ఆదరించండి మరింత అభివృద్ధి చేసి చూపుతాం..శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు...
ఆదరించండి మరింత అభివృద్ధి చేసి చూపుతాం..శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపుతామని నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు తెలిపారు.
గార్లదిన్నె మండలం ఇల్లూరు, కేశవాపురం, కొప్పలకొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాల ద్వారా చేసిన లబ్దిని కుటుంబాలకు వివరిస్తూ, ఇలాంటి గొప్ప సంక్షేమం మళ్లీ మనకు రావాలి అంటే వైఎస్సార్సీపీ 'ఫ్యాన్' గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పాలన సాగుతోందన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో గ్రాఫిక్స్ తో రాజధాని నిర్మిస్తే, నేడు ముఖ్యమంత్రి వైయస్ జగనన్న వాటిని కళ్ళముందు నిర్మించి చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అవి టిడిపి, జనసేన పార్టీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేపట్టారన్నారు. గత టిడిపి పాలనలో అవినీతి ఎక్కువ అభివృద్ధి శూన్యం అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గత టిడిపి ప్రభుత్వంలో చేసిన అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా రాబోయే ఎన్నికలలో జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Mar 06 2024, 19:33