జగనన్నను గెలిపిద్దాం.. సంక్షేమాన్ని కాపాడుదాం.. సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
![]()
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నను గెలిపించుకొని ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలను కాపాడుకుందామని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
యల్లనూరు మండలం వేములపల్లి, మేడికుర్తి, నిట్టూరు, పెద్ద మల్లేపల్లి, పీఎం.కొండాపురం, తిరుమలాపురం, అచ్యుతాపురం, చిలమకూరు, కోడుమూర్తి, యల్లనూరు, జంగంపల్లి, పాతపల్లి, వెన్నపూసపల్లి, గడ్డంవారిపల్లి, లింగారెడ్డిపల్లి, మల్లాగుండ్ల, గ్రామాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.
గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా ప్రకరిస్తూ వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు నాయుడు గతంలో అబద్ధపు హామీలతో మోసం చేసినట్టు ఇప్పుడు కూడా అదే విధంగా చేయటానికి వస్తున్నారని అలాంటి వారికి ఓటు వేస్తే ప్రస్తుతం జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని వారికి తెలియజేశారు. ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందాలి అంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పాలన జరుగుతుందన్నారు. ఈ పాలనను చూసి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదని గ్రహించి పొత్తులతో ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమం అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు నీరాజనం పలుకుతూ జగనన్నే మళ్లీ కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని గుర్తు చేశారు.
గ్రామాల్లో గతంలో పింఛన్లు తీసుకోవాలంటే పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడే వాళ్ళమని, తమ మనవడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక తెల్లవారుజామునే వాలంటీర్లతో పింఛన్ అందజేస్తున్నారని మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నాడు - నేడు ద్వారా పాఠశాల రూపురేఖ మార్చి పేదవాడికి ఉన్నత విద్యను అందిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజలందరి ఆశీర్వాదంతో జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, అభిమాన సంఘాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mar 16 2024, 08:46