నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 09:38

మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 100 సభల్లో పాల్గొంటారు

మ్యానిఫెస్టో సకల జన సంక్షేమం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 100 సభల్లో పాల్గొంటారు

రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయానికే అత్యంత ప్రాధాన్యం

మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యాచరణ

ఈ నెల 15న ప్రజల ముందుకు మ్యానిఫెస్టో

55 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కన్నీళ్లే

హామీలను ఆ పార్టీ ఎప్పుడూ నిలబెట్టుకోలే

డబ్బులుంటే హస్తం పార్టీలో టికెట్‌ పక్కా

డబ్బు వెదజల్లి ప్రజల్ని కొనాలని చూస్తున్నది

ఇప్పటికే కర్ణాటక నుంచి కొడంగల్‌కు 8 కోట్లు

40 చోట్ల అభ్యర్థుల్లేని పార్టీ 70 చోట్ల గెలుస్తదా?

ఇది తెలంగాణ గల్లీకి, ఢిల్లీ అహంకారానికి, గుజరాతీ దౌర్జన్యానికి మధ్య జరిగే పోరాటం

ప్రతి ఓటరు ఆడపిల్ల తండ్రిలా ఆలోచించాలి

పొన్నాల పార్టీలోకివస్తానంటే నేనే వెళ్లి ఆహ్వానిస్తా

మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌

ఇప్పటికే పెన్షన్‌దారుల మనసుల్లో సీఎం కేసీఆర్‌ చెరగని ముద్ర వేశారు. ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మ్యానిఫెస్టోకు తుదిరూపును ఇచ్చేందుకు శని, ఆదివారాల్లో సమావేశాలున్నాయి. ఈ నెల 15న మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతాం.

– మంత్రి కేటీఆర్‌

రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు ప్రస్తావించిన అంశాలపై మాట్లాడుతూ.. బలహీన వర్గాలు, మైనార్టీలపై దృష్టిపెడతామని, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులు, డయాలసిస్‌ రోగులు, ఒంటరి మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఉంటాయని వివరించారు. ఇతర పార్టీల హామీలపైనా కేటీఆర్‌ స్పందించారు. నెత్తి వాడిది కాదు.. కత్తి వాడిది కాదు అన్నట్టు ఎటుపడితే అటు గోకుతున్నారని, ఎటుపడితే అటు గీకుతున్నారని ఎద్దేవా చేశారు.

సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగలేదు

'మ్యానిఫెస్టో రూపకల్పనలో ఆదాయం, బడ్జెట్‌ వంటి అన్ని రకాల లెక్కలేసుకుంటున్నాం. ఇచ్చిన మాటను, హామీలను నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంతకాలం సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగకుండా జాగ్రత్తపడ్డాం' అని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని అన్నారు. 2004, 2009లో ఆ పార్టీ మ్యానిఫెస్టోలు తీసుకొంటే వైఎస్సార్‌ ప్రభుత్వం రెండే రెండు హామీలిచ్చింది. 9 గంటల ఉచిత విద్యుత్తు సహా మరో హామీ. ఈ రెండింటినీ కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను విస్మరించటమే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు అని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో 95% హామీలను నెరవేర్చామని చెప్పారు.

బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటకపోవచ్చు

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటకపోవచ్చని మంత్రి కేటీఆర్‌ జోస్యం చెప్పారు. ఆ పార్టీ 110 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోతుందని అన్నారు.

రాష్ర్టానికి బీఎల్‌ సంతోష్‌, అమిత్‌షా, ప్రధాని మోదీ ఎవరొచ్చినా చెప్పడానికి వారికేం లేదు. ఈ రాష్ర్టానికి, ఈ దేశానికి ఒక్క మంచి పని చేసిందేమీ లేదు. ఊరికే అరుపులు బొబ్బలు. మాట్లాడితే కేసులు, కేసీఆర్‌ ఫ్యామిలీ కరెప్టు ఇవి తప్ప వారు చెప్పేదాంట్లో కొత్తేముంది? తొమ్మిదిన్నరేండ్ల నుంచి పాత చింతకాయ పచ్చడి.

– మంత్రి కేటీఆర్‌

119 సీట్లపైనా ఫోకస్‌

రాష్ట్రంలోని 119 సీట్లపై తాము ఫోకస్‌ పెడతామని, ఏ సీటునూ వదలబోమని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు సిరిసిల్ల, కామారెడ్డి ప్రచార బాధ్యతలను తాను నెత్తికెత్తుకున్నానని వెల్లడించారు. 'జీహెచ్‌ఎంసీలో రోడ్డుషోలు, కార్నర్‌సభలు, డివిజన్‌ మీటింగ్స్‌ ఉంటాయి. సీఎం కేసీఆర్‌వి ఒకటో రెండో సభలు హైదరాబాద్‌లో ఉండొచ్చు' అని తెలిపారు. ఎన్నికలు రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయని, స్థిరమైన చిత్తంతో మంచి చేయాలనుకునేవారు ప్రజాజీవితంలో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అన్నారు. వ్యక్తిగతంగా తాను మద్యం, డబ్బు పంచకుండా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ 114 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని, మిగిలిన 5 మంది అభ్యర్థులను 3, 4 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ మిగిల్చింది కన్నీళ్లే

ప్రజలకు కాంగ్రెస్‌ మిగిల్చింది కన్నీళ్లేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆ పార్టీ 60 ఏండ్లు మనల్ని ఆగం చేసిందని చెప్పారు. ఓ ఆడపిల్ల తండ్రి తన బిడ్డ పెండ్లి కోసం ఎంతలా ఆలోచిస్తాడో, తెలంగాణలోని ప్రతి ఓటరు కూడా కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలి? ఆ అభ్యర్థి గుణగణాలేమిటి? ఆ పార్టీ గుణగణాలేమిటి? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి? ఎవరు సారథ్యం వహిస్తే రాష్ట్రం బాగుంటది? అన్నది ఆలోచించాలి' అని కోరారు. సీఎం కేసీఆర్‌ పనితీరును ఆశీర్వదిద్దామా? ప్రతిపక్షాల మొసలి కన్నీళ్లకు మోసపోదామా? అని అడిగారు. 'కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులు లేరు. అలాంటి పార్టీ 70-80 చోట్ల గెలుస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉన్నది. ఇది విని వాళ్ల పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో గమనిస్తే కాంగ్రెస్‌కు 29 సీట్లకుగానూ 22-25 స్థానాల్లో అభ్యర్థులు లేరు' అని తెలిపారు.

దేశంలో కేసీఆర్‌ అంత పరుషంగా, పదునుగా మోదీని తూర్పారబట్టిన నేత మరొకరు లేరు. నిజంగా మేం బీజేపీకి సబ్‌ సర్వెంట్‌ అయితే 206 మైనార్టీ స్కూళ్లు పెట్టగలిగేవాళ్లమా? బీజేపీ మా ఫ్రెండ్‌ అయితే మైనార్టీల కోసం గొప్ప పనులు చేయగలిగేవాళ్లమా?

– మంత్రి కేటీఆర్‌

తెలంగాణ అభివృద్ధిని ఒక్క రాష్ట్రంలోనైనా చూపిస్తారా?

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేటీఆర్‌ తెలిపారు. ప్రతి సూచీలో, నీతిఆయోగ్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు విడుదల చేసే ర్యాంకుల్లో తెలంగాణ అగ్రశ్రేణి రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా ప్రత్యేకతను చాటుకుంటున్నదని వెల్లడించారు. 'వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పట్టణ, గ్రామీణ అభివృద్ధి.. ఇలా ఏ రంగాన్ని చూసినా అభివృద్ధే కనిపిస్తున్నది. తలసరి ఆదాయంలో తెలంగాణ నం.1 అని ఆర్బీఐ చెప్పింది. తెలంగాణ కాకుండా 27 రాష్ర్టాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఒక్క చోటైనా బాగుచేశారా? దేశంలో రైతులకు మేలు చేసే రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అది తెలంగాణ మాత్రమే. కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది' అని వివరించారు.

అబద్ధాల అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అంతదారుణంగా అబద్ధాలు ఎలా చెప్తారో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గింది తెలంగాణలోనేనని కేంద్రమే చెప్తుంటే, అమిత్‌షా మాత్రం అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. మేఘాలయ సీఎంను మోస్ట్‌ కరప్ట్‌ అంటూ తిట్టిన ప్రధాని మోదీ.. నాలుగు రోజుల తర్వాత మళ్లీ మేఘాలయకు ఆ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లి, ఆ పార్టీతో పొత్తు కలుపుకొన్నారని విమర్శించారు. ప్రధాని కూడా పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

రాహుల్‌గాంధీ రీడర్‌

రజాకార్‌ సినిమా తెలంగాణ బీజేపీ ఎజెండా అని కేటీఆర్‌ తెలిపారు. 'ఓ గుజరాతీ తెలంగాణకు స్వా తంత్య్రం కల్పించారు. ఇప్పుడు మరో గుజరాతీ వచ్చి మిమ్మల్ని మళ్లీ స్వతంత్రులను చేస్తాడు' అన్న మోదీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'తెలంగాణ దాస్య శృంఖలాలను తెంచిది సీఎం కేసీఆర్‌ కాదా? తెలంగాణకు స్వేచ్ఛావాయువులను అందిం చి స్వయం పాలనలో సుపరిపాలన అందిస్తున్నది కేసీఆర్‌ కాదా?' అని అడిగారు. రాహుల్‌గాంధీ లీడర్‌ కాదు ఓ రీడర్‌ అని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చి ఎవరో రాసిచ్చింది చదివి పోతారని విమర్శించారు.

ఈ నెల 28 వరకు సీఎం కేసీఆర్‌ పర్యటనలు ఖరారయ్యాయి. ఈ విడతలో సీఎం కేసీఆర్‌ 41 సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కూడా కేసీఆర్‌ సభలుంటాయి. మొత్తం కలుపుకుంటే కేసీఆర్‌ హాజరయ్యేవి దాదాపు వంద సభలుంటాయి. అవసరాన్ని బట్టి నేను. మంత్రి హరీశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా సిద్ధం అవుతున్నది. మంత్రులు, సీనియర్‌ లీడర్లు ప్రచారంలో పాల్గొంటారు.

– మంత్రి కేటీఆర్‌

పొన్నాల వస్తానంటే నేనే ఆహ్వానిస్తా

కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై కేటీఆర్‌ స్పందిస్తూ 'పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌. ఆయన్ను మేం గౌరవిస్తాం. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతానంటే రేపే నేను ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తా' అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తాయన్న సర్వేలపై స్పందిస్తూ 'ఇవే సర్వేలు 2018లో మేం ఓడిపోతాయని చెప్పాయి. అప్పుడు, ఇప్పుడు.. ఇవే సర్వేలు, ఇవే ఏజెన్సీలు. వాళ్లే మళ్లీ మేం ఓడిపోతున్నామని చెప్పాయంటే మాకు శుభసూచకం. మళ్లీ మేమే గెలుస్తాం. వాళ్లే మళ్లీ పప్పులో కాలేశారు. రెండోసారి పప్పులో కాలేసిందునకు వారికి అభినందనలు' అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:26

హైదరాబాదులో మరణించిన నల్లగొండ వాసి హాస్పిటల్ బిల్లును చెల్లించి గొప్ప మనసును చాటుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి

8వ వార్డులోని మోడుసు యాదగిరి ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో 50 వేల రూపాయలు బిల్లు ఉండగా

నల్గొండ అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు తక్షణమే మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది

ఈ సందర్భంగా నల్గొండ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన అంజిబాబు యాదవ్ గారు 9వ వార్డు అధ్యక్షులు కమ్మలపెల్లి ఉపేందర్ యాదవ్ గారు 8వ వార్డు సుంకిశాల ప్రవీణ్ గారు వారికి నివాళులర్పించడం జరిగింది

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:19

ఐఏఎస్ లకు పోస్టింగులు

నిజామాబా ద్ సీపీ గా కమలేశ్వర్....

వరంగల్ సీపీ గా అంబరీ కిషోర్ జా..

సంగా రెడ్డి జిల్లా ఎస్పీ  గా రూపేష్ 

నాగర్ కర్నూల్ ఎస్పీ  గా వైభవ్ గైక్వాడ్

జగిత్యాల సన్ ప్రీత్ సింగ్

మహబూబాబాద్ - పాటిల్ సంగ్రామ్

భూపాలపల్లి ఎస్పీ గా - కారే కిరణ్ ప్రభాకర్

ఐఏఎస్ లకు పోస్టింగులు

ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, ఎండోమెంట్స్ స్పెషల్ సీఎస్ గా సునీల్ శర్మ.

ప్రోహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ గా జ్యోతిబుద్ధ ప్రకాష్

రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా వాణీప్రసాద్

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా క్రిస్టినా చొంగ్తు.

రంగారెడ్డి కలెక్టర్ గా భారతి హోలికేరీ.

మేడ్చల్ మల్కాజ్ గిరీ కలెక్టర్ గా గౌతమ్ పొట్రు.

యాదద్రి భువనగిరి కలెక్టర్ గా హన్మంతు కొండిబా

నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వన్

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:11

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ*

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ 

అనారోగ్యంతో స్వర్గస్తులైన రజిని కుమారి కూతురు ఐశ్వర్య

సూర్యాపేటలోని ఆమె స్వగృహంలో పరామర్శించిన మంత్రి

 సూర్యాపేట

భాజపా నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య స్వర్గస్తురాలయింది. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న రజనీకుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారిని అడిగి తెలుసుకున్నారు.

మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:07

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

- న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం 

చర్ల

గిరిజనులు ఎంతో కాలంగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలని చర్ల దుమ్ముగూడెం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్‌ చేశారు. చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లింగాల కాలనీలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలివేరు గ్రామం నుండి నుండి చర్ల తహశీల్దార్‌ కార్యాలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు.

కు

అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.  అనంతరం సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని ఆయన పట్టించుకునే నాధుడు లేరన్నారు. ఇప్పటికైనా గ్రామసభ నిర్వహించి అర్హులైన వారందరికీ పోడు పట్టాలు అందజేయాని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు నరేష్ సమ్మక్క, రాజు,నాగలక్ష్మి రామలక్ష్మి కనక వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:02

అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు

అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు..

రేపటి సడక్ బంద్ ను విజయవంతం చేయండి.. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి..

సడక్ బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలి..

ఈ అంశాలపై గతంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల పక్షం సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు పులుపు నిచ్చారు. 

TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.

ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి, BSP, CPI, CPM, న్యూ డెమోక్రసీ, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, PDSU,SFI విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.

అక్టోబర్ 14 న ఉదయం 10.30 గంటల నుండీ 12.30 వరకూ జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరుతున్నాము.

.

అక్టోబర్ 14 రాస్తారోకో పాయింట్స్.

1. మహబూబ్ నగర్ నుండీ హైదరాబాద్ రహదారిలో మహబూబ్ నగర్,జడ్చర్ల, షాద్ నగర్,శంషాబాద్ ..

2.వరంగల్ నుండీ హైదరాబాద్ రహదారి పై వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘటకేశ్వర్, 

3.రామగుండం నుండీ హైదరాబాద్ రహదారిపై రామగుండం పెద్దపల్లి,కరీం నగర్, సిద్దిపేట, గజ్వేల్, శామీరు పేట, తూం కుంట 

4. ఖమ్మం నుండీ హైదరాబాద్ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్..

అక్టోబర్ 14. రాస్తారోకో డిమాండ్లు.

1.ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా TSPSC సభ్యులను తొలగించి ,TSPSC చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి. 

2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.

3.DSC పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.(బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )

4.పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి.

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 16:57

*తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?*

తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?  

హైదరాబాద్:అక్టోబర్ 13

 తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది.

ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది...

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 16:52

*పోచంపల్లి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి*

పోచంపల్లి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందిస్తున్న పోచంపల్లి బ్యాంకు ఖాతాదారులందరికీ ఒక్క లక్ష రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ఉపయోగకరమని పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ తెలిపారు.

అనంతారం గ్రామానికి చెందిన మెండు సైదిరెడ్డి విద్యుత్ తీగల తగిలి మృతి చెందగా వారి తల్లి మెండు జయమ్మకు శుక్రవారం లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కును పోచంపల్లి బ్యాంకు ద్వారా అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు శాఖ మేనేజర్ ఎం.శ్రీ కిషన్ మాట్లాడుతూ కస్టమర్లకు పోచంపల్లి బ్యాంక్ అందిస్తున్న సేవలకు గాను జాతీయస్థాయిలో ఉత్తమ బ్యాంకుగా అవార్డును పొందడం జరిగిందని తెలిపారు. తమ బ్యాంకు డిపాజిట్ దార్లకు అత్యధిక వడ్డీని చెల్లిస్తున్నట్లు, వ్యవసాయదారులకు, చేతివృత్తుల వారికి,వ్యాపారస్తులకు అతి తక్కువ వడ్డీకే వారి అవసరాల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది టీ క్రాంతి కే మల్లికార్జున్ బి. కవిత వి. శృతి 

జి. సైదులు, జి నీరజ్ కుమార్

 పి హిందూ కుమార్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 12 2023, 09:10

ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత

ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత

5 రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్‌ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టింది.

అధికారులకు ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌

ఐదు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 తెలంగాణ): ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్‌ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్‌, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి, ఐటీ శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి 'ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (ఈ-ఎస్‌ఎంఎస్‌) అనే యాప్‌ను వినియోగిస్తున్నది.

ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఎప్పటికప్పుడు వివరాలను ఈఎస్‌ఎంఎస్‌ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, డ్రగ్స్‌ వంటి వివరాలను సరైన సమయంలో నమోదు చేయకపోవడం వల్ల కొంత దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ-ఎస్‌ఎంస్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అక్రమాలపై ఫిర్యాదుకు..

ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా 'సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ యాప్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నది.

నిజందాగదుక్షణంఆగదు

Oct 12 2023, 08:49

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి: వి. కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి

రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి ఇస్రో స్వీయ శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలి

తమిళనాడులో ఏర్పాటు చేయనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో స్పేస్‌పోర్ట్‌ (అంతరిక్ష పరిశోధన కేంద్రం) నుండి ఇస్రో శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలని, ప్రయివేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ అధ్యక్షులు వి.కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ (షార్) స్పేస్‌పోర్ట్‌ నుంచి ఇస్రో స్వీయ వ్యోమ నౌకలను పంపడంతో పాటు ప్రయివేటు వ్యోమనౌకలను, కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్న విధంగా తూత్తుకుడి జిల్లాలోని కులశేఖరపట్టణంలో నిర్మించే రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి కూడా ఇస్రో స్వీయ శాటిలైట్లను ప్రయోగించడానికి అనుమతించాలని కోరారు. అయితే ఇక్కడ నిర్మించే స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ను ప్రైవేట్‌ రంగం మాత్రమే వినియోగిస్తుందని, ఇస్రో రాకెట్లు ప్రయోగించబోరనే నిర్ణయాన్ని తప్పుబట్టారు.

సుమారు రెండేళ్లలో అందుబాటులోకి రానున్న స్పేస్‌పోర్టు కోసం అవసరమైన రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇస్రోకు అప్పగించినట్లు, ఇక నుంచి ప్రయివేటు రంగానికి సంబంధించిన వ్యోమనౌకలను, ఉపగ్రహాలను మాత్రమే కులశేఖరపట్టణంలో నిర్మించే స్పేస్‌పోర్టు నుంచి పంపించనున్నారని వి. కృష్ణ మోహన్ తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని, ప్రయివేటు రంగ శాటిలైట్లను మాత్రమే నింగిలోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగ కేంద్రాన్ని వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌-స్పేస్‌) చైర్మన్‌ను కోరారు.