సంక్షేమ పాలన కోసం.. జగనన్నను గెలిపించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
సంక్షేమ పాలన కోసం.. జగనన్నను గెలిపించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో, మరియు జమ్ములదిన్నె, జమ్ములదిన్నె కొట్టాలు,ఓబుళాపురం గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
గడపగడపకు వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి ఆరా తీశారు. అవ్వా,తాతలను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కావాలంటే వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... పేద ప్రజలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైస్సార్సీపీ పార్టీని స్థాపించారన్నారు. ప్రజలకు జగనన్న చేస్తున్న మేలును మరచి పోలేనిదన్నారు. వైఎస్సార్సీపీ ని ఓడించాడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తున్నాడన్నారు. సీఎం జగనన్నకు ప్రజల అండ ఉన్నంత వరకు ఏమి చేయలేన్నారు. జగనన్న మేలు మరువద్దని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి గా ఆయన్నే చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Mar 10 2024, 19:29