నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 17:00

Andhra News: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి

తాడేపల్లి: ఏపీ ఎన్జీవో నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు..

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్‌ లేని ఫించను ఇవ్వాలని సీఎంను కోరామని వెల్లడించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కాంట్రిబ్యూషన్‌ లేని విధానం భారమవుతుందన్నారని చెప్పారన్నారు.

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణకు మంత్రులు, సీఎస్‌ కృషి చేశారని ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కొనియాడారు. కేబినెట్‌లో 12వ పీఆర్సీ ప్రకటన, ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు, అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నామని బండి శ్రీనివాస్‌ తెలిపారు. జీపీఎస్‌లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని సీఎం తెలిపారన్నారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఓపీఎస్‌తో సమానంగా లబ్ధి కలిగించేలా జీపీఎస్‌ను తీసుకొచ్చారన్నారు. ''జీపీఎస్‌తో నష్టం ఉండదని, ఉద్యోగులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. జీపీఎస్‌.. దేశానికి రోల్‌ మోడల్‌గా ఉంటుందన్నారు. ఉద్యోగులు రిటైర్‌ అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్‌ తెచ్చామని చెప్పారు. జీపీఎస్‌ తీసుకువచ్చిన సీఎంకు ధన్యావాదాలు తెలిపాం'' అని వెల్లడించారు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 16:54

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..

Revanth Reddy: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి..

ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్‌ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగసభల పేరుతో జనంలోకి వెళ్తోంది. తాజాగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని రేవంత్​ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నేతలంతా కష్టపడాలన్నారు..

ధరణి పోర్టల్ గడీల పాలన కోసం తెచ్చారని ఆయన ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసమేనని.. ఆ భూముల మీద దొరల పెత్తనం ఆగకపోతే నక్సల్ బరి ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టణ బాట పట్టిన దొరల కోసం ధరణి కేసీఆర్‌ ధరణి తెచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. కొత్త భూస్వాములను తయారుచేసేందుకే.. ధరణి. రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో లేదని ఆయన విమర్శించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ దళారుల చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు.

ధరణి ద్వారా హైదరాబాద్‌ చుట్టూ భూములు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దోచుకున్న భూములను బినామీ పేర్లపై ఉంచారని రేవంత్ అన్నారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని అంటూ రేవంత్ మండిపడ్డారు. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా కలసికట్టుగా కష్టపడాలని రేవంత్‌ సూచించారు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 13:09

Venkaiah Naidu : పదవికి విరమణ ఇచ్చాను కానీ మాట్లాడే పెదవులకు విరమణ లేదు

గుంటూరు ఆర్‌వీఅర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల ఎనిమిదవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు..

ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువతను మేల్కోల్పడం నాకు ఇష్టమైన పని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలతో గడపడం నాకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. పదవికి విరమణ ఇచ్చాను కానీ మాట్లాడే పెదవులకు విరమణ లేదని ఆయన అన్నారు.

అంతేకాకుండా.. విద్యావిధానాన్ని భారతీయకరణ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో యువ శక్తి ఎక్కువగా ఉన్న దేశం మనదని ఆయన అన్నారు..

పురుషులతో పాటు స్త్రీ లు పోటీ ప్రపంచంలో దూసుకు వెళ్తున్నారని ఆయన కొనియాడారు. ప్రపంచంలో వస్తున్న మార్పులతో ఉపాధి అవకాశాల తో పాటు పోటీ తత్వం, సవాళ్లు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

యువత క్రమశిక్షణ, కష్టపడే తత్వం, కలుపుగోలుగా ఉండటం అలవరుచుకోవాలని ఆయన అన్నారు. పాశ్చాత్య ధోరణి మన దేశానికి, యువతకు మంచిది కాదని, భారతీయ ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని ఆయన అన్నారు. యోగను యువత జీవితంలో భాగం కావాలన్నారు. యోగా మతానికి సంబంధించిన అంశం కాదు…ప్రపంచం ఆచరిస్తున్న ఆరోగ్య మంత్రం అని ఆయన అన్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 09:11

మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

మంచిర్యాల :జూన్ 09

:దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మూడు పథకాలను ప్రారంభించనున్నారు. నస్పూర్ మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐడీఓసీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యాలయాలు, చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (సీఎల్‌ఐఎస్), మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ వెనుకబడిన వర్గాల చేతివృత్తులు, చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ రెండో విడత, గృహలక్ష్మి పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

రాత్రి జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. నస్పూర్ మండల కేంద్రంలోని ఐడీఓసీ రూ.55.20 కోట్లతో 26.24 ఎకరాల విస్తీర్ణంలో కాంప్లెక్స్‌లోని రెండంతస్తుల ప్రధాన భవనాన్ని రూ.1.39 లక్షల చదరపు గజాలలో నిర్మించారు. కలెక్టర్, మరియు అదనపు కలెక్టర్ల ఛాంబర్, వెయిటింగ్ హాల్ మరియు సమావేశ మందిరాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాయి, స్టేట్ ఛాంబర్ మరియు స్టాఫ్ రూమ్ మొదటి అంతస్తులో ఉన్నాయి.

ప్రతి ఫ్లోర్‌లో 40 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న కాన్ఫరెన్స్ హాల్, టైప్-ఎ హాల్స్, టైప్-బి హాల్స్, ప్యాంట్రీ రూమ్, స్ట్రాంగ్ రూమ్, క్రెచ్, టాయిలెట్, రెండు వీఐపీ టాయిలెట్లు, నాలుగు లిఫ్టులు మరియు హెలిప్యాడ్ ఉన్నాయి. కార్యక్రమాలకు 2,500 మంది పోలీసులతో విస్తృత ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ సభకు భారీగా తరలివచ్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు సభ ఏర్పాట్లు చేశారు.

మంచిర్యాలలో ట్రాఫిక్‌ పోలీసుల హెచ్చరికలు

జూన్ 9న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ హెచ్చరికలు జారీ చేశారు. సూచన మేరకు గోదావరిఖని, చెన్నూరు నుంచి మంచిర్యాల పట్టణంలోకి వచ్చే వాహనదారులు శుక్రవారం ఉదయం నుంచి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద 363 జాతీయ రహదారిపై వెళ్లాలి. శ్రీరాంపూర్, గోదావరిఖని, చెన్నూరు వైపు వెళ్లే వాహనదారులు క్యాతాన్‌పల్లి గ్రామ సమీపంలోని గాంధారివనం వద్ద ఇదే రహదారిపై వెళ్లాలని సూచించారు. మంచిర్యాల వద్ద గోదావరి నదిపై నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, హైలెవల్‌ వంతెనకు శంకుస్థాపనతో పాటు నస్పూర్‌ మండల కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని (ఐడీఓసీ) ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

సీఎం నేటి షెడ్యూల్ ఇదే..

సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు మంచిర్యాల జిల్లా చేరుకుంటారు.

సాయంత్రం 5.10 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారు.

సాయంత్రం 5.15 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరి 5.30కు భవనాన్ని ప్రారంభించనున్నారు.

అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 6.30కి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు.

సభలో ప్రజలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు.

రాత్రి 7.30కి రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళతారు.

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 08:45

బస్టాండ్ ప్రారంభోత్సవం వాయిదా❓️

ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కన్పించని బస్టాండ్‌ పేరు

ప్లాట్‌ఫాం ఎత్తు పెంపుతో ఆలస్యం వల్లే..

గద్వాల జిల్లా :జూన్‌ 09

జిల్లా కేంద్రంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండ్‌ ప్రారంభం వాయిదా పడినట్లేనా అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అదే రోజు నూతన బస్టాండ్‌ను ప్రారంభిస్తారని వేసుకున్న అంచనా తప్పిపోయింది.

జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయంతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదు గా ప్రారంభించేందుకు అధికారులు, పార్టీ నాయకులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. అయితే ఆ కార్యక్రమాల జాబితాలో నూతన బస్టాండ్‌ పేరు ప్రస్తావన లేకపోవడంతో వాయిదా పడినట్టేనని స్పష్టమవుతోంది.

పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే అసహనం

గద్వాల పాత బస్టాండ్‌లో గతంలో పది ప్లాట్‌ఫాంలు ఉండేవి. నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్‌లో వాటి సంఖ్య 15కు పెంచారు. ప్రయాణికులు వేచి వుండే ప్రాంగణం కొత్త డిజైన్‌ మేరకు ఎత్తు పెరిగింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం ముందు ఆగిన బస్సులో ప్రయాణీకులు ఎక్కడం, దిగడం అసౌకర్యంగా మారింది

ఈ నేపథ్యంలో బస్సు ఆగే ప్రాంతం ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఆ పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం వల్ల బస్టాండ్‌ ప్రారంభోత్సవం ఆలోచనను విరమించుకున్నారు. ఇటీ వల బస్టాండ్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి రెండుసార్లు పరిశీలించారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆసహసం వ్యక్తం చేశారు. పనులు పూర్తయ్యాకే ప్రారంభోత్సవం చేద్దామని అధికారులతో చెప్పారు. దీంతో ఆ పనులను త్వరలో ప్రారంభించేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యారు.......

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 08:41

నేటి నుంచే రూ.లక్ష ఆర్థిక సాయం.. ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఇవ్వాళ సీఎం కేసీఆర్ చాలా ఘనంగా ప్రారంభించనున్నారు.

మొదటగా 200 మందికి ఈ సహాయం చేయనున్నారు సీఎం కేసీఆర్.

కాగా 15 బీసీ కులాలకు చెందినవారు సహాయం కోసం tsobmmsbc.cgg.gov.in అనే వెబ్సైట్ లో ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది కేసీఆర్ సర్కార్.

వయస్సు 21 సంవత్సరాలనుంచి 55 సంవత్సరాలు ఏళ్ళు ఉండి… గ్రామాలలో లక్షన్నర, పట్టణాల్లో రెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అవుతారు.

ఈ అర్హతలు ఉన్నవారు ఈనెల 20 లోపు ఈ పథకం కోసం అమలు చేసుకోవాలని ఆదేశించింది కెసిఆర్ సర్కార్. కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని.. ఆ డబ్బులతో ఏదైనా పనిముట్లను కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది.

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 08:36

భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 09

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. నేడు (శుక్రవారం) క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 70,160 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 16:56

Hyderabad: రేపు చేప మందు పంపిణీ... ఏర్పాట్లు పూర్తి..

హైదరాబాద్: మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబం (Battina Family) అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..

రేపు (శుక్రవారం) ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణి ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలు (రెండు రోజులు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు..

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు..

నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 16:54

Kottu Satyanarayana: యాగంతోనే ఏపీకి కేంద్రం నిధులు.. మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు..

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు. రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని.. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు.

ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ..

నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 16:52

Fraud At Registrar Office: అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు..

అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు మారుతున్నాయి. ఏసీబీ దాడులు చేస్తున్న వదలని అవినీతి కంపు వదలడం లేదు. విజయవాడలోని పటమట, గాంధీనగర్, మాచవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది..

పటమట రిజిస్ట్రార్ పోస్ట్ కోసం కోటి నుంచి కోటిన్నర వరకు బేరాలు సాగుతున్నట్లు సమాచారం. ఆడిట్ ఆఫీస్ లో రిజిస్ట్రార్, డిప్యూటేషన్ విధుల్లో ఉన్న మరో రిజిస్ట్రార్ పోటా పోటీ లాబీయింగ్ చేస్తున్నారని, రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూళ్ళ కోసం మళ్లీ ప్రైవేట్ సిబ్బంది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది..

ఇటీవల డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని ఏసీబీ అరెస్ట్ చేసినా రిజిస్ట్రార్ల తీరు మారడం లేదు. ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ఆఫీసులో అర్థరాత్రి వరకు రిజిస్ట్రార్, సిబ్బంది ఉండటంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆదాయానికి మించి కోట్లలో ఆస్తులు రిజిస్ట్రార్లు కూడగడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఏసీబీ తనిఖీలు కేవలం లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న కేసులే నమోదు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెజవాడలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల మధ్య కోల్డ్ వార్ తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో రచ్చకెక్కుతున్నారట. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ రాఘవ రావు అరెస్ట్ రిమాండ్ రిపోర్టు లో దిమ్మదిరిగే విషయాలు నమోదు చేసింది ఏసీబీ. రిజిస్ట్రార్లు అందరూ డబ్బులు వసూలు చేసి ఉన్నతాధికారికి ఇస్తున్నట్టు చెప్పినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ ఉండటం గమనార్హం..