వైయస్సార్సీపి నాయకులు అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.

వారు మాట్లాడుతూ.. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికే చేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నలకు పాలన మరింత దగ్గర చేశారన్నారు. విలేజ్ క్లినికల్ ద్వారా గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే వైద్యాన్ని అందించారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ దాసరి సునీత..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు.          పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పిల్లలతో ముచ్చటించి పరీక్షల్లో తీసుకోవలసిన మెలకుల గురించి విద్యార్థులతో ఆమె మాట్లాడారు అలాగే 10వ తరగతి విద్యార్థులకు పెన్నులను సరఫరా చేశారు పిల్లలకు వడ్డించే భోజనాలను తనిఖీ చేశారు పిల్లలు ఉపాధ్యాయులు చెప్పే మెలకువలను పాటించి ధైర్యంగా పరీక్షలు రాసి మన జగనన్నకు మంచి పేరు తేవాలని అలాగే పాఠశాలకు మంచిర్యాంకు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నాగవేణి గారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు