Mane Praveen

Oct 28 2023, 10:08

చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ రోజు రాత్రి 7.05 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 3.15 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితి ఉంది. తెల్లవారుజామున 3.15 గంటలకు వ్యక్తిగత శుద్ధి, సుప్రభాతసేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా నేడు సహస్ర దీపాలంకార సేవ, మరియు వికలాంగులకు, వృద్ధులకు సౌకర్యాలు రద్దు చేసినట్లు తిరుమల దేవస్థానం తెలిపింది.

Mane Praveen

Oct 27 2023, 22:43

TS: 45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 55 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాలో 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల పేర్లు:

1. సిర్పూర్- రావి శ్రీనివాస్

2. అసిఫాబాద్ (ఎస్టీ)- అజ్మీరా శ్యామ్

3. ఖానాపూర్ (ఎస్టీ)- వెద్మ బొజ్జు

4. ఆదిలాబాద్- కంది శ్రీనివాస్ రెడ్డి

5. బోథ్ (ఎస్టీ)- వెన్నెల అశోక్

6. ముథోల్- బోస్లె నారాయణ రావు పాటిల్

7. ఎల్లారెడ్డి- కే.మదన్ మోహన్ రావు

8. నిజామాబాద్ రూరల్- డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

9. కోరుట్ల- జువ్వాది నర్సింగరావు

10. చొప్పదండి (ఎస్సీ)- మేడిపల్లి సత్యం

11. హుజూరాబాద్- వడితెల ప్రణవ్

12. హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్

13. సిద్దిపేట- పూజల హరికృష్ణ

14. నర్సాపూర్- ఆవుల రాజిరెడ్డి

15. దుబ్బాక- చెరుకు శ్రీనివాస్ రెడ్డి

16. కూకట్‌పల్లి- బండి రమేష్

17. ఇబ్రహీంపట్నం- మల్ రెడ్డి రంగారెడ్డి

18. ఎల్బీనగర్- మధుయాష్కి గౌడ్

19. మహేశ్వరం- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

20. రాజేంద్రనగర్- కస్తూరి నరేందర్

21. శేరిలింగంపల్లి- వి. జగదీశ్వర్ గౌడ్

22. తాండూర్- బయ్యని మనోహర్ రెడ్డి

23. అంబర్‌పేట్- రోహిన్ రెడ్డి

24. ఖైరతాబాద్- పి. విజయారెడ్డి

25. జూబ్లీహిల్స్- మహ్మద్ అజహరుద్దీన్

26. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)- డాక్టర్ జీవీ వెన్నెల(గద్దర్ కుమార్తె) 

27. నారాయణపేట- డా. పర్ణిక చిట్టెం రెడ్డి

28. మహబూబ్ నగర్- యెన్నం శ్రీనివాస్ రెడ్డి

29. జడ్చర్ల- జె.అనిరుధ్ రెడ్డి

30. దేవరకద్ర- గావినోళ్ల మధుసూధన్ రెడ్డి

31. మక్తల్- వాకిటి శ్రీహరి

32. వనపర్తి- డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

33. దేరకొండ (ఎస్టీ)- నేనావత్ బాలూ నాయక్

34. మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

35. భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి

36. జనగామ- కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

37. పాలకుర్తి- యశశ్విని

38. మహబూబాబాద్ (ఎస్టీ)- డా. మురళీ నాయక్

39. పరకాల- రేవూరి ప్రకాశ్ రెడ్డి

40. వరంగల్ పశ్చిమ- నాయిని రాజేందర్ రెడ్డి

41. వరంగల్ తూర్పు- కొండా సురేఖ

42. వర్ధన్నపేట (ఎస్సీ)- కేఆర్. నాగరాజు

43.పినపాక (ఎస్టీ)- పాయం వెంకటేశ్వర్లు

44. ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు

45. పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Mane Praveen

Oct 27 2023, 18:55

వట్టే జానయ్య ఆధ్వర్యంలో బీఎస్పీ లో భారీ చేరికలు

సూర్యాపేట: మండలం ఇమాంపేట గ్రామంలో పలు పార్టీలకు రాజీనామా చేసి 600 మంది వరకు కార్యకర్తలు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బీఎస్పీలో చేరారు. 

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం, ఇమాంపేట గ్రామంలో దళితుల భూములు లాక్కొని మిషన్ భగీరథ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

బీఎస్పీ లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాగిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కుంచం ఉపేందర్, గ్రామ వార్డు మెంబర్ సొప్పరి నాగమణి లాలయ్య, నగిరి వెంకటమ్మ అంజయ్య, మాజీ వార్డు సభ్యులు నగిరి అంజయ్య, సాగాల సోమమ్మ, సొప్పరి నాగమ్మ, డప్పు కళాకారుడు సామల కృష్ణయ్య, సర్దార్ నగేష్, చలక రవి, సతీష్ హరీష్ లతోపాటు 600 మంది వరకు ఉన్నారు.

అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Mane Praveen

Oct 27 2023, 18:07

నకిరేకల్ : బిఎస్పి కి ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే.. అభివృద్ధి అంటే ఎట్లా ఉంటదో చూపిస్తా: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా: నకిరేకల్ పట్టణ కేంద్రం, మరియు పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా భాగంగా బి ఎస్ పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో.. గడపగడపకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ఎస్పి అనే నినాదంతో ఇంటింటా తిరిగి ఏనుగు గుర్తు, బీఎస్పీ మేనిఫెస్టోను బహుజన సిద్ధాంతాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ సారి బిఎస్పి కి ఓట్ వేసి ఏనుగు గుర్తును అసెంబ్లీ కి పంపిస్తే అభివృద్ధి అంటే ఎట్లా ఉంటాదో చూపిస్తా అని అన్నారు. ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మహిళా కన్వీనర్ మర్రి శోభ, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, విజయ్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Streetbuzz National News App

Mane Praveen

Oct 27 2023, 17:20

NLG: ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తైక్వాండో మహిళా విభాగం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని లకు గోల్డ్ మెడల్

నల్లగొండ: నేడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తైక్వాండో మహిళా విభాగం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన ఇద్దరు విద్యార్థినులు సరయు, మేఘన అత్యంత ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా వీరు వచ్చేనెల 3,4 తేదీలలో రాజస్థాన్ యూనివర్సిటీలో తైక్వాండో విభాగంలో ఎం.జి యూనివర్సిటీ తరపున పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.ఘన్ శ్యామ్, ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా.రాజారామ్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, దేవవాని, నరేష్, వెంకటకృష్ణ, తదితరుల అధ్యాపకులు ఇద్దరు విద్యార్థినిలను అభినందించారు.

Mane Praveen

Oct 27 2023, 14:34

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వివిధ పార్టీల ప్రముఖ నాయకులు

ఢిల్లీ: తెలంగాణకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిలో 

1. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

2. మోత్కుపల్లి నరసింహులు - మాజీ మంత్రి

3. ఏనుగు రవీందర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

4. ఆకుల లలిత - ఎమ్మెల్సీ

5. నేతి విద్యా సాగర్ - మాజీఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్

6. సంతోష్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ

7. కపిలవాయి దిలీప్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ

8. నీలం మధు ముదిరాజ్ - పటాన్ చెరువు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు

ఈ సందర్భంగా నాయకులకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NATIONAL NEWS APP

Mane Praveen

Oct 27 2023, 10:40

తిరుమల: టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. 

నిన్న శ్రీవారిని 62,055 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Mane Praveen

Oct 27 2023, 09:21

NLG: శివన్నగూడెంకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదే: సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా:

మునుగోడు: మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆగం కావొద్దు ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు.

దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పాలించినప్పటికీ ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీర్చలేదని, వాజ్ పేయి ప్రభుత్వంలో కూడా సమస్యలు తీర్చలేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీర్చామని తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నది. కర్ణాటకలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు మరింత పెంచుతాం, రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భీమా ఇస్తాం, రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామని అన్నారు.

మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతమని, పూటకో పార్టీ మారే నేతలు సిద్ధాంతం లేకుండా ఎన్నికల్లో దిగుతున్నారని, డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అలాంటి నేతలకు బుద్ధి చెప్పాలి. మనం చైతన్యం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెసిఆర్ అన్నారు.

పాలమూరు రిజర్వాయర్ పూర్తి అయితే దిండి కి, శివన్న గూడెం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని శివన్నగూడెం కు నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత తనదే అని సీఎం అన్నారు. ఆ నాటి ఉద్యమ సమయంలో తన వెంట కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో చూపించిన చైతన్యం వచ్చే ఎన్నికల్లో కూడా చూపించాలని అన్నారు 

కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 26 2023, 09:08

TS: నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్..ఈ రోజు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. బీఎస్పీ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. 

అయితే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రగతి నివేదన తో పాటు, మునుగోడు ప్రజలకు ఉప ఎన్నికల్లో మాదిరిగా ఈ సారి ఏమైనా వరాల జల్లులు కురిపిస్తారా అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రగతి నివేదన సభకు వెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

Mane Praveen