*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:పాల్వంచ* *ఇసుక వ్యాపారులకు పాల్వంచ సిఐ హెచ్చరిక*
పాల్వంచ సర్కిల్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ట్రాక్టర్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని పాల్వంచ సీఐ వినయ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాల్వంచ మండలం, పట్టణంలోని 30 మంది ట్రాక్టర్ యజమానులను తాసిల్దార్ కు బైండ్ ఓవర్ చేశారు. ములకలపల్లి బూర్గంపాడు మండలాల్లో సైతం మరో 50 మందిని బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు .అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ బైండోవర్ చేయబడిన ప్రతి ఒక్కరు రెండు లక్షల రూపాయల కూచికత్తు సమర్పించాలన్నారు. భవిష్యత్తులో వారు ఇదే తరహా నేరానికి పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రించడానికి సర్పంచులు సైతం పోలీసులకు సహకరించాలన్నారు. ఫుల్ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లను ధ్వంసం చేస్తే సహించేది లేదన్నారు. ట్రాక్టర్లకు నంబర్ ప్లేటు ఉండాలని, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఉండాలని, మద్యం సేవించి ట్రాక్టర్లను నడపవద్దని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించానని, అందులో భాగంగానే ప్రమాదాల నివారణ లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ల మధ్యలోఏర్పాటు చేసుకున్న మార్గాలను మూసివేయడానికి సంబంధిత అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ మీడియా సమావేశంలో టౌన్ ఎస్సై రాము, అడిషనల్ ఎస్సై రాఘవయ్య పాల్గొన్నారు.
Aug 02 2023, 17:51