నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 21:33

రేపు జోగులాంబ గద్వాల్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణాలు చేపట్టగా ఇటీవల ఆ నిర్మాణాలు పూర్తయ్యాయి.

అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కూడా చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తిచేశాయి. 2018 తర్వాత మళ్లీ ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 2018 జూన్‌ నెలలోనే గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగా,

దాదాపు ఐదేళ్ల తర్వాత గద్వాల జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో హామీలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశలు పెట్టుకున్నారు. గద్వాలకు మెడికల్‌ కాలేజీ, చేనేత పార్కు, పలు సాగునీటి పథకాలకు సంబంధించి నిధుల విడుదలపై ప్రత్యేకంగా హామీలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 20:34

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై కేసు నమోదు

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ తో పాటు మరో ఇద్దరు పై భూ ఆక్రమణకు సంబంధించిన కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు బంజరాహిల్స్ పోలీసులు పట్నం నరేందర్ తో పాటు మరో ఇద్దరి పై కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం..... బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ కు చెందిన సామ ఇంద్రపాల్ రెడ్డికి సంబంధించిన భూమిని పట్నం నరేందర్ రెడ్డి, వై. శ్రీరామ్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు మోసం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. దాంతో వివిధ సెక్షన్ ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.

అంతే కాకుండా ఈ కేసు పై పూర్తి విచారణ జరపాలని బంజారాహిల్స్ ఎస్సై నవీన్ రెడ్డికి ని కోర్టు ఆదేశించింది...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 18:26

హెల్త్‌హబ్‌గా తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ :జూన్ 11

తెలంగాణ హెల్త్‌ హబ్‌గా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బంజారాహిల్స్‌లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆసుపత్రిని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, అదే విధంగా ఆరోగ్యరంగంలో అభివృద్ధి చెందిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు.

10వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని, కార్పొరేట్‌ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానాలు పోటీపడుతున్నాయన్నారు. 2014 లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30శాతం ఉంటే.. గత నెల 70శాతం చేరాయన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా ఉందన్నారు.

ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నామన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో నెంబర్-1 అని, వందశాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయన్నారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు తోడ్పాటు అందించాలన్నారు. అనవసర సీ సెక్షన్లతో అనేక ఇబ్బందులుంటాయని, నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని, నేడు అది రివర్స్ అయ్యిందన్నారు. ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యసేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 18:06

కోమటిరెడ్డితో​ జూపల్లి భేటీ.. వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో​ ఎ‍న్నికల ముందే పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది.

ఈ క్రమంలో​ తెలంగాణలో కీలక నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే పక్రియను వేగవంతం చేసింది. కాగా, తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి కృష్ణారావు ఆదివారం భేటీ అయ్యారు. 

ఇక, వీరి భేటీ అనంతరం కోమటిరెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌రెడ్డి మీడియాతో​ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పాను. నల్లగొండలో​ 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్‌ అంటే ఏంటో చూడండి అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో​ మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరతానో ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పార్టీలో చేరే ముందు జూపల్లి ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. నిన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి, నేడు కోమటిరెడ్డితో జూపల్లి భేటీ అయ్యారు.....

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 17:49

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్:జూన్ 11

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సౌందర్య ఆత్మహత్య కు పాల్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన గాజుల సౌందర్య మూడేళ్లుగా కొండాపూర్‌లోని ఐబీఎం IBM లో ఉద్యోగం చేస్తున్నారు. 2022 డిసెంబర్ 2న మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్‌ తో వివాహం జరిగింది.

ఈనెల 8న సౌందర్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ రోజు సాయంత్రం భర్త అభినవ్‌తోపాటు మామకు ఫోన్ చేశారు. తాను దూరంగా వెళ్లపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి.. శంషాబాద్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకుతున్నట్లు భర్తకు చెప్పారు.

దీంతో భర్త అభినవ్‌ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సౌందర్య భవనం నుంచి దూకి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ నిన్న శనివారం రాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శంషాబాద్‌లోని అర్కాన్ హాస్పిటల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి సౌందర్య దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. తాను ఊహించుకున్నట్లుగా జీవితం ఉండడం లేదని తరుచూ ఫ్రెండ్స్‌తో చెప్పారని, ఇటీవలే భర్త ఉద్యోగం కోల్పోవడంతో.. ఇంటివద్దే ఉంటున్నారు. దీంతో సౌందర్య మానసికంగా బాధపడుతూ.. అనుకున్న విధంగా భర్త దొరకకపోవడం.. ఊహించుకున్న జీవితం లేకపోవడం వల్లే.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. శంషాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 17:24

వికారాబాద్‌లో 19 ఏళ్ల యువతి దారుణహత్య

వికారాబాద్:జూన్ 11

మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దలు చెప్పిన మాట. అనాధిగా ఇక్కడ స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నారు. అంతెందుకు దేశాన్ని భరతమాతగా కొలుస్తున్నాం. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆకృత్యాలకు గురవుతూనే ఉన్నారు.

ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. నానాటికి మహిళలపై గృహహింసతో పాటు అనేక రూపాల్లో లైంగికంగా మానిసిక వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హింస పరాకాష్టకు చేరింది.

హైదరాబాద్‌లో అప్సర దారుణహత్య మరువకముందే మరో యువతి దారుణ హత్య ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) అనే యువతి ని దుండగులు హత్య చేశారు. శనివారం అర్ధ రాత్రి సమయంలో ఇంటి నుంచి శిరీష బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది.

ఈ రోజు మధ్యాహ్నం చెరువు కుంట ఒడ్డున యువతి దుస్తులు స్థానికుల కంట పడ్డాయి. అనుమానంతో కుంటలో శిరీష కోసం వెతికారు. కుంటలో యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి పరిశీలించారు. యువతి మృతదేహంపై కత్తిగాట్లను పోలీసులు గుర్తించారు. సమగ్ర విచారణ జరుపుతున్నామని త్వరలోనే

నిందితులను గుర్తించి శిక్షస్తామని డీఎస్పీ తెలిపారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 17:22

పంచాయతీ కోసం వచ్చిన మహిళ దారుణ హత్య

హనుమకొండ:జూన్ 11

జిల్లా కేంద్రంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది,

పంచాయతీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది, మృతురాలి భర్త నాలుగు నెలల క్రితం చనిపోగా రాజు, కిషోర్ అనే తన ఇద్దరు పిల్లలు తన మరిది వద్ద ఉంటున్నారని స్థానికులు తెలిపారు.

పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి పిల్లలను తన వద్దకు తీసుకెళ్లడానికి నేడు పంచాయతీ పెట్టకోగా పంచాయతీకి వచ్చిన పెద్దల సమక్షంలోనే స్వరూప మరిది నాపై పంచాయతీ పెడతావా? అంటూ!స్వరూప పై తన మరిది ఒక్కసారిగా కత్తితో దాడి చేసి మెడ కోసి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు.

కాగా గత వారం రోజుల కిందట తన మరిది వల్ల ప్రాణ భయం ఉన్నట్లు మృతురాలు స్వరూప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు చేయవలసి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 15:41

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షం : వాతావరణ శాఖ హెచ్చరిక *

తరువాతి 6 గంటల్లో చాలా తీవ్రమైన తుఫాను తుఫానులో మార్చబోతోంది. అరబ్ సరాబ్ హరికేన్ 'ద్విపాయం హరికేన్' ద్విపాయం 'లో చేసిన తుఫాను ఆదివారం ఇండియన్ మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్, ఉత్తరాన 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాన తరలించబడింది మరియు తరువాతి 6 గంటలలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ తుఫాను యొక్క ప్రభావం అనేక తీర ప్రాంతాల్లో చూడవచ్చు. ఈ సమయంలో ఒక హరికేన్ మరియు ఒక బలమైన వర్షం ఉంది.

గుజరాత్-మహారాష్ట్రలోనూ గొప్ప విపత్తు

ముంబై నుండి 600 కిలోమీటర్ల దూరంలో, 530 కిలోమీటర్ల దూరంలో 830 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్బందర్ నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది కరాచీ. తుఫాను ఇక్కడ నుండి తీవ్రమైన మరియు తరువాత జూన్ 15 వరకు పాకిస్తాన్, సౌరాష్ట్ర మరియు కచ్లతో సహా పరిసర ప్రాంతాలను చేరుకుంటుంది.

రాబోయే రోజుల్లో రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో వర్షం అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో గత ఆరు గంటల్లో, ముంబైలో ఐదు కిలోమీటర్ల వేగంతో తుఫాను తుఫాను, పోర్బందర్, 580 కిలోమీటర్ల దక్షిణ-నైరుతి దక్షిణ-దక్షిణాన కరాచీ నుండి పశ్చిమ మరియు 830 కిలోమీటర్ల జూన్ నుండి కేంద్రీకృతమై ఉంది దక్షిణ భారత ప్రాంతంలో తదుపరి నాలుగు రోజుల్లో వర్షం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కేరళ మరియు తీర కర్ణాటకలో భారీ వర్షాలు అవకాశం ఉండినప్పటికీ, ఆదివారం వరకు లక్షద్వీప్లో వర్షం ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో తరువాతి 24 గంటల్లో వాకింగ్ గాలి దెబ్బలు, రాయ్గడ్, రత్నగిరి మరియు సింధుదుర్గ్ సహా. పాకిస్తాన్ ప్రభావం చూస్తుంది ఈ తుఫాను యొక్క ప్రభావం పాకిస్తాన్ వరకు కనిపిస్తుంది. జూన్ 15 నాటికి, ఈ ప్రమాదకరమైన బిపెర్జాయ్ పాకిస్తాన్ మరియు ప్రక్కనే ఉన్న తీరానికి చేరుకుంటాడు. మెట్రోపాలిస్ దక్షిణాన 900 కిలోమీటర్ల అంచనా ఉందని శనివారం నా న్యూస్, పాకిస్తాన్ చెప్పారు. VSCS "Bipeljoy" కారణంగా నౌకలు మరియు పోర్ట్ సౌకర్యాలను రక్షించడానికి కరాచీ పోర్ట్ ట్రస్ట్ 'అత్యవసర మార్గదర్శకాలను' విడుదల చేసింది.

అరీ న్యూస్ నివేదిక ప్రకారం, KPT షిప్పింగ్ కార్యకలాపాలు సస్పెండ్ చేసే ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ప్రకటనలో, 25 నాట్ల పైన బలమైన గాలుల విషయంలో షిప్పింగ్ కార్యకలాపాలు సస్పెండ్ చేయబడతాయని నమ్ముతారు. ఇది గాలి వేగం 35 నాట్లు పైన ఉంటే, కార్గో నౌకల ఉద్యమం సస్పెండ్ చేయబడుతుంది అని చెప్పబడింది. కరాచీ పోర్ట్ ట్రస్ట్ కూడా నౌకలను సంప్రదించడానికి రెండు అత్యవసర పౌనఃపున్యాన్ని విడుదల చేసింది. ఇది 'తుఫాను యొక్క ప్రభావం ఇచ్చిన, నౌకల కదలిక రాత్రి సస్పెండ్ చేయబడుతుంది.' తనిఖీ కేంద్రం లో ఒక సురక్షితమైన స్థలంలో హార్బర్ క్రాఫ్ట్ను మార్చడానికి అధికారులను ట్రస్ట్ కూడా ఆదేశించారు.

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 14:25

తిరుమల కొండపై మరోసారి అపచారం

తిరుమల:జూన్ 11

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల కొండ పైనుంచి విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. శనివారం అన్నదాన సత్రంపై నుంచి వెళ్లిన విమానం. ఆదివారం శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని గొల్లమండపం పైనుంచి వెళ్లింది.

గత వారం రోజులు వ్యవధిలో విమానాలు తిరుమల కొండపై చక్కర్లు కొట్టడం ఇది మూడోసారి. ఆగమశాస్త్ర నిబంధనలకు ఇది విరుద్ధమని.. ఆనందనిలయం మీదుగా విమానం ఎగరటం అపచారమని వేద పండితులతో పాటు భక్తులు అంటున్నారు.

ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై ఎటువంటి విమానాలు ఎగురకూడదనే నియమం ఉంది. గతంలో అలాంటి ఘటనలు జరిగినా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అందుకు తగిన విధంగా స్పందిస్తుండేది.

ప్రస్తుతం రోజూ విమానాలు కనిపిస్తున్నా.. టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. తరచూ ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘించినా.. ఏటీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి........

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:45

చిన్న జీయర్ స్వామి మేనల్లుడి కథే వేరు లే

ముచ్చింతల్ :జూన్ 11

స్వాములు స్వాములుగా ఉండకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే… జరిగే పరిణామాలు వారి ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రభావం చూపిస్తాయి. చినజీయర్ పొలిటికల్ స్వామిగా.. అత్యంత ఖరీదైన స్వామిగా ప్రసిద్ధులు. ఇప్పుడు ఆయన మేనల్లుడి వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉదయం అంతా .. చినజీయర్ వారసుడి తరహాలో స్వామిలాగా .. ముచ్చింతల్ ఆశ్రమంలో తిరిగే అయన సాయంత్రం అయ్యే సరికి పబ్బులు, క్లబ్బుల్లో సేదదీరుతూంటారని ఫోటోలతో సహా వెలుగులోకి వచ్చాయి. నిజానికి చినజీయర్ భువబంధాలకు అతీతుడనని చెప్పుకుంటారు. సన్యాసం తీసుకున్నప్పుడే అన్నింటినీ వదిలేశానని చెబుతారు. అయితే ఆయన తన మేనల్లుడిని తన తదుపరి వారసుడ్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ట్రస్ట్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆయన చినజీయర్ మేనల్లుడని చాలా మందికి తెలియదు. కానీ హఠాత్తుగా ఆయన ప్రైవేటు లైఫ్ సహా మొత్తం బయటకు వచ్చింది. ఆయన ఏం చేసినా అది వ్యక్తిగతం కానీ.. ప్రజలకు ఏం చేయకూడదో చెప్పి.. అదే చేయడం ఏమిటన్న విమర్శలు ఈ కారణంగా వస్తున్నాయి.

చినజీయర్ తన ఆశ్రమంలో లేదా ట్రస్టుల్లో ఎవరిని పెట్టుకుంటారు.. అన్నది ఎవరికీ అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే రాజకీయ స్వామిగా మారారో అప్పుడే అందరికీ అవసరం అయింది. ముందు ముందు చినజీయర్ విషయంలో మరిన్ని వివాదాలు వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. శారదాపీఠం పేరుతో మరిన్ని రాజకీయాలు చేసే స్వరూపానంద కూడా తన మేనల్లుడు అయిన యువకుడ్ని తదుపరి ఉత్తరాధికారిగా నియమించి ఇప్పటికే జోరుగా ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు........,..