msrinivas

Aug 17 2023, 09:18

*ఫలించిన టియూడబ్ల్యూజె (టిజెఎఫ్) 143 నాయకుల కృషి*

 జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో50శాతం రాయితీ 

సర్క్కులర్ జారీ చేసిన భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ

హర్షం వ్యక్తం చేసిన యూనియన్ నేతలు

ధన్యవాదాలు తెలిపిన జిల్లా జర్నలిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సోమశేఖర శర్మ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులకు, ప్రైవేట్​ స్కూళ్లకు సర్య్కులర్​ జారీ చేశారు. 2023–24 అకడమిక్​ ఇయర్​కు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం​ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కోరుతూ గత నెలలో 6వ తేదీన భద్రాద్రి ​జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసిన టియూడబ్ల్యూజె (టిజెఎఫ్) 143 ప్రతినిధి బృందం డీఈఓకు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సర్క్యూలర్ జారీ చేశారు. ఫీజు రాయితీపై డీఈఓ ఆదేశాలు జారీ చేయడం పట్ల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజీ శ్రీనివాస్, మహమ్మద్ షఫీ, టెంజు అధ్యక్ష, కార్యదర్శులు వట్టికొండ రవి, సిహెచ్ నరసింహరావు, యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేయగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లు యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

msrinivas

Aug 11 2023, 13:25

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ**విద్యుత్ షాక్ గురై వ్యక్తి మృతి*

 ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాల్వంచ లో చోటుచేసుకుంది.పాల్వంచ పట్టన పరిధిలోని శేఖరం బంజర కు చెందిన సంతోష్ అనే వ్యక్తి చిప్పింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అల్లూరి సెంటర్ ఏరియాలోని ఓ ఇంటిలోని చిప్పింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతదేహాన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

msrinivas

Aug 09 2023, 09:23

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు-పాల్వంచ డీఎస్పీ వెంకటేష్*

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పాల్వంచ డిఎస్పి వెంకటేష్ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.నేషనల్ హైవే పై డివైడర్లను అనధికారికంగా కట్ చేసి ఏర్పాటు చేసుకున్న మార్గాలు, ఆ కారణంతో జరిగిన ప్రమాదాలు, మృతి చెందిన వ్యక్తుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పట్టణంలోని ప్రధాన సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరును, బ్లూ కోట్ సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా, ఆ కారణంతో జరిగే రోడ్డు ప్రమాదాలకు బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా హోంగార్లు ట్రాఫిక్ ఉల్లంఘన ల ఫోటోలు తీయవద్దని , ఆ పనిని ఎస్ఐ స్థాయి అధికారికి కేటాయించాలని సీఐ వినయ్ కుమార్ కు సూచించారు.

msrinivas

Aug 04 2023, 20:16

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి*

రోడ్డు ప్రమాదాల నివారణ పై పాల్వంచ పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ట్రాఫిక్ అంతరాయాలు, ట్రాఫిక్ రూల్స్ పై ప్రయాణికులకు పూర్తిస్థాయిలోఅవగాహన లేకపోవడం, జాతీయ రహదారిపై నేషనల్ హైవే అథారిటీ వారు ఏర్పాటు చేసిన డివైడర్లను నిబంధనలకు విరుద్ధంగా మధ్యలో ధ్వంసం చేసి ఇల్లీగల్ పాసెజ్ లను ఏర్పాటు చేసుకోవడం తదితర కారణాలను గుర్తించారు. పాల్వంచ టౌన్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, నేషనల్ హైవే అధికారులతో కలిసి పాల్వంచ సీఐ వినయ్ కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్ , దమ్మపేట సెంటర్ , రెజీనా స్కూల్ ప్రాంతాలలో జాతీయ రహదారిని, డివైడర్లను, ఇల్లీగల్ ప్యాసేజెస్ను శుక్రవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన డివైడర్స్ ను క్రమబద్ధీకరించాలని సూచించారు. వెంటనే ఇల్లీగల్ ప్యాసేజెస్ను మూసి వేయడానికి కావలసిన చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు తమవంతుగా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ టౌన్ ఎస్సై బాణాల రాము, నేషనల్ హైవే అథారిటీ అధికారి నలిని, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ ఏఈ రాజేష్ పాల్గొన్నారు.

msrinivas

Aug 04 2023, 17:58

*కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన టియూడబ్లూజే జిల్లా నాయకులు*

భద్రాద్రి కొత్తగూడెం

రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జర్నలిస్ట్ భవన్ కు స్థలాన్ని కేటాయించడంపై టియూడబ్లూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మహ్మద్ సఫీ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద టియూడబ్లూజే (టీజేఎఫ్) జిల్లా నాయకులు కేసీఆర్, కేటీఆర్, అల్లం నారాయణ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలోని ఉప్పల్ బగాయత్ లో  జర్నలిస్టుల కోసం తెలంగాణ జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి 2000 గజాల స్థలాన్ని కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. టియూడబ్లూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భవిష్యత్తు లో మరిన్నీ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చండ్ర నరసింహారావు, టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జిల్లా అధ్యక్షులు చెంగపొంగు సైదులు, కార్యదర్శి అఫ్జల్ పఠాన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, అచ్చి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కనుకు రమేష్, శివ ,రాజ్ కుమార్, నవీన్, భాస్కరాచారి, సురేష్, నాగరాజు ,మురళి, చిరంజీవి, కనకారావు, జంపన్న, చదలవాడ సూరి, కిరణ్ ,రత్నకుమార్, వినోద్, రమేష్, ఆదాబ్ శ్రీను, దశరథ్ ,కలవ రాజా, మిలాప్ శ్రీను, రహీం తదితరులు పాల్గొన్నారు.

msrinivas

Aug 04 2023, 13:31

*సీఎం కే సి ఆర్,కేటీఆర్ చిత్రపటాలకు లకు పాలభిషేకం*

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న టియూడబ్లూజే (టీజేఎఫ్) రాష్ట్ర కార్యాలయానికి (తెలంగాణ జర్నలిస్ట్ భవన్) కు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసిన నేపథ్యంలో స్థల కేటాయింపు జరపడానికి ప్రధాన కారణమైన సీఎం కేసీఆర్, మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీ మహమ్మద్ అధ్యకతన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ కోత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కల్లోజీ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.హైద్రాబాద్ ఉప్పల్ బగాయత్ లో యూనియన్ భవనం కోసం 2000 గజాలా స్థలంను కేటాయించటం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, రాష్ట్ర ఐ జె యూ సభ్యులు చండ్ర నరసింహరావు,యూనియన్ బాధ్యులు, యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

msrinivas

Aug 03 2023, 15:58

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:కొత్తగూడెం* *ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు*

గత సంవత్సరం నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం,ఎఱ్ఱబొడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధులలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపిన ఇద్దరు నిందితులకు ఈ రోజు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు 1000/- రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించారు.

నిందితులపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో Cr.no 165/22,U/s 302,353,332 r/w 34 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకమైన ఈ కేసులోని నిందితులు మడకం తులా మరియు పోడియం నంగా లను పోలీసులు వెంటనే అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగింది.

హత్య చేసిన ఇద్దరు నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు,సిబ్బంది బాగా కృషి చేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. వినీత్. జి ఐపీఎస్ అన్నారు.నేరం చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడుతుందని తెలియజేసారు.

నిందితులకు ఇద్దరికీ శిక్ష పడేవిధంగా కృషిచేసిన విచారణాధికారి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని రాధాకృష్ణ,కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ రవి,లైజన్ ఆఫీసర్ వీరబాబు లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి,సత్కరించారు.

msrinivas

Aug 02 2023, 17:51

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; పాల్వంచ* *శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు* *పాల్వంచ సిఐ*

బందులు, రాస్తారోకోలు చేయడం చట్టరీత్యా నేరమని అందుకు పాల్పడిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పాల్వంచ సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో మాదిరిగా ఇటువంటి తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని వివిధ రాజకీయ పార్టీల వారికి సూచించారు. గతంలో బందులు, రాస్తారోకోల లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారి వివరాలను సేకరిస్తున్నామని ఇకముందు ఇదే తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నందుకు వారిపై రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేయడానికి వెనుకాడ బోమని హెచ్చరించారు. ప్రతి వ్యక్తికి నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది, కానీ నిరసన వ్యక్తం చేసే క్రమంలో ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అందుకోసమే ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాల్లో, ధర్నా చౌక్లలో నిరసనలు తెలియజేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించవద్దని , తద్వారా ట్రాఫిక్ అంతరాయాలను సృష్టించవద్దని అన్నారు. ప్రజలను అసౌకర్యానికి గురి చేసే ఎటువంటి కార్యకలాపాలకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్పడవద్దని తెలిపారు.

msrinivas

Aug 01 2023, 17:19

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *ఇసుక వ్యాపారులకు పాల్వంచ సిఐ హెచ్చరిక*

పాల్వంచ సర్కిల్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ట్రాక్టర్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని పాల్వంచ సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాల్వంచ మండలం, పట్టణంలోని 30 మంది ట్రాక్టర్ యజమానులను తాసిల్దార్ కు బైండ్ ఓవర్ చేశారు. ములకలపల్లి బూర్గంపాడు మండలాల్లో సైతం మరో 50 మందిని బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు .అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ బైండోవర్ చేయబడిన ప్రతి ఒక్కరు రెండు లక్షల రూపాయల కూచికత్తు సమర్పించాలన్నారు. భవిష్యత్తులో వారు ఇదే తరహా నేరానికి పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించడానికి సర్పంచులు సైతం  పోలీసులకు సహకరించాలన్నారు. ఫుల్ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లను ధ్వంసం చేస్తే సహించేది లేదన్నారు. ట్రాక్టర్లకు నంబర్ ప్లేటు ఉండాలని, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఉండాలని, మద్యం సేవించి ట్రాక్టర్లను నడపవద్దని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించానని, అందులో భాగంగానే ప్రమాదాల నివారణ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ల మధ్యలోఏర్పాటు చేసుకున్న మార్గాలను మూసివేయడానికి సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ మీడియా సమావేశంలో టౌన్ ఎస్సై రాము, అడిషనల్ ఎస్సై రాఘవయ్య పాల్గొన్నారు.

msrinivas

Jul 19 2023, 11:50

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *మత్తు పదార్థాలు-దుష్పరిణామాలు అనే అంశంపై అవగాహన సదస్సు*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ రూరల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఆదేశాలమేరకు కే ఎల్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం పాల్వంచ రూరల్ పోలీసులు మత్తు పదార్థాలు, దుష్పరిణామాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాల్వంచ డిఎస్పి వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవడమే కాకుండా సిగరెట్,మందు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవడమే ఒక ఫ్యాషన్ భావిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలుగుతూ విద్యపైనే దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యార్థులు సైతం పోలీసులకు సహకరించడం తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం పలువురు వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.