నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 21:27

గ్రూప్‌-1 అభ్యర్థులకు కీలక సూచనలు..

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకోగా..

మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు చేసింది.

పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు

పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులకు అనుమతి నిరాకరణ

అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు

నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి

జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదు

వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేసే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదు

3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలి..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:54

JP Nadda: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.. ఏపీ సర్కార్‌ అత్యంత అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన..

మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కామ్‌లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపించారు. ఏ స్కామ్ లు ఉన్నాయో.. అన్నింటినీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు..

శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు.. కానీ, ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని ఫైర్‌ అయ్యారు జేపీ నడ్డా.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.

రాయలసీమ అభివృద్ధిని వైసీపీ సర్కార్‌ గాలికి వదిలేసింది అని విమర్శించారు జేపీ నడ్డా.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు.. దేశంలో మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోడీ దే అన్నారు.. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారన్న ఆయన.. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది.. కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు.

మోడీ వచ్చాక మన దేశంలో పేదరికం రేటు తగ్గిందన్న నడ్డా.. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జేపీ నడ్డా..

ఇక, బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం అని స్పష్టం చేశారు నడ్డా.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించిందన్నారు.. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోడీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగిందన్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:50

బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్న ఈటల.. ఏం జరుగుతోంది..!

ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో జరుపుతున్న చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా బీజేపీ అగ్ర నేతలతో ఈటల రాజేందర్ టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నేతలను కలిశారు.

తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను హైకమాండ్‌కు ఈటల వివరిస్తున్నారు. నిన్న అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ‌తో చర్చలు జరిపారు. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అనంతరం అసోం నుంచీ ఈటల ఢిల్లీకి బయల్దేరినట్టు తెలుస్తోంది.

ఈరోజు ఢిల్లీలో పలువురి అగ్రనేతలతో ఈటల చర్చలు జరపనున్నట్లు సమాచారం. త్వరలోనే భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:48

మంత్రి సత్యవతి రాథోడ్ చేతిపై కేసీఆర్ పచ్చబొట్టు..!!

కేసీఆర్ దైవసమానులు.. నా..ఊపిరి ఉన్నంత వరకు వారు చేసిన మేలు మరిచిపోను..

బాద.. అయినా భరిస్తూ.., కన్నీళ్ళను ఆనందబాష్పాలుగా బావిస్తూ.. చేతిపై చెరిగిపోని "కేసీఆర్" పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి సత్యవతిరాథోడ్..

కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యాకే పాదరక్షలు వేసుకుంటానని..!! పాదరక్షలు లేకుండానే పర్యటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భక్తిబావాన్ని.. అభిమానాన్ని చాటుతున్న మంత్రి సత్యవతిరాథోడ్..

కేసీఆర్ పై ఉన్న ఆరాధనభావం ఆ..బాదను భరించేలా చేసింది...!ఆ..నాయకునిపై ఉన్న అభిమానం కన్నీళ్ళను కట్టడిచేసింది..!!వద్దని వారించినా.. నొప్పి అని నచ్చచెప్పాలని చూసిన.. చెరిగిపోని పచ్చబొట్టు రూపంలో తమ నాయకుని పేరు తన చేతిపై ఉండాలని మంత్రి సత్యవతిరాథోడ్ కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

హైదరాబాద్ బంజారభవన్ లో జరిగిన గిరిజన సాంస్కృతికోత్సవాలలో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు. స్టాల్స్ ను పరిశీలిస్తూ పచ్చబొట్టుస్టాల్ దగ్గర ఆగిపోయారు. తన చేతిపైన కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయాలని కోరారు..!!పక్కనే ఉన్న అధికారులు, గిరిజనసంఘాల నాయకులు వద్దు మేడమ్ చాలా నొప్పిగా ఉంటుందని వారించే ప్రయత్నం చేసారు.

అయినా నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ఆలోచన చేయడం అలవాటుగా లేని మంత్రి సత్యవతిరాథోడ్ పచ్చబొట్టు వేసే మహిళ ముందు కూర్చొని చేయందించారు. ఏకంగా రాష్ట్రమంత్రి వచ్చి పచ్చబొట్టు వేయమనడంతో ఆ..ఆదివాసీ మహిళ కాస్త కంగారు పడింది..

మంత్రి సత్యవతిరాథోడ్ ఆమెతో మాటలు కలిపింది... కొమరంబీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలును నేనంటూ ఆ.. ఆదివాసీ మహిళ తనను పరిచయం చేసుకోవడంతో మంత్రి మరింతగా సంతోషపడింది..సొంత సోదరిలా... సోపతిదారులా మంత్రి మనసునిండా మాట్లాడుతుంటే ఆ..ఆదివాసీ బిడ్డ ఆనందపడిపోయింది.

మంత్రి సత్యవతిరాథోడ్ చేయిపై *కేసీఆర్ అనే అక్షరాలను పచ్చబొట్టు వేసేసింది..

రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖల

మంత్రి సత్యవతిరాథోడ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు పచ్చ వేయడానికి వాడిన సూదిపోట్లు చిన్నబోయాయి..!!

తన చేతిపై కేసీఆర్ పేరు పచ్చబొట్టును చూసుకుని ఆనందబాష్పాలు నిండిన కన్నులతో.. అభిమానం నిండిన హృదయంతో మంత్రి సత్యవతిరాథోడ్ మురిసిపోయారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:47

ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు దగ్ధం

ఖమ్మం జిల్లా:జూన్ 10

ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న స్కూల్ బస్సు షార్ట్​సర్క్యూట్ తో నేలకొండపల్లి మండల కేంద్రంలో దగ్ధమైంది. దగ్ధమైన బస్సు కోదాడ కు చెందిన తేజ టాలెంట్ స్కూల్ బస్సుగా గుర్తించారు.

అయితే ఈ బస్సు ఖమ్మంలోని ముస్తఫానగర్ లో శనివారం జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంకు హాజరై కోదాడకు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ముప్పై మంది పెళ్లి బృందం సభ్యులు అందులో ఉన్నారు.

బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సు ను పక్కకి ఆపి వెంటనే పెళ్లి బృందం సభ్యులను వేరే బస్సు ఎక్కించి పంపారు. అందరూ దిగిన కొద్ది సేపట్లోనే మంటలు పెరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ఆ సమయంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

గ్రామ శివారులో ఈ ప్రమాదం జరగటంతో చుట్టూ పక్కల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ లతో మంటలను ఆర్పి వేశారు. సమయానికి స్థానికంగా పైర్ ఇంజన్ కూడా లేదు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:45

అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్..

ఎక్స్‌క్లూజివ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి. అప్సరను సాయికృష్ణ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు ముందు ఏం జరిగింది..? హత్య తర్వాత అసలేం జరిగింది..? పోలీసు విచారణలో సాయి ఏం చెప్పాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఇప్పటికే పెను సంచలన విషయాలు బయటికి రాగా.. తాజాగా అప్సర హత్య రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

రిమాండ్ రిపోర్టు యథావిధిగా..

‘గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ -అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సందేశాలు చేశాడు సాయి. నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. నవంబర్‌లో గుజరాత్ వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది.

వాట్సాప్ ద్వారా అప్సరకు సాయి లవ్ ప్రపోజ్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోమని అప్సర.. సాయిపై ఒత్తిడి తెచ్చింది. తనను పెళ్లి చేసుకోకపోతే సాయిని రోడ్డుకు ఈడుస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేసింది. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయి హత్య చేశాడు. హత్యకు వారం రోజుల ముందు How To Kil Human Being అని కొట్టి గూగుల్‌లో సాయి వెతికాడు. తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయిని అప్సర కోరింది. అప్సరను చంపేందుకు కోయంబత్తూర్ టూర్‌ను అడ్డుపెట్టుకున్నాడు.

జూన్-3న రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను సాయి నమ్మించాడు. ప్రియుడి మాటలు నమ్మి సరూర్‌నగర్ నుంచి కారులో అప్సర వెళ్లింది. అదే రోజు 8:15 గంటలకు సరూర్‌నగర్‌లో ఇద్దరూ కారులో బయల్దేరి వెళ్లారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని అప్సరతో చెప్పాడు. అక్కడి నుంచి గోశాలకు వెళ్తున్నట్లు అప్సరకు సాయి చెప్పాడు. డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర సాయి కారు ఆపాడు. అప్పటికే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అప్సర వాంతులు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. 12 గంటలకి సుల్తాన్‌పల్లిలో ఉన్న గోశాలకు చేరుకున్నారు. 3:50 గంటలకు వెంచర్ వైపు ఇద్దరూ వెళ్లారు. అప్సర నిద్రలో ఉండగా సాయి హత్య చేశాడు’ అని రిమాండ్ రిపోర్టులో ఉంది..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:41

ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీ బొక్కబోర్లా పడింది..

మరోసారి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మంత్రి హరీష్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని.. వాళ్ళది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావుడి చేశారని... ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు.

కేసీఆర్ తలయెత్తుకునేలా పాలన అందించారని గొప్పగా చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం అయినా సుపరిపాలన అందించారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని తెలిపారు. కేంద్ర, అన్ని రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని పేర్కొన్నారు. తెలంగాణ చేస్తున్న మంచి పనులు చూసి కేంద్రం తట్టుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్షా 30 వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే దళారి వ్యవస్థ వస్తుందని.. కేసీఆర్‌ర్ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పారు. తెలంగాణ వస్తే నక్షలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉంటుందని.. అంతా చీకటేనని చాలా మంది చెప్పారని గుర్తుచేశారు.

ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని.. కేంద్రమే తెలంగాణకి అవార్డులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు ఇది చెంపపెట్టన్నారు. తెలంగాణ విభజనని వ్యతిరేకించి తప్పు పని చేశానని లగడపాటి అన్నట్టు గుర్తు అని... ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరన్నారు. నవ్విన చోటే నాప పండు పండించినట్టు కేసీఆర్ తల ఎత్తుకునేలా చేశారని చెప్పుకొచ్చారు. కేంద్రం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

‘‘మనం ఆడిట్ బాగా చేస్తున్నామని మన దగ్గర ఉన్న ఆడిట్ డైరెక్టర్‌ను ఢిల్లీకి పిలుచుకున్నారని’’ అన్నారు. తెలంగాణలో సర్పంచులు అందరూ ఓ బస్సులో గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనానికి.. బీఆర్‌ఎస్ మోడల్ సర్కార్ పనితనానికి తేడా తెలుస్తుందన్నారు. ‘‘అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా కరెంట్ సరిపోవట్లేదు కరెంట్ పొదుపుగా వాడాలని చెప్పారు. మనకి ఢిల్లీల అవార్డులు ఇస్తారు.. గల్లీల తిడుతారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యింది. ధరణి రాకముందు రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ చెబుతుంది. ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇస్తారు. నిజాలను ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుంది. తెలంగాణ దేశానికి దిక్సుచిగా నిలవాలంటే మూడోసారి కేసీఆర్ రావాలి’’ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 20:36

ఘనంగా భాజపా రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ పుట్టినరోజు వేడుకలు

•ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

నకిరేకల్ నియోజకవర్గo లోని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చిట్యాల లోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బిజేపి రాష్ట్ర నాయకులు 1వ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ గారి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిధిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు.

రవీందర్ గారి జన్మదిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అదేవిధంగా నకిరేకల్ నియోజకవర్గంలో శెపూరి రవీందర్ లాంటి నాయకుడిని మీరందరూ మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తారని ఆశిస్తున్నామన్నారు.

ఈ నకిరేకల్ నియోజకవర్గం లో ఏ ఇంట్లో ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేనున్నానని ఒక భరోసానిచ్చేటువంటి ప్రజా నాయకుడు రవీందర్ గారని, గత 20 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు సేవలు అందించి ప్రజా ఆశీర్వాదం పొందినారన్నారు అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలన్నారు.

బిజెపి రాష్ట్ర నాయకులు చేపూరి రవీందర్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఇక ముందు ముందు కూడా మా మహిళా సోదరీమణులు ఎంత పెద్ద ఎత్తున నాకు మద్దతునిచ్చి రానున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకై అహర్నిశలు శ్రమిస్తానని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు సినీనటి కవిత, నకిరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, బిజెపి నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు, చిట్యాల మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ రూరల్ మున్సిపాలిటీ అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, పల్సా శ్రీను గౌడ్, నార్కట్పల్లి మండల అధ్యక్షులు కొరివి శంకర్, కేతపల్లి మండల అధ్యక్షులు రాచకొండ గోపి, ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, ఎస్సీ సెల్ కోరబోయిన లింగస్వామి, సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, గుండాల నరేష్ గౌడ్, పాపాని వనజ వాసుదేవ్, బొడిగ లక్ష్మయ్య, పీక వెంకన్న ఇమ్మడి విజయ్, చిట్యాల మండల మహిళా అధ్యక్షురాలు నర్రా మాధవి గోపాల్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు సలీం, ఓ బి సి మోర్చ అధ్యక్షులు నాగాచారి, కొండే నరేష్, అంతటి వెంకటేష్, పాకాల దినేష్, ఉయ్యాల లింగస్వామి, రాము, రూపాని నరసింహ, వరికుప్పల నరసింహ, భత్తుల వెంకన్న, గుడిపాటి సందీప్ ,సిద్దగాని అశోక్, వెంకన్న ,భత్తుల అనిల్, సైదులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 18:10

Police Section 30: వారాహి యాత్ర నేపథ్యంలో ఆంక్షలు.. 20 రోజుల పాటు పోలీస్‌ సెక్షన్‌ 30 అమలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనం ముందుకు వెళ్తున్నారు.. “వారాహి యాత్ర” కు సిద్ధం అయ్యారు.. ఈ నెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభం కానుంది..

అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో సాగనుంది “వారాహి యాత్ర”.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అలర్ట్ అయ్యారు.. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుండి ఈనెల 30వ తేదీ వరకు పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు.

డీఎస్పీ అంబికా ప్రసాద్.. ఇక, ఈ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఈనెల 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

, ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.. ఐదు బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు..

జూన్ 14న – ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్ లో..

జూన్ 16న – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో..

జూన్ 18న – కాకినాడ సర్పవరం జంక్షన్ లో..

జూన్ 21న – అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో..

జూన్ 22న – రాజోలు మల్కిపురం సెంటర్ లో

బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. ఇప్పటికే వారాహి యాత్ర ఏర్పాట్లు, యాత్ర సాగే రూట్‌లో తగిన ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టారు జనసైనికులు..

నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 18:08

AP NEWS | 10 కిలోల విదేశీ బంగారం పట్టివేత..ఇద్దరు అరెస్ట్‌

అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (Directorate of Revenue Intelligence,) అధికారులు పట్టుకుని వారి వద్ద నుంచి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు..

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. అధికారులకు అందిన సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా సీటు కింద దాచిన 7.798 కిలోల విదేశీ బంగారాన్ని( Foreign Gold) గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కారులో ఉన్న ఇద్దరుఅనుమానితులను పోలీసులు విచారించారు. వారు అందించిన సమాచారం మేరకు హైదరాబాద్‌లో మరో డీఆర్‌ఐ బృందం తనిఖీలు చేపట్టి 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు.

బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్‌ను పట్టుకుని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు వారు వెల్లడించారు..