ముఖ్యమంత్రి జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థి ఎం. వీరాంజనేయులును గెలిపించుకుందాం..రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు మేలు.
-ముఖ్యమంత్రి జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థి ఎం. వీరాంజనేయులును గెలిపించుకుందాం.
-ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉందాం.
◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.
-కలసికట్టుగా పార్టీ కోసం పని చేద్దాం.. జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.
◆ శింగనమల వైస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
ప్రతి గడపకు మేలు చేస్తున్న సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
నార్పల మండల కేంద్రంలోని కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఆలూరు సాంబ శివారెడ్డి.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కుల వృత్తులకు జగనన్న ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వారి వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
పార్టీలకతీతంగా ప్రజలు ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ఎన్నికల గుర్తు 'ఫ్యాన్' పేద ప్రజల గుండెచప్పుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ పార్టీ తరుపున వీరాంజనేయులును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలువాలన్న లక్ష్యంతో జగనన్న అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి మరింత ఎక్కువ జరగాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమాలను మరింత దగ్గర చేయడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలలో మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Mar 05 2024, 20:12