సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలి.. రాబోయే రోజుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..

సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలి..

రాబోయే రోజుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..

సార్వత్రిక ఎన్నికలు - 2024పై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ

అనంతపురం, మార్చి 06 :

సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సార్వత్రిక ఎన్నికలు - 2024పై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. ఎన్నికల కోడ్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని, రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను పాటించేలా మీడియా ప్రధాన భూమిక వహించాలన్నారు. ఎన్నికల్లో జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారికి, మీడియాకు మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సన్నద్ధత, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, అప్డేట్స్, జిల్లా జరిగే పలు విషయాలు, ఇతర అంశాలపై సమాచారం అందించాలన్నారు. ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం తెలియజేయడంలో మీడియా ప్రధానంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో మీడియా పాత్రపై అన్ని రకాల అంశాలను తెలియజేయడం కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పెయిడ్ న్యూస్ కి సంబంధించి ఎన్నికల కమీషన్ నుంచి కొన్ని సూచనలు ఉన్నాయని, ఇందుకోసం ఎంసిఎంసి (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) ఉంటుందని, నోడల్ అధికారి ఉంటారని, కమిటీ సర్టిఫికేషన్ జరిగిన అనంతరం నిర్ణయించిన డిఐపిఆర్ఓ రేట్స్ కు అనుగుణంగా పెయిడ్ న్యూస్ ప్రచురించాలన్నారు. ఎంసిఎంసికి ఎన్నికల్లో అధికారులకు, నాయకులకు సమాచారం కోసం మీడియా ముఖ్యమైన వారన్నారు. ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో మీడియా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. సోషల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏ చిన్న విషయమైనా ఓటర్లకు వెంటనే చేరువ అవుతుందని, ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు ఫ్యాక్ట్ చెక్ సరిచూసుకొని ప్రచురించాలని సూచించారు. ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ కాకుండా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు. రాజకీయ ప్రకటనలు, సోషల్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లు, సినిమా హాల్లో ప్రకటనలు, ఈ పేపర్లు, రేడియోలలో ముందుగా ఎంసిఎంసి ద్వారా సర్టిఫై అయిన తర్వాతనే ప్రచురించాలన్నారు. ఎన్నికల కమీషన్ గైడ్లైన్స్ ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

ఈ సందర్భంగా ఎంసిఎంసి అండ్ పెయిడ్ న్యూస్, ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ యాడ్స్ ఎక్స్పెన్స్, మీడియా & ఎలెక్షన్స్ పర్సెప్షన్ మేనేజ్మెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీడియా సెల్, సాధారణ నిబంధనలు, కమ్యూనికేషన్ స్ట్రాటజీ, తదితర అన్ని రకాల అంశాలపై హ్యాండ్లూమ్స్ అభివృద్ధి అధికారి బసవరాజు శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా.. అలం నరసానాయుడు...నియామకం..

శింగనమల నియోజకవర్గం, మరియు రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్ట పడుతున్న అలం నరసానాయుడు గారిని పార్టీ అధిష్టానం గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలం అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 30 సంవత్సరాలు పైగా అలం నరసానాయుడు గారు 

టిడిపి 

మండల పార్టీ అధ్యక్షుని గా, జిల్లా పార్టీ కార్యదర్శి గా 2 సంవత్సరాలు,జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి గా 2 సంవత్సరాలు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా 4 సంవత్సరాలు ,జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా 4 సంవత్సరాలు, అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 3 సంవత్సరాలు,రాష్ట్ర కార్యదర్శి గా 8 సంవత్సరాలుగా, శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులుగా 3 సంవత్సరాలుగా కొనసాగుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కడప, కర్నూల్, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకునిగా పార్టీ కోసం నిత్యం శ్రమిస్తున్న విషయాన్ని గుర్తించి అలాగే గత పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం కోసం చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా శ్రమించిన తీరును మరియు నియోజకవర్గంలోని సర్పంచుల ఉప ఎన్నికల్లో కష్టపడిన తీరును గుర్తించి ఇలా ఎన్నో విషయాలను పరిగణములోకి తీసుకొని ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు విషయాన్ని తెలుసుకున్న శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు హర్షాని వ్యక్తం చేస్తున్నారు,

 అలాగే ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా నియమించినందుకు మరింత బాధ్యతతో పార్టీ అభివృద్ధికి నిత్యం కష్టపడుతూ 2024 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేయడమే ధ్యేయంగా పని చేస్తానని అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కోవెలమూడి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసారు,

కలసికట్టుగా పని చేద్దాం.. వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

◆ కలసికట్టుగా పని చేద్దాం.. వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం.

◆ సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసి.. విశ్వసనీయత చాటుకున్న పార్టీ మనది.

◆ కుల, మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాం.

◆ చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది శూన్యం.

◆ ' మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం' లో దిశానిర్దేశం.

◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.

● అందరం కలిసి.. శింగనమల సెంటిమెంట్ ను నిలబెడుదాం.

◆ శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

◆ పాల్గొన్న పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎం. శంకర్ నారాయణ.

వివక్షకు తావులేకుండా దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ, ఎప్పుడు ఎన్నడూ చేయని విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించిన జగన్మోహన్ రెడ్డిని, మరో 30 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కలసికట్టుగా పని చేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని సాంబ శివారెడ్డి పిలుపునిచ్చారు.

బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో 'మేము సిద్ధం..మా బూత్ సిద్ధం' కార్యక్రమంలో భాగంగా బూత్ ప్రెసిడెంట్స్ తో సాంబ శివారెడ్డి, శంకర్ నారాయణ, వీరాంజనేయులు సమావేశం నిర్వహించారు.

బూత్ లను ఎలా సిద్ధం చేయాలి, బలోపేతం చేయడానికి విధులు, మరియు బాధ్యతలపై, బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లిన ఏ ఇంటికి వెళ్లి అడిగినా జగనన్న అందించిన సంక్షేమమే కనిపిస్తుందన్నారు. విశ్వసనీయతతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత దేశ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న విశ్వసనీయతతో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసారని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చన్నారు. 

2014 లో చంద్రబాబు 650 పేజీలతో మేనిఫెస్టో తెచ్చి  అందరిని మోసగించారన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి వారి వర్గానికి మాత్రమే ఆదాయాన్ని సమకూర్చి ప్రజలను మోసం చేశారన్నారు. తప్పుడు వాగ్దానాల వలలో పడోద్దని 2014లో ఏ విధంగా నమ్మించి మోసం చేశాడో, అదేవిధంగా ఈసారి కూడా మోసం చేస్తాడని ప్రతి కుటుంబం సభ్యులకు వివరించాలన్నారు.

చంద్రబాబు నేతృత్వంలోని పెత్తందార్ల కూటమిని నమ్మవద్దని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను ఎన్నుకోవాలని పిల్లల భవిష్యత్తు కోసం జగనన్నను మాత్రమే నమ్మాలనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కరోనా కష్టకాలంలో జగనన్న ప్రజలకు చేసిన మేలును ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యణ్ రాష్ట్రంలో కనిపించలేదన్నారు. 

బూత్ ప్రెసిడెంట్ మరియు బూత్ కోర్ కమిటీ సభ్యులు తమ బూతు పరిధిలోని వాలంటీర్లు మరియు గృహ సారథులతో కలిసి కనీసం 60 శాతం ఓట్లు వైసీపీకి పడేలా వ్యూహాన్ని రూపొందించాలన్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాల మేలుని మరోసారి లబ్ధిదారులకు గుర్తు చేయాలన్నారు.

2019 లో వైస్సార్సీపీ మేనిఫెస్టో లో అమలుపర్చిన హామీలన్నీ 100 శాతం నెరవేర్చామన్నారు. జగనన్న పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. రానున్న ఎన్నికలకు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం సిద్ధం అవ్వాలని కోరారు. మరింత సంక్షేమం అభివృద్ధి జరగాలంటే జరగబోయే ఎన్నికలలో జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ ప్రెసిడెంట్స్, బూత్ వైస్ ప్రెసిడెంట్స్, తదితరులు పాల్గొన్నారు.

ఆదరించండి మరింత అభివృద్ధి చేసి చూపుతాం..శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు...

ఆదరించండి మరింత అభివృద్ధి చేసి చూపుతాం..శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపుతామని నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు తెలిపారు.

గార్లదిన్నె మండలం ఇల్లూరు, కేశవాపురం, కొప్పలకొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు.

ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాల ద్వారా చేసిన లబ్దిని కుటుంబాలకు వివరిస్తూ, ఇలాంటి గొప్ప సంక్షేమం మళ్లీ మనకు రావాలి అంటే వైఎస్సార్సీపీ 'ఫ్యాన్' గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పాలన సాగుతోందన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మిస్తే, నేడు ముఖ్యమంత్రి వైయస్ జగనన్న వాటిని కళ్ళముందు నిర్మించి చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అవి టిడిపి, జనసేన పార్టీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారన్నారు. గత టిడిపి పాలనలో అవినీతి ఎక్కువ అభివృద్ధి శూన్యం అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గత టిడిపి ప్రభుత్వంలో చేసిన అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా రాబోయే ఎన్నికలలో జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థి ఎం. వీరాంజనేయులును గెలిపించుకుందాం..రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు మేలు.

-ముఖ్యమంత్రి జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థి ఎం. వీరాంజనేయులును గెలిపించుకుందాం.

-ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉందాం.

◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.

-కలసికట్టుగా పార్టీ కోసం పని చేద్దాం.. జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.

◆ శింగనమల వైస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

ప్రతి గడపకు మేలు చేస్తున్న సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

నార్పల మండల కేంద్రంలోని కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ఆలూరు సాంబ శివారెడ్డి.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కుల వృత్తులకు జగనన్న  ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వారి వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

పార్టీలకతీతంగా ప్రజలు ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ఎన్నికల గుర్తు 'ఫ్యాన్' పేద ప్రజల గుండెచప్పుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ పార్టీ తరుపున వీరాంజనేయులును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

 వీరాంజనేయులు మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలువాలన్న లక్ష్యంతో జగనన్న అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి మరింత ఎక్కువ జరగాలంటే  జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమాలను మరింత దగ్గర చేయడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలలో మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీ తోనే సాధ్యం.. సింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీ తోనే సాధ్యం.. సింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..

రాష్ట్రంలో వైస్సార్సీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..సీఎం జగనన్న పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి అందించారని అందుకే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలతోపాటు చెప్పనివి కూడా చేసి చూపించారన్నారు. చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో నెరవేర్చాడా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ పథకాలు అందాలంటే గతంలో అధికారుల చుట్టూ తిరిగేవారన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక ఇంటి దగ్గరికే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రాబోయే ఎన్నికలలో ప్రజలు వైఎస్సార్సీపీ కి ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్నను మరోసారి చేసి వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

పేదల సొంతింటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల తీర్చడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.

జగనన్న రిజిస్ట్రేషన్‌ చేయించిన ఇంటి స్థలం హక్కు పత్రాలను  స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి వారు లబ్ధిదారులకు అందజేశారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ పథకం ద్వారా పేదలకు సొంతిళ్లు ఉండాలనే అభిలాషతో ప్రతి పేద కుటుంబానికి ఒకటిన్నర సెంటు భూమిని ఉచితంగా ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించిందన్నారు. 

మండల వ్యాప్తంగా సుమారు 1,855 మందికి స్థలాలు ఇవ్వగా, వాటిలో ప్రస్తుతం1,159 మందికి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. ఈ పత్రాలు శాశ్వత భూహక్కు పత్రాలుగా చెలామణి అవుతాయన్నారు. ఈ హక్కు పత్రాలపై బ్యాంకు రుణాలు పొందవచ్చునని లేదా విక్రయించుకోవచ్చన్నారు. దీనిపై లబ్ధిదారునికి పూర్తి హక్కును కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతుందన్నారు.

పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ మోసం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు వస్తున్నాడని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామన్నారు. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులును మీరందరూ ఆశీర్వదించి మరోసారి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు జగనన్న ఆర్థిక చేయూత: ఆలూరు సాంబ శివారెడ్డి..

బాధిత కుటుంబాలకు జగనన్న ఆర్థిక చేయూత: ఆలూరు సాంబ శివారెడ్డి..

ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

బాధిత కుటుంబాలు, వారి ఆర్థిక సమస్యలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకురావటంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 17 కుటుంబాలకు రూ.25.31 లక్షలు మంజూరు చేయించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబ శివారెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

దుర్గం గ్రామం అంగనవాడి సెంటర్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ సాకే రామాంజనేయులు..

నార్పం మండలం శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం  అంగనవాడి సెంటర్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ సాకే రామాంజనేయులు పాల్గొని పలుగుపిల్లలకి పోలియో చుక్కల మందును వేయడం జరిగినది

 ఈ సందర్బంగా సర్పంచు రామాంజినేయులు మాట్లాడుతు తమపిల్లలు ఆరోగ్యంగా ఉన్న ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది

  పుట్టిన పిల్లలనుండి5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు పోలియో రాకుండా నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమం దేశంవ్యాప్తంగాచెపట్టడం జరిగిందని అన్ని ఆసుపత్రులలోను బస్సుస్టేషన్లలోను రైల్వే స్టేషన్లలోను వేయ్యబడతాయి అందులో భాగంగా ఆదివారం అందరు పోలియో చుక్కలు వారి పిల్లలకు తప్పకుండా పిల్లలందరికి వారి తల్లులు నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించి పిల్లలకు పోలియో రాకుండ నివారించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్ కురవ ఉజ్జినప్ప వైద్యసిబ్బంది అమృతాంజలి .శివకూమార్ MLHP పరిదాబానుఏఎన్ఎం , అంగన్ వాడి టిచర్లు బాలమ్మ సువర్ణ.తృనిత రాధ లు ఆయాలు సాకేపెద్దక్క గంగమ్మ దేవక్క ఆశావర్కర్లు వీరణారాయణమ్మ అంజలి సునిత గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలి చుక్కలు వేస్తున్న ఎంపీపీ దాసరి సునీత ..

బుక్కరాయసముద్రం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల యందు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలి చుక్కలు వేస్తున్న ఎంపీపీ దాసరి సునీత గారు ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి దామోదరమ్మ గారు సి హెచ్ ఓ గారు ఏఎన్ఎంలు అంగన్వాడి కార్యకర్తలు వైసిపి నాయకులు బుల్లెట్ నారాయణస్వామి గారు పాల్గొన్నారు బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలోనూ అంగన్వాడి కేంద్రాలలోనూ మరియు పంచాయతీ ఆఫీసుల దగ్గర పల్స్ పోలియో చుక్కలు నిర్వహించడం జరిగింది 4213 మంది పిల్లలకు గాను 4176 పిల్లలకు పల్స్ పోలియో చుక్కలం వేయడం జరిగింది 99.12% శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది మిగతా పిల్లలకు రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వైద్యాధికారిని తెలియజేశారు