పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలి చుక్కలు వేస్తున్న ఎంపీపీ దాసరి సునీత ..

బుక్కరాయసముద్రం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల యందు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలి చుక్కలు వేస్తున్న ఎంపీపీ దాసరి సునీత గారు ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి దామోదరమ్మ గారు సి హెచ్ ఓ గారు ఏఎన్ఎంలు అంగన్వాడి కార్యకర్తలు వైసిపి నాయకులు బుల్లెట్ నారాయణస్వామి గారు పాల్గొన్నారు బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలోనూ అంగన్వాడి కేంద్రాలలోనూ మరియు పంచాయతీ ఆఫీసుల దగ్గర పల్స్ పోలియో చుక్కలు నిర్వహించడం జరిగింది 4213 మంది పిల్లలకు గాను 4176 పిల్లలకు పల్స్ పోలియో చుక్కలం వేయడం జరిగింది 99.12% శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది మిగతా పిల్లలకు రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వైద్యాధికారిని తెలియజేశారు

రైతులను ప్రోత్సహించడానికి రాతి దూలం పోటీలు.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి...

రైతులను ప్రోత్సహించడానికి రాతి దూలం పోటీలు.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.

గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం పామిడి పెన్నానది సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ క్షేత్రపాల కొండ శింగరప్ప స్వామి తిరుణాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త ఎం. వీరాంజనేయులు స్వామి వారిని దర్శించుకున్నారు.

గ్రామస్తుల ఆధ్వర్యంలో రాతి దూలం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులను ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల రాతి దూలం పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు.

గతంలో కల్లూరు నుంచి కొండపై కొలువైన సింగరప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించి నూతనంగా తారురోడ్డు నిర్మించారన్నారు.

కొండపైకి రోడ్డు నిర్మించడంతో గ్రామస్తులు భక్తులు ఎమ్మెల్యే దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ జెడ్పి సీఈవో శ్రీమతి వైఖోమ్ నిదియ దేవి..

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ జెడ్పి సీఈవో  శ్రీమతి వైఖోమ్ నిదియ దేవి గారు, చెదుళ్ల గ్రామపంచాయతీలో ప్రారంభించడం జరిగింది, అలాగే బుక్కరాయసముద్రం ఎంపీపీ స్కూల్ దగ్గర మండల ప్రజా పరిషత్ చైర్మన్ దాసరి సునీత గారు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, అలాగే బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీ నందు ఉన్న అంగన్వాడి సెంటర్ నందు గ్రామ సర్పంచ్ కుమారి పార్వతి గారు ప్రారంభించడం జరిగింది, ఈ పల్స్ పోలియో సందర్భంగా మొబైల్ టీం సెంట్రల్ యూనివర్సిటీలో నూతన బిల్డింగ్ నిర్మాణ కార్యక్రమం కొరకు వచ్చిన కార్మికుల పిల్లలకు వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది, అలాగే మకరసముద్రం గాంధీనగర్ అంగన్వాడి సెంటర్ నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మన్నేరు కొండమ్మ గారు ప్రారంభించడం జరిగింది , ప్రాథమిక ఆరోగ్యక కేంద్ర పార్టీలో ఉన్న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు హెల్త్ విన్న సెంటర్ ల నందు ప్రజాప్రతినిధులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది

ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల విరాళం..

శింగనమల నియోజకవర్గం

ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల విరాళం..

 

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి శ్రీమతి ముంటిమడుగు కాంతమ్మ & కీర్తి శేషులు ముంటిమడుగు ఎల్లారెడ్డి కుమారులు ముంటిమడుగు శ్రీకాంత్ రెడ్డి, ముంటిమడుగు కేశవరెడ్డి, ముంటిమడుగు శ్రీనివాస్ రెడ్డి అక్షరాల 111116 లక్ష పదకొండువేల నూట పదహారు రూపాయలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో కేశవాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు శ్రీరాములు, సువర్ణమ్మ, జన్నె కృష్ణయ్య ,సద్దల నాగరాజు, మాజీ సర్పంచ్ నల్లప్ప, హరిజన నాగన్న, బందెల నాగరాజు, దాసరి వెంకటేశు, సద్దల వెంకటరాముడు, జన్నే పెద్ద అది నారాయణ, మందమీద సుబ్బన్న, క్లస్టర్ ఇంచార్జ్ అంజి, తదితరులు పాల్గొన్నారు.

హలో వికలాంగ్ చలో అమరావతి మార్చ్ 9న తరలిరండి.. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు

హలో వికలాంగ్ చలో అమరావతి మార్చ్ 9న తరలిరండి.. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు పిలుపు

ఈరోజూ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రము మండల కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు ఈనెల9న మన రాష్ట్రంలోని వికలాంగుల సమస్యలపై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఆవరణ దగ్గర వికలాంగుల మహాగర్జన చేయాలని సంకల్పించిన మందకృష్ణ మాదిగ వికలాంగుల డిమాండ్లను ఈరాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల అందరి కోసం జరుగుతున్నటువంటి ఈ మహాసంగ్రామానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది వికలాంగులు పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు కొండన్న నారాయణ మల్లేష్ కాసెప్ప నాగేష్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు

తరిమెల ప్రజల కల సాకారం అందించిన జగనన్న తరిమెల వద్ద పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి.. ప్రారంభించిన ఆలూరు సాంబశివారెడ్డి, సమన్వయకర్త వీరాంజన

తరిమెల ప్రజల కల సాకారం అందించిన జగనన్న

తరిమెల వద్ద పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి 

◆ రాకపోకలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.

◆ పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, పెనుగొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎం. శంకర్ నారాయణ, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పైలా నరసింహయ్య.

గ్రామ ప్రజల సమక్షంలో వీరంతా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

పాదయాత్ర సమయంలో తరిమెల, చిట్టూరు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని సాంబ శివారెడ్డి, శంకర్ నారాయణ, వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలం తరిమెల గ్రామంలో తరిమెల నుంచి చిట్టూరు గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన బ్రిడ్జిను వారు ప్రారంభించారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ..పాదయాత్ర సమయంలో రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారన్నారు. వర్షాకాలంలో నదిలోంచి నడుచుకుంటూ అవతలికి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేశారన్నారు. జగనన్న సీఎం అయ్యాక ఉన్నతాధికారులతో మాట్లాడి పెన్నా నదిపై లో లెవెల్ పైపు కల్వర్టు నిర్మించడానికి చర్యలు చేపట్టారన్నారు. ఇందుకు ఎంపీ నిధులను దాదాపు రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయి వినియోగంలోకి రావడంతో శింగనమల, పెద్దవడుగూరు మండలాల ప్రజల రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ప్రజల కష్టాలను తీర్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. 

తరిమెల గ్రామ ప్రజల కష్టాలను గుర్తించి, బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారిపేట గ్రామంలో ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ వెలుగు సీసీలు వెలుగు సంఘాలతో కార్యక్రమం

బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేట గ్రామం నందు ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ మేడం ఉమా మహేశ్వరి హాజరై గ్రామ ప్రజలతో ప్రధానమంత్రి బీమా యోజన పథకం గురించి ఏటీఎం లేని వాళ్ళకి కల్పించడం చెప్పడం జరిగినది అదేవిధంగా పాలవెల్లు డైరీ గురించి ప్రజలకు ఎంత రేటు వస్తుంది బయట ఎంత రేటు వస్తుంది అని వివరముగా తెలియ చెప్పడం జరిగినది అదేవిధంగా మహిళా రైతు సంఘాలు గురించి ఐదు ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్క మహిళ రైతు మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వారికి కావలసిన సదుపాయాలు వస్తాయని వివరించడం జరిగింది అధికారులు ఈవో ఆర్డీవో మేడమ్ రూట్ ఆఫీసర్ సార్ ఐకెపి ఏపిఎం సారు ఐకెపి సీసీలు హాజరు కావడం జరిగినది

విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు సాంబశివా రెడ్డి...

విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు సాంబశివా రెడ్డి.

కృష్ణా జిల్లా పామర్రులో విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివా రెడ్డి , పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.

దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసింది.

పల్స్ పోలియో నిర్వహణపై అవగాహన శిక్షణ కార్యక్రమం

పల్స్ పోలియో నిర్వహణపై అవగాహన శిక్షణ కార్యక్రమం, బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రo వైద్య అధికారి డాక్టర్ స్వాతి లక్ష్మీ గారు మరియు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం శోభ రాణి గారి ఆధ్వర్యంలో మార్చి మూడవ తేదీన జరుగు పల్స్ పోలియో కార్యక్రమం పై శిక్షణ నిర్వహించడం జరిగింది . వైద్య అధికారి మాట్లాడుతూ బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్ర పరిధిలో గల 38 బూత్ లలో గల సభ్యులకు, మరియు బుక్కరాయసముద్రం బస్టాండులో ట్రాన్సిస్టర్ పాయింట్ సభ్యులకు, మొబైల్ టీం సభ్యులకు పల్స్ పోలియో నిర్వహణ పైన అవగాహన శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది, ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని బుక్కరాయసముద్రం ఆరోగ్య కేంద్రం పరిధి నందు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరముల పిల్లలు 4213 ఉన్నారని వారందరికీ మార్చి 3 తేదీనే 100% పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు, అలాగే మార్చి 4వ తారీఖు, మార్చి 5వ తేదీన ఇంటింటికి వెళ్లి ఆదివారం రోజు చుక్కలు వేయించుకొని పిల్లలను గుర్తించి పల్స్ పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మూడు రూట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రూట్ సూపర్వైజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు, అలాగే ఒక మొబైల్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు, మార్చి మూడో తారీఖున ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మోహన్ రావు, పిహెచ్ఎన్ చెన్నమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి, సత్యనారాయణ శాస్త్రి, జానీ రాజ్, రూట్ సూపర్వైజర్లు శివానంద, నాగరాజు, మరియు హెల్త్ అసిస్టెంట్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ సచివాలయ మహిళా ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు వాలంటరీ వర్కర్లు ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

పథకాలు కొనసాగాలంటే.. జగనన్న మళ్లీ రావాలి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త ఎం. వీరంజనేయులు

రాష్ట్రంలో పేదలకు మేలు జరగాలన్నా..మరోసారి పెద్దఎత్తున సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా...అభివృద్ధి పనులన్నీ ముందుకు సాగాలన్నా.. మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు మనమంతా అండగా నిలవాలని సమన్వయకర్త ఎం. వీరంజనేయులు అన్నారు.

శింగనమల మండలం నిదనవాడ, గ్రామంలో ఆయన పర్యటించారు.

గ్రామంలో ప్రజలను పలకరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికలలో మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తనను గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసి చూపించారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ప్రతి ఒక్కరూ చూశారని గుర్తు చేశారు.

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు తన పాలనలో సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలు గుర్తించాలని కోరారు. బాబు మోసపు మాటలు, హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని హితవు పలికారు. జగనన్న చెప్పిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. జరగబోయే ఎన్నికలలో మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.