madagoni surendar

Feb 10 2024, 18:10

గరిడేపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం

సూర్యాపేట జిల్లా :-గరిడేపల్లిలో మెడికల్ క్యాంపును సందర్శించిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటాచలం

సూర్యాపేట జిల్లా :-

గరిడేపల్లి మండలం,కల్మలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సర్వారం గ్రామంలో గత కొద్దీ రోజులుగా విష జ్వరం కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా శనివారం రోజు సూర్యాపేట జిల్లా మెడికల్ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం, జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్ తో కలిసి సర్వారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించడం జరిగింది. వారు మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 74 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 17 మందికి డెంగ్యూ వ్యాధిగా నిర్ధారణ అయింది అని డాక్టర్ సింహచలం చెప్పారు.మరియు గ్రామంలో మురికినీటి కాల్వలను మరియు వాటర్ ట్యాంక్ గేట్ వాల్వును ను పరిశీలించారు ముఖ్యంగా డ్రైనేజీలలో త్రాగు నీటి పైపులు మురికి కాలువలలో మునిగి ఉండి నీరు కలుషితం అయ్యి మరియు కాలువలలో మురికి నీరు నిలువ ఉండడం వలన దోమలు వృద్ధి చెంది జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు పారిశుధ్య లోపం లోపించింది అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రత మరియు వ్యాధులపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.గరిడేపల్లి గ్రామంలో జ్వరాలు తగ్గేవరకు మెడికల్ క్యాంపును కొనసాగించాలని వైద్యాధికారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ శృతి, మాస్ మీడియా అధికారి అంజయ్య గౌడ్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు ,హెచ్ ఇ ఓ రామకృష్ణ,సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, గ్రామ సె క్రటరీ బాలాజీ, ఏఎన్ఎం అనిత, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.

madagoni surendar

Feb 10 2024, 16:39

పొదుపు సంఘాల మహిళల డబ్బు బ్యాంకులో బలవంతంగా డిపాజిట్ ఎందుకు.

పొదుపు సంఘాల మహిళల డబ్బు బ్యాంకులో బలవంతంగా డిపాజిట్ ఎందుకు

పావలా వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదు

ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.

పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

నల్గొండ జిల్లా:-

పొదుపు సంఘాల మహిళల సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈ రోజు నల్గొండ లోని దొడ్డి కొమురయ్య భవనంలో మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం చేనబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలు పైసా పైసా కూడబెట్టి దినదినం అభివృద్ధి చెందాలని ప్రయత్నాలు చేస్తుంటే బ్యాంకులో బలవంతంగా డిపాజిట్లు చేయించడం ఏమిటని ? వెంటనే డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వకపోగా అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని అన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తామన్న ప్రభుత్వాలు పొదుపు సంఘ మహిళల సమస్యలు పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రతి మహిళకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పొదుపు మహిళల పిల్లలకు స్కాలర్షిప్స్ సౌకర్యం గతంలో ఇచ్చేదని నేడు అది లేదని వెంటనే స్కాలర్షిప్ మంజూరు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో సమ భావన సంఘాలకు బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నెలకొల్పారని మంచి నీరైన దొరకడం లేదు కానీ బ్రాండ్ విస్కీలు దొరుకుతున్నాయని అన్నార. జిల్లా వ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచి బెల్ట్ షాపులు రద్దు అయ్యేవరకు పోరాడతామన్నారు. మునుగోడు తరహాలో బెల్ట్ షాపులను రద్దు చేయాలని, ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై అనేక పద్ధతులలో దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు మద్యం గంజాయి ట్రక్స్ నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఐద్వా ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలపై సమగ్ర సర్వే నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ ,జిల్లా ఆఫీసు బేరర్స్ తుమ్మల పద్మ,భూతం అరుణ,కుమారి పాదురి గోవర్ధన, జిల్లా కమిటీ సభ్యులు చనగని సైదామ్మ,గోలి వెంకటమ్మ,ఎండి సుల్తానా,తంగెళ్ళ నాగమణి,బూరుగు కృష్ణవేణి,కడకంచి అందాలు, తదితరులు పాల్గొన్నారు.

.

ఐద్వా జిల్లా కార్యదర్శి.

madagoni surendar

Feb 10 2024, 11:03

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికురాలు. బస్సు కండక్టర్ పై దాడి. చెప్పు తీసుకొని చంపలు వాయించిన మహిళ.

రంగారెడ్డి జిల్లా :-

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన మహిళా ప్రయాణికురాలు.

బస్సు కండక్టర్ పై దాడి. చెప్పు తీసుకొని చంపలు వాయించిన మహిళ.

అడిగిన చోట బస్సు నిలుపలేదని ఆరోపిస్తూ కండక్టర్ ను విచక్షణారహితంగా చెప్పు తో కొట్టిన వైనం.

దుర్భాషలాడుతూ దాడి. ‌మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సు లో ఘటన.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. దాడికి పాల్పడిన మహిళ శివరాంపల్లి కి చెందిన ప్రసన్న గా గుర్తింపు.

madagoni surendar

Feb 10 2024, 10:59

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

ఢిల్లీ:-నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ..

చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే

స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్

రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ..

madagoni surendar

Feb 09 2024, 20:43

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి

టి.ఎమ్.ఎస్.ఎస్ దళిత జాతి ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి.

.

నల్గొండ జిల్లా:-

టి.ఎమ్.ఎస్.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా ఇంచార్జి గా నాగుల జ్యోతి శ్రీనివాస్ ని టి.ఎమ్.ఎస్.ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ గడ్డ యాదయ్య మాదిగ నియమించారు.ఈ సందర్బంగా నాగుల జ్యోతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా ఇంచార్జీ గా నియమించినందుకు ఫౌండర్ ప్రెసిడెంట్ యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. దళిత సంఘాల, దళిత్ జాతి కోసం తన వంతు సేవ చేస్తానని అన్నారు.

.

madagoni surendar

Feb 09 2024, 10:11

తెలంగాణ మూడవ అసెంబ్లీ రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

తెలంగాణ మూడవ అసెంబ్లీ

రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

నేడు శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ

ప్రభుత్వ సమాధానం ఉండనుంది.

శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.

మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరుస్తారు.

మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా, బి మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు.

అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం cm రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు.

గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు.

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను....

తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికన ఉభయసభల ముందు టేబుల్ చేస్తారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉపసభల ముందు టేబుల్ చేస్తారు.

రేపు శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం నేడు సమావేశం.

అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం కానుంది.

బడ్జెట్​కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ నివేదిక ఇచ్చింది.

విజిలెన్స్ నివేదికపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ ఆలోచన.

న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది

రిటైర్డ్ జస్టిస్ చే విచారణ చేయించాలని సర్కార్ ఆలోచన.

ఇలాంటి విషయాలపై కేబినేట్​లో చర్చించే అవకాశం.

వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

madagoni surendar

Feb 08 2024, 17:43

బెల్ట్ షాపుల తో మహిళలపై పెరుగుతున్న నేరాలు.మునుగోడు తరహాలో బెల్టు షాపులను ఎత్తివేయాలి.

బెల్ట్ షాపుల తో మహిళలపై పెరుగుతున్న నేరాలు

మునుగోడు తరహాలో బెల్టు షాపులను ఎత్తివేయాలి.

రౌండ్ టేబుల్ సమావేశంలో. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపు.

.

నల్గొండ జిల్లా:-

మిర్యాలగూడ.

విచ్చలవిడి మద్యంతో జిల్లాలో నేరాలు పెరిగిపోతున్నాయని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం బెల్టు షాపులను ఎత్తివేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి యు టి యఫ్.రాష్ట్ర కార్యదర్శి నాగమణి డిమాండ్ చేశారు.

గురువారం నాడు మిర్యాలగూడ కార్యాలయంలో "విచ్చలవిడి బెల్టు షాపులు-పెరుగుతున్న నేరాలు" అనే అంశంపై ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి యు టి యఫ్.రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ.నూతన ఆదాయ మార్గాలను సృష్టించాల్సిన పాలకులు మద్యాన్ని ఆధారంగా చేసుకొని మద్యం పైన వచ్చే ఆదాయం ఆధారంగా ప్రభుత్వాలు నడపడం అనేది దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విచ్చలవిడి బెల్ట్ షాపుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పసిపిల్లల నుండి మొదలుకొని పండు ముసలి వరకు 'మధ్యమనే' వ్యసనానికి లోనై మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని వారన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల ద్వారానే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని వారన్నారు. మునుగోడు నియోజకవర్గం లో బెల్టు షాపు లేని వ్యవస్థను అక్కడ ఎమ్మెల్యే తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. మునుగోడు తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం బెల్ట్ షాప్ నిషేధిత పాలసీని తీసుకొచ్చిఎత్తివేయాలని కోరారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారికి వాస్తవంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనట్లయితే అలాంటి వారికి ప్రభుత్వం మరో మార్గం ద్వారా ఆదాయ వనరులను సమకూర్చుకునే విధంగా వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.బెల్ట్ షాపులో ఎత్తివేత కోసం జిల్లావ్యాప్తంగా కార్యాచరణ చేపట్టి బెల్ట్ షాపుల నిషేధిత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని వారన్నారు.

ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలే బోయిన వరలక్ష్మి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో.

హెచ్ఎం అరుణకుమార నాగమణి, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత,టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ సభ్యురాలు మట్టమ్మ,సీనియర్ నాయకురాలు గాద పద్మ,

ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన,

జిల్లా కమిటీ సభ్యురాలు నాగమణి,

జిల్లా కమిటీ సభ్యురాలు

పూలమ్మ,జిల్లా కమిటీ సభ్యురాలు శాంతమ్మ,టౌన్ అధ్యక్షురాలు ఊర్మిళ,హుస్సేన్,కృష్ణవేణి,

సరిత,మంగ,తదితరులు పాల్గొన్నారు.

పోలెబోయిన వరలక్ష్మి

జిల్లా అధ్యక్షులు.

మిర్యాలగూడ.

madagoni surendar

Feb 08 2024, 14:49

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్:ఫిబ్రవరి 08

విద్య,వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణా సాధకుడు, శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు.

డిజెఎఫ్ జాతీయ మహాసభ కు ముఖ్య అతిథి గా విచ్చే సిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించా రు.జర్నలిస్టుల పై ప్రభుత్వా లు సానుకూలంగా ఉండాల న్నారు.

వారికి విద్య వైద్యం తో పాటు వారికి నివాస యోగ్య మైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నా రు.కార్పోరేట్ విద్యాల యాలలో జర్నలిస్టులకు 50 శాతం రాయితీ ఇప్పటికే అమలు లో ఉన్నదని కానీ అది కూడా సరిగా అమలు కావటం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని వాటి ప్రామాణికతలలో కూడా మరింత వెసులుబాటు కలిగేలా ప్రయత్నం చేయాల న్నారు.

అలాగే ఎక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు.ఈ మేరకు తగిన ప్రతిపాదనను తన వద్దకు తీసుకు వస్తే సంబం ధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా నని హామీఇచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలం గా ఉందని త్వరిత గతిన జర్నలిస్టులకు మంచి జరుగుతున్నదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు...

madagoni surendar

Feb 08 2024, 11:08

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్.- టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్.

నల్గొండకు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ కేసీఆర్ - టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

హైదరాబాద్ (ఫిబ్రవరి 08):-

నాగార్జున సాగర్ నుండి జగన్ కు నీళ్లు ఇచ్చినందుకా? పది ఏండ్లు అధికారంలో ఉండి కూడా ఎస్ ఎల్ బి సి.నీటి కాలువను పూర్తి చేసి, నీళ్లు ఇవ్వనందుకా?మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా సమస్యల సుడిగుండంలో ఉంచినందుకా?అక్షరాన్ని మాత్రమే నమ్ముకుని హైదరాబాద్ లైబ్రరీలల్లో కుర్చీలకు అతుకున్న నల్లగొండ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినందుకా?నల్లగొండ మూసీ నది ఏటి ఇసుక నంత దోచుకున్నందుకా? తక్షణమే నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి, నల్గొండకు రావాలి.కాంగ్రెస్ ప్రజా పాలన హితం కోరుతూ, స్పష్టమైన తీర్పించి కాంగ్రెస్ కు పట్టం కట్టిన నల్లగొండజిల్లా ప్రజల ముందు నీ ఆటలు సాగవు కేసీఆర్.

• చనగాని దయాకర్ గౌడ్ .టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓ.యూ. ఉద్యమ నేత •

madagoni surendar

Feb 08 2024, 10:12

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

హైదరాబాద్:- నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఉదయం 11:30 గంటలకు ఉభయసభల సమావేశం

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ తమిలి సై

గవర్నర్ ప్రసంగంపై పొలిటికల్ వర్గాల్లో చర్చ

గత పది ఏళ్ల పాలన తీరు, రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగించనున్న గవర్నర్

గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ స్పీచ్ లో గత బీఆర్ఎస్ పాలనపై ఘాటైన విమర్శలు

ఇవాళ అసెంబ్లీలో అదే స్థాయిలో గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం